Showing posts with label Political Party. Show all posts
Showing posts with label Political Party. Show all posts

Friday, May 4, 2012

పొలిటికల్ ఫైర్ బ్రాండ్స్ ...

కొన్ని దశాబ్దాల క్రితం రాజకీయంలో మహిళలు  రాణించలేరు అనే ఒక అపోహ చాలా మందిలో ఉండేది. మామూలుగా రాణించలేరేమో కానీ ఓ రేంజ్‌లో రాణించగలరని నిరూపించారు మాజీ దేశ ప్రధాని ఇందిరా గాంధీ. అధికారాన్ని ఏ అభివృద్ధికోసం వినియోగించాలో ఆమెకు తెలిసినంతగా మరొకరికి తెలియదు అని చాలా మంది అభిప్రాయం. ఇందిరా గాంధీ ఏది చేసినా సంచలనమే. ఆమె ప్రతీ నిర్ణయం ఓ రహస్యమే. ఇలా సాగిన ఆమె పాలనా సిద్ధాంతాన్ని కొన్ని మార్పులు చేసి నేడు జయలలితా, మాయావతి, మమతా బేనర్జీ రాజకీయంలో అదరగొడుతున్నారు. మొండితనం వారి బలం. ఆయుధం వారనుకున్నది వారు సాధిస్తారు ఆదే వారి విజయ రహస్యం. వారలా ఎందుకు చేయాల్సి వస్తోంది అని ప్రశ్నిస్తే రాజకీయ మనుగడకు ఇలాంటి జిత్తుల మారి ఎత్తులు అవసరమే అని జవాబు వస్తుంది. వివాదాలు.. విజయాలు కామన్‌. దూసుకుపోవడమే న్యాయం అనేది వాని తత్వం.

మాయావతి
ప్రొఫైల్‌

పూర్తి పేరు : మాయావతి
పుట్టిన తేది : జనవరి 15
జన్మస్థలం  : ఢిల్లీ
విద్యాభ్యాసం: ఎల్‌.ఎల్‌.బి, బిఈడి
వృత్తి  : రాజకీయ నాయకురాలు
పార్టీ  : బహుజన్‌ సమాజ్‌ పార్టీ

Uns 

మాయావతి అనగానే చాలా మందికి తెల్ల ఏనుగులు గుర్తుకు వస్తాయి. ఆమె వేల కోట్లు ఖర్చుపెట్టి ఉత్తర్‌ ప్రదేశ్‌లో కళాత్మక దృష్టితో నిర్మిస్తున్న ఏనుగుల బొమ్మలు. ఈ బొమ్మలు ఆమె పార్టీ గుర్తు.ఉత్తర్‌ ప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల విగ్రహాలతో పాటు తన పాలరాతి బొమ్మను కూడా సెంట్రల్‌ పార్క్‌లో నిర్మించి ఉత్తర్‌ ప్రదేశ్‌కు ఇది సరికొత్త పర్యాటక స్థలం అని ప్రకటించారు. మాయావతికి ఈ విగ్రహాలపై ఇంత అభిమానం ఎందుకో తెలీయదు కానీ శిల్పకారులకు మాత్రం స్వర్ణయుగంగా అవతరించింది ( ఒకటా రెండా ఏకంగా రూ.2500 కోట్లు ప్రాజెక్టు మరి). ఆమె పుట్టిన రోజు సందడిని టీవి ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ప్రతీ పుట్టిన రోజు ఏదో విధంగా వైవిధ్యశైలిలో జరగడమే దీనికి కారణం.కొన్నేళ్ళ క్రితం అభిమానులు కరెన్సీ నోట్లతో చేసి దండ ఆమె మెడలో వాలినప్పుడు ఆశ్చర్య పోవడం ప్రేక్షకుల వంతైంది.ఇంత వైవిధ్యాన్ని భరించలేని ప్రజలు వేరే పార్టీకీ ముఖ్యమంత్రి ఛాన్స్‌ను అందించారు.

జయలలిత

 
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : జయలలిత 
పుట్టిన తేది  :  ఫిబ్రవరి 24
జస్మస్థలం   : మైసూర్‌
వృత్తి    : రాజకీయనాయకురాలు
పార్టీ    : ఆమె ఆల్‌ ఇండియా  
            ఆన్నా ద్రవిడ మున్నెట్ట 
            కజగం (ఏఐఏడిఎమ్‌కే)
ప్రస్తుత హోదా: తమిళనాడు ముఖ్యమంత్రి

Unt6 

ఇక దక్షిణాదికి వస్తే తమిళనాడు ఆమ్మగా పిలవబడే జయలలిత రూటే వేరు. ఆమె పథకాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో..అమె నిర్ణయాలు కూడా అంతే వైవిధ్యంగా ఉంటాయని సన్నిహితుల అభిప్రాయం. రాజకీయంలో పురుషులతో సమానంగా రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా పనిచేయాలి అనేది ఆమె నమ్మే సిద్ధాంతం. ప్రాంతీయా భిమానం విపరీతంగా ఉన్న జయలలితా పాలన విషయంలో ప్రజల అభిప్రాయానికి అత్యంతవిలువ నిస్తుంది. టీవిలు, సెల్‌ఫోన్లు వంటివి ప్రజల జీవన ప్రమాణాన్ని సౌఖ్యానికే అని తెలిపారామె. జయలలిత ఒక్క చూపుకోసం అభిమానులు, కార్యకర్తలు ఎన్నిగంటలైనా వేచి చూస్తారంటే ఆమె ఏ విధంగా తన మార్కును సృష్టించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. మంచి నటిగా గుర్తింపు సాధించాకా అమె రాజకీయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరగడం విశేషం.2011 సాధారణ ఎన్నికల్లో కరుణానిధిని కాదని జయలలితను మూడవసారి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు ప్రజలు. 2011 మే 16న ఆమె తన ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకు క్రితం ఆమె 2002-2006, 2001 సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నారు.

మమతా బెనర్జి
ప్రొఫైల్‌

పూర్తి పేరు  : మమతా బెనర్జి
పుట్టిన తేది  : జనవరి 5
జస్మస్థలం          : కలకత్తా
వృత్తి   : రాజకీయ వేత్త
పార్టీ   : త్రినమూల్‌ కాంగ్రెస్‌
ప్రస్తుత హోదా  : పశ్చిమబెంగాల్‌ 
    ముఖ్యమంత్రి

Us 

బెంగాలీ ‘దీది’మమతా బేనర్జీలోని పాజిటీవ్‌ కోణాన్ని గతేడాది చూసి చాలా మంది మురిసి పోయి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అనుకున్నారు. కానీ 2012లో మమతాలో వచ్చిన మార్పుకు యావత్‌ భారతం ఆశ్చర్యపోయింది. రైల్వే బడ్జెట్‌ తరువాత మమతాలో ప్రారంభమైన నిరంకుశ ధోరణి ఆమె అభిమానులను సైతం నిరాశ పరిచింది. గతేడాది విదేశీ సంస్థాగత పెట్టుబడి విషయంలో ప్రారంభమైన ఆమె మొండి వైఖరి, రైల్వే ఛార్జీలలో స్వల్ప మార్పు చేసిన ముకుల్‌ రాయ్‌ను రాజీనామా చేయించినా అక్కడితో ఆగలేదు. మమతా నిర్వాకాన్ని గమనిస్తున్ను మీడియా ఆమెపై దుమ్మెత్తి పోయడం ప్రారంభించింది. అందులో భాగంగా ఒక వార్తా పత్రిక కార్టూనిస్ట్‌ ఆమెకు వ్యతిరేకంగా కార్టూన్‌ వేశాడు.ఇది ఆమెకు కోపాన్ని కలిగించింది . సదరు కార్టూనిస్ట్‌ను అరెస్ట్‌ చేయించడమే కాకుండా మీడియాకు మార్గదర్శకాను జారీ చేసింది. పబ్లిక్‌ లైబ్రెరీలో కొన్ని పత్రికలను నిషేదించింది, ఏ పత్రికలు చదవాలో కూడా ఆమెనే నిర్ణయించి. .ఏ టీవి ఛానల్‌ను చూడాలో కూడా తెలిపింది. ఇలా ఆమెలోని నెగెటీవ్‌నెస్‌ ప్రజాస్వామ్యానికే ప్రమాదంగా దాపురించిందని విజ్ఞులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమతా ఇలా ఎందుకు మారిందో ఆమెకే తెలియాలి.

Sunday, January 15, 2012

జయకళ శశిలలిత! * Inner View

ప్రాణానికి ప్రాణం అనుకున్న శశికళను బయటికి గెంటేస్తూ
జయ ఎందుకంత నిష్కర్షమైన నిర్ణయం తీసుకున్నారు?
పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జయ హృదయంలో తనకున్న ప్రత్యేక స్థానాన్ని కూడా శశికళ ఎందుకు పోగొట్టుకోవలసి వచ్చింది? అసలు జయకు, శశికి మధ్య ఏమిటంత స్నేహం? ఎందుకంత స్నేహం? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఇన్నర్‌వ్యూ.


అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ గుర్తులో కనిపించే ఆకుపచ్చని జంట ఆకుల్లా ఇంతకాలం వర్థిల్లిన జయ, శశిల స్నేహం ఇప్పుడు ‘ఏకాకు’లా మిగిలింది!

రాజకీయాలలో స్నేహం కానీ, శత్రుత్వం కానీ శాశ్వతం కాదని అంటారు. అయితే గత డిసెంబర్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తన అనుంగు నె చ్చెలి శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా బయటికి పంపించడాన్ని బట్టి చూస్తే - పాతికేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహ సాన్నిహిత్యం శాశ్వతంగా ముగిసినట్ల్లే కనిపిస్తోంది.


శశికళను బహిష్కరించిన ఐదురోజుల తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో తొలిసారిగా మౌనం వీడిన జయ... ‘నమ్మక ద్రోహులకు పార్టీలో చోటు లేదు’ అని ఒకప్పటి తన ‘సిస్టర్ ఇన్ స్పిరిట్’ (స్నేహోదరి) ను ఉద్దేశించి కరాకండిగా వ్యాఖ్యానించడం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది! నిజానికి జయ, శశిల మధ్య ఇన్నేళ్లూ కొనసాగింది రాజకీయాలకు అతీతమైన స్నేహానుబంధం. దాన్ని కూడా కాదనుకుని శశికళపై చర్య తీసుకున్నారు జయ. ‘‘ఇవాళ్టి నుంచి నువ్వు అన్నాడిఎంకెలో భాగం కాదు.. ఫో’’ అని అధికారికంగా అనడమైతే అన్నారు కానీ, అంతరార్థం మాత్రం ‘ఇవాళ్టి నుండి నువ్వు నాలో భాగం కానే కాదు’ అని స్నేహానికి నీళ్లొదులుకోవడమే.

ఐదేళ్ల నిరధికార విరామం తర్వాత గత ఏడాది మే 16న తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి పట్టాభిషిక్తురాలైన ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయిక) జయలలిత... తనెంతో కష్టపడి సాధించుకున్న పదవిని కాపాడుకోవడం కోసం చివరికిలా తన ఇష్టసఖినే ఫణంగా పెట్టవలసి వస్తుందని ముందెన్నడూ ఊహించి ఉండరు! స్నేహితురాలికి సర్వం దోచిపెట్టిన జయలలితకు... ఇప్పుడా స్నేహితురాలి నుంచే తన రాజకీయ అధికారాన్ని సంరక్షించుకోవలసిన అగత్యం ఏర్పడింది.


ప్రాణసమానం అనుకున్న శశికళ తనను నట్టేట ముంచేందుకు పార్టీ కార్యాలయంలో పావులు కదుపుతున్న విషయం తెలిసి జయ ఆమెకు చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇందుకు వారు చూపుతున్న నిదర్శనాలు జయ కటౌట్‌లా నిలువెత్తుగా కనిపిస్తున్న ప్పటికీ అంతకన్నా ఎత్తైది వారి స్నేహానుబంధం.

అనుకోని అనుబంధం
జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా, అది పోయస్ గార్డెన్‌కే పరిమితం అయ్యింది. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో స్నేహం బహిర్గతమయ్యింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల దుకాణం నడుపుతున్న శశికళకు ప్రభుత్వోద్యోగి అయిన ఆమె భర్త నటరాజన్ ద్వారా జయలలితతో పరిచయభాగ్యం కలిగింది.
అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో కూడా పట్టు దొరికింది. 


జయలలిత, శశికళ, చంద్రలేఖ


 









ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆంతరంగికురాలిగా మారిన శశికళల మధ్య స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం చంద్రలేఖ అనే మరో మహిళ. చంద్రలేఖ దక్షిణ ఆర్కాట్ జిల్లాకు అప్పట్లో కలెక్టర్‌గా ఉండేవారు. అదే జిల్లాకు పౌర సంబంధాల అధికారి (పి.ఆర్.ఓ)గా శశికళ భర్త నటరాజన్ ఉండేవారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రభుత్వం కొంతమంది పి.ఆర్.ఓ.లను చెట్టుకొకర్ని, పుట్టకొకర్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యడంతో నటరాజన్... పన్నీర్‌శెల్వం అనే మరో అధికారితో కలిసి కోర్టుకెక్కారు.

ఆ సమయంలోనే జీవనోపాధి కోసం నటరాజన్ తన భార్య శశికళ చేత వీడియో పార్లర్ పెట్టించాడు. చివరికి కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో నటరాజన్‌కు 1980లో తిరిగి పి.ఆర్.ఓ.గా ఉద్యోగం లభించింది. సరిగ్గా అప్పుడే భర్త ద్వారా శశికళకు కలెక్టరు చంద్రలేఖ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో శశికళ తరచు చంద్రలేఖ ఇంటికి వెళ్లి కష్టాలను వెళ్లబోసుకునేవారు. సంపాదన చాలకపోవడంతో శశికళ కొంత డబ్బు అప్పు చేసి సింగపూరు వెళ్లి, వీడియో కెమెరాలు తెచ్చుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

అన్నాడిఎంకె పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితను తనకు పరిచయం చేయాలని చంద్ర లేఖను శశికళ కోరారు. అలా చంద్రలేఖ పరిచయం చేయడంతో పార్టీకి చెందిన కార్యక్రమాలను వీడియో, ఫోటోలు తీసే పనులను జయ శశికళకు అప్పగించారు. పనితీరు బాగుండటంతో శశికళను మళ్లీ మళ్లీ పిలిపించి కార్యక్రమాలు అప్పగించేవారు. అయితే జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు. ఒక పట్టాన ఎవరినీ నమ్మరు.


అలాంటిది ఒక సాధారణ గృహిణి, చదువులేని మహిళ అయిన శశికళను ఆమె ఎందుకు చేరదీశారన్నది ఇంకో ప్రశ్న. అయితే శశికళలో ఉండే ప్లస్ పాయింట్లు శశికళలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె ఘటికురాలు. సాటి మనిషికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కూడా. ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే, అందులో జోక్యంచేసుకోరు, వారు చెప్పేదంతా శ్రద్ధగా వింటారు. ఈ స్వభావం ఉన్న వారిని సాధారణంగా ఎవరైనా ఇష్టపడతారు. జయలలిత కూడా బహుశా అందుకే ఆమెను చేరదీసి ఉండొచ్చు.


‘కళ’ తప్పిన స్నేహం

1996 ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓడిపోయి డిఎంకె అధికారంలోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై జయ, శశి జైలుపాలయ్యారు. అప్పటి వరకు శశికళ పార్టీ సభ్యురాలు కూడా కాదు. జయ వెంట ఎక్కడా కనిపించేవారు కాదు. 2001 శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారి బహిరంగంగా జయలలిత వెంట శశికళ ప్రత్యక్షమయ్యారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండగనే 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని శశికళకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే శశికళకు పార్టీ సభ్యత్వం లేకపోవడం, ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని ఆశించలేక పోయారు. దాంతో ఆమె సూచించిన పన్నీరుశెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత నిర్దోషిగా బయట పడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. తరువాత పార్టీలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కోర్‌కమిటీ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీలోను, ప్రభుత్వంలోను శశికళ వర్గీయులదే పైచేయిగా నిలిచింది. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది.


‘రాజకీయమే’ అసలు కారణం!

నిరుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి జయలలిత, శశికళల మధ్య విభేదాలు తలెత్తాయి. శాసనసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు తన సొంత వర్గానికి చెందిన కొంతమందికి జయలలితకు తెలియకుండానే శశికళ సీట్లు కేటాయించుకున్నారు. దాంతో జయ ఆ జాబితాను రద్దు చేసి, కొత్త జాబితాను విడుదల చేశారు.

అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిగింది. పార్టీలో ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, శశికళ తమ బంధువర్గానికి సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ పోయస్ గార్డెన్‌లోని శశికళ ఇంటి ముందు కూడా కార్యకర్తలు ఆందోళనలు చేశారు.


పరిపాలనలోనూ జోక్యం!

రాష్ట్ర పరిపాలనలో కూడా శశికళ జోక్యం ఎక్కువయింది. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం, టెండర్లు ఫలానా వారికే ఇవ్వాలని ఒత్తిడి తేవడం వంటివి కూడా జరిగాయి. ఈ కారణంగా కొందరు ఐఎఎస్ అధికారులు శెలవులు పెట్టి వెళ్లిపోయిన విషయాన్ని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జయలలితకు ఫిర్యాదులు అందాయి. అప్పుడే కొంతమంది మంత్రులపై జయ వేటు వేశారు.

భర్త కోసం శశి వ్యూహం!

జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసు ప్రస్తుతం బెంగుళూరు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు వ్యవహారంలో కూడా స్నేహితురాళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. జయలలిత కోర్టుకు హాజరయినపుడు, న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధించారు. వాటిలో చాలా వరకు తనకు తెలియదని, అవన్నీ తన పేరు చెప్పుకుని తన చుట్టూ ఉన్నవారు చేశారని జయలలిత చెప్పారు.

తనపేరు మీద ఉన్న ఆస్తులన్నీ శశికళకు చెందినవేనని అన్నట్లు కూడా బయటికి పొక్కింది. అదే విధంగా శశికళ కూడా తనకేమీ సంబంధం లేదని, అంతా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితకు చెందిన ఆస్తులేనని తెగేసి చెప్పారు.


రేపో మాపో బెంగుళూరు కోర్టులో గనుక జయలలితకు ప్రతికూలమైన తీర్పు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆమె వైదొలగవలసి ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలి. ఆ బాధ్యతలను తన భర్త నటరాజన్‌కు కట్టబెట్టాలని శశికళ జయలలితను కోరినట్లు వినికిడి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శంకర్ కోవిల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నటరాజన్‌కు టిక్కెట్టు ఇచ్చి, గెలిపించాలని జయను శశి కోరారు.


2002లో ఇదే కేసులో జయను దోషిగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చి జైలు శిక్షను విధించింది. అప్పుడు శశికళ సామాజిక వర్గానికి చెందిన పన్నీరుశెల్వంను ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు ఆరు నెలల పాటు పన్నీరుశెల్వం ముఖ్యమంత్రిగా పని చేశారు. తరువాత జయను కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే పరిస్థితి మరోసారి ఉత్పన్నమవుతుందని శశికళ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ తన బంధువర్గంతో పలుసార్లు సమావేశమయ్యారు.


జయలలిత కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఆ పదవిని నటరాజన్‌కు ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. సమావేశంలో నటరాజన్‌తో పాటు శశికళ బంధువర్గం రావణన్, వెంకటేశన్, దివాకరన్, భాస్కరన్, మరి కొంతమంది ఉన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఇరవై మంది శశికళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం జయ చెవిలో పడింది. పర్యవసానమే శశి, ఆమె అనుచరుల బహిష్కరణ.


ఇంత అకస్మాత్తుగా శశికళను జయ దూరం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. జయ చాటున శశికళ మిన్నాగు పన్నాగాలు పన్నగలరని కూడా ఎవరూ అనుకోలేదు. రెండు దశాబ్దాలకు పైబడిన వీరిద్దరి ఆత్మీయ అనుబంధంలో ఇంతవరకు ఉల్లాసాలు తప్ప విరుపులు లేవు. నిజానికి జయ ఔదార్యమే వీరి స్నేహాన్ని నిలిపింది.


 
ఆమె చెప్తే ‘అమ్మ’ చెప్పినట్లే














అన్నాడిఎంకె పార్టీలో ఇద్దరు అధినేత్రులు! ఒకరు ప్రధాన కార్యదర్శి జయలలిత, మరొకరు ఆమె సన్నిహితురాలు శశికళ. వారిద్దరిది ఇరవై ఏళ్లకు పైబడిన అనుబంధం. పార్టీలోను, ప్రభుత్వంలోను, జయ నివాసం పోయస్ గార్డెన్‌లోను శశికళకు అగ్రతాంబూలమే. అధికారులు జయలలితకు ఎంత విలువ ఇస్తారో, అంతే విలువను శశికళకూ ఇవ్వాల్సిందే.

జయలలిత వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లినా, అధికారిక పర్యటనలో ఉన్నా శశికళ ఆమె పక్కన ఉండాల్సిందే. చివరికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ప్రచార వాహనంలో వెనక సీటులో శశికళ ఉంటారు. పార్టీలో జయలలితకు తెలియని విషయాలయినా ఉంటే ఉండవచ్చు కాని, శశికళకు తెలియని విషయాలు ఉండవని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జయలలిత నీడ శశికళ. 1991-96 మధ్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి.


కవలు పిల్లలు ఏ విధంగా ఒకే డ్రస్ వేసుకుంటారో, అదే విధమైన దుస్తులు ధరించేవారు. 1996లో జైలుకు కూడా కలిసే వెళ్లారు. అటువంటి స్నేహం వారిద్దరిదీ. ఒక దశలో శశికళ జయకు సమయం కేటాయించడం కోసం తన భర్తను కూడా నిరాదరించారు. 1996 శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె పరాజయానికి శశికళ, ఆమె బంధువర్గమే కారణమని ఆరోపణలు వచ్చినప్పుడు శశికళను కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచిన జయలలిత మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. 2003లో శశికళకు పార్టీలో తొలిసారిగా ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి ఎగ్జిక్యూటివ్ కోర్ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు.


అమలిన స్నేహం

 







ఇరవై ఏళ్ల స్నేహ బాంధవ్యంలో, రాజకీయ సాంగత్యంలో జయలలితగానీ ఆమె ప్రియబాంధవి శశికళగానీ ఒకరి గురించి ఒకరు నోరు మెదిపిన సందర్భం ఒక్కటైనా లేదు! ఇంటర్వ్యూలలో శశికళ ప్రస్తావన వచ్చినప్పుడు జయ ‘నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అన్నట్లు చూసేవారు. జయ గురించి శశకళను అడిగే ధైర్యమైతే అసలు పార్టీలో ఎవరికీ ఉండేది కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఊహలు, వదంతులు చుట్టుముట్టినప్పుడు కూడా వీళ్ల స్నేహం తొణకలేదు. తత్తరపడలేదు. శశికళ ఒంటి మీద ప్రతి తులం బంగారానికీ ప్రత్యుర్థులు జయనే లెక్క అడిగేవారు.

శశి వెనకేసుకున్న ప్రతిరూపాయి పైనా వారికి జయ బొమ్మే కనిపించేది. ఎన్నికల ప్రచారంలో జయ వెంట శశికళ ఉండడం, ఒక చిన్న వేడుకలో వారిద్దరూ ఆత్మీయంగా దండలు మార్చుకోవడం, శశికళ మేనల్లుడి వివాహాన్ని జయ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించడం వంటి వాటిని కూడా బద్ధ విరోధ డి.ఎం.కె.పార్టీ రాష్ర్ట సమస్యలుగా చిత్రీకరించినప్పుడూ ఈ అపూర్వ స్నేహితులు ఖాతరు చేయలేదు.


అయితే ఇవే అంశాలపై వారు 1996 ఎన్నికల్లో ప్రజాతీర్పును మన్నించవలసి వచ్చింది! ఎన్నికల ప్రచారానికి శశికళను వెంటేసుకుని వెళ్లినప్పుడు జయకు బ్రహ్మరథం పట్టిన తమిళనాడు ప్రజలు ఆ అభిమానాన్ని తమ ఓటు ద్వారా చాటలేకపోయారు! మేనల్లుడి పెళ్లిలో ఒంటి నిండా నగలతో టీవీలలో ఆడంబరంగా కనిపించిన శశికళను నేరుగా చూసేందుకే జనం ఎగబడ్డారనీ, నిజానికి వారికి శశికళ తీరు నచ్చక ఆ కోపాన్ని జయపైన చూపించి ఆమెను ఓడించారని మీడియాలో వార్తకథనాలు వచ్చాయి.


అయినప్పటికీ శశి చేతిని జయ వదల్లేదు. అంతగా తను నమ్మి, ప్రేమించి అభిమానించిన మిత్రురాలు తనకు ద్రోహం చేస్తోందన్న వాస్తవాన్ని తట్టుకోలేకే చివరికి ఒక్క బహిష్కరణ సంతకంతో తన మనసులోంచి ఆమె ముద్రను చెరిపేసుకున్నారు జయలలిత!

- సి.బి.మోహన్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి, చెన్నై

ఫొటోలు: వన్నె శ్రీనివాసులు

Thursday, May 19, 2011

మెరుపు తగ్గినందుకే '' ఎరుపు '' ఓటమి

 http://www.currentnewsindia.com/wp-content/uploads/2011/04/cpm-logo_1.jpg
బెంగాల్ అంటే భారతదేశపు తూర్పువాకిలి మాత్రమే కాదు మార్పువాకిలి కూడా. ఇంగ్లీషువాడు అడుగుపెట్టి తొలిరాజ్యం స్థాపించుకున్నది ఇక్కడే. సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలిచే పడమటిగాడ్పు సుడులు తిరిగింది ఇక్కడే. రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్రవిద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి,హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జగదీశ్‌చంద్రబోసు, సత్యజిత్‌రే, అమర్త్యసేన్.. చెప్పుకుంటూ పోతే జాతి గర్వించదగ్గ మేధావులు ప్రతిభావంతులు ధీరులు వీరులు వందల వేల సంఖ్యలో కనిపిస్తారు. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో దేశం రేపు అదే ఆలోచిస్తుందట. బెంగాల్ ఆకాశం ఎరుపెక్కినప్పుడు, ప్రపంచం దానివైపు ఆసక్తిగా చూసింది. జనం రైటర్స్ బిల్డింగ్ గర్భగుడిలో ఎర్రదేవుడిని ప్రతిష్ఠించినప్పుడు దేశమంతటా ఆ జైత్రయాత్ర కొనసాగుతుందనిపించింది. http://westbengalelections2011.com/wp-content/uploads/2011/02/Election-in-West-Bengal-Assembly-Election-in-West-Bengal.jpg
చిట్టగాంగ్ వీరుల దగ్గరనుంచి చారుమజుందార్ దాకా బెంగాల్ ప్రజావిప్లవాలకు వేదికగానే ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన తెభాగా రైతాంగ ఉద్యమం కానీ, స్వాతంత్య్రానంతరం రెండుసార్లు చెలరేగిన ఆహారభద్రతా ఉద్యమాలు కానీ బెంగాలీ ప్రజానీకాన్ని సమరశీలంగా మలిచాయి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి, చీలిక తరువాత అతివాద పక్షంగా ఉండిన మార్క్సిస్టు పార్టీకి, మరో చీలిక అనంతరం నక్సలైట్ పార్టీలకు బెంగాల్ వేదిక అయింది.

1967 నుంచే అధికారంలో భాగస్వామ్యం సాధించుకోగలిగిన మార్క్సిస్టు పార్టీ, ఎమర్జెన్సీ చీకటిరోజుల అనంతరం, 1977లో సహవామపక్షాలతో కలసి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచే స్థాయికి ఎదిగింది. అధికారంలోకి రాగానే భూసంస్కరణల అమలును చేపట్టింది. మిగులు భూములను పంచడం, కౌలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యాలుగా తొలిదఫా జ్యోతిబసు ప్రభుత్వం పనిచేసింది. ఫలితంగా, రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదులు వేయగలిగింది. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగంపై పార్టీ పట్టును స్థాపించగలిగింది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhh1M-BnJftw-88Zqk9oWhosluz0E6IZ18on2kzimfupSpXTALMrefVExaN0Hf9llcio1sEqNHA3nhWAKBmwGe1LPJmTyXB6ncHDC4_10CZa3WSAshxaK4XnthPZvHbV3RGdvwfhTVHI1R0/s1600/Buddha+WB.JPG
రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో బలంగా ఉండిన ట్రేడ్‌యూనియన్ ఉద్యమం, కిసాన్ ఉద్యమం వామపక్ష ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేందుకు బాటలు వేశాయి.వామపక్ష ప్రభుత్వం హయాంలో సంక్షేమపథకాలు, పేదలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు కొన్ని సాధ్యపడ్డాయి కానీ, పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంగుళం ముందుకు సాగలేదు. ప్రతిపక్ష ప్రభుత్వమని చెప్పి కేంద్రం ప్రభుత్వరంగ పరిశ్రమలకు అవకాశం ఇవ్వలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమని, అల్లరిపెట్టే ట్రేడ్‌యూనియన్ల రాష్ట్రమని ప్రైవేటు రంగమూ ప్రవేశించలేదు. http://images.jagran.com/cpm-b-11-4-2011.jpg
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎత్తుగడగా మాత్రమే ఎన్నికలను, ప్రభుత్వ నిర్వహణను ఆశ్రయిస్తున్నామని చెప్పిన మార్క్సిస్టు పార్టీకి రాష్ట్రాభివృద్ధికి అనువైన మార్గమేదో బోధపడలేదు. బెంగాల్ అంటే భారతదేశంలో ఒక మారుమూల రాష్ట్రం, పరిశ్రమలు బతకలేని రాష్ట్రం- అన్న ముద్ర ఖాయపడింది. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగులకు, భృతి ఇవ్వడం సంక్షేమచర్యే అయింది తప్ప, పరిష్కారం కాలేకపోయింది. http://static.ibnlive.com/pix/sitepix/10_2010/prakash-karat2710630_271x181.jpg
వరుస విజయాలతో అధికారానికి అలవాటుపడిపోయిన పార్టీ యంత్రాంగంలో అనేక అవలక్షణాలు ప్రవేశించాయి, ఉద్యమశీలత కొరవడింది. జ్యోతిబసుతో సహా పార్టీ, ప్రభుత్వ అధినేతలందరూ వ్యక్తిగత నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతీకలుగా ఉండినప్పటికీ, దిగువస్థాయిల్లో పార్టీనాయకుల తీరు భిన్నంగా ఉండింది.

బెంగాల్‌తో సంబంధం లేకుండా మార్క్సిస్టు పార్టీ సరళిలో కూడా మార్పులు రాసాగాయి. కొత్తరకం రాజీకమ్యూనిస్టులే తప్ప కడదాకా నిలిచే విప్లవ కమ్యూనిస్టులు కాదని నక్సలైట్లు 1960లలోనే విమర్శించినప్పటికీ, ఎమర్జెన్సీ ముగిసేదాకా మార్క్సిస్టు పార్టీకి మిలిటెంట్ పార్టీ ప్రతిష్ఠే ఉండేది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర అణచివేతచర్యలకు లక్ష్యంగా ఉన్నవారిలో, అజ్ఞాతజీవితం గడపవలసివచ్చినవారిలో మార్క్సిస్టులు కూడా ఉన్నారు.

ఆ తరువాత కొంతకాలం దాకా సిపిఎం మాటల్లో విప్లవం, తగిన సమయంలో సాయుధపోరాటం వంటి మాటలు వినిపిస్తూనే ఉండేవి. మరోవైపు ఇందిరాగాంధీతో అంటకాగి అప్రతిష్ఠపాలైన సిపిఐతో పోల్చినప్పుడు, మార్క్సిస్టుపార్టీ నికార్సయిన పార్టీగానే కనిపించేది. బెంగాల్ విజయంతో స్ఫూర్తిపొందిన ఆపార్టీ 1980ల తరువాత ప్రధానస్రవంతి రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్ష ప్రత్యామ్నాయాలను నిర్మించడంలోను, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలతో పొత్తుపెట్టుకోవడంలోను ఆసక్తిపెరిగిపోయింది.

అదే సమయంలో తనకు అనుబంధంగా ఉన్న రైతాంగ, కార్మిక, ఉద్యోగ సంఘాల ద్వారా పోరాటాలను కూడా పార్టీ నిర్వహించేది. అయితే, పాలకపార్టీలతో పొత్తుల క్రీడ కారణంగా అప్పుడప్పుడు నాలుగుసీట్లు అదనంగా గెలుచుకోగలిగినా, మరోసారి అవే ప్రధానపార్టీలు చతికిలపడినప్పుడు వామపక్షాల సభాబలం కూడా తగ్గిపోయేది. పోరాటాల ద్వారా ఏర్పడే ప్రజాబలం మాత్రమే వారికి స్థిరంగా ఉంటూ వచ్చింది.

ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సిపిఎం, ఎన్నికల రాజకీయాలపైనే మొగ్గు చూపుతూ వచ్చింది. ప్రధాన పాలక పార్టీల ఘర్షణలో ముందుకు వచ్చిన దేశసమగ్రత, సమైక్యత, సుస్థిరత, లౌకికవాదం, తీవ్రవాదంపై పోరాటం- వంటి నినాదాల చుట్టూ పరిభ్రమించింది. శ్రామికవర్గపార్టీగా ఉండిన సంస్థ భావరంగంలో ఎగువ మధ్యతరగతికి, ఆర్థికవిధానాల్లో పారిశ్రామికులకు ఆమోదకరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

1990దశకం ప్రారంభంలో అమలులోకి వచ్చిన ఆర్థికసంస్కరణలు వామపక్షాలకు కొత్త పోరాట అవకాశాలను తెరిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త పారిశ్రామికవిధానం వల్ల కార్మికులకు ఏర్పడిన అభద్రత కమ్యూనిస్టులకు నూతన పోరాట ఎజెండాను కల్పించాయి.

అయితే, ఆ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో వామపక్షాలు విఫలమయ్యాయి. సంస్కరణల తొలి దశాబ్దంలో వామపక్షాలు చేసిన ఉద్యమాలన్నీ సారాంశంలో- ప్రభుత్వం తాను తలపెట్టిన సంస్కరణలను కొద్దిపాటి సవరణలతో అమలుచేయించడానికి పనికివచ్చాయి. చివరకు ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగసంఘాలు బలహీనపడ్డాయి. మార్క్సిస్టు పార్టీ నేతలే సంస్కరణల్లోని మంచిని కూడా చూడాలనే వాదన ప్రారంభించారు.
http://img2.allvoices.com/thumbs/event/609/480/53688836-buddhadeb-bhattacharjee.jpg
బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్‌లో సంస్కరణలకు ప్రతినిధిగా చూస్తున్నాము కానీ, 1990లలో జ్యోతిబసు రాష్ట్రానికి ప్రయోజనం కలిగినట్టయితే విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఇక బుద్ధదేవ్ హయాంలో అయితే, మార్పు స్పష్టంగా కనిపించింది. 2006లో ఆయన ఘనవిజయం సాధించినప్పుడు మొదటగా అభినందించింది రతన్‌టాటాయే.

ఉద్యోగాలు దొరుకుతున్నప్పుడు విదేశీపెట్టుబడి మీద ఏమిటి మీ అభ్యంతరం?- అని బుద్ధదేవ్ కేరళలోని తన సహచరుడు అచ్యుతానందన్‌ను ఒక సందర్భంలో ప్రశ్నించారు. బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ మాట్లాడుతున్న మాటలకు, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరించిన వైఖరికి పొంతన లేక పార్టీ అభిమానులు గందరగోళపడ్డారు. తన విధానంలోని ద్వంద్వ స్వభావానికి పార్టీ తగిన వివరణ ఇవ్వలేకపోయింది.

భూములను పంచి, కౌలురైతాంగానికి హక్కులు ఇచ్చి, రైతు అనుకూల చర్యలు చేపట్టిన ప్రభుత్వం పరిశ్రమల కోసం నందిగ్రామ్‌లో, సింగూర్‌లో రైతుల భూములను ఇవ్వడం బెంగాల్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీర్ఘకాలంగా బెంగాల్‌లో పార్టీరాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగడుతున్న తృణమూల్ కాంగ్రెస్‌కు, నలభైయేండ్ల కిందట విఫలమైన ప్రయత్నాన్ని మరోసారి చేపట్టిన మావోయిస్టులకు క్రమంగా రాష్ట్రంలో ఆదరణ పెరిగింది.
http://get.cfn.netdna-cdn.com/wp-content/uploads/2010/06/Mamta-Trinamool-Congress.jpg
ఒకనాడు బెంగాల్‌లో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులను పంజాబ్ పోలీసులు అపహరించి ఎన్‌కౌంటర్ చేస్తే అభ్యంతరం చెప్పిన వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా కేంద్రబలగాలతో కలసి ప్రజలపై అణచివేతచర్యలను నిర్వహించడం, బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం రాష్ట్రంలో దిగజారిన విలువలకు సాక్ష్యంగా నిలిచాయి.

మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం చాలా కాలం పాటు కట్టుబడిన విలువలను కూడా చివరి సంవత్సరాలలో వదులుకున్నది. అందుకే, నందిగ్రామ్, సింగూర్ తరువాత జరిగిన అన్ని స్థాయిల ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ పరాజయాన్ని చవిచూస్తూ వచ్చింది. సిపిఎంనేతలు అంటున్నట్టు బెంగాలీలు కోరుకున్నది కేవలం పార్టీల మార్పు, నేతల మార్పు కాదు. విధానాల మార్పు.

బెంగాల్, కేరళల్లో పరాజయం మార్క్సిస్టు పార్టీకి ఒకరకంగా మేలుచేస్తుంది. తన విధానాలను సమీక్షించుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ శషభిషలు లేకుండా దేశంలో అమలవుతున్న అభివృద్ధి విధానాన్ని సమర్థించడమా, నానాటికి పెరుగుతున్న ప్రజాచైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడమా వారు నింపాదిగా, ఏ పరిమితులూ లేకుండా చర్చించుకోవచ్చు. 2000 సంవత్సరం తరువాత నాలుగేళ్ల పాటు మన రాష్ట్రంలో మార్క్సిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలను గుర్తు తెచ్చుకుంటే, దాని శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేము.

ఆ ప్రయాస అంతా రాజశేఖరరెడ్డి విజయానికి తోడ్పడిందనుకోండి, అది వేరే విషయం. విప్లవకరమైన, మిలిటెంట్ పార్టీగా మార్క్సిస్టు పార్టీ ఉండాలని ఇప్పుడు ఎవరూ ఆశించడంలేదు. నికార్సయిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో చేయగలదు. భారత రాజకీయచిత్రపటంలో ఒక కట్టుబాటున్న ప్రజాస్వామిక రాజకీయ పక్షం అవసరం స్పష్టంగానే కనిపిస్తున్నది. మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా సాగాలని కోరుకోవాలి.

మార్క్సిస్టుపార్టీ స్వయంకృతాపరాధాల కారణంగా ఓడిపోయిందని గ్రహించడం అవసరమే కానీ, అందుకు ఆనందించడం కానీ, సంబరపడడం కానీ అనవసరం.మార్క్సిస్టులు బలహీనపడితే, ప్రధానస్రవంతి రాజకీయాల్లో ప్రజానుకూలమైన గొంతు కనీసంగాకూడా, అప్పుడప్పుడైనా వినిపించే అవకాశం ఉండదు. అలాగే, మమతాబెనర్జీ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. రెండు ఊర్లలో భూమిని అన్యాక్రాంతం చేసినందుకే ప్రభుత్వంపై ఆగ్రహించిన బెంగాలీలు, మొత్తం రాష్ట్రాన్ని అంగట్లో పెట్టగలిగే విధానాలున్న మమతను ఎంతో కాలం సహించరు.
http://economictimes.indiatimes.com/photo/8289643.cms
-కె. శ్రీనివాస్

Monday, May 16, 2011

జయమైనా.. అపజయమైనా... ఆమెది ఒకటే తీరు..!

 
తమిళనాడు పదహారవ ముఖ్యమంత్రిగా జయలలిత చెనై్నలోని మద్రాసు యూనివర్శిటీ ఆడిటోరియంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాల రోజు ఎటువంటి ఆత్రుత లేకుండా ఎలా కనిపించారో ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆమె ఎటువంటి బావోధ్వేగాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డా రు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఓ మహిళగా ఆమె సాధించిన ఈ విజయం.. మహిళాలోకానికే గర్వకారణం..

jaya 
ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన క్షణం నుండి... ప్రచారం... ఫలితా లు ప్రమాణ స్వీకారం వంటి అన్ని సందర్భాల్లోనూ ప్రతిపక్ష నేతగా, అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించారు.
అనుచరులకు అమ్మగా...
ఎంజీఆర్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అనతికాలంలో ఎంత పేరుప్రఖ్యాతులు సాధించిన ఆమెను పార్టీలోని వారంతా ‘అమ్మా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి అడుగిడక ముందు సినీ ప్రపంచంలో ఓ అందాల తార.. ఎదురులేని నాయకి... రాజకీయాల్లోనూ అంతే అడుగిడింది మొదలు ఎన్ని సమస్యలు.. అడ్డంకులు వచ్చినా ఎదురు నిలవడమే కానీ వెనక్కి వెళ్లడం అంటే ఏమిటో ఆమెకు తెలియదు.. ఆమె స్వభావాన్ని కొందరు మొండి తనం అంటే మరికొందరు ఆత్మవిశ్వాసం అంటారు. ఏది ఏమైనా ఆమె లక్ష్యం మాత్రం ముందుకు సాగడమే...

చిన్నతనం...
తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన జయలలిత ప్రాధమిక విద్యా భ్యాసం బెంగళూరులో చేశారు.అనంతరం మద్రాసుకు వలసవెళ్లారు. 15 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో జయలలిత నటనా రంగంలో ప్రవేశిం చారు. ఆమె అన్న విజయకుమార్‌ 1990లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

సినీ జీవితం...

తమిళసినీ రంగంలో ఎదురులేని తారగా జయలలిత వెలిగారు. 1961లో మాజీ రాష్టప్రతి వి.వి.గిరి కొడుకు శంకర్‌ గిరి నిర్మించిన ఇంగ్లీష్‌ సినిమా లో నటించారు. మొదటి సినిమాను మాత్రం కన్నడలో చేశారు. అది చాలా పెద్ద హిట్టు కావడంతో ఆమెకు ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకపో యింది. అన్నిటా విజయమే.తెలుగునాట ఆమెకు అభిమానులు బ్రహ్మర థం పట్టారు. హిందీలోనూ ఆమె కొన్ని సినిమాలను చేశారు. కేవలం నటన మాత్రమే కాదు ఆమె స్వయంగా పదికి పైగా పాటలను కూడా పాడారు.

రాజకీయ జీవితం...
1981లో ఎంజీఆర్‌ ప్రోత్సాహంతో అన్నాడీఎంకేలో చేరి 1988లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం పార్టీ నాయకత్వ బాధ్య తలను జయలలిత తీసుకున్నారు. మొదటిసారి 1991 తమిళనాడు అసెం బ్లీ ఎన్నికలలో గెలిచి మొదటి మహిళా ప్రతిపక్షనాయకురాలిగా మారారు.

ప్రతిపక్షం నుండి ముఖ్యమంత్రిగా...
jaya1అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంజీఆర్‌ వారసత్వంతో 1982లో రాజ కీయాల్లోకి వచ్చి ఆయన మార్గంలోనే నడిచారు. మొదటి సారి బోదినా యక్కలనూర్‌ నియో జకవర్గం నుండి పోటీ చేసి గెలు పొందారు. ఈ ప్రాం తం కేరళకు సమీపంలో వుంది. తరువాత ఈ ప్రాంతం రెండుగా విభజిత మైంది.అందులో ఒక భాగం, తమిళనాడులో, మరో ప్రాంతం కేరళలో వుంది.

1984లో ఎంజీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం ఎంజీఆర్‌ మరణానంతరం ఆమె ఆయన నియోజక వర్గం ఆండిపట్టినుండి నుండి పోటీ చేసి గెలుపొందారు. అనతరం ఈ ప్రాం తం అన్నాడీఎంకే స్థావరంగా మారింది. వరుసగా అన్నాడీఎంకే పార్టీలే గెలు పొందుతూ వచ్చింది.మధ్యలో రెండు సార్లు డీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుం ది. తిరిగి 2002, 2006లలో జయలలిత ఈ ప్రాంతం నుండి పోటీ చేసి గెలు పొందారు. ప్రస్తుత విజయం మాత్రం ఆమెకు అందించింది శ్రీరంగం నియోజ కవర్గం.
రాజకీయ విజయాలు...
  • ప్రయివేటు సంస్థల్లో ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించారు.
  • చెనై్నకి న్యూ వీరనం నీటి సరఫరా పథకాన్ని పూర్తి చేశారు.
  • లాటరీ టికెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించారు.
  • జైళ్లలో, కోర్టుల్లో వీడియో కాన్ఫిరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • వర్షపు నీటి నిల్వ పథకాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు.
  • గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

    మర్చిపోలేని సందర్భాలు...
  • 1991 జూన్‌ 24-1996 మే 12 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు.
  • 1996లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగారు.
  • ఎన్నో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.
  • 2001 ఎన్నికలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు.
  • అసెంబ్లీకి ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
  • 2001 సెప్టెంబర్‌ 21న సుప్రీం కోర్టు క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకుని వున్న వ్యక్తి 163(1)కింద ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదనే తీర్పు నిచ్చింది. ఆమెపై వారెంటును జారీ చేసింది.
  • దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకుల్లో ఒకరైన పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సి వచ్చింది.
  • 2003లో జయలలిత తిరిగి తనపై వచ్చిన ఆరోపణలు సవాలు చేస్తూ న్యాయస్థానంలో పోరాడారు. ఎన్నికల ద్వారా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
  • 2006లో పన్నీర్‌సెల్వం పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. ఆమెను అవసరం అయితే తప్ప సమావేశాల్లోనూ పాల్గొనరాదన్న నిబంధనను కూడా జారీ చేశారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు.
  • 2006లో అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆమె తిరిగి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

    పొందిన అవార్డులు...
  • 1972లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని
  • 1991లో మద్రాసు యూనివర్శిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌
  • 1992లో ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌
  • 1993లో మధురై కామరాజు యూనివర్శిటీ నుండి గౌరవ డిగ్రీ పట్టా
  • 2005లో తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ న్యాయ విద్యాలయం నుండి గౌరవ న్యాయవాద డిగ్రీ.
    ప్రొఫైల్‌...
    పుట్టిన తేది    : ఫిబ్రవరి 24, 1948 (63 ఏళ్లు)
    రాజకీయ పార్టీ    : అన్నాడీఎంకే
    నియోజకవర్గం     : శ్రీరంగం
    నివాసం     : చెనై్న, తమిళనాడు
    వృత్తి     : అన్నాడీఎంకే అధినేత్రి
     

మారుతున్న గ్రామీణ భారతానికి ప్రతీక.. ఛవీ రజావత్‌

లక్షల సంపాదన వదిలి... సమాజసేవవై కదిలి
http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010041650130402_330710e.jpg
సరిగ్గా 50 రోజుల క్రితం.. మార్చి 25, 2011.. ఐక్య రాజ్య సమితి వేదికగా.. 11వ ‘ఇన్ఫో-పావర్టీ’ సదస్సు జరుగుతోంది. భారత్‌ నుండి ఓ మహిళా గ్రామ సర్పంచ్‌ ఇప్పుడు ప్రసంగిస్తారు అని సదస్సు చైర్‌పర్సన్‌ ప్రక టించగానే.. అక్కడ ఉన్న వివిధ దేశాల రాయబారులు, మంత్రులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందరో మహామహులు ప్రసంగించాల్సిన ఈ సదస్సులో ఒక సర్పంచ్‌ ఏం మాట్లాడుతుంది అని చెవులు కొరుక్కు న్నారు.


మహిళా సర్పంచ్‌ అనగానే.. ఓ 40-50 ఏళ్ళ వయస్సులో.. గ్రామీణ వస్తధ్రారణలో.. ఉంటుందని భావించిన వారికి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అందం, ఆధునిక వస్తధ్రారణ చూసి.. ఈమె సర్పంచ్‌ కానేకాదు ఐటీ ప్రొఫెషనల్‌, మోడల్‌ అయి వుంటుందని అనుకున్నారంతా.. ఆమె రాజస్థాన్‌లోని సోడా గ్రామ సర్పంచ్‌ 30 ఏళ్ళ ఛవీ రజావత్‌. మేనేజ్‌ మెంట్‌ డిగ్రీని సైతం పక్కనబెట్టి.. ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సహకారం లేకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ‘ధీర’ వనిత. ఆమె సేవలకు గుర్తింపుగా.. ఇటీవల ‘టెక్నాలజీ డే’ సందర్భంగా.. మాజీ రాష్టప్రతి డా అబ్దుల్‌ కలామ్‌ చేతుల మీదుగా.. ప్రశంసాపత్రాన్ని అందుకుంది.


chhavirajawat 
ఛవీ రజావత్‌.. రాజస్థాన్‌లోని మారుమూల సోడా గ్రామ సర్పంచి.. మారుతున్న గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక.. 30 ఏళ్ల రజావత్‌ ఎంబీఏ చేసిన ఏకైక గ్రామ సర్పంచి.. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా..! మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య... ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో కాలేజీ విద్య... పుణెలోని బాలాజీ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీఏ పూర్తిచేసన రజావత్‌ తన స్వగ్రామానికి సేవ చేసేందుకు..


భారతీ-టెలీ వెంచర్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాన్ని సైతం వదులుకున్నారు. సిటీ లైఫ్‌ను విడిచిపెట్టి.. సోడాలోని మట్టి రోడ్లపై తిరుగుతూ.. ప్రజల తో మమేకమవుతూ తన గ్రామ ఉజ్వల భవితకు పునాది రాళ్లు వేస్తున్నారు. మార్చి 24-25 తేదీల్లో ఐరాసలో జరిగిన ఈ సద స్సు ప్యానెల్‌ చర్చలో పాల్గొన్న రజావత్‌.. దారిద్య్రానికి వ్యతిరేకం గా పోరాడటంతో.. అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌర సమా జం పాత్రపై ప్రసంగించారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తు త తరుణంలో మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ- సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవా లని చెప్పారు.


సోడాకు కొత్త సొబగులు...
‘‘గత సంవత్సర కాలంలో నేను, గ్రామస్తులు కలిసి మా సొంత కృషితో గ్రామంలో మంచి మార్పు తెచ్చాం. మాకు బయటి మద్ద తు లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకారం లేదు. అయితే, మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాకు కార్పొరేటు ప్రపంచం, బయటి ఏజెన్సీల మద్దతు కావాలి’’ అని రజావత్‌ కోరారు. తమ గ్రామంలో తొలి బ్యాంకు ఏర్పాటుకు సహకరించిన ఐరాస ఆఫీ్‌ ఫర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. ‘‘మూడేళ్లలో నా గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తా. నాకు డబ్బు అక్కర్లేదు. మా గ్రామంలో ప్రాజెక్టులను దత్తత తీసుకునే వ్యక్తులు, సంస్థలు కావాలి. నా గ్రామంలో సత్వర అభివృద్ధి కోసం ఈ సదస్సు సహకారమందించాలి. అప్పుడే మీరు, నేను అనుభవిస్తున్న మంచి జీవితాన్ని ప్రస్తుత తరం అనుభవించడాని కి వీలుంటుంది’’ అని ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. రజావత్‌ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
http://img.technospot.in/Chhavi-Rajawat.png
జీన్స్‌ ప్యాంట్‌... గుర్రపుస్వారీ...
సంప్రదాయంలో భాగంగా తమ ముఖం ఇతరులకు కనిపించ కుండా ముసుగు ధరించే మహిళలు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌ ధరించి.. గ్రామ సభలకు హాజరవుతారు.గుర్రపు స్వారీ చేస్తారు. సాధారణంగా.. ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన ఎవరైనా కార్పొరేట్‌ రంగంలో లక్షల సంపాదనతో స్థిరపడతారు. కానీ, రజావత్‌ అలా కాదు, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం కాదని. జన్మభూమి సేవలో తరిస్తున్నారు. గత మూడేళ్ళలో గ్రామ సర్పంచ్‌గా సోడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది. దీనికి గుర్తింపుగానే ఐరాస సదస్సు ప్యానల్‌ చర్చల్లో పాల్గొనే అరుదైన ఘనతను సొం తం చేసుకున్నారు రజావత్‌. ఎలాంటి సహాయ సహకారాలను ఆశించకుండా.. తీసుకోకుండా తనదైన ఆలోచనలతో తన గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సాధారణ మను షులకు సాధ్యం కాని పనిని చేసి చూపించింది. అందుకే 30 ఏళ్ళ వయస్సులోనే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించింది. భారత్‌ లోనే పిన్నవయస్కురాలైన, ఎంబిఎ చదివిన ఏకైక మహిళా సర్పం చ్‌ రజావత్‌ (30). గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన భారీ టెలీవెంచర్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. గ్రామ సర్పంచ్‌గా తాను అనుకున్నది సాధించిన వైనాన్ని ఐక్యరా జ్యసమితి సదస్సులో వివరించింది. దారిద్య్రంపై పోరు, అభివృద్దిలో పౌరసమాజం పాత్ర, అభివృద్ధి చర్యలను పౌరసమాజం ఎలా అమలు చేయాలి అనే అంశంపై చర్చలో పాల్గొంది.
http://images.jagran.com/PTI3_30_2011_000016B_49592.jpg
ఈ-సేవలు అమలు చేయాలి...
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిలీనియం లక్ష్యాలను సాధించాలంటే ఈ-సేవలు వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సహా వివిధ వ్యూహాత్మక చర్యలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులకు సూచించింది. ‘‘స్వాతంత్య్రం సంపాదించినప్పటినుంచీ గత 65 ఏళ్ళు ఒకే రీతిలో పురోగతిని సాధించేందు కు భారత్‌ కృషి చేస్తోంది. కానీ ఇది సరైనరీతిలో లేదు.ప్రజలకు నీరు, విద్యుత్తు, మరుగుదొ డ్లు, పాఠశాలలు, ఉద్యోగాలు అందించడంలో మనం విఫలమయ్యాం.


Chhavi_Rajawat
వీటిని వేరొకదారిలో సాధించడవచ్చు. వేగంగా చర్యలు చేపట్టవచ్చునని నేను భావిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాది లోనే నేను, సోడా గ్రామస్తులు కలిసి సొంత సామర్థ్యంతో గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.మేము ఎవరి మద్దతును తీసుకోలేదు. ఎన్జీవోలు గానీ, ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎవరి సాయం తీసుకోలేదు’’ అని చెప్పారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధిం చేందుకు బయట ఏజన్సీలు, కార్పొరేట్‌ ప్రపంచం మద్దతును కోరుతున్నానని ఆమె చెప్పారు.


మేనేజ్‌మెంట్‌ డిగ్రీ గ్రామ పాలనకు ఉపయోగపడుతోంది...
‘‘గ్రామస్తులకు సేవ చేయడం ద్వారా నేను నా మూల్లాలోకి వెళుతున్నాను. ఇందుకు ముంద స్తుగా అనుకున్నది కాదు. ఎక్కడైతే నేను ఎదిగానో అదే గ్రామానికి నేను సేవలు అందిస్తున్నా ను’’ అని ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం రజావత్‌ చెప్పారు. నా ఎంబీఏ డిగ్రీ గ్రామ పాలనకు, కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. దీనిని నేను కెరీర్‌గా భావిం చడం లేదు. సామాజిక సేవగా భావిస్తున్నాను అని చెప్పారు. ఎన్జీవోల సాయంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, సురక్షితమైన తాగునీరు తెచ్చేందుకు దృష్టిపెడుతున్నాను రజావత్‌ తెలిపారు.
http://images.idiva.com/media/content/2011/Mar/woman_sarpanch_chhavi_600x450.jpg
రిషీ వ్యాలీ టు సోడా...
ఛవీ రజావత్‌ నేతృత్వంలో సోడా గ్రామం ప్రగతిపథాన ముందుకు పోతుంటే, పత్రికా విలేఖ రులు, ప్రచార ప్రసార మాధ్యమాలు, ిసినీ నిర్మాతలు సోడా గ్రామానికి బారులు తీరారు. ఓ మహిళ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుచున్నాయనేదే అందరి ధ్యాస. సోడాలో మంచి నీరు ప్రధాన సమస్య. రజావత్‌ గతంలో జైపూర్‌లో గుర్రాల స్వారీ స్కూలును నడుపుతూ, తల్లికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించేది. రజావత్‌కు పూర్వ సర్పంచ్‌ విధులు సరిగా నిర్వహించని కారణాన గ్రామస్థులు విసిగి వేసారిపోయారు.


ఆమెను ఈసారి సర్పంచ్‌గా పోటీకి నిలువకపోతే ధర్నాకు సిద్ధమయ్యారు. ఓ వైపు తలంతా కప్పుకున్న గృహిణులు, మరోవైపు జీన్స్‌ ప్యాంట్‌తో ఈమె ఎలా గ్రామానికి పొంతన కుదరుతుందని కొం దరు ప్రశ్నించారు. ఆమె ఏ దుస్తులు ధరించినా సోడా గ్రామవాసి. అదే ఆ గ్రామానికి కోడలై తే రాజస్థానీ దుస్తులు ధరించాలని పట్టుబట్టే వారే. గుర్రమెక్కి గ్రామంలో ఇంటింటి బాగోగు లు వాకబు చేస్తుంది. ఛవీ రజావత్‌ రాజ్‌పుట్‌ కుటుంబీకురాలు. వారికి సోడా, పరిసర గ్రామాలలో వందల ఎకరాలున్నాయి.


ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తాతగారు ఆ ఊరి సర్పంచ్‌ వారి పాలనలో గ్రామస్థుల కష్టాలు తీరాయి.మళ్లీ సర్పంచ్‌ మారడంతో అభివృద్ధి నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ అమలు జరుగుతుందని సర్పించ్‌ భార్యను సర్పంచ్‌గా నుంచోమన్నాడు. కానీ గ్రామస్థులంతా ఛవీ రజావత్‌నే సర్పంచ్‌గా ఆదరించి గెలిపించారు.రాజస్థాన్‌లోని సర్పంచ్‌ల ఎన్నికల్లో చావీ రజావత్‌కే అత్యధికంగా మెజారిటీ లభించింది.

ఉపాధి హామీ...

టాంక్‌ జిల్లావెనుకబడిన ప్రాంతం. గ్రామస్థులంతా ఆవాలు, గోధుమ, ధనియాలను పండించే వారు.వర్షాభావ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా చెరువులు, వాగులు ఎండిపోయాయి. భూమిలో నీరు ఇంకిపోతుంది.బిసాల్పూర్‌ డామ్‌ నీళ్లు జైపూర్‌కు మళ్లిస్తున్న కారణాన టాంక్‌ జిల్లాలోని గ్రామాలకు నీరు అందటం లేదు. చావిరజావత్‌ సోడా గ్రామానికి నీరు రప్పించేందుకు కంకణం కట్టుకుంది. మరోవెపు జాతీయస్థాయిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలో అవినీతిపై రజావత్‌ యుద్ధం ప్రకటించింది. పంటలకాలం ముగిస్తే, గ్రామంలో పెక్కుమందికి ఉపాధి లభించుట లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకై రజావత్‌ శ్రమించింది. పంటకాలం ముగిస్తే, చేతులు ముడుచుకొని ఎవరినీ కూర్చోవద్దన్నది.


మహిళా కార్మికులు...
పొలం గట్లు వేయటం, మట్టి పనులలో అధికంగా మహిళా కార్మికులే పని చేస్తారు. చదువుకున్న విద్యార్థినులు కూడా మట్టి పనులు చేస్తున్నారు. ఏదైనా పొలాలకు నీరందితేనే కానీ, వారి భవిష్యత్‌ మారదనేది వారి వాదన. రోజూ నీటికై మహిళలు ఎన్నోమైళ్లు నడిచివెళ్లాలి. రోజూ రెండు సార్లు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. కొందరు నగరానికి వలసలు వెళ్లారు. మరి కొందరు సోమరులుగా సోడా గ్రాంలోనే కాలం గడుపుతున్నారు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4DQP_uTb9y7rwtPTNJac8JjjRK9P__GlnGQF0jYq-mwpvwQ3Ep_vk7mStdvbrfmuwbWt0T-qG6Klv5cKb9JHhCjrQYnLNYiqewLIzOh1pkoJabl0Z0ao-UAPBKMz7wM6w-oTQiEuL7Cs/s400/Chhavi-Rajawat.jpg

మారిన ఆలోచనాధోరణి...
తండ్రి, ఛవీ రజావత్‌కు బాసటగా నిలిచారు. చెరువులను తవ్వించటం, చెట్లు పెంచటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపకల్పన చేయటం వారి నిత్యవిధులు. వర్షపు నీటిని సక్రమంగా విని యోగించమని గ్రామస్థులకు తెలియజేశారు. ఛవీ రజావత్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులలో, ఎవరినీ సోమరిగా కూర్చోవద్దన్నది. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసింది. గ్రామాలలో పలుచోట్ల ప్రభుత్వం పైనే, ప్రతి పనికీ గతంలో ఆధారపడేవారు. ఛవీ రజావత్‌ అలా కాకుండా గ్రామస్థులను వారి కాళ్లపై నిలబడే స్వభావాన్ని పెంచింది. వారి ఆలోచనలను మార్చడం కష్టమే. కానీ కాలగమనంలో ఛవీ రజావత్‌ దీక్ష, పట్టుదల ముందు వారు తలొగ్గారు. ప్రతీ చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడక, గ్రామాభివృద్ధికై వారిని శ్రమయేవ జయతే బాటలో నడిపిస్తుంది.

Monday, January 31, 2011

గణతంత్రమా ? కు(టుంబ)తంత్రరాజ్యమా?


india-poltics
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీర్తి అందుకుంటున్న భారత దేశంలో రాచరికపు, వారసత్వ లక్షణాలు బలపడడం ఒక వైచిత్రి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది. పార్లమెంటే కాదు అనేక రాష్ట్ర అసెంబ్లీలలో పరిస్థితి ఇదే. అంతెందుకు? మన రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న ప్రజాస్వామిక నిర్వచనం ఇక్కడ పని చేయడం లేదు. కుటుంబం కొరకు, కుటుంబం వలన, కుటుంబం చేత నాయకులు తయారవుతున్నారు.

ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మరణిస్తే ఆ స్థానాన్ని మరో దీటైన నాయకుడితో నింపకుండా భార్యకో, కుమారిడికో ఇవ్వడం దానిని వారి కుటుంబ జమీన్‌లా కట్టబెట్టడం వెనుక రాజకీయ పార్టీల నిస్సహాయత, స్వార్థమూ రెండూ కనిపిస్తాయి. ఒక నాయకుడు కష్టపడి పైకి ఎదిగి ఒక స్థానాన్ని సాధించుకోవడం వెనుక అతడి శ్రమ, నిబద్ధత రెండూ ఉంటాయి. అయినంత మాత్రాన అతడు మరణించగానే ఆ స్థానాన్ని కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని చూడడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.

list1 ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్‌ గాంధి కొడుకు రాహుల్‌, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్‌ , మాధవ్‌రావ్‌ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్‌ పైలెట్‌ కొడుకు, ఒమర్‌ అబ్దుల్లా బామ్మర్ది సచిన్‌, ఫరూక్‌ అబ్దుల్లా కొడుకు, షేఖ్‌ అబ్దుల్లా మనవడు ఒమర్‌ అబ్దుల్లా, ములాయమ్‌ సింగ్‌ యాదవ్‌ కొడుకు అఖిలేశ్‌, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్‌సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది.

ఇప్పటి యువ నాయకులు ప్రపంచం చుట్టివచ్చారు. ప్రతిభపై ఆధారపడ్డ కొత్త కార్పొరేట్‌ సంస్కృతిని అలవరుచుకున్నారు. ఆధునిక భారతదేశాన్ని అవతరింపచేయడం కోసం కృషిచేసినవారి వారసులుగా వీరిని వీరు పరిగణించుకుంటున్నారు. ఏ దిక్కుకేసి చూచినా కుటుంబరాజకీయాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దాని ఫలితాలు చాలా స్వల్పమైనవి.

list లక్షద్వీప్‌ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్‌ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్‌పవార్‌ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది.

రాజకీయాల్లో బంధుప్రీతి ఎంతగా పాతుకుపోయిందంటే ప్రజాస్వామ్యంపై దాని ప్రభావాన్ని అంచనా వేయలేము. వంశానుగత వారసత్వ రాజకీయాలు ఎంత లోతుగా పాతుకుపోయిందో ఊహకందదు.
ఈ కుటుంబ వ్యవస్థ వల్ల మంచి సత్తా ప్రతిభ వున్న వారు మొగ్గ దశలోనే రాజకీయరంగానికి దూరమవుతున్నారు. ఇక్కడ సమస్య వారసత్వం మాత్రమే కాదు. ప్రముఖ నాయకుడి పిల్లల్ని, వితంతువుల్ని, బామ్మర్దుల్ని రంగంలోకి దింపి కుటుంబం అధికారాన్ని బలోపేతం చేసుకుం టున్నాయి రాజకీయ పార్టీలు. అర్హులు కాకపోయినా ప్రముఖ నాయకుల పిల్లలు రాజకీయల్లోకి ప్రవేశించాలని ఆశిస్తారు.

వారసత్వం అధికంగా ఉన్న పార్టీలు...
farukhపార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్‌పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు.

ఇది ప్రాంతీయ అంశమా..
ఇక్కడే విభిన్న రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. పంజాబ్‌,ఢిల్లీ, హర్యానాల్లో కుటుంబ రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయి. ఆ తర్వా త గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ కాక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 75 శాతం పైచిలుకు ఎంపీ లు వారసత్వేతర నేపథ్యానికి చెందినవారని తెలుస్తోంది. సాధారణంగా ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి 2000 సంవత్సరంలో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రాల్లో బంధుప్రీతి అంత గా లేదని చెప్పుకోవాలి. కుటుంబ రాజకీయాలు బలపడ్డానికి సమయం బహుశా సరిపోలేదు.


రాష్ట్రంలో సంచలన వారసత్వం
ap-pమన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్‌కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.

mchannareddy లోక్‌సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉత్తర భారతమంతటా శాసన సభ్యులు తమ పిల్లల్ని, పెళ్ళాల్ని వారసులుగా నియమిస్తున్నారు. 38 అతి కుర్ర ఎంపీల్లో 33 మంది మమ్మీ-డాడీ సహాయంతో వచ్చినవారే. మిగతా 5గురిలో ఒకరు రాహుల్‌ ఎంపిక చేసిన మీనాక్షి నటరాజన్‌. మరో ముగ్గురు స్వయం కృషితో పైకి వచ్చిన బిజెపి,బిఎస్‌పి ,సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు. మరొక సభ్యుడు మాయావతి ఎంపిక చేసిన వారు.

దక్షిణాదిలో బలమైన వంశ వృక్షం
south-polticsదక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.

సుదీర్ఘకాల వారసులు ఎక్కువ సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ లో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. వలస పాలకులు మన రాజ్యాధికారాన్ని దేశంలోని రాజరిక కుటుంబాలకు హస్తగతం చేయకూడదన్న నిజం పునాదిగా భారత గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. కానీ తీరా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌ సభ కాక ఒక వంశ సభ ఆవిర్భవించినట్టు కనిపిస్తోంది. వారసత్వ పాలన రాకుండా ఉండేందుకు నెహ్రూ,పటేల్‌,వి.పి.మీనన్‌ తదితరులు బృహత్తరమైన కృషిచేశారు. 554 రాజరిక రాజ్యాలు ఆధునిక ప్రజాస్వామిక దేశంలో విలీనం చేయడానికి పాటుపడ్డారు. దేశంలో సర్వసత్తాక అధికారం ప్రజాపరంగానే వుండాలన్న సూత్రంగా స్వతంత్ర భారత రాజ్యాంగం ఆవిర్భవించింది.

కానీ ఈ రోజు దేశం కొత్తగా కొన్ని ప్రాంతాలుగా విడిపోయింది. కొన్ని స్థానిక కుటుంబాల చేతుల్లో రాజ్యాధికారం బందీ అయిపోయింది.