Thursday, December 23, 2010

ఇంతింతై... అవధానమంతై

చెప్పు, చేట, పేడ, గాడిద...ఈ నాలుగు పదాలతో శ్రీకృష్ణదేవరాయలు అల్లసానికి చేసిన సత్కారాన్ని వర్ణించండి? పోనీ...సచిన్, ద్రవిడ్, గంగూలీ, గంభీర్‌లు ఉండేలా మహాభారత పద్యాన్ని చెప్పగలరా? ఏంటండీ అలా కళ్లెర్ర చేస్తున్నారు?

'మరి..ఈ వేళాకోళాలేంటి? చెప్పేమిటి, చేటేమిటి? వాటితో పెద్దనామాత్యునికి సత్కారమేమిటి? పైగా సచిన్, ద్రవిడ్, గంగూలీ, గంభీర్లతో మహాభారతమా? మా భాషా పరిజ్ఞానానికి పరీక్షా?' అంటున్నారా? అయ్యో..అపార్థం చేసుకున్నారు. ఈ పదాలనే నాగశాంతి స్వరూప, అపర్ణలకు ఇస్తే చిటికెలో చక్కటి పద్యాలు చెప్పేస్తారు ఆశువుగా. అష్టావధానంలో. ఎక్కడ అంటారా? ఆ వివరాలు చెప్పడానికే ఈ కథనం.


పరిచయం: అపర్ణ, పుల్లాభట్ల నాగశాంతి స్వరూప ఇద్దరూ రాజమండ్రిలోని ఆంధ్రయువతీ సంస్కృతకళాశాలలో భాషా ప్రవీణ కోర్సు అభ్యసించారు. వారిలో స్వరూప కంటే అపర్ణ సీనియర్. ఇద్దరూ తెలుగు పండిట్ కోర్సు మూడో సంవత్సరంలో ఉన్నప్పటి నుంచే అష్టావధానం చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం స్వరూప తిరుపతిలో ఎమ్ఏ చదువుతోంది. ఈ మధ్యే అపర్ణ గృహిణిగా మారింది.

సరదాగా మొదలుపెట్టాం- నాగశాంతి స్వరూప

నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తెలుగులో అష్టావధానం అనే పాఠముండేది మాకు. మాస్టారు ఆ పాఠాన్ని వివరించి చెప్పాక 'అమ్మో ఎంత కష్టం' అనిపించింది. అయినా కుతూహలం కలిగింది. అట్లా మొదలైన ఇష్టం, జిజ్ఞాసకు మా మాస్టారు ధూళిపాళ మహదేవమణిగారు ఓ రూపాన్నిచ్చారు. నిజానికి మాదేమీ పాండిత్య నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నాన్న సుబ్రహ్మణ్య శర్మ పౌరోహిత్యం చేస్తుంటారు. అమ్మ లక్ష్మీనరసింహాంబ గృహిణి.

ఎవరికీ కనీసం ఈ ప్రక్రియ మీద అవగాహన లేదు. భాషా ప్రవీణ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడే మహదేవమణిగారు రకరకాల సందర్భాలు..అంశాలు ఇస్తూ ఆశువుగా పద్యాలు రాయమనేవారు. అలా పద్యాలు రాయడం చాలా ఇష్టంగా..సరదాగా ఉండేది నాకు. నా ఉత్సాహం చూసే లక్ష్మీకామేశ్వరి అనే అమ్మాయితో పాటు నన్నూ ఎంపికచేశారు అష్టావధానం నేర్పడానికి. మా కన్నా ముందు బ్యాచ్‌లో అపర్ణ, ఉదయచంద్రికలు ఎంపికయ్యారు. ఆ కళాశాలలోనే కాదు రాష్ట్రంలో అష్టావధానం చేస్తున్న మహిళలం కూడా మేం నలుగురమే.

పదకొండు అవధానాలయ్యాయి...

రాజమండ్రిలో ఉన్నప్పుడు గణపతి నవరాత్రులలో మా కళాశాలే వేదికగా, ఉపాధ్యాయులే పృచ్ఛకులు(సమస్యలిచ్చేవాళ్లు)గా మహదేవమణిగారి ఆధ్వర్యంలో మా మొదటి అష్టావధానం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా లక్ష్మీకామేశ్వరి, అపర్ణలతో కలిసి పదకొండు అష్టావధానాలు చేశాను. నిషిద్ధాక్షరి, దత్తపదులు, అప్రస్తుత ప్రసంగం ఇలా ఏ అంశమైనా బెరుకు, తత్తరపాటు లేకుండా పూర్తిచేయగలను.

ఇప్పటిదాకా నేను చేసిన అవధానాల్లో నాకు బాగా నచ్చినవి, పేరు తెచ్చినవి రెండు. ఒకటి కిందటేడు కావలిలో చేసిన అవధానం. ఇందులో పృచ్ఛకులంతా మహిళలే. తర్వాతది హైదరాబాదులో...త్యాగరాయ భాషోత్సవాల్లో నేను, కామేశ్వరి కలిసి చేసిన అష్టావధానం. ఆ రోజు మమ్మల్ని సినారె అభినందించారు కూడా. అందులో ఓ పృచ్ఛకుడు 'రాముని మానసంబు కడు రంజిల్లు అప్సర గాంచినంతన్' అనే సమస్యనిచ్చారు పూరించమని. రాముడేంటి? పరకాంతను చూసి ఆనందపడ్డమేంటి అనిపించింది. ఎలా పూరించాలి? అని ఆలోచించి..

కోమలి ఓరచూపులును కుల్కులు లాస్యవినోదహాసముల్
మామన దేవునిన్ కొలుచు సత్యధనంబున చేరబోవు సుత్
రాముడు పంపు మేనకనురాగము నుండెను కౌసుకుండు ఔ
'రా ముని మానసంబు కడు రంజిల్లు అప్సరగాంచినంతన్..' అని పూరించాను.

దీని అర్థం క్లుప్తంగా చెప్పాలంటే సుత్‌రాముడు అంటే ఇంద్రుడు పంపిన మేనక కులుకులు, ఒయ్యారాలు, నాట్యం చూసి విశ్వామిత్రుడి మనసు వశం తప్పింది అని. అర్థమన్నమాట. ఇందులో నాలుగోపాదంలో వాళ్లిచ్చిన పాదం వచ్చింది. రా ముని విడగొట్టడం ద్వారా దాని అర్థం మార్చగలిగాను.

మా నాన్న ప్రోత్సాహం చాలా ఉంది - బి. అపర్ణ

నేను శాంతితోనూ, నా బ్యాచ్‌మెట్ ఉదయచంద్రికతోనే కాక ఒంటరిగా కూడా ముప్పై వరకు అష్టావధానాలు చేశాను. కొత్తలో దత్తపదుల సమస్యను పూరించడమంటే చాలా భయంగా ఉండేది. ఒకసారి మహదేవమణి గారితో కలిసి బెంగుళూరులో చేసిన అష్టావధానంతో దత్తపదులంటే ఉన్న భయం పోయింది. అప్పుడే సచిన్, ద్రవిడ్, గంభీర్, గంగూలీలతో మహాభారత పద్యం పూరించమన్నారు. హతవిధీ...అనుకున్నాను. అది క్షణం సేపే. తేటగీతిలో వెంటనే మొదలెట్టేశాను

ఆ'సచిన్న'ది అయిదు ఊళ్లే అడుగ భీతి
ము'ద్రవిడ'నాడి కౌరవ మోహ మతుల్
అనిని జొచ్చి వే'గంగూలి'రథములౌచు

క్రౌర్య 'గంభీరు'లవ్వారి కర్మమదియే' అని. అరణ్య, అజ్ఞాతవాసములు పూర్తిచేసుకున్న పాండవులు కనీసం ఐదూళ్లన్నా ఇవ్వమని కౌరవులను అడిగారు. వాళ్లు ఇవ్వకపోగా యుద్ధానికి తలపడ్డారు. ఎంత వేగంగా వారు యుద్ధంలోకి దిగారో అంతే వేగంగా కూలిపోయారని ఆ పద్యం అర్థం. ఆ'సచిన్న'ది అంటే ఆశ చిన్నది అని. అందులో సచిన్ వచ్చాడు. భీతి ము'ద్రవిడ'నాడి అనగా..భయమనే భావనే లేకుండా అని. అందులో ద్రవిడు వచ్చాడు. వే'గంగూలి' అంటే వేగంగా నేలకొరిగారు అని. అందులో గంగూలి వచ్చాడు.

చివర క్రౌర్య 'గంభీరు'లవ్వారి అంటే ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని, క్రూరులు అని. అందులో గంభీర్ ఉన్నాడు. ఈ పూరణతోనే దత్తపదులంటే ఉన్న భయం పోయింది నాకు. ఇలాగే ఒకసారి చెప్పు, చేట, పేడ, గాడిదలతో దేవరాయలచే అల్లసానికి సత్కారం చేయమన్నారు. శివశివా..అనుకోలేదు నేను. ఉత్సాహంగా పూర్తిచేశాను.

ఆఖరికి భర్తా మామలు కూడా...

అష్టావధానం అంటే నాకు చిన్నప్పటి నుంచే అవగాహన ఉంది. ఎందుకంటే నాన్నగారు బి.ఎ.మోహన్ వచన కవిత్వం రాస్తారు. అప్పట్లో ప్రతి గురువారం ఆకాశవాణిలో నా పేరుమీద సమస్యా పూరణం పంపేవారు. నాన్నను ఎరిగున్న వాళ్లంతా 'అమ్మాయి పేరుమీద పంపడం కాదయ్యా...అమ్మాయినీ గొప్ప పండితురాలిగా చెయ్యాలి' అనేవాళ్లు. వాళ్లన్నట్టుగానే నాన్న నా చేత పద్యం రాయించడానికి చాలా కష్టపడేవారు.

నాన్న ఆరాటం, సహజంగానే భాషంటే నాకున్న అభిమానం, కాలేజ్‌లో గురువుగారిచ్చిన ప్రోత్సాహం ఇవన్నీ కూడా నేను అష్టావధానం చేయడానికి ప్రేరణగా నిలిచాయి. పెళ్లయి అత్తింటికి వెళ్లాక భర్త, మామగారి ప్రోత్సాహం కూడా అలాగే ఉంది. ఆలూమగల గిల్లికజ్జాల మీద కూడా పద్యాలు, పాటలు సాగుతుంటాయి మా ఇంట్లో. వీళ్లంతా నా వెనకుండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

Thursday, December 9, 2010

ముడియెట్టు నాట్యం

mudiyett
ఇది కేరళీయులందరికీ ఎంతో గర్వకారణమైన రోజు. ప్రతి ఒక్కరూ గుండెలనిండా సంతోషంతో తమ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు లభించిన ఆనందాన్ని ఆస్వాదించే రోజు. భద్రకాళికా మాత శత్రుసంహారం జరిపే ఘట్టానికి ఆ ప్రాంత వాసులు ‘ముడియెట్టు’ ఉత్సవంగా జరుపుకుంటారు. ఇది చాలా పురాతనమైన సంస్కృతీయ కళలకు సంబంధించిన ఎంతో ఘనమైన ఆచారం. కేరళలోని మారుమూల పల్లె ప్రాంతవాసులు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటారు ఈ ఉత్సవాన్ని. ముడియెట్టు ఉత్సవానికి ఇటీవలే అంతర్జాతీయ భద్రతా సంస్థలో భాగమైన అంతర్జాతీయ కళాసంస్కృతికి సంబంధించిన ‘యునెస్కో’ గుర్తింపు లభించింది. కేరళలోని తిరుస్సూర్‌ ప్రాంతంలో ఈ ‘ముడియెట్టు’ ఉత్సవాన్ని ప్రజలు భక్తిప్రపత్తులతో జరుపుకోవడం విశేషం. ఈ గుర్తింపు వెనక ‘నాట్యవేది’ సంస్థకు చెందిన కో-ఆర్డినేటర్‌ సి.కె.థామస్‌ కృషి అనిర్వచనీయమైనది.

mudiyettu1
కేరళ రాష్ట్రానికే గర్వకారణమైన ఈ నృత్యాన్ని ‘యునెస్కో’ దృష్టికి తీసుకెళ్లడమేగాక దానికి సంబంధించిన క్లిప్పింగ్స్‌, జనాభిప్రాయసేకరణ అవన్నీ సమీకరించి అంతర్జాతీయ స్థాయికి కృషిచేశారు థామస్‌. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించడంలో...థామస్‌ ఖర్చుకు వెనకాడక మధ్య ట్రావెన్కూర్‌లోని అన్ని భద్రకాళి గుళ్లలో ఈ‘ముడియెట్టు’ ఉత్సవానికి సంబంధించిన రికార్టులను, వాటి మూల చరిత్రను సంపాదించగలిగారు. ఈ ప్రయత్నంలో ఇదే సబ్జెక్టుపై పరిశోధనలు జరుపుతున్న సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో మీనాపౌల్‌ సహకారం తీసుకున్నారు. తమ ‘నాట్యవేది’ సంస్థ తరపున దాదాపు ఒక కోటి రూపాయల మేరకు ఖర్చుపెట్టి ఓ 5 సంవత్సరాలపాటు పరిశోధనలు సాగించారు. థామస్‌ ‘నాట్యవేది’ కో-ఆర్డినేటర్‌గానేగాక త్రిస్సూర్‌ దూరదర్శన్‌ కేంద్రానికి డైరెక్టర్‌గా కూడా చేస్తున్నారు. దీనితో ఆయనకు పరిశోధన విషయంలో ఏ మాత్రం ఆటంకాలు ఎదురుకాలేదు.

Tuesday, December 7, 2010

శాక్సోఫోన్ సిస్టర్స్

వీణ వాయించే సిస్టర్స్ గురించి మనకి తెలుసు. కాని శాక్సోఫోన్‌పై రాగాలు పలికించే సిస్టర్స్ గురించి తెలుసా మీకు? 'అచ్చమైన పాశ్చాత్య పరికరం అది. దాన్ని సరిగ్గా పట్టుకోవడమే రాదు మన అమ్మాయిలకి' అని అనుకుంటున్నారా! అబ్బాయిల సంగీత పరికరంగా ముద్ర పడిన శాక్సోఫోన్‌ని అలవోకగా వాయించేస్తున్నారు ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు. వీళ్లు విదేశీయులు కాదు మన భారతీయులే. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లావణ్య, సుబ్బలక్ష్మి 'శాక్సోఫోన్ సిస్టర్స్'గా సంగీత ప్రపంచంలో స్థానం సంపాదించుకున్నారు.

పదిహేనేళ్ల వయసులోనే లావణ్య దృష్టి శాక్సోఫోన్‌పై పడింది. 'నువ్వు నేర్చుకోవాలంటే మన సంప్రదాయ సంగీత పరికరాలు ఎన్ని లేవు? ఎక్కడో ఆ విదేశీ వాయిద్యం ఎందుకు' అని చాలామంది ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డారు. 'నేను చూపించే ఆసక్తి పాశ్చాత్య సంగీతంపై కాదు పరికరంపైన. దాంతో మన సంప్రదాయ సంగీతం పలికిస్తే చాలా బాగుంటుంది' అని ఆమె తన ఆశయాన్ని ఒక్క మాటలో చెప్పింది. బిడ్డ మాట కాదనలేక తండ్రి తన స్నేహితుడైన శాక్సోఫోన్ దిగ్గజం కద్రి గోపాల్‌నాథ్ దగ్గర శిక్షణ ఇప్పించారు.

కుటుంబానికి పేరైతే ఉంది కాని ఆర్థికంగా ఉన్నవారేం కాదు. అయినా ఎంతో కష్టపడి శాక్సోఫోన్ నేర్చుకుంటున్న అక్క శ్రద్ధని ఆదర్శంగా తీసుకుంది చెల్లెలు సుబ్బలక్ష్మి. ఇద్దరూ కలిసి నేర్చుకున్నారు. కలిసి శాక్సోఫోన్‌తో మన దేశ సంప్రదాయ రాగాల్ని పలికించారు. చిన్న చిన్న కచేరీలతో మొదలైంది వీరి సంగీత ప్రయాణం. ఆ నోటా ఈ నోటా వీరి గురించి నలుగురికీ తెలిసింది.

కలర్స్ టీవీ చానెల్ వారు నిర్వహించిన 'ఇండియా హాజ్ గాట్ టాలెంట్' కార్యక్రమంలో పాల్గొనడంతో వారి ప్రతిభ దేశవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అప్పటి నుంచే దేశవ్యాప్తంగా వారికి ఆహ్వానాలు అందాయి. విదేశాల్లో వీరిచ్చే కచేరీలకు బోలెడంత డిమాండ్ పెరిగింది. తమ దేశ సంగీత పరికరంతో భారతీయ రాగాలు పలకిస్తున్న ఈ సిస్టర్స్‌ని వారు చక్కగా ఆదరిస్తున్నారు. దేశ, విదేశాల్లో ఈ శాక్సోఫోన్ సిస్టర్స్ ఇప్పటివరకూ 600 కచేరీలు ఇచ్చారు.




Saturday, November 20, 2010

No. 1 C.E.O.

Nooyi
అమెరికాలో అత్యధికంగా వేతనాలు పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సిఇఓగా ఇంద్రానూయి నిలిచారు. మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ హే గ్రూపు నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.అమెరికాలో భారతీయ సంతతికి చెందిన, అత్యధిక వేతనం అందుకుంటున్న సిఇఓల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో 400 కోట్ల డాలర్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన కంపెనీలను సర్వే పరిగణలోనికి తీసుకుంది. ఇందులో 1.4 కోట్ల డాలర్లు(63 కోట్లు) వార్షిక వేతనంతో పెప్సికో కంపెనీ సిఇఓ అత్యధికంగా వేతనాలు పొందుతున్న సిఇఓల్లో 67వ స్థానంలో నిలిచింది.

ప్రొఫైల్‌..
పుట్టినది      *    అక్టోబర్‌ 28, 1955, చెన్నై

పౌరసత్వం   *   అమెరికా
విద్య           *   మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజ్‌ ఐఐఎం కలకత్తా, యాలే స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ 

హోదా       *   పెప్సికో కంపెనీ ఛైర్‌పర్సన్‌, సిఇఓ

Friday, November 19, 2010

షరతులతో కూడిన స్నేహం

Friendship1
సంజన, కునాల్‌ మంచి స్నేహితులు. చాలా ఏళ్ళ నుంచి ఒకరినొకరు విడిచి ఉండలేనంత స్నేహం వారిది. ఒకరోజు కునాల్‌ తాను శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దాంతో సంజన చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయింది. చివరకు కాలేజీకి కూడా రావడం మానేసింది. ఒక రోజు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కునాల్‌ వెంటనే సంజనను కలిసి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్‌ ? అని అడిగాడు. సంజన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ సంజన చెప్పిన విషయం ఏంటంటే... కునాల్‌ను ప్రేమిస్తున్నానని, వేరే అమ్మాయితో కలిసి తిరగడం తనకు నచ్చలేదని, ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే కోపం వస్తుందని అందుకే ఈ పనిచేశానని చెప్పింది. ఇలా నేడు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్నేహితులు ఇతరులతో ప్రేమలో పడితే సహించలేకపోతున్నారు. పెత్తనం చెలాయించేలా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సమాధానం గా కొందరు యువతీ యువకులు కొందరు కొన్ని షరతులతో కూడిన స్నేహం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నా రు. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే చర్చించుకుంటే మంచిదని భావిస్తున్నారు.

friendship
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి... అని అనేక మంది కవులు, రచయితలు ఎప్పుడో అన్నారు. అది నిజం కూడా. కానీ, స్నేహితులంటే ఇద్దరు అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య మాత్రమే కాదు. నేటి రోజుల్లో యువతీ యువకుల మధ్య కూడా ఫ్రెండ్‌షిప్‌ పెరిగింది. అసలు చిక్కు అక్కడే ఉంది. చాలా కాలం స్నేహితులుగా ఉన్న వారి మధ్య సాధారణంగా ప్రేమ చిగురించేందుకు ఆస్కారం ఉంది. ప్రేమ పుట్టకపోయేందుకు కూడా అంత అవకాశం ఉంది. కానీ నేడు కొంతమంది స్నేహానికీ, ప్రేమకూ తేడాలు తెలియకుండా పోతోంది. ఇతరులతో స్నేహం చేసినా, ప్రేమలో పడినా వారు సహించలేకపోతున్నారు. బెదిరించడం, అఘాయిత్యాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అందుకే నేడు కొత్త పద్ధతిని కుర్రకారు ప్రవేశపెట్టారు. అదే షరతులతో కూడిన స్నేహం. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే ఒక ఒప్పందానికి రావడం ఇందులోని ప్రధా‚న విషయం. ప్రస్తుతం చాలామంది యువత ఈ పద్ధతిని ఆమోదిస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. స్నేహానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు.

కాలం మారింది... : కాలం మారింది. కాలంతో పాటే మనుషుల అభిప్రాయాలు, ఆలోచనలు మారాయి. అధునిక నాగరికత మూలంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఉండే గీత చెరిగిపో యింది. కలిసి ఒకే కాలేజీలో చదువుకోవడం, ఒకే చోట ఉద్యోగాలు చేయడం వల్ల వారి మధ్య సహజంగానే స్నేహం ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాలకు ముందు ఆడ ఫ్రెండ్‌ ఉందంటే చిత్రంగా అనుకునేవారు. ప్రస్తుతం స్నేహితురాలయినా, స్నేహితుడయినా పెద్ద తేడాలేకుండా అయిపోయింది. అయితే, నేడు యువతీ యువకులు స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమా తేల్చుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అది కొన్ని సమస్యలకు కూడా దారి తీస్తోంది.

Friendship2
ఒప్పందం కుదుర్చుకుంటున్నారు... : నేడు స్నేహం చేసే అమ్మాయిలు, అబ్బాయిలు ముందే ఒక ఒప్పం దం కుదుర్చుకుంటున్నారు. ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం తమ స్నేహాన్ని విస్తరించుకుంటున్నారు. ‘కలిసి ప్రయాణిస్తున్న స్నేహం అనే బోటులో ఎప్పుడైనా ఇద్దరి మధ్య ప్రేమ కలగవచ్చు, లేకుండా పోవచ్చు. ఇతరులపై ఆమెకు లేదా అతనికి ప్రేమ కలగవచ్చు. అలాంటప్పుడు ఇంత కాలం స్నేహం చేసిన వారు బాధపడకుండా ఉం డాలంటే ముందుగానే షరతు ఉండాలని నేననుకుంటున్నాను. పరిచయం అయిన వెంటనే మీ డ్రీమ్‌ గర్ల్‌ / బాయ్‌తో ప్రేమిస్తున్నామని చెప్పడం కుదరదు. ప్రేమ ఎప్పుడు ఎవరితో ఏ సమయంలో కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ నేడు కొంతమంది స్నేహం కూడా ప్రేమే అని అనుకుంటున్నారు. అలా కాకుండా ముందుగానే కొన్ని షరతులతో ఒప్పదం కుదుర్చుకొని స్నేహం చేయడం మంచిది. చెప్పుకోవడానికి హాస్యాస్పదంగానే కనిపి స్తున్నా నేడు జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవసరమే అనిపిస్తుంది’ అని మెడిసిన్‌ చదువుతున్న ప్రసాద్‌ తెలిపాడు.

మంచిది కాదు... : ‘నా ఫ్రెండ్‌ నేను చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నాం. సన్నిహితంగా మారిపో యాం. నాకు తన మీద స్నేహం కన్నా ప్రేమ ఎక్కువైంది. ఆ సమయంలో తను ఒక రోజు వేరే అమ్మాయిని ప్రేమి స్తున్నానని చెప్పాడు. అప్పుడు తనకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను ప్రేమిస్తున్నానన్న సంగతి ముందుగానే తెలియజేసి ఉంటే బాగుండేది అని నాకా టైములో అనిపించింది. కానీ ఎటువంటి సంబంధం లేని అతన్ని ఆపే హక్కు నాకు లేదు. అందుకే ఒకరోజు వాళ్లిద్దరికీ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశాను. తరువాత అతనితో ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తూనే ఉన్నాను. మనం ప్రేమిస్తున్నామని తను కూడా ప్రేమించాలనుకోవడం మంచిది కాదని నాకు అప్పుడు అనిపించింది’ అని ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ సులోచన పేర్కొంది.

సిద్ధాంతం లేదు... : ‘ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉన్నంత మాత్రాన అబ్బాయి మరొక అమ్మా యితో ప్రేమలో పడకూడదని ఎక్కడా లేదు. మరెందుకు స్నేహితులుగా ఉన్న అబ్బాయిలు వేరే అమ్మాయిని ప్రేమించినా, స్నేహం చేసినా బాధపడడం, ఏడవడం ఎందుకు చేస్తారో నాకు అర్థంకాదు. ఇది అర్థం పర్థంలేని విషయాలుగా నాకనిపిస్తుంది. స్నేహం చేస్తున్నంత మాత్రాన పెళ్లి అయిపోయినట్టే అనుకుంటే అది వారి మూర్ఖత్వంగానే పరిగణిస్తాను. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిల విషయంలోనూ వర్తిస్తుంది. తమ ఆడ ఫ్రెండ్‌ వేరే అబ్బాయితో మా ట్లాడినా, స్నేహం చేసినా కొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయిపై పెత్తనం చెలాయిస్తారు. దాదాపు అందరూ తమ స్నేహాన్ని విస్తరించా లనుకుంటారు. అది సహజం. అది ఎవరియినా కావచ్చు. అందుకే ముందుగానే చర్చించుకోవడం మంచిదే అని నా అభిప్రాయం. తమ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది ముందుగానే నిర్ణయించుకో వడం ప్రస్తుతం తప్పనిసరి’ అని బికాం విద్యారి కిరణ్‌ చెప్పాడు.

చిరాకుగా అనిపించింది... : ‘నా ఫ్రెండ్‌ తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పలేదు. అయితే, కాలేజీలో చాలా మంది నీ బాయ్‌ఫ్రెండ్‌ నిన్ను మోసం చేస్తే ఎందుకు కామ్‌గా ఉన్నావని అడిగారు. అలా అడగడం నాకు చాలా చిరాకుగా అనిపించింది. స్నేహానికి, ప్రేమకు తేడా తెలియనివారు ఇప్పుడు కూడా ఉన్నారా? అని అనిపించింది’ అని నిఖితా చెప్పింది.

Thursday, October 14, 2010

‘టైగర్‌ రతన్‌’

నేను పులి పిల్లను
money_magic
అతికొద్దిమంది మహిళా ఫండ్‌ మేనేజర్లలో ఒకరిగా వుంటూ ‘టైగర్‌ రతన్‌’ను స్థాపించి అందరి ప్రశంసలు అందుకుంటోంది నేహా చోప్రా. ఆర్థిక రంగానికి సంబంధించి భిన్నమైన వ్యూహం, వ్యవహార శైలిని అవలంబిస్తూ ముందుకెళ్తోంది. ఆ రంగంలో తలెత్తే మార్పులు, నిశితమైన విశ్లేషణ, పరిశోధనల ఆధారంగా పనిచేయడం వల్లే విజయాలు సాధిస్తున్నట్లు చెబుతోంది.

ప్ర.కొద్దిమంది ఫండ్‌ మేనేజర్లలో ఒకరుగా ఉండడం ఎలా అనిపిస్తోంది?
జ. మిహళనవడం ఒక అవరోధంగా ఎప్పుడూ భావించలేదు. చాలా కాలంగా పురుష ప్రపంచంలోనే ఉన్నాను కదా! అంతకు పూర్వం ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్‌గా కృషిచేశాను. నేనెప్పుడూ ఈ విషయాల గురించి కలత చెందలేదు.కొద్దిమంది మహిళల్లో నేనొకదానై్ననందుకు నన్నందరూ ప్రశంసి స్తున్నారు.పురుషుడినైవుంటే అభినందనలు దక్కేవి కావు కదా!

ప్ర. వార్టన్‌ నుంచి 21 ఏట ఎం.బి.ఎ పూర్తి చేశారు. అంత చిన్న వయసు ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించారు?
జ.వార్టన్‌ యూనివర్శిటీలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చదువుతున్నపుడు మంచి మార్కులు వచ్చేవి. కనుక జూనియర్‌గా వున్నపుడే టీచింగ్‌ అసిస్టెం ట్‌గా పనిచేశాను. మూడు ఫైనాన్సు క్లాసులు చెప్పేదాన్ని.నిజానికి అప్పటికే ఎంబిఎ విద్యార్థులకు పాఠాలు చెప్పినట్లే. వేసవి సెలవల్లో గోల్డ్‌మాన్‌ సాక్స్‌ లో వారి ఎలీట్‌ మెట్రిక్యులేషన్‌ కార్యక్రమంలో భాగంగా పనిచేశాను. నాకు వచ్చిన మంచి గ్రేడ్లు, చిన్న వయసులోనే టీచింగ్‌ అసిస్టెంట్‌గా అనుభవం గడించడం, ఎంతో పేరున్న ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ అయిన గోల్డ్‌మాన్‌ సాక్స్‌లో అనుభవం వల్ల వార్టన్‌ విశ్వ విద్యాలయంలో ఎంబిఎ పాసయ్యాను.

ప్ర.అమెరికా చదువు వల్ల అదనపు ప్రయోజనం వుందనుకుంటున్నారా?
జ. అమెరికా చదువు ప్రత్యేకించి ఏలాటి ప్రయోజనాన్ని సమకూరుస్తుందని నేనకోవడంలేదు. పట్టుదల, కృషి విజయానికి మూలస్తంభాలని భావిస్తు భావిస్తున్నాను.మనం సాధించాలనుకున్నదానిపైనే దృష్టి కేంద్రీకరించాలి. మీ మక్కువను చూరగొన్న విషయంపై కృషి చేస్తే తప్పకుండా అద్భుతమైన విజయం సాధించవచ్చు.

ప్ర. యు.బి.ఎస్‌.లో మీరు పనిచేస్తున్నపుడు మీరు వయసు రీత్యా చాలా చిన్న అసిస్టెంట్‌ అవడం మూలాన ఎవైనా ఇబ్బందులు ఎదురైనట్లు భావిస్తు న్నారా?
జ. వయసులో చాలా చిన్న వారవడాన్ని ఒక అనుకూలమైన విషయంగా భావించి వ్యవహరించాలి. మన పట్ల చాలామంది సహాయపూర్వక వైఖరి అవలంబిస్తారు. అది నాకెంతో ఇష్టం. ఇంకా, ప్రతిభే ప్రధానంగా ఉన్న చోటే నేను పనిచేశాను. వయసు పరిమితులు విధించే అంశంకాదు. చేసేపని బాగా చేయగలిగే అసలు వయసొక అడ్డంకే కాదు. మన విజ్ఞానాన్ని ప్రతిభను రుజు వు చేస్తే వయసు అప్రస్తుతం అయిపోతుంది.

ప్ర. ప్రపంచంలోకెల్లా అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్లు జూలియన్‌ రాబర్ట్సన్‌తో మీ సంస్థకు అనుబంధం వుంది. ఇప్పుడు మీరు మీ సొంత హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ ‘‘టైగర్‌ రతన్‌’’ నెలకొల్పారు. దీని గురించి కాస్త వివరిస్తారా?
జ. నేను పులి పిల్లను. నా సొంత హెడ్జ్‌ ఫండ్‌ సంస్థ ప్రారంభించే అవకాశం రాబర్ట్సన్‌ ఇచ్చారు. 2008లో మా స్నేహితులు, మా కుటుంబ వ్యాపారాలను నిర్వహించడం ప్రారంభించాను. ఒక ఏడాది అయిన తరువాత మే 2009లో టైగర్‌ రతన్‌ నెలకొల్పాను. మొదటి 12 నెలల్లో 32 శాతం సాధించింది. కనీసం 1 మిలియన్‌ డాలర్లు ఉండాలి. ఇప్పుడు ఇతరులు కూడా పెట్టుబడి పెట్టేట్లు ఫండ్‌ను వెలుపలి ఇన్వెస్టర్లకు తలుపులు తెరుస్తున్నాం. ఆర్థికరంగం చతికిలబడివున్నపుడు కూడా మా సంస్థ బాగా పనిచేసింది. ఇతర కంపెనీ లతో పోలిస్తే మాది భిన్నమై వ్యూహం వ్యవహార శైలి. తలెత్తే మార్పులు, నిశితమైన విశ్లేషణ, పరిశోధనల ఆధారంగా టైగర్‌ రతన్‌ నమూనా పనిచేస్తుంది.

ప్ర.కొద్దిమంది ఫండ్‌ మేనేజర్లలో ఒకరుగా ఉండడం ఎలా అనిపిస్తోంది?
జ. మిహళనవడం ఒక అవరోధంగా ఎప్పుడూ భావించలేదు. చాలా కాలంగా పురుష ప్రపంచంలోనే ఉన్నాను కదా! అంతకు పూర్వం ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్‌గా కృషిచేశాను. నేనెప్పుడూ ఈ విషయాల గురించి కలత చెందలేదు. కొద్దిమంది మహిళల్లో నేనొకదానై్ననందుకు నన్నందరూ ప్రశంసి స్తున్నారు.పురుషుడినైవుంటే అభినందనలు దక్కేవి కావు కదా!

Wednesday, October 13, 2010

Old Photographs from Indian History.

Just read what INDIA was as per LORD MACAULAY on his statement on 2nd February 1835, in the last snap.
That would really shock us.
Old Photographs from Indian History.
Please Read the last Article Carefully……
The daughter of an Indian maharajah seated on a panther she shot, sometime during 1920s.  

 
 
A British man gets a pedicure from an Indian servant.




The Grand Trunk Road , built by Sher Shah Suri, was the main trade route from Calcutta to Kabul .



A group of Dancing or notch girls began performing with their elaborate costumes and jewelry
.



A rare view of the President's palace and the Parliament building in New Delhi .




Women gather at a party in Mumbai ( Bombay ) in 1910.




A group from Vaishnava, a sect founded by a Hindu mystic. His followers are called Gosvami-maharajahs




An aerial view of Jama Masjid mosque in Delhi , built between 1650 and 1658.




The Imperial Airways 'Hanno' Hadley Page passenger airplane carries the England to India air mail, stopping in Sharjah to refuel.



 
See what the India was at 1835.......


Forward it to all Indians…. I really liked it, so forwarding it to you…
 

Sunday, October 3, 2010

'కామన్‌వెల్త్' ఇది అలవాటైన బానిసత్వమా? బతక నేర్చిన లౌక్యమా?

ఎవరి 'కామన్‌వెల్త్' ఇది ?

ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆడే ఒలింపిక్ గేమ్స్ ఉండగా మళ్లీ ఈ కామన్‌వెల్త్ గేమ్స్ ఎందుకు? వలస దేశాలతో సంబంధాలు కొనసాగించాలన్న కోరిక దొరల దేశానికి ఉండొచ్చు, కానీ కొత్త సంకెళ్ళను పోయిన పొడవునా తగిలించుకుని తిరగాలనే కోరిక వలస దేశాలలో ఎందుకు ఉండాలి? ఇది అలవాటైన బానిసత్వమా? బతక నేర్చిన లౌక్యమా? ఒక్క కామన్‌వెల్త్ క్రీడలనే కాదు బ్రిటిష్ పాలకుల పట్ల విధేయతను ప్రకటించే అనేక చిహ్నాలను మనం ఇప్పటికీ మోస్తూనే ఉన్నాం. 63 ఏళ్ల తర్వాత కూడా వలస మెదళ్లతోనే ఆలోచిస్తే ఎలా, ఆ బానిస బూజును ఇంకెన్నాళ్లు దులుపుకోకుండా ఇలా బతుకుతామని ప్రశ్నిస్తున్నారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. వలస పాలకులపై పోరాడిన మనవారి త్యాగాలను, వారసత్వాన్ని మాత్రమే మనం మన 'కామన్‌వెల్త్'గా భావించాలని చెపుతున్న ఆయన వ్యాసమే ఇది.

ఈసారి బ్రిటీష్‌రాణి కోహినూరు కిరీటపు ధగధగల మ«ధ్య జాతి మహాత్మాగాంధీకి నివాళి సమర్పించబోతున్నది. కామన్‌వెల్త్ (అసలు పేరు బ్రిటిష్ ఎంపైర్ కామన్‌వెల్త్) గేమ్స్ ఢిల్లీలో గాంధీ జయంతి మరుసటి రోజు నుంచే ఆరంభమవుతున్నాయి. బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ ఇచ్చిన సామ్రాజ్యవాద అధికార చిహ్నం రాణిబెత్తం (queen's baton) ఒకనాడు బ్రిటిష్ వలస పాలన కింద మగ్గిన కామన్‌వెల్త్ 72 దేశాలలో ఊరేగి ఆ రోజు ఢిల్లీ చేరుకుంటుంది. 'సైమన్ గో బ్యాక్' అన్నందుకు వయోవృద్ధుడైన పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్‌ని చితగ్గొట్టి చంపేసిన బెత్తం అది. కామన్‌వెల్త్ ఆటల చిహ్నంలో ప్రముఖంగా కనిపించేది ఇండియాగేట్. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిరక్షించడానికి చనిపోయిన సైనికులకు స్మారకంగా ఇండియాగేట్‌ను బ్రిటిష్ ప్రభుత్వమే నిర్మించింది. ఈ బెత్తంతో పాటు ఇండియా గేట్ కామన్‌వెల్త్ ఆటలకు చిహ్నంగా ఉండడం యాదృచ్ఛికం కాదు. భారతీయులకు ఇంగ్లీష్ భాష నేర్పినందుకు మనమంతా బ్రిటన్‌కు రుణపడి ఉండాలని సెలవిచ్చిన ప్రధాని మన్‌మోహన్ సింగ్ పాలనలో బ్రిటిష్ రాచరికపు చిహ్నాలకు దౌత్యమర్యాద సహజమే.

ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే లేజర్ ప్రింటర్‌కు పదిహేను రోజుల అద్దె కింద డెబ్బయి వేల రూపాయలు చెల్లించడం వంటి కుంభకోణాలు వందల కోట్ల రూపాయల్లో జరిగినా, కామన్‌వెల్త్ విలాసాల కోసం కోట్లాది రూపాయలు నీళ్లలాగ ఖర్చు చేసినా పెద్ద బాధ కలగడం లేదు. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి మూలంగా జాతి పరువు మంట కలవడం వేరే విషయం. స్టేడియం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలడం, స్టేడియం ఫాల్స్ సీలింగ్ రాలడం కన్నా ఈ గేమ్స్ కొనసాగింపు వల్ల జాతిగౌరవం మట్టికరవడం ఎక్కువ క్షోభ కలిగిస్తున్నది. జాతిని తిరిగి బ్రిటిష్ బానిసత్వానికి దిగజార్చడం స్వాభిమానాన్ని దెబ్బతీస్తుంది.

63 ఏళ్లు గడిచినా...

బ్రిటిష్ రాచరిక పాలన దేశంలో అంతరించి అరవై మూడేళ్లు గడిచినా అడుగడుగునా సామ్రాజ్యవాద కీర్తన ఇంకా గింగుర్లెత్తుతూనే ఉన్నది. ఒకప్పటి వైస్రాయ్ ప్యాలెస్ అయిన నేటి రాష్ట్రపతి భవన్‌లో ఒక్క స్వాతంత్య్ర సమరయోధుని విగ్రహం కాని, తైలవర్ణ చిత్రం కాని లేదు. బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్-v, క్వీన్‌మేరీ ఇతర బ్రిటిష్ రాజులు, రాణుల నిలువెత్తు పాలరాతి విగ్రహాలు, బ్రిటిష్ వైస్రాయ్‌ల, గవర్నర్ జనరల్‌ల తైలవర్ణ చిత్రాలు భవనం నిండా ఉన్నాయి. కింగ్ జార్జ్-v రాకకు గుర్తుగా చెక్కించిన భారీ శిలాస్తంభం కూడా ఉన్నది. బ్రిటిష్‌రాణి కిరీటం, ఆమె రజత సింహాసనం, ఆమె బెత్తం... అన్నీ కూడా తిరిగి భారత్ గడ్డ మీదికి, గద్దె మీదికి వస్తామన్నట్లు బెదిరిస్తుంటాయి. పార్లమెంటులో మాదిరి ఒక గాంధీ విగ్రహం, ఒక బిర్సాముండా విగ్రహం, ఒక పటేల్ విగ్రహం వంటివి రాష్ట్రపతి భవన్‌లో పెట్టాలనే స్పృహ మన పాలకులకు ఇంకా కలగలేదు. అంటే మనం మానసికంగా ఇంకా వలసపాలనలోనే జీవిస్తున్నాం.

పేర్లన్నీ తెల్లదొరలవే...

దేశ రాజధాని ఢిల్లీలో రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు అన్నీ ఇంకా వలసపాలకుల పేర్లతోనే కొనసాగుతున్నాయి. కర్జన్ రోడ్, (చార్లెస్)క్యానింగ్ రోడ్, డూప్లే రోడ్, వెల్లింగ్టన్ రోడ్ వంటి సామ్రాజ్యవాద అవశేషాలు స్వతంత్ర దేశ రాజధానిలో మనల్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. సర్ కనాట్ పేరు మీద వెలిసిన వాణిజ్య సముదాయానికి మరమ్మత్తుల కోసం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ అదే పేరు కొనసాగిస్తున్నారు. లేడీ హార్డింగ్ హాస్పిటల్, బట్లర్ స్కూల్ ఇంకా అవే పేర్లతో మనలను వెక్కిరిస్తున్నాయి. కేజీ రోడ్ అంటే కస్తూర్బా గాంధీ రోడ్ అయితే సంతోషిస్తాం గాని కింగ్‌జార్జ్ రోడ్ అయితే కలిగే బాధ స్వాతంత్య్ర ప్రియులకే తెలుస్తుంది. ఒక కిత్తూరు రాణి చెన్నమ్మ పేరు, ఒక సంగోలి రాయన్న పేరు, ఒక రాంజీ గోండు పేరు, ఒక సీతారామరాజు పేరు, ఒక వీరపాండ్య కట్టబొమ్మన పేరు ఢిల్లీ రోడ్లకు ఈనాటికీ లేకపోవడం పరిపాలకుల దివాలా మానసిక స్థితికి మచ్చుతునక. ఈ వీరులెవరో అప్పటి బ్రిటిష్ పాలకులకు బాగా తెలుసు. కానీ నేటి మన పాలకులకు అసలే తెలియదు. సిపాయిలను తిరుగుబాటును అణచడానికి హిందూ, ముస్లింలను విడదీసే కుట్ర చేసిన ఛార్లెస్ క్యానింగ్ పేరుమీద ఇప్పటికీ ఒక రోడ్డు సాగడం, బహదూర్ షా జఫర్‌ను చక్రవర్తిగా ప్రకటించి తెల్లదొరలు తెల్లబోయేటట్టు జాతినంతటినీ ఏకం చేసిన యశ్వంతరావ్ హోల్కర్ పేరు మీద రోడ్డు లేకపోవడం మానసిక బానిస రాజ్యానికే సాధ్యం.

'జ్యోతి'కో నీతి

ఇండియాగేట్ బ్రిటిష్ సామ్రాజ్యానికి చిహ్నం అయితే దానిమీద తిరుగుబాటు చేసి చనిపోయిన సిపాయిల శౌర్యానికి ప్రతీక కాశ్మీర్ గేట్ వద్దనున్న స్మారక చిహ్నం. కాని ఇండియాగేట్ మీద చూపుతున్న శ్రద్ధ కాశ్మీరీగేట్ మీద చూపకపోవడం దేశభక్తి రాహిత్యం. ఇండియాగేట్ వద్ద ఆరిపోకుండా వెలుగుతున్న 'అమర్‌జవాన్ జ్యోతి'కి నిరంతరం వంట గ్యాస్ ఉచితంగా సరఫరా చేయడం సహించగలం. కాని అండమాన్ దీవుల్లోని సెల్యులార్ జైలులో వెలుగుతున్న 'స్మృతిజ్యోతి'కి నిరంతరంగా గ్యాస్ అందజేయడం శుద్ధ దండుగ అని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సెలవివ్వడం ఘోరం. బ్రిటిష్ పాలకులు నివసించిన ప్రాసాదాల్లోనే ప్రధాన మంత్రి, మంత్రులు నివసిస్తున్నందువల్ల తెల్లదొరల ప్రేతాత్మలు వారిని ఆవహించి ఉండవచ్చు. అందుకే తల్లి రొమ్ము తంతున్నారు.

భారత సైన్యం ఒకప్పుడు బ్రిటిష్ సైన్యంలో భాగం. జనరల్ కరియప్ప, జనరల్ ఎస్.ఎం. శ్రీనగేశ్, జనరల్ తిమ్మప్ప, జనరల్ జె.ఎన్. చౌదురి వంటివారు బ్రిటిష్ ఆర్మీ అకాడమీ(లండన్)లో శిక్షణ పొందినవారే. భారత సైన్యంలోని రెజిమెంట్లు (డోగ్రా, జాట్, కుమావూ, రాజ్‌పుత్, అసోం, గఢ్‌వాల్, గూర్ఖా, మద్రాస్ రెజిమెంటు వంటివి) అన్నీ దేశంలో ఎక్కడో ఒకచోట పెల్లుబికిన స్వాతంత్య్ర పోరాటాల్ని అణచడానికి ఏర్పడినవే. ఈ రెజిమెంట్ల స్థాపన దినోత్సవం (రైజింగ్ డే) ఘనంగా నేటికీ జరుపుకోవడం స్వాతంత్య్ర పోరాటాన్ని ఈసడించుకోవడమే.

ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో వేలాది యుద్ధఖైదీలను ఫిరంగి నోళ్ళకు కట్టి పేల్చివేసిన క్రూరులు జనరల్ హెన్రీ హావెలాక్, జనరల్ నీల్, జనరల్ హెన్రీ లారెన్స్, జేమ్స్ ఔట్రామ్ వంటివారు. వారి పేర్లమీద లక్నో, కాన్పూర్, ఢిల్లీ, అండమాన్‌లలో రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు, దీవులు, కాలనీలు ఉండడం పాలకుల చర్మం నీటిగుర్రం, ఖడ్గమృగాల కన్నా మందమని రుజువు చేస్తున్నది.

ఆకలి చావులకు కారకులై...

కామన్‌వెల్త్ ఆటలను బ్రిటిష్ రాణి బెత్తపు నీడలో జరుపుకుంటున్న సమయంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలకుల దౌష్ట్యాలన్నిట్నీ మననం చేసుకోవడం అవసరం. దేశంలో నాడయినా నేడయినా ప్రతి మనిషికి సరిపోయినంత తిండి గింజలు సమృద్ధిగా ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు రావడానికి ముందు దేశంలో ఆకలిచావులు మచ్చుకు కూడా లేవని స్వామి వివేకానంద అన్నారు. జొన్నలు, ఇతర తిండిగింజల బదులు బ్రిటిష్ పాలకులు బలవంతంగా రైతుల చేత నీలిమందు, పత్తి పంటలు వేయించారు. అయినా ఏ ఊర్లో జొన్నపంట ఆ ఊరి ప్రజలకు సరిపోయేది. కాని జనానికి కొనుగోలు శక్తి ఉండేది కాదు. పంటలో సగం ప్రజల నుంచి బలవంతంగా పన్నుగా వసూలు చేసేవారు. నిజాం రాజ్యంలో అది 'చౌత్' (నాలుగోవంతు) మాత్రమే. నిర్బంధ పన్ను వసూళ్ల వల్లనే ప్రజలు తరచూ కరువువాత పడ్డారు. క్రీ.శ. 1770 నుంచి 1900 వరకూ దేశంలో కరువు వల్ల రెండు కోట్ల యాభై లక్షల మంది చనిపోయారు. వీరిలో ఒక కోటి యాభై లక్షల మంది 1877, 1889, 1897, 1900 సంవత్సరాల్లో వచ్చిన కరువుల మూలంగా చనిపోయారు. ప్రజల ఆకలి తీర్చడానికి, కొనుగోలు శక్తి పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఆ సమయంలో బ్రిటన్‌లో వసూలైన పన్నులకన్నా ఎనిమిది రెట్ల పన్నును వాళ్లు రాణి బెత్తం చూపి బెదిరించి ఇండియాలో వసూలు చేసుకుని లండన్ దోచుకెళ్లారు.

రోగాల బారిన కోట్లాది మంది...

అప్పట్లో భారత గణాంక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన విలియమ్ హంటర్ బ్రిటిష్ ప్రభుత్వం వైద్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో కళ్లకు కట్టినట్టు వివరించారు. 1918లో బిట్రిష్ ప్రభుత్వం మనదేశంలోని 24 కోట్ల ప్రజల వైద్యానికి 50 లక్షల రూపాయలు మాత్రమే మంజూరు చేసింది. అంటే తలా రెండు సెంట్లు మాత్రమే. విదేశాల నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి మూలంగా దేశంలో 1901లో రెండు లక్షల 70 వేల మంది చనిపోగా మరుసటి సంవత్సరం 50 లక్షల మంది చనిపోయారు. 1903లో ఎనిమిది లక్షల మంది, 1904లో పది లక్షల మంది మరణించారు. ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి 1918లో 12 కోట్ల మందికి సోకగా, ఒక కోటి 25 లక్షల మంది మృత్యువాత పడ్డారు. మందు లేకపోయినా పౌష్టికాహారం లభించి ఉంటే మరణాల శాతం గణనీయంగా తగ్గి ఉండేది. బ్రిటిష్ ప్రభుత్వ రాక్షస విధానాలు గుర్తు చేసుకుంటే కామన్‌వెల్త్ ఆటలు ఏ బానిసత్వం కొనసాగింపో తేటతెల్లం అవుతుంది.

ప్రసూతి రోగాలు, మరణాల గురించి చెప్పనవసరం లేదు. ప్రసూతి తరువాత తల్లులు, పిల్లలు నూటికి ఐదుగురు చచ్చిపోయేవారు. ఎనిమిదేళ్లు నిండకముందే బెంగాల్‌లో వెయ్యికి 500 మంది, బొంబాయి ప్రావిన్స్‌లో వెయ్యికి 666 మంది పిల్లలు చనిపోయేవారు. ఇతర కారణాల వల్ల 1921లో ఇంగ్లండ్‌లో వెయ్యికి 13 మంది, అమెరికాలో వెయ్యికి 12 మంది చనిపోతే, ఇండియాలో 32 మంది పిల్లలు చనిపోయారు. దేశంలోని 24 కోట్ల జనాభాలో కనీసం నాలుగు కోట్ల మంది ఏళ్లకొద్దీ సగం కడుపు కూడా నిండక మలమల మాడిపోయారు. ఇప్పుడు కూడా గోదాముల్లో 6 కోట్ల టన్నుల తిండిగింజలు ఒకవైపు మురిగిపోతుంటే, మరోవైపు 60 కోట్ల ప్రజలు తిండిలేక అలమటిస్తుంటే వైస్రాయ్ (రాష్ట్రపతి)ను భవన్ అధిష్టించిన వలసపాలకుల వారసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ప్రజలకన్నా ఆస్ట్రేలియా వీట్ బోర్డ్, కార్జిల్ కంపెనీ, రిలయన్స్ కంపెనీల లాభా లే ముఖ్యమని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా వీట్ బోర్డ్ అంటేనే ఎగుమతులు, దిగుమతుల లావాదేవీల్లో భారీ లంచాలకు పర్యాయపదం.

మన మగ్గాలు విరగ్గొట్టి...

లాంక్‌షైర్, యార్క్‌షైర్, మాంచెస్టర్ మిల్లుల వస్త్రాలకు భారత్‌లో చేనేత మగ్గాలు పోటీ కావడంతో బ్రిటిష్ పాలకులు మన మగ్గాల్ని విరగ్గొట్టారు. అప్పటికీ చేనేత కార్మికులు ఏదో విధంగా తమ వృత్తి కొనసాగిస్తుంటే, వారి చేతులు నరికేశారు. వైస్రాయ్‌గా ఇండియాకొచ్చిన విలియమ్ బెంటిక్ "చేనేత కార్మికుల కళేబరాలతో భారతదేశం తెల్లబడిపోయింద''ని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన వస్త్రం మీద పైసా పన్ను లేదు కాని ఇండియాలో మగ్గం మీద తయారైన వస్త్రాలకు అడుగడుగునా పన్నే. గింజ నుంచి పత్తిని వేరుజేస్తే పన్ను; పత్తిని నూలుగా వడికితే పన్ను; నూలును వస్త్రంగా నేస్తే పన్ను; వస్త్రం అమ్మకానికి తాలూకా దాటితే పన్ను; జిల్లా దాటితే మరోసారి పన్ను; ప్రావిన్స్ దాటితే మళ్లీ పన్ను. స్వదేశీ నేతవస్త్రం ధరను ఇంగ్లండ్ వస్త్రం ధర కన్నా కృత్రిమంగా పెంచాలనేది పాలకుల కుట్ర.

స్వదేశీ గుత్త పెట్టుబడిదారుల యాజమాన్యంలోని టెక్స్‌టైల్ మిల్లులు, విదేశీ కంపెనీలు దేశంలో డంప్ చేసిన దుస్తులు ఈనాటికీ మన చేనేత వస్త్రాలను పోటీ నుంచి నెట్టేస్తూనే ఉన్నాయి. అందువల్ల చేనేత కార్మికులు కూడా చౌకైన మిల్లు దుస్తులే ధరిస్తున్నారు.

అవినీతికి మారుపేరు

ఈస్టిండియా కంపెనీ రాబర్ట్ క్లయివ్ నాయకత్వంలో అత్యంత రాక్షసంగా వ్యవహరించింది. క్లయివ్ వ్యక్తిగతంగా పగ్గాల్లేని అవినీతికి ఒడిగట్టాడు. కోట్లాది రూపాయలు స్వదేశీ పాలకుల దగ్గర లంచం తీసుకుని సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు. బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను చంపి ఆ స్థానంలో మీర్ జాఫర్‌ను కూర్చోబెట్టడానికి 61 లక్షల 93 వేల పౌండ్లు లంచం తీసుకున్నాడు. మీర్ జాఫర్‌ను దించి, గద్దె మీద మీర్ ఖాసింను కూర్చోబెట్టడానికి క్లయివ్ వారసులు 11 లక్షల 52 వేల పౌండ్లు లంచం తీసుకున్నారు. ప్రజల వద్ద కూడా గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేశారు. పన్నులు కట్టలేక అనేక గ్రామాల్లో మూడింట రెండు వంతుల మంది రైతులు పారిపోయారు. పారిపోలేని వారిని బహిరంగంగా బోనుల్లో బంధించారు.

ఈస్టిండియా కంపెనీ ఐదు కోట్ల రూపాయల సరుకు ఇంగ్లండ్ నుంచి తెచ్చి ఇండియాలో రెండు వందల కోట్లకు అమ్ముకుంది. ఇండియాలో రెండు కోట్ల రూపాయలకు ఖరీదు చేసిన సరుకును ఇంగ్లండ్‌లో వంద కోట్ల రూపాయలకు అమ్ముకుంది. ఫలితంగా లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈస్టిండియా కంపెనీ షేరు విలువ 32 వేల పౌండ్లకు పెరిగింది. మదుపుదారులందరూ భారీ డివిడెండ్లతో లూటీలో భాగస్వాములైనారు. క్లయివ్ అవినీతి మెకాలే విచారణలో బయటపడినా బ్రిటిష్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. మళ్లీ మళ్లీ మెకాలే కేసులు పెట్టి వెంటపడడంతో తట్టుకోలేక క్లయివ్ ఉరేసుకున్నాడు. క్లయివ్ దుర్మార్గాలను ఉపేక్షించి, క్షమాభిక్ష పెట్టిన బ్రిటిష్ రాణి కిరీటాన్ని, బెత్తాన్ని కామన్‌వెల్త్ ఆటల చిహ్నంగా నెత్తిన పెట్టుకోవడం దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇంకా కొనసాగుతున్నదని అన్యాపదేశంగా అంగీకరించడమే.

భారతీయులకు విద్యాగంధం అబ్బాలని ప్రయత్నించినట్టు చెప్పుకున్న మెకాలే కూడా ప్రాథమిక విద్య కోసం మాత్రమే ప్రయత్నించాడు. ఉన్నత విద్య భారతీయులకు అవసరం లేదని వాదించాడు. బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో తలా ఎనిమిది సెంట్లు మాత్రమే విద్య కోసం కేటాయించింది. అదీ ఇంగ్లీషు నేర్పే విశ్వవిద్యాలయాల కోసమే. దేశంలో సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశ పెట్టాలని 1911లో గోపాలకృష్ణ గోఖలే పార్లమెంట్‌లో ప్రైవేటు ముసాయిదా చట్టం ప్రవేశపెడితే ఆ ప్రభుత్వం తిరస్కరించింది. పటేల్ కూడా ఇటువంటి బిల్లును 1916లో మళ్లీ ప్రవేశపెడితే అది కూడా వీగిపోయింది.

ప్రజలను తిండికీ, చదువుకూ, వైద్యానికీ దూరం చేసి సమున్నతమైన భారతీయ నాగరికతను ధ్వంసం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనేక కుటిలయత్నాలు చేసింది. మొట్టమొదట సంస్కృతిని నాశనం చేయచూసింది. బ్రిటిష్ వారిలాగా దుస్తులు ధరించి, కత్తులు, చెంచాలు, ముళ్ల చెంచా(ఫోర్క్)లతో బ్రెడ్, బటర్, జామ్ తిని, వారి భాష వారి యాసలో మాట్లాడి, వారి నమ్మకాలు అంగీకరించి, వారి పండుగలు జరుపుకునే మనస్తత్వం అలవరిస్తే భారతీయులతో ఏ పనైనా (నేటి రోబోల మాదిరి) చేయించుకోవచ్చని మెకాలే సెలవిచ్చాడు. రోబోలకు పునరుత్పత్తి శక్తి ఉందని, రోబోలకు తిరిగి రోబోలు పుడతాయని నేటి పాలకులు చాటుతున్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులందరూ ఉపమానవుల వలె బతికు ఈడ్చి ఉండవచ్చు. కానీ ఉద్వేగం లేని రోబోల వలె తిరుగాడలేదు. కామన్‌వెల్త్ ఆటల నిర్వాహకులు మాత్రం రోబోలకన్నా అధ్వాన్నంగా మెదడు, గుండె క్లోక్‌రూమ్(సామాన్ల గది)లో కొక్కానికి తగిలించి యంత్రాల మాదిరి బ్రిటిష్ రాణి బెత్తం మోస్తున్నారు. జాతి ఒకప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తే పాలకులు ప్రస్తుతం స్వదేశీ వస్తు బహిష్కరణ చేస్తున్నారు.

త్యాగాలే మన ఉమ్మడి సొత్తు...

కామన్‌వెల్త్ అంటే అర్థం ఉమ్మడి సంపద. ఇండియా సంపద, మిగతా 71 దేశాల సంపద ఇంగ్లండ్‌కు ఉమ్మడి సంపదే. కానీ ఇంగ్లండ్ సంపద ఈ దేశాలకు ఉమ్మడి హక్కు కాదు. భారతదేశం నుంచి వసూలు చేసుకుని తీసుకునిపోయిన నగదు పన్నులను తిరిగి ఇవ్వాలిన అవసరం వారికి లేదు. కోహినూర్ లాంటి విలువైన సంపదనూ తిరిగి ఇవ్వరు.

క్రాంతివీర్ వాసుదేవ్ బల్వంత్ ఫడ్కేను అరేబియా ఎడారిలో చంపినందుకు, భగత్‌సింగ్‌ను ఉరితీసినందుకు, వేలాదిమంది దేశభక్తులను సెల్యులార్ జైలులో చిత్రహింసలు పెట్టినందుకు బ్రిటిష్ ప్రభుత్వం మనదేశానికి క్షమాపణలు చెప్పినాకయినా కామన్‌వెల్త్ గేమ్స్ గురించి ఆలోచిస్తే ఉచితంగా ఉండేది. ఒక శతాబ్దం తరువాత కూడా వలస పాలన అవశేషాలను తిరస్కరించకపోవడం దారుణం. మనం మన జాతీయతను, సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి సంపాదించుకోవాలి. జస్టిస్ వెంకటాచలయ్య అభిప్రాయపడినట్లుగా భారతదేశం ఒక సమాఖ్యల సమాఖ్య (మహాసమాఖ్య). జాతీయత కొరవడి బానిస భావజాలంలోనే జాతి నాయకత్వం కొట్టుమిట్టాడితే అనేక జాతులు, భాషలు, సంస్కృతులకు నిలయమైన దేశం విచ్ఛిన్నమవుతుంది. విదేశీయులపై పోరాటంలో అమరులైన వారిని, వారి వారసత్వాన్ని, త్యాగాలను ఉమ్మడి సొత్తు(కామన్‌వెల్త్)గా, ఉమ్మడి ఉద్వేగంగా జాతి భావించిన నాడే ప్రజల మధ్య మానసిక తాదాత్మ్యత ఏర్పడి జాతి అఖండంగా నిలుస్తుంది. వికసిస్తుంది.

నిర్లిప్తత పనికిరాదు

ఆటల పోటీలలో విజయం సాధించడానికి క్రీడాకారులకు ప్రేరణ జాతీయభావం. చిన్న దేశాలైనా, జాతీయత నిలుపుకున్న దేశాలే ఎక్కువ పతకాలు సాధిస్తున్నాయి. ఎంత ఖర్చు చేసి, ఎన్ని వసతులు కల్పించినా, ఎంత నాణ్యమైన శిక్షణ ఇప్పించినా క్రీడా సౌధాలు ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్‌తో పేకమేడల వలె కుప్పకూలుతాయి. ప్రభుత్వంలో పెద్దలు, క్రీడల నిర్వాహకులు, క్రీడాకారులు ఎంత అవినీతిలో కూరుకుపోయినా వారికి శిక్షల్లేవు. ప్రజల నుంచి ప్రతిఘటన లేదు. నిర్లిప్తతే మన జాతీయ లక్షణంగా మారింది. దేశ విముక్తి కోసం నాటి కార్యశూరులు సాగించిన జాతి ఏకీకరణ కృషిని, వారి త్యాగాలను, అమరత్వాన్ని మననం చేసుకుంటేనే కర్తవ్య స్పృహ కలుగుతుంది. సామ్రాజ్యవాదుల కామన్‌వెల్త్ బదులు జాతి ఉమ్మడి సంపద సాక్షాత్కారమవుతుంది.

Saturday, September 25, 2010

దృఢమైన, నీతిమంతమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకులు కావాలి.


ఏరీ నాటి మహా నాయకులు?
"దేశంలో దొంగలు పడ్డారు''- ఇది ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమా టైటిల్. అప్పట్లో ఈ సినిమా టైటిల్ కొంత అతిశయోక్తిగా అనిపించినప్పటికీ, వామపక్ష, అభ్యుదయ భావజాలం పరిఢవిల్లిన ఆ రోజుల్లో ఈ సినిమాను ప్రజలు బాగానే ఆదరించారు. కానీ, ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నెలకొన్న పరిస్థితులను అద్దం పట్టి చూపాలంటే... ఆ సినిమా టైటిల్ కూడా సరిపోయేలా లేదు.

కేవలం మూడు దశాబ్దాల వ్యవధిలో రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ పరిస్థితులు ఇంతగా ఎందుకు దిగజారిపోయాయి? సమస్య కానిది సమస్యగా ఎందుకు మారుతున్నది? అసలైన సమస్యలు, సమస్యలు కాకుండా ఎందుకు పోతున్నాయి? ప్రజల్లో చైతన్యం ఎందుకు కొరవడిం ది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం అన్వేషించవలసిన బాధ్యత పౌర సమాజంపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో మహోన్నత వ్యక్తిత్వం, రాజనీతిజ్ఞతకు ప్రతీకలైన నేతలు మనకు నాయకత్వం వహించగా, ఇప్పుడు మరుగుజ్జులు మాత్రమే మిగిలారు.

దేశం కోసం, ప్రజల కోసం త్యాగాలు చేసిన నాయకుల తరం అంతరించి, తమ కోసం ప్రజలే త్యాగా లు చేయాలని కోరుకునే నాయకులు మనకు మిగిలారు. ఈ కారణంగానే అప్రధాన విషయాలు ముందుకు రావడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన న్యాయవ్యవస్థ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, మీడియా వ్యవస్థలు అనేకానేక అవలక్షణాలను సంతరించుకుని కునారిల్లుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం దేశానికి దిశ-దశ నిర్దేశించగల సమర్థమైన, ఆదర్శవంతమైన నాయకత్వం లేకుండా పోవడమే!

గడచిన వారం రోజులుగా దేశంలో చోటు చేసుకున్న సంఘటనలను పరిగణనలోకి తీసుకుంటే జాతి భవిష్యత్తు పట్ల గుబులే మిగులుతుంది. అయోధ్యలో వివాదాస్పద స్థలంపై అలహాబాద్ హైకోర్టు ఇవ్వనున్న తీర్పును తలచుకుని ప్రశాంతంగా నిద్రపోలేని స్థితిలో ఈ దేశ ప్రజలు ఉండటానికి కారకు లు ఎవరు? ఆ వివాదంపై జాతి మొత్తం తల్లడిల్లవలసిన అవసరం ఉందా?

తెలియని, కారణంలేని భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రజానీకం కాలం గడుపుతున్న సమయంలోనే, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణలో అంతులేని అవినీతి చోటుచేసుకుందని వచ్చిన వార్తలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారిలో సగం మంది అవినీతిపరులేనని సీనియర్ న్యాయవాది, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ చేసిన సంచలనాత్మక ప్రకటనతో కలవరం చెందకుం డా ఎలా ఉండగలం! ముందుగా అయోధ్య అంశాన్ని తీసుకుందాం.

అక్కడి వివాదాస్పద భూమిలో రామమందిరం ఉండేదా? బాబ్రీ మసీదు ఉండేదా? అనే వివాదంపై హైకోర్టు తీర్పు శుక్రవారంనాడు వెలువడవలసి ఉంది. సుప్రీంకోర్టు జోక్యంతో ఈ తీర్పు ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇలా ఒక కోర్టు ఇవ్వవలసిన తీర్పును వాయిదా వేయాలని ఆదేశించే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదు. అయినా, సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వు జారీ చేసింది. దీనివల్ల వారం రోజులపాటు ఉపశమనం లభించవచ్చుగానీ, సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభించలేదు కదా!

ఈ నెల 28 తర్వాత తీర్పు రావచ్చు. అప్పుడైనా పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. కానీ, ఈ లోపు న్యాయ వ్యవస్థ తానే ఒక తప్పుడు సంప్రదాయానికి తెర తీసింది. ఈ విషయం అలా ఉంచితే ఈ దేశ ప్రజలకు అయోధ్య వివాదం ఒక్కటే సమ స్యా? అసలు ఇది ఒక సమస్య ఎలా అవుతుంది? ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి పరిమితం కావలసిన ఈ వివాదం దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారకులు ఎవరు? దీనిపై దేశ ప్రజలందరూ ఆందోళనతో గడపవలసిన అవసరం ఎందుకు వచ్చింది?

బలమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకత్వం ఉండి ఉంటే... కూటికీ గుడ్డకి ఉపయోగపడని ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకు ని ఉండేవాళ్లం కాదా? ఇప్పుడు జరుగుతున్నది అందుకు భిన్నంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న మన్మోహన్‌సింగ్ ప్రభు త్వం తాను భయపడుతూ, ప్రజలను భయపెడుతున్నది. ప్రభుత్వ తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపవలసిన ప్రధాన ప్రతిపక్షం బి.జె.పి. కోర్టు తీర్పు తర్వాత రాజకీయ లబ్ధిపొందే అవకాశాల కోసం వేచి చూస్తున్నది.

బి.జె.పి.కి ఆ అవకాశం ఇవ్వకుండా మైనారిటీలకు తామే రక్షకులమన్న భావన కల్పించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీది. ఈ రెండు పార్టీల ఆలోచనల్లో దేశ ప్రజల హితం ఏమైనా ఉందా? నిజానికి వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నా, మసీదు ఉన్నా ఈ దేశ ప్రజలకు వొనగూరే ప్రయోజనం ఏమిటి? దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు ఎన్నో ఉండగా, మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు అంత ప్రాధాన్యం ఇస్తూ వణికి చస్తూ ఉండాలా?

నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించలేరా? దేశ ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వివాద పరిష్కారానికి సహకరించవలసిందిగా ఆయా మతపెద్దలను పాలకులు ఆదేశించలేరా? ఆ దిశగా ఎందుకు ప్రయ త్నం చేయరు! రెండు మతాల వారు కొట్టుకు చస్తే మత పెద్దలు మాత్రం ఎవరికి నాయకత్వం వహించగలరు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అటు నాయకులుగానీ, ఇటు మతపెద్దలు గానీ సామరస్యంతో కూర్చుని మాట్లాడుకుంటే ఈ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ఏ మతమైనా ఆ మతస్తులకు, అన్యులకు మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు.

ఇక కామన్‌వెల్త్‌గేమ్స్ విషయానికి వస్తే.. క్రీడల నిర్వహణ పేరిట జరిగిన అవినీతి, ప్రపంచ దేశా ల ముందు మన దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, కొందరి అవినీతి కారణంగా దేశ ప్రజలందరూ తలదించుకోవలసిన దుస్థితిని కల్పించింది. ఈ క్రీడల నిర్వహణ అవకాశాన్ని దక్కించుకోవడమే గొప్పగా ప్రచారం చేసుకున్న కేంద్ర ప్రభు త్వం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏం సంజాయిషీ ఇవ్వగలదు? సురేశ్ కల్మాడీ నేతృత్వంలోని బృందం అంతులేని అవినీతికి పాల్పడుతున్నదనీ, పనులన్నీ నాసిరకంగా జరుగుతున్నాయని మీడియా ఘోషించినప్పటికీ నిజాయితీకి చిహ్నంగా భావించుకునే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కనీ సం స్పందించలేదు.

స్వయంగా అవినీతికి పాల్పడకపోయినా, అవినీతిపరులను అడ్డుకోకుండా ప్రోత్సహించడం కూడా అవినీతికి పాల్పడటమే అవుతుంది. ఈ క్రీడల నిర్వహణకోసం 36 వేల కోట్ల రూపాయలను అధికారికంగా కేటాయించారు. వాస్తవానికి ఈ మొత్తం ఆచరణలో ఇంకా పెరిగిందని చెబుతున్నా రు. ఆరోపణలు వచ్చినప్పుడే స్పందించి ఉంటే ప్రపంచ దేశాల ముందు తలదించుకునే పరిస్థితి తప్పి ఉండేది. అవినీతి మామూలే అని ఉపేక్షించితే పరిస్థితులు ఎంతకు దారి తీస్తా యో ఈ ఉదంతం రుజువు చేస్తున్నది.

పాదచారుల కోసం నిర్మించిన వంతెన కూలిపోవడం, ఫాల్స్ సీలింగ్ పడిపోవడం వంటి సంఘటనలు వరుసగా జరగడంతో తప్పనిసరి పరిస్థితు ల్లో ప్రధాన మంత్రి స్పందించవలసి వచ్చింది. సురేశ్ కల్మాడీ తమ పార్టీకి చెందిన వాడైనందున కాపాడాలన్న ఆలోచనతో తాత్సారం చేయడం వల్ల దేశం పరువేపోయింది. ఇందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ జాతికి సంజాయిషీ ఇవ్వవలసిన అవసరం ఉంది. దేశాన్ని పట్టి పీడిస్తున్న నాయకత్వ లేమి అనే సమస్య ఇక్కడ కూడా పరిస్థితి వికటించడానికి కారణం.

మన్మోహన్‌సింగ్ వ్యక్తిగతంగా నిజాయితీపరుడే. అయితే, ఆయన స్వయం ప్రకాశితుడు కాదు. మరొకరి (సోనియాగాంధీ) నాయకత్వంలో ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ప్రధాన మంత్రి పదవిని నిర్వహిస్తున్నారు. మన్మోహన్ స్వయం గా నాయకుడైతే స్వంతంగా నిర్ణయాలు తీసుకోగలిగి ఉండేవారు. అలాంటి పరిస్థితి లేనందున, తన కళ్లముందే అవినీతి ప్రవహిస్తున్నా ఇంతకాలం మౌనంగా ఉండిపోక తప్పలేదు.

బాధ్యతలేని అధికారం చలాయిస్తున్న శ్రీమతి సోనియాగాంధీ అయినా, సకాలంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు అని సందేహం రావడం సహజం. కానీ, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే నేటితరానికి చెందిన సాదాసీదా నాయకురాలు కనుక ఆమెకు ఇవన్నీ పట్టించుకునే తీరిక ఉండదు. దేశానికి క్రీడలు అవసరం కావచ్చు. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ అవకాశం దక్కించుకోవడం గొప్పే కావ చ్చు.

కానీ, అందుకు తగినట్లుగా వ్యవహరించే స్థితి లేనప్పుడు ఉన్న పరువు పోగొట్టుకోవడం ఎందుకు? అంతేకాదు, ఇన్ని వేలకోట్ల రూపాయలు వ్యయం చేసి దేశం పరువు తీసుకునే బదులు... దేశాన్ని దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఎన్నో మౌలిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా! ఉదాహరణకు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మచ్చుకైనా లేవు. ఆడపిల్లల కోసమైనా మరుగుదొడ్లు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి వెయ్యి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి.

అలాగే, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు మెరుగుపచడానికి మరో వెయ్యి కోట్ల రూపాయలు అవసరం. కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకోసం ఖర్చు చేసిన డబ్బుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ సౌకర్యాలు కల్పించవచ్చు. కానీ... అలాచేస్తే నాయకులకు కమీషన్లు రావు, పాలకులకు ప్రత్యేకంగా ఓటు బ్యాంకు పెరగదు. అందుకే, ఈ సమస్యలు ఎప్పటికీ సమస్యలుగానే ఉంటాయి.

ఇక, న్యాయ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పెడధోరణులు అన్నింటినీ మించి కలవరం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు న్యాయమూర్తుల గురించి మాట్లాడాలంటే వణికిపోయేవారు. అలాంటిది ఇప్పుడు ఎవరు పడితే వాళ్లు న్యాయమూర్తుల నిబద్ధతను ప్రశ్నిస్తున్నారు. నిన్నగాక మొన్న మన రాష్ట్ర హై కోర్టులోనే కేసు లు వింటున్న న్యాయమూర్తులను న్యాయవాదులు దూషించా రు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేసిన వారిలో సగం మంది అవినీతిపరులేనని కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్ సంచలనాత్మక ప్రకటన చేశారు.

ఈ ప్రకటన చేసినందుకు ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదు కావచ్చు. కానీ, అంతకంటే ముందు తేలవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వి.ఆర్.కృష్ణయ్యర్ వ్యాఖ్యానించినట్లు "ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. కోర్టు ధిక్కార నోటీసులు ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు. శాంతి భూషణ్ ప్రకటన చేసిన తర్వాత న్యాయవ్యవస్థ లేదా న్యాయమూర్తులు మౌనంగా ఎందుకు ఉన్నారు?''అన్నది తేలవలసి ఉంది.

దేశంలో ఎమర్జెన్సీ విధిం చి, అపఖ్యాతి మూటగట్టుకుని, అధికారం కోల్పోయిన శ్రీమతి ఇందిరాగాంధీ, తర్వాత జరిగిన ఎన్నికలలో తిరిగి అధికారం కైవసం చేసుకోవడాన్ని అభినందిస్తూ అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి.ఎన్.భగవతి ఆమెకు లేఖ రాయడం ఆ రోజు ల్లో తీవ్ర వివాదాస్పదం అయింది. తర్వాత రోజుల్లో భగవతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అయ్యారు. కానీ, న్యాయవ్యవస్థ ప్రమాణాలకు భంగకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉండేది.

ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. దేశంలో ఎక్కడో ఒకచోట తరచుగా న్యాయమూర్తులు ఆత్మరక్షణలో పడుతున్నారు. ఇందుకు కారణం ఏమిటో ఆయా న్యాయమూర్తులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. లేని అధికారాన్ని సంక్రమింప చేసుకుని దేశ ప్రయోజనాల పేరిట సుప్రీంకోర్టు సైతం ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, ఎవరైనా ఎవరినైనా విమర్శించకుండా ఎందుకు ఉంటా రు! ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటి వ్ బాటలోనే న్యాయవ్యవస్థ కూడా పతనం దిశగా పయనిస్తున్నదని భావించక తప్పదు.

మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి ది. ఒకప్పుడు దేశం కోసం పత్రికలు నిర్వహించేవారు. తర్వాత రోజులలో కొంత వ్యాపార దృక్పథం జొరబడినప్పటికీ, ప్రజల ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో పత్రికలు వ్యవహరి స్తూ వచ్చాయి. కానీ, ఇటీవల కాలంలో పరోక్ష ప్రయోజనాల కోసం ఎవరు పడితే వారు మీడియాలోకి ప్రవేశించారు. ప్రస్తు తం ఆ దశ కూడా పోయి, రాజకీయాలలో ఉన్న వ్యక్తులు, పార్టీ లు తమ స్వంత పత్రికలు - చానళ్లు ప్రారంభించడం ఫ్యాషన్ గా మారిపోయింది.

ఫలితంగా నిబద్ధతతో వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్న పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతున్నది. పర్యవసానంగా ప్రజలకోసం నిలబడవలసిన పత్రికలు అంతర్థానమై, పార్టీల కోసం ప్రచారం చేసే పత్రికలే మిగిలే ప్రమా దం పొంచి ఉంది. తన అధికారాన్ని కాపాడుకోవడానికి శ్రీమ తి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అంతులేని చైతన్యంతో స్పందించిన పౌర సమాజం, ఇప్పుడు నిస్తేజంగా పడి ఉంది. ఆనాడు ప్రభుత్వానికి అణిగిమణిగి ఉండకపోతే జైల్లో గడపవలసి ఉంటుందని తెలిసినా లెక్క చేయకుండా ఆయా నాయకులు ఉద్యమించారు.

ఫలితంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లతో దేశంలోని జైళ్లు అన్నీ నిండిపోయాయి. మరి ఇప్పుడు.. ఎమర్జెన్సీ లేదు. పోరాటం చేస్తే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు లేవు. కానీ, కూలిపోతున్న వ్యవస్థలను కాపాడుకోవడానికై పోరాటాలు చేసేవారే కరువయ్యారు. ఈ పరిస్థితులో మార్పు రావాలంటే దృఢమైన, నీతిమంతమైన, ఆదర్శవంతమైన, జాతి మొత్తాన్ని ప్రభావితం చేయగల నాయకులు కావాలి. ప్రస్తుతానికి అటువంటి నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కాబట్టి, వేచి చూద్దాం! 

-ఆదిత్య