Showing posts with label friendship. Show all posts
Showing posts with label friendship. Show all posts

Sunday, January 15, 2012

జయకళ శశిలలిత! * Inner View

ప్రాణానికి ప్రాణం అనుకున్న శశికళను బయటికి గెంటేస్తూ
జయ ఎందుకంత నిష్కర్షమైన నిర్ణయం తీసుకున్నారు?
పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జయ హృదయంలో తనకున్న ప్రత్యేక స్థానాన్ని కూడా శశికళ ఎందుకు పోగొట్టుకోవలసి వచ్చింది? అసలు జయకు, శశికి మధ్య ఏమిటంత స్నేహం? ఎందుకంత స్నేహం? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఇన్నర్‌వ్యూ.


అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ గుర్తులో కనిపించే ఆకుపచ్చని జంట ఆకుల్లా ఇంతకాలం వర్థిల్లిన జయ, శశిల స్నేహం ఇప్పుడు ‘ఏకాకు’లా మిగిలింది!

రాజకీయాలలో స్నేహం కానీ, శత్రుత్వం కానీ శాశ్వతం కాదని అంటారు. అయితే గత డిసెంబర్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తన అనుంగు నె చ్చెలి శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా బయటికి పంపించడాన్ని బట్టి చూస్తే - పాతికేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహ సాన్నిహిత్యం శాశ్వతంగా ముగిసినట్ల్లే కనిపిస్తోంది.


శశికళను బహిష్కరించిన ఐదురోజుల తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో తొలిసారిగా మౌనం వీడిన జయ... ‘నమ్మక ద్రోహులకు పార్టీలో చోటు లేదు’ అని ఒకప్పటి తన ‘సిస్టర్ ఇన్ స్పిరిట్’ (స్నేహోదరి) ను ఉద్దేశించి కరాకండిగా వ్యాఖ్యానించడం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది! నిజానికి జయ, శశిల మధ్య ఇన్నేళ్లూ కొనసాగింది రాజకీయాలకు అతీతమైన స్నేహానుబంధం. దాన్ని కూడా కాదనుకుని శశికళపై చర్య తీసుకున్నారు జయ. ‘‘ఇవాళ్టి నుంచి నువ్వు అన్నాడిఎంకెలో భాగం కాదు.. ఫో’’ అని అధికారికంగా అనడమైతే అన్నారు కానీ, అంతరార్థం మాత్రం ‘ఇవాళ్టి నుండి నువ్వు నాలో భాగం కానే కాదు’ అని స్నేహానికి నీళ్లొదులుకోవడమే.

ఐదేళ్ల నిరధికార విరామం తర్వాత గత ఏడాది మే 16న తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి పట్టాభిషిక్తురాలైన ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయిక) జయలలిత... తనెంతో కష్టపడి సాధించుకున్న పదవిని కాపాడుకోవడం కోసం చివరికిలా తన ఇష్టసఖినే ఫణంగా పెట్టవలసి వస్తుందని ముందెన్నడూ ఊహించి ఉండరు! స్నేహితురాలికి సర్వం దోచిపెట్టిన జయలలితకు... ఇప్పుడా స్నేహితురాలి నుంచే తన రాజకీయ అధికారాన్ని సంరక్షించుకోవలసిన అగత్యం ఏర్పడింది.


ప్రాణసమానం అనుకున్న శశికళ తనను నట్టేట ముంచేందుకు పార్టీ కార్యాలయంలో పావులు కదుపుతున్న విషయం తెలిసి జయ ఆమెకు చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇందుకు వారు చూపుతున్న నిదర్శనాలు జయ కటౌట్‌లా నిలువెత్తుగా కనిపిస్తున్న ప్పటికీ అంతకన్నా ఎత్తైది వారి స్నేహానుబంధం.

అనుకోని అనుబంధం
జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా, అది పోయస్ గార్డెన్‌కే పరిమితం అయ్యింది. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో స్నేహం బహిర్గతమయ్యింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల దుకాణం నడుపుతున్న శశికళకు ప్రభుత్వోద్యోగి అయిన ఆమె భర్త నటరాజన్ ద్వారా జయలలితతో పరిచయభాగ్యం కలిగింది.
అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో కూడా పట్టు దొరికింది. 


జయలలిత, శశికళ, చంద్రలేఖ


 









ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆంతరంగికురాలిగా మారిన శశికళల మధ్య స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం చంద్రలేఖ అనే మరో మహిళ. చంద్రలేఖ దక్షిణ ఆర్కాట్ జిల్లాకు అప్పట్లో కలెక్టర్‌గా ఉండేవారు. అదే జిల్లాకు పౌర సంబంధాల అధికారి (పి.ఆర్.ఓ)గా శశికళ భర్త నటరాజన్ ఉండేవారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రభుత్వం కొంతమంది పి.ఆర్.ఓ.లను చెట్టుకొకర్ని, పుట్టకొకర్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యడంతో నటరాజన్... పన్నీర్‌శెల్వం అనే మరో అధికారితో కలిసి కోర్టుకెక్కారు.

ఆ సమయంలోనే జీవనోపాధి కోసం నటరాజన్ తన భార్య శశికళ చేత వీడియో పార్లర్ పెట్టించాడు. చివరికి కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో నటరాజన్‌కు 1980లో తిరిగి పి.ఆర్.ఓ.గా ఉద్యోగం లభించింది. సరిగ్గా అప్పుడే భర్త ద్వారా శశికళకు కలెక్టరు చంద్రలేఖ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో శశికళ తరచు చంద్రలేఖ ఇంటికి వెళ్లి కష్టాలను వెళ్లబోసుకునేవారు. సంపాదన చాలకపోవడంతో శశికళ కొంత డబ్బు అప్పు చేసి సింగపూరు వెళ్లి, వీడియో కెమెరాలు తెచ్చుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

అన్నాడిఎంకె పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితను తనకు పరిచయం చేయాలని చంద్ర లేఖను శశికళ కోరారు. అలా చంద్రలేఖ పరిచయం చేయడంతో పార్టీకి చెందిన కార్యక్రమాలను వీడియో, ఫోటోలు తీసే పనులను జయ శశికళకు అప్పగించారు. పనితీరు బాగుండటంతో శశికళను మళ్లీ మళ్లీ పిలిపించి కార్యక్రమాలు అప్పగించేవారు. అయితే జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు. ఒక పట్టాన ఎవరినీ నమ్మరు.


అలాంటిది ఒక సాధారణ గృహిణి, చదువులేని మహిళ అయిన శశికళను ఆమె ఎందుకు చేరదీశారన్నది ఇంకో ప్రశ్న. అయితే శశికళలో ఉండే ప్లస్ పాయింట్లు శశికళలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె ఘటికురాలు. సాటి మనిషికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కూడా. ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే, అందులో జోక్యంచేసుకోరు, వారు చెప్పేదంతా శ్రద్ధగా వింటారు. ఈ స్వభావం ఉన్న వారిని సాధారణంగా ఎవరైనా ఇష్టపడతారు. జయలలిత కూడా బహుశా అందుకే ఆమెను చేరదీసి ఉండొచ్చు.


‘కళ’ తప్పిన స్నేహం

1996 ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓడిపోయి డిఎంకె అధికారంలోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై జయ, శశి జైలుపాలయ్యారు. అప్పటి వరకు శశికళ పార్టీ సభ్యురాలు కూడా కాదు. జయ వెంట ఎక్కడా కనిపించేవారు కాదు. 2001 శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారి బహిరంగంగా జయలలిత వెంట శశికళ ప్రత్యక్షమయ్యారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండగనే 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని శశికళకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే శశికళకు పార్టీ సభ్యత్వం లేకపోవడం, ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని ఆశించలేక పోయారు. దాంతో ఆమె సూచించిన పన్నీరుశెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత నిర్దోషిగా బయట పడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. తరువాత పార్టీలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కోర్‌కమిటీ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీలోను, ప్రభుత్వంలోను శశికళ వర్గీయులదే పైచేయిగా నిలిచింది. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది.


‘రాజకీయమే’ అసలు కారణం!

నిరుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి జయలలిత, శశికళల మధ్య విభేదాలు తలెత్తాయి. శాసనసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు తన సొంత వర్గానికి చెందిన కొంతమందికి జయలలితకు తెలియకుండానే శశికళ సీట్లు కేటాయించుకున్నారు. దాంతో జయ ఆ జాబితాను రద్దు చేసి, కొత్త జాబితాను విడుదల చేశారు.

అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిగింది. పార్టీలో ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, శశికళ తమ బంధువర్గానికి సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ పోయస్ గార్డెన్‌లోని శశికళ ఇంటి ముందు కూడా కార్యకర్తలు ఆందోళనలు చేశారు.


పరిపాలనలోనూ జోక్యం!

రాష్ట్ర పరిపాలనలో కూడా శశికళ జోక్యం ఎక్కువయింది. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం, టెండర్లు ఫలానా వారికే ఇవ్వాలని ఒత్తిడి తేవడం వంటివి కూడా జరిగాయి. ఈ కారణంగా కొందరు ఐఎఎస్ అధికారులు శెలవులు పెట్టి వెళ్లిపోయిన విషయాన్ని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జయలలితకు ఫిర్యాదులు అందాయి. అప్పుడే కొంతమంది మంత్రులపై జయ వేటు వేశారు.

భర్త కోసం శశి వ్యూహం!

జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసు ప్రస్తుతం బెంగుళూరు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు వ్యవహారంలో కూడా స్నేహితురాళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. జయలలిత కోర్టుకు హాజరయినపుడు, న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధించారు. వాటిలో చాలా వరకు తనకు తెలియదని, అవన్నీ తన పేరు చెప్పుకుని తన చుట్టూ ఉన్నవారు చేశారని జయలలిత చెప్పారు.

తనపేరు మీద ఉన్న ఆస్తులన్నీ శశికళకు చెందినవేనని అన్నట్లు కూడా బయటికి పొక్కింది. అదే విధంగా శశికళ కూడా తనకేమీ సంబంధం లేదని, అంతా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితకు చెందిన ఆస్తులేనని తెగేసి చెప్పారు.


రేపో మాపో బెంగుళూరు కోర్టులో గనుక జయలలితకు ప్రతికూలమైన తీర్పు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆమె వైదొలగవలసి ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలి. ఆ బాధ్యతలను తన భర్త నటరాజన్‌కు కట్టబెట్టాలని శశికళ జయలలితను కోరినట్లు వినికిడి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శంకర్ కోవిల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నటరాజన్‌కు టిక్కెట్టు ఇచ్చి, గెలిపించాలని జయను శశి కోరారు.


2002లో ఇదే కేసులో జయను దోషిగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చి జైలు శిక్షను విధించింది. అప్పుడు శశికళ సామాజిక వర్గానికి చెందిన పన్నీరుశెల్వంను ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు ఆరు నెలల పాటు పన్నీరుశెల్వం ముఖ్యమంత్రిగా పని చేశారు. తరువాత జయను కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే పరిస్థితి మరోసారి ఉత్పన్నమవుతుందని శశికళ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ తన బంధువర్గంతో పలుసార్లు సమావేశమయ్యారు.


జయలలిత కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఆ పదవిని నటరాజన్‌కు ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. సమావేశంలో నటరాజన్‌తో పాటు శశికళ బంధువర్గం రావణన్, వెంకటేశన్, దివాకరన్, భాస్కరన్, మరి కొంతమంది ఉన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఇరవై మంది శశికళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం జయ చెవిలో పడింది. పర్యవసానమే శశి, ఆమె అనుచరుల బహిష్కరణ.


ఇంత అకస్మాత్తుగా శశికళను జయ దూరం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. జయ చాటున శశికళ మిన్నాగు పన్నాగాలు పన్నగలరని కూడా ఎవరూ అనుకోలేదు. రెండు దశాబ్దాలకు పైబడిన వీరిద్దరి ఆత్మీయ అనుబంధంలో ఇంతవరకు ఉల్లాసాలు తప్ప విరుపులు లేవు. నిజానికి జయ ఔదార్యమే వీరి స్నేహాన్ని నిలిపింది.


 
ఆమె చెప్తే ‘అమ్మ’ చెప్పినట్లే














అన్నాడిఎంకె పార్టీలో ఇద్దరు అధినేత్రులు! ఒకరు ప్రధాన కార్యదర్శి జయలలిత, మరొకరు ఆమె సన్నిహితురాలు శశికళ. వారిద్దరిది ఇరవై ఏళ్లకు పైబడిన అనుబంధం. పార్టీలోను, ప్రభుత్వంలోను, జయ నివాసం పోయస్ గార్డెన్‌లోను శశికళకు అగ్రతాంబూలమే. అధికారులు జయలలితకు ఎంత విలువ ఇస్తారో, అంతే విలువను శశికళకూ ఇవ్వాల్సిందే.

జయలలిత వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లినా, అధికారిక పర్యటనలో ఉన్నా శశికళ ఆమె పక్కన ఉండాల్సిందే. చివరికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ప్రచార వాహనంలో వెనక సీటులో శశికళ ఉంటారు. పార్టీలో జయలలితకు తెలియని విషయాలయినా ఉంటే ఉండవచ్చు కాని, శశికళకు తెలియని విషయాలు ఉండవని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జయలలిత నీడ శశికళ. 1991-96 మధ్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి.


కవలు పిల్లలు ఏ విధంగా ఒకే డ్రస్ వేసుకుంటారో, అదే విధమైన దుస్తులు ధరించేవారు. 1996లో జైలుకు కూడా కలిసే వెళ్లారు. అటువంటి స్నేహం వారిద్దరిదీ. ఒక దశలో శశికళ జయకు సమయం కేటాయించడం కోసం తన భర్తను కూడా నిరాదరించారు. 1996 శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె పరాజయానికి శశికళ, ఆమె బంధువర్గమే కారణమని ఆరోపణలు వచ్చినప్పుడు శశికళను కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచిన జయలలిత మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. 2003లో శశికళకు పార్టీలో తొలిసారిగా ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి ఎగ్జిక్యూటివ్ కోర్ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు.


అమలిన స్నేహం

 







ఇరవై ఏళ్ల స్నేహ బాంధవ్యంలో, రాజకీయ సాంగత్యంలో జయలలితగానీ ఆమె ప్రియబాంధవి శశికళగానీ ఒకరి గురించి ఒకరు నోరు మెదిపిన సందర్భం ఒక్కటైనా లేదు! ఇంటర్వ్యూలలో శశికళ ప్రస్తావన వచ్చినప్పుడు జయ ‘నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అన్నట్లు చూసేవారు. జయ గురించి శశకళను అడిగే ధైర్యమైతే అసలు పార్టీలో ఎవరికీ ఉండేది కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఊహలు, వదంతులు చుట్టుముట్టినప్పుడు కూడా వీళ్ల స్నేహం తొణకలేదు. తత్తరపడలేదు. శశికళ ఒంటి మీద ప్రతి తులం బంగారానికీ ప్రత్యుర్థులు జయనే లెక్క అడిగేవారు.

శశి వెనకేసుకున్న ప్రతిరూపాయి పైనా వారికి జయ బొమ్మే కనిపించేది. ఎన్నికల ప్రచారంలో జయ వెంట శశికళ ఉండడం, ఒక చిన్న వేడుకలో వారిద్దరూ ఆత్మీయంగా దండలు మార్చుకోవడం, శశికళ మేనల్లుడి వివాహాన్ని జయ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించడం వంటి వాటిని కూడా బద్ధ విరోధ డి.ఎం.కె.పార్టీ రాష్ర్ట సమస్యలుగా చిత్రీకరించినప్పుడూ ఈ అపూర్వ స్నేహితులు ఖాతరు చేయలేదు.


అయితే ఇవే అంశాలపై వారు 1996 ఎన్నికల్లో ప్రజాతీర్పును మన్నించవలసి వచ్చింది! ఎన్నికల ప్రచారానికి శశికళను వెంటేసుకుని వెళ్లినప్పుడు జయకు బ్రహ్మరథం పట్టిన తమిళనాడు ప్రజలు ఆ అభిమానాన్ని తమ ఓటు ద్వారా చాటలేకపోయారు! మేనల్లుడి పెళ్లిలో ఒంటి నిండా నగలతో టీవీలలో ఆడంబరంగా కనిపించిన శశికళను నేరుగా చూసేందుకే జనం ఎగబడ్డారనీ, నిజానికి వారికి శశికళ తీరు నచ్చక ఆ కోపాన్ని జయపైన చూపించి ఆమెను ఓడించారని మీడియాలో వార్తకథనాలు వచ్చాయి.


అయినప్పటికీ శశి చేతిని జయ వదల్లేదు. అంతగా తను నమ్మి, ప్రేమించి అభిమానించిన మిత్రురాలు తనకు ద్రోహం చేస్తోందన్న వాస్తవాన్ని తట్టుకోలేకే చివరికి ఒక్క బహిష్కరణ సంతకంతో తన మనసులోంచి ఆమె ముద్రను చెరిపేసుకున్నారు జయలలిత!

- సి.బి.మోహన్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి, చెన్నై

ఫొటోలు: వన్నె శ్రీనివాసులు

Monday, January 3, 2011

వాణిజ్య వారధి...ఈ రజని * స్ఫూర్తి... విజయం

ఈమె పేరు రజనీ వుడ్. ఉండేది ఆస్ట్రేలియాలో. హోదా.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్) వ్యవస్థాపక సభ్యురాలు, బోర్డ్ మెంబర్. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసిన ఈమె ఒకప్పుడు అశ్విని హెయిర్ ఆయిల్, ఆప్కో సంస్థలకు మోడల్‌గా కూడా పనిచేశారు. మణిశంకర్ తీసిన చాలా డాక్యుమెంటరీల్లో నటించారు.

ప్రస్తుతం చేస్తున్న పని.. సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్ మెంబర్‌గా ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూడ్డం. ఇదీ ఈమె పరిచయం. మొన్న జరిగిన ఎలీప్ వాళ్ల సెమినార్‌కు ఆస్ట్రేలియన్ ప్రతినిధిగా హైదరాబాద్‌కు విచ్చేసినప్పుడు ఆమె తన గురించి చెప్పిన విశేషాలు ...

'పదిహేనేళ్ల క్రితం టానీ పాల్ వుడ్ అనే ఆస్ట్రేలియన్‌ను పెళ్లి చే సుకుని అక్కడే స్థిరపడ్డాను. నాకు మొదటి నుంచి నైన్ టు ఫైవ్ ఉద్యోగాలంటే పెద్ద ఆసక్తి లేదు. కొత్తగా, అందరికి భిన్నంగా చేయగలిగే పనుల పట్లే శ్రద్ధ వహించేదాన్ని. అలా మొదలుపెట్టిందే సౌత్ ఆస్ట్రేలియన్ ఛాప్టర్. దీన్ని స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాం.

నిజానికి ఇది ఎలాంటి లాభాపేక్షలేకుండా నడుస్తున్న సంస్థ. దీని తరపున ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య వ్యాపార సంబంధాలు బలపడేలా చూస్తున్నాం. అంటే ఇండియాలో ఉన్న ఉత్పత్తులకు ఆస్ట్రేలియాలో మార్కెట్ చూడడం, ఆస్ట్రేలియా వ్యాపారులకు ఇండియాలో అవకాశాలు చూపించడం మా పని. దీనివల్ల రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలపడ్డమే కాకుండా కొత్త కొత్త ఉత్పత్తులకు మార్కెట్ లభిస్తుంది.

అలాగే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇది ఇండియాకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అందుకే మా సేవలకు మంచి గుర్తింపే లభిస్తోంది. అంతేకాదు మా సంస్థకు రెండుసార్లు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. ఇది మేము సాధించిన విజయం.

కొత్త ఐడియా
ఎలీప్ వాళ్ల సెమినార్‌కి నాకు వక్తగా అహ్వానం అందింది. ఆ సమావేశంలో పాల్గొన్నాక కొత్త ఐడియా మెరిసింది. ఎంతోమంది మహిళలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుని రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. అందులో కొన్నిటిని ఆస్ట్రేలియన్ మార్కెట్‌కి పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన తట్టింది. అప్పుడు జనపనారతో తయారైన వస్తువులు నన్ను చాలా ఆకర్షించాయి.

పైగా ఆస్ట్రేలియన్లు పర్యావరణం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, ప్లాస్టిక్ నిషేధం చాలా స్ట్రిక్టుగా అమలవుతోంది. అందుకని ఇక్కడ వీళ్ల చేత జనపనారతో సంచులను తయారుచేయించి వాటిని అక్కడ మార్కెట్‌లో అమ్మితే మంచి లాభాలు ఉంటాయి.

ఇట్లా అక్కడి వాళ్ల డిమాండు తీరుతుంది ఇక్కడ వీళ్ల వస్తువులకు మార్కెట్టూ దొరుకుతుంది. ఈ ఒక్కటే కాదు ఇలా ఆస్ట్రేలియా డిమాండున్న ఇతర వస్తువులకూ ఇక్కడ వీళ్ల చేత ఉత్పత్తి మొదలుపెట్టించి అక్కడ మార్కెట్ చేయాలన్నది నా సంకల్పం. అందుకే ఇప్పుడు ముందుగా నమూనాకు కొన్ని జ్యూట్ బ్యాగులను తీసుకెళ్తున్నాను. దాన్ని బట్టి మిగతావాటికి ప్రణాళిక వేసుకోవాలని అనుకుంటున్నాను.

ఆస్ట్రేలియాలో ఈ ఉత్పత్తుల డిమాండుననుసరించి చక్కటి నైపుణ్యం గల కొంతమంది వర్కర్లను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో నేను విజయం సాధించగలిగితే ఇక్కడి వర్కర్లను అక్కడికి తీసుకెళ్లినట్లే అక్కడ నైపుణ్యం ఉన్న వర్కర్లను కొంతమందిని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. దీనివల్ల ఒకరి పనితనాన్ని ఇంకొకరు నేర్చుకునే వీలుంటుంది. అంటే ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్స్ అన్నమాట. ఇదీ నా భవిష్యత్ ప్రణాళిక.

డాక్టర్ అవుదామని....
నిజానికి నేను డాక్టర్ అవుదామనుకుని చివరకు ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపకురాలినయ్యాను. సాధారణంగా ఇలా సినిమా యాక్టర్లు చెబుతారనుకుంటా. కాని నా విషయంలో కూడా జరిగిందదే. మెడిసిన్ చేద్దామనుకున్నాను. వయసు సరిపోలేదని ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అనుమతి దొరకలేదు.

ఖాళీగా ఉండడం ఎందుకని అప్పుడే హోటల్ మేనేజ్‌మెంట్‌లో చేరాను. ఆ చదువు పూర్తవడంతోనే కృష్ణా ఒబేరాయ్(ఇప్పటి తాజ్ కృష్ణా)లో ఉద్యోగం వచ్చింది.అదే నా లక్ష్యాన్ని మార్చింది. ఆ రోజుల్లోనే ఓ వైపు ఉద్యోగం చేస్తూ ఇంకోవైపు మోడలింగ్ చేసేదాన్ని. అప్పుడే టానీ పరిచయం అవడం, ప్రేమగా మారడం, తర్వాత పెళ్లి చేసుకోవడమూ అయింది. ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్(స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవ

కాశం దొరికింది. ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్‌లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.

ఇలా సంస్థ తరపున ఆస్ట్రేలియా, ఇండియాల మధ్య ఎన్నో వ్యాపార పర్యటనలను, సమావేశాలను, వీటికి సంబంధించిన ఈవెంట్స్‌ను నిర్వహించేదాన్ని. రెండు దేశాల మధ్య ఎన్నో బిజినెస్ డీల్స్‌ని కూడా కుదిర్చిపెట్టాము. అలా ఎన్నో కీలకమైన వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించి ఒక్క యేడాదిలోనే ఆ సంస్థ సీఈవో స్థానానికి ఎదిగాను.

స్ఫూర్తి... విజయం
ఆ స్ఫూర్తితో కొంతమంది స్నేహితులతో కలిసి ఆస్ట్రేలియన్ ఛాప్టర్ (ఆస్ట్రేలియన్, ఇండియన్ బిజినెస్ కౌన్సిల్)ను స్థాపించాను. దీని వ్యవహారాలు నడుపుతూనే ఆస్ట్రేలియా సమాజంలో ఉన్న రుగ్మతల మీద పనిచేయడం మొదలుపెట్టాను. అక్కడ డ్రగ్స్ బారిన పడే యువత చాలా ఎక్కువ. వాళ్లను గుర్తించి కౌన్సిలింగ్‌లు ఇప్పించడం, పునరావాస కేంద్రాల్లో చేర్పించడం, వాళ్లకు పనులు నేర్పించడం వంటివి చేస్తుంటాను మా సంస్థ తరపున.

అలా మాదకద్రవ్యాల అలవాటు మానుకుని సాధారణ జీవితం గడుపుతున్న కొంతమంది అమ్మాయిలు రకరకాల పనులు నేర్చుకుని చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటి అమ్మాయిలనే కొంతమందిని ఎక్సేంజ్ ఆఫ్ స్కిల్ కార్యక్రమంలో భాగంగా ఇండియాకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను చేపట్టిన చాలా పనుల్లో విజయాలే సాధించాను. ఇకముందు నేను చేపట్టబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయనే ఆశతోనే ముందడుగు వేస్తున్నాను.'
- సరస్వతి రమ

Saturday, January 1, 2011

మెరుపుల మిలమిలలు !

sachinఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్‌, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్‌బాస్‌-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్‌ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 50 సెంచరీలు, బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌ టాప్‌ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...

టెస్ట్‌ క్రికెట్‌లో 50 శతకాలతో రికార్డుల్లోకి...
క్రికెట్‌కు పర్యాయపదంగా మారారు సచిన్‌ టెండూల్కర్‌. ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ క్రికెట్‌లో ఎవరెస్ట్‌ శిఖరంగా నిలిచారు. రెండు దశాబ్దాలుగా క్రికెట్‌ ఆడుతున్న సచిన్‌ ఎన్నో రికార్డులు సృష్టించారు. బ్యాటింగ్‌లో ఆయన సృష్టించిన రికార్డులు ఇప్పట్లో ఎవ్వరికీ సాధ్యం కాదు. సచిన్‌ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ రెండవ ఇన్సింగ్‌లో సెంచరీ చేసి టెస్టుల్లో 50 శతకాలు చేసిన మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 50 సెంచరీలతో ఏ టాప్‌ బ్యాట్స్‌మన్‌కు అందనంత ఎత్తులో ఆయన నిలిచారు. ఇక టెస్టుల్లో 50 వ సెంచరీని ఆయన తన తండ్రికి అంకితమిచ్చారు. త్వరలోనే సచిన్‌ వన్డేల్లో కూడా 50 సెంచరీలను పూర్తి చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు చేసిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తారు. ఈ రికార్డుకు చేరువలో సచిన్‌ ఉండడం మన దేశవాసులందరికీ గర్వకారణం.

బాలీవుగ్‌ టాప్‌ హీరోగా సల్మాన్‌ ఖాన్‌
salman-khanఈ ఏడాది బాలీవుడ్‌ టాప్‌ హీరోగా సల్మాన్‌ ఖాన్‌ నిలిచారు. సల్మాన్‌ ఇటీవలే 45వ బర్త్‌డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్‌కు అమీర్‌ఖాన్‌కు ఉన్న యాక్టింగ్‌ స్కిల్స్‌, షారూఖ్‌ ఖాన్‌ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్‌ సినిమాలతో బాలీవుడ్‌ టాప్‌ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్‌ నటించిన దబంగ్‌ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతోపాటు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4లో యాంకర్‌గా చేసిన సల్మాన్‌కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌లు, సల్మాన్‌ ఖాన్‌లు ఖాన్‌ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్‌ల త్రయంలో సల్మానే బెస్ట్‌గా నిలిచారు. ఇతర ఖాన్‌లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్‌ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్‌ ట్రేడ్‌ కన్సల్టెంట్‌ అమోద్‌ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్‌లో డబ్బింగ్‌ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్‌ హిట్‌ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్‌, గోల్‌మాల్‌ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్‌ కౌన్‌ హై...అంటే నేను సల్మాన్‌ ఖాన్‌ అని చెబుతాను. సల్మాన్‌ నటించిన వీర్‌ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్‌ సినిమాతో ఆయన టాప్‌స్టార్‌గా నిలిచారు’ అని ఆయన సల్మాన్‌ను పొగిడారు.

సల్మాన్‌ఖాన్‌తో పాటు గోల్‌ మాల్‌-3 సినిమా హీరో అజయ్‌దేవ్‌గన్‌ సైతం పాపులారిటీ సంపాదించుకున్నారు. దబంగ్‌, గోల్‌మాల్‌-3 సినిమాలు పెద్దమొత్తంలో కలె క్షన్లను తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది యంగ్‌ స్టర్‌ హీరోలు రణబీర్‌ కపూర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌లు తమ హిట్‌ సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.

పెళ్లితో ఆనందమయ జీవితంలోకి..
Sania-Shoaibటెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్‌లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్‌తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్‌ గేమ్స్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్స్‌ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్‌లో జరిగిన ఇంటర్నే షనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్‌లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్‌ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్‌ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్‌ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్‌లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్‌ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్‌ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్‌‌స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్‌ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.

మేమిద్దరు క్రీడల్లో ఉన్నందున ఆయన నా సమస్యలను సులభంగా తెలుసుకొని ప్రోత్సహిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘టెన్నిస్‌లో సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ గేమ్స్‌ కూడా ఆడుతున్నాను. . నా దృష్టిలో అయతే ర్యాకింగ్స్‌ కేవలం నెంబర్స్‌ మాత్రమే. చక్కగా ఆడుతూ ముందుకు వెళ్తుంటే మంచి ర్యాంకింగ్స్‌ వాటంతట అవే వస్తాయి. ఎప్పటివరకైతే పూర్తి ఫిట్‌గా, ఆరోగ్యవంతంగా ఉంటానో అప్పటి వరకు విజయాలు సాధిస్తాను. టెన్నిస్‌లో కొనసాగుతాను’ అని సానియా ధీమాగా చెప్పారు.

సెలబ్రిటీ జంటగా దీపికా, సిద్దార్థ మాల్యా...
dipeeka&sidduదేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్‌మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్‌ కింగ్‌, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్‌ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ టీం యజమాని కూడా విజయ్‌మాల్యానే. ఇక విజయ్‌మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్‌లో తమ టీం బెంగళూర్‌ క్రికెట్‌ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్‌ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్‌గా ఉన్న బాలీవుడ్‌ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్‌ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్‌ వేడు కలను లండన్‌లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్‌ షాపింగ్‌ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్‌ తో కలిసి న్యూ ఇయర్‌ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్‌లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.

బిగ్‌ బాస్‌లో పమేలా సందడి...
andersonమన దేశంలోని పలు టివి ఛానెల్స్‌లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్‌ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్‌ను సాధించింది మాత్రం బిగ్‌ బాస్‌. దీని హోస్ట్‌గా సల్మాన్‌ ఖాన్‌ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్‌ బాస్‌-4లో సెలబ్రిటీ గెస్ట్‌గా హాలీవుడ్‌ ‘అందాల’ తార, బేవాచ్‌ గర్ల్‌ పమేలా ఆండర్సన్‌ సెలబ్రిటీ గెస్ట్‌గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్‌ నటి పమేలా ముంబయ్‌కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్‌గా బిగ్‌ బాస్‌ 4 హౌస్‌లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్‌ బాస్‌ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్‌లో ఆమె యానా గుప్తా ఐటమ్‌ సాంగ్‌ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్‌ మేట్స్‌ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్‌గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్‌ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్‌ పటేల్‌, హృషాంత్‌ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్‌ టివి ఛానెల్‌లో ప్రసారమైన బిగ్‌ బాస్‌-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

జీవిత భాగస్వామితో విడిపోయి...
liz-hurleyఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ ఉడ్స్‌ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్‌ ఉడ్స్‌ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్‌ ఉడ్స్‌ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్‌ సెలబ్రిటీ లిజ్‌ హర్లీ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ షేన్‌వార్న్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్‌ టైకూన్‌ అరుణ్‌ నాయర్‌ను పెళ్లి చేసుకున్న లిజ్‌ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్‌వార్న్‌తో జతకట్టింది లిజ్‌. ఈ జంట లండన్‌లోని ఓ హోటల్‌లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్‌ భర్త అరుణ్‌ నాయర్‌తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్‌వార్న్‌తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.

Friday, November 19, 2010

షరతులతో కూడిన స్నేహం

Friendship1
సంజన, కునాల్‌ మంచి స్నేహితులు. చాలా ఏళ్ళ నుంచి ఒకరినొకరు విడిచి ఉండలేనంత స్నేహం వారిది. ఒకరోజు కునాల్‌ తాను శ్రావ్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. దాంతో సంజన చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయింది. చివరకు కాలేజీకి కూడా రావడం మానేసింది. ఒక రోజు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కునాల్‌ వెంటనే సంజనను కలిసి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్‌ ? అని అడిగాడు. సంజన చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు. ఇంతకీ సంజన చెప్పిన విషయం ఏంటంటే... కునాల్‌ను ప్రేమిస్తున్నానని, వేరే అమ్మాయితో కలిసి తిరగడం తనకు నచ్చలేదని, ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే కోపం వస్తుందని అందుకే ఈ పనిచేశానని చెప్పింది. ఇలా నేడు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు తమ స్నేహితులు ఇతరులతో ప్రేమలో పడితే సహించలేకపోతున్నారు. పెత్తనం చెలాయించేలా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు సమాధానం గా కొందరు యువతీ యువకులు కొందరు కొన్ని షరతులతో కూడిన స్నేహం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నా రు. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే చర్చించుకుంటే మంచిదని భావిస్తున్నారు.

friendship
సృష్టిలో తీయనిది స్నేహమేనోయి... అని అనేక మంది కవులు, రచయితలు ఎప్పుడో అన్నారు. అది నిజం కూడా. కానీ, స్నేహితులంటే ఇద్దరు అబ్బాయిల మధ్య, అమ్మాయిల మధ్య మాత్రమే కాదు. నేటి రోజుల్లో యువతీ యువకుల మధ్య కూడా ఫ్రెండ్‌షిప్‌ పెరిగింది. అసలు చిక్కు అక్కడే ఉంది. చాలా కాలం స్నేహితులుగా ఉన్న వారి మధ్య సాధారణంగా ప్రేమ చిగురించేందుకు ఆస్కారం ఉంది. ప్రేమ పుట్టకపోయేందుకు కూడా అంత అవకాశం ఉంది. కానీ నేడు కొంతమంది స్నేహానికీ, ప్రేమకూ తేడాలు తెలియకుండా పోతోంది. ఇతరులతో స్నేహం చేసినా, ప్రేమలో పడినా వారు సహించలేకపోతున్నారు. బెదిరించడం, అఘాయిత్యాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అందుకే నేడు కొత్త పద్ధతిని కుర్రకారు ప్రవేశపెట్టారు. అదే షరతులతో కూడిన స్నేహం. తాము స్నేహితులమో, ప్రేమికులమో ముందే ఒక ఒప్పందానికి రావడం ఇందులోని ప్రధా‚న విషయం. ప్రస్తుతం చాలామంది యువత ఈ పద్ధతిని ఆమోదిస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. స్నేహానికి సరికొత్త భాష్యం చెబుతున్నారు.

కాలం మారింది... : కాలం మారింది. కాలంతో పాటే మనుషుల అభిప్రాయాలు, ఆలోచనలు మారాయి. అధునిక నాగరికత మూలంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఉండే గీత చెరిగిపో యింది. కలిసి ఒకే కాలేజీలో చదువుకోవడం, ఒకే చోట ఉద్యోగాలు చేయడం వల్ల వారి మధ్య సహజంగానే స్నేహం ఏర్పడుతుంది. కొన్ని సంవత్సరాలకు ముందు ఆడ ఫ్రెండ్‌ ఉందంటే చిత్రంగా అనుకునేవారు. ప్రస్తుతం స్నేహితురాలయినా, స్నేహితుడయినా పెద్ద తేడాలేకుండా అయిపోయింది. అయితే, నేడు యువతీ యువకులు స్నేహితులుగా ఉన్న వారి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమా తేల్చుకోలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. అది కొన్ని సమస్యలకు కూడా దారి తీస్తోంది.

Friendship2
ఒప్పందం కుదుర్చుకుంటున్నారు... : నేడు స్నేహం చేసే అమ్మాయిలు, అబ్బాయిలు ముందే ఒక ఒప్పం దం కుదుర్చుకుంటున్నారు. ఖచ్చితమైన ప్రణాళిక ప్రకారం తమ స్నేహాన్ని విస్తరించుకుంటున్నారు. ‘కలిసి ప్రయాణిస్తున్న స్నేహం అనే బోటులో ఎప్పుడైనా ఇద్దరి మధ్య ప్రేమ కలగవచ్చు, లేకుండా పోవచ్చు. ఇతరులపై ఆమెకు లేదా అతనికి ప్రేమ కలగవచ్చు. అలాంటప్పుడు ఇంత కాలం స్నేహం చేసిన వారు బాధపడకుండా ఉం డాలంటే ముందుగానే షరతు ఉండాలని నేననుకుంటున్నాను. పరిచయం అయిన వెంటనే మీ డ్రీమ్‌ గర్ల్‌ / బాయ్‌తో ప్రేమిస్తున్నామని చెప్పడం కుదరదు. ప్రేమ ఎప్పుడు ఎవరితో ఏ సమయంలో కలుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ నేడు కొంతమంది స్నేహం కూడా ప్రేమే అని అనుకుంటున్నారు. అలా కాకుండా ముందుగానే కొన్ని షరతులతో ఒప్పదం కుదుర్చుకొని స్నేహం చేయడం మంచిది. చెప్పుకోవడానికి హాస్యాస్పదంగానే కనిపి స్తున్నా నేడు జరుగుతున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే అవసరమే అనిపిస్తుంది’ అని మెడిసిన్‌ చదువుతున్న ప్రసాద్‌ తెలిపాడు.

మంచిది కాదు... : ‘నా ఫ్రెండ్‌ నేను చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నాం. సన్నిహితంగా మారిపో యాం. నాకు తన మీద స్నేహం కన్నా ప్రేమ ఎక్కువైంది. ఆ సమయంలో తను ఒక రోజు వేరే అమ్మాయిని ప్రేమి స్తున్నానని చెప్పాడు. అప్పుడు తనకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేను ప్రేమిస్తున్నానన్న సంగతి ముందుగానే తెలియజేసి ఉంటే బాగుండేది అని నాకా టైములో అనిపించింది. కానీ ఎటువంటి సంబంధం లేని అతన్ని ఆపే హక్కు నాకు లేదు. అందుకే ఒకరోజు వాళ్లిద్దరికీ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశాను. తరువాత అతనితో ఫ్రెండ్‌షిప్‌ కొనసాగిస్తూనే ఉన్నాను. మనం ప్రేమిస్తున్నామని తను కూడా ప్రేమించాలనుకోవడం మంచిది కాదని నాకు అప్పుడు అనిపించింది’ అని ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ సులోచన పేర్కొంది.

సిద్ధాంతం లేదు... : ‘ఒక అమ్మాయి, అబ్బాయి స్నేహితులుగా ఉన్నంత మాత్రాన అబ్బాయి మరొక అమ్మా యితో ప్రేమలో పడకూడదని ఎక్కడా లేదు. మరెందుకు స్నేహితులుగా ఉన్న అబ్బాయిలు వేరే అమ్మాయిని ప్రేమించినా, స్నేహం చేసినా బాధపడడం, ఏడవడం ఎందుకు చేస్తారో నాకు అర్థంకాదు. ఇది అర్థం పర్థంలేని విషయాలుగా నాకనిపిస్తుంది. స్నేహం చేస్తున్నంత మాత్రాన పెళ్లి అయిపోయినట్టే అనుకుంటే అది వారి మూర్ఖత్వంగానే పరిగణిస్తాను. ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిల విషయంలోనూ వర్తిస్తుంది. తమ ఆడ ఫ్రెండ్‌ వేరే అబ్బాయితో మా ట్లాడినా, స్నేహం చేసినా కొంతమంది అబ్బాయిలు ఆ అమ్మాయిపై పెత్తనం చెలాయిస్తారు. దాదాపు అందరూ తమ స్నేహాన్ని విస్తరించా లనుకుంటారు. అది సహజం. అది ఎవరియినా కావచ్చు. అందుకే ముందుగానే చర్చించుకోవడం మంచిదే అని నా అభిప్రాయం. తమ మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమా అనేది ముందుగానే నిర్ణయించుకో వడం ప్రస్తుతం తప్పనిసరి’ అని బికాం విద్యారి కిరణ్‌ చెప్పాడు.

చిరాకుగా అనిపించింది... : ‘నా ఫ్రెండ్‌ తనొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు నేనేం అభ్యంతరం చెప్పలేదు. అయితే, కాలేజీలో చాలా మంది నీ బాయ్‌ఫ్రెండ్‌ నిన్ను మోసం చేస్తే ఎందుకు కామ్‌గా ఉన్నావని అడిగారు. అలా అడగడం నాకు చాలా చిరాకుగా అనిపించింది. స్నేహానికి, ప్రేమకు తేడా తెలియనివారు ఇప్పుడు కూడా ఉన్నారా? అని అనిపించింది’ అని నిఖితా చెప్పింది.