Sunday, December 11, 2011

వందేళ్ల రాజధాని ఢిల్లీ

 http://www.wheninindia.com/_/rsrc/1316456855159/history-of-Delhi/43.jpg
భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా మారి డిసెంబర్‌ 12 నాటికి వందేళ్ళు పూర్తి కానున్నాయి. ఈ వందేళ్ళలో ఎంతో మార్పు. నాటి బ్రిటిష్‌ ఇండియాకు రాజధానిగా కోల్‌కతా ఉండింది. సరిగ్గా వందేళ్ళ క్రితం బ్రిటిష్‌ వారు ఢిల్లీని రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకూ రాజధాని నగరంలో ఎన్నెన్నో మార్పులు. పాత అందాలు అదృశ్యమై కొత్త అందాలు చేరాయి . పట్నం వాతావరణం మాయమైపోయాయి. మెట్రోపాలిటన్‌ కల్చర్‌ చేరింది. ఎంతో అభివృద్ధి ... మరెంతో విధ్వంసం ... 

http://karol-bagh.com/images1/rashtrapati-bhavan-india-picture-photo.jpg
ఒక నగరం జీవితకాలంలో వందేళ్ళు ఏమంత పెద్దది కాదు. అందులో విశేష మూ ఉండదు. ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు భిన్నం. ఈ నగరం దేశరాజధాని హోదాను సంతరించుకొని వందేళ్ళు గడిచాయి. ఈ వం దేళ్ళలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకు న్నాయి. పాత ఆనవాళ్ళు చెదిరిపోయాయి. కొత్త ఆనవాళ్ళు వచ్చిపడ్డాయి. ఒక శతాబ్ది కా లంలో...ఒక్కో దశాబ్దిలో ఒక్కో రకం పోకడ. వెరసి నేటికి రాజధాని ఢిల్లీ ‘న్యూఢిల్లీ’గా మారిపోయింది. ‘‘కౌన్సిల్‌లో గవర్నర్‌ జనరల్‌తో సంప్రదిం పుల అనంతరం మంత్రులు ఇచ్చిన సలహా మేరకు భారత ప్రభుత్వం దేశ రాజధానిని కలకత్తా నుంచి ప్రాచీన రాజధాని అయిన ఢిల్లీకి మార్చాలని నిర్ణయించినట్లు తెలియజే సేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం’’ - అని 1911 డిసెంబర్‌ 12న నాటి రాజు ఐదో జార్జ్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన దేశం లో సంచలనం కలిగించారు. 18వ శతాబ్ది నుంచి కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యానికి భారతదేశంలో ఆయువుపట్టుగా ఉన్న కలకత్తా నుంచి రాజధాని హోదా ఢిల్లీకి మారింది. ఆ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఢిల్లీకి రాజధాని హంగులు సమకూరసాగాయి. http://delhi.gov.in/wps/wcm/connect/24f200004fe87b85b02dbbd9d1b46642/red+fort.jpg?MOD=AJPERES&lmod=827272050&CACHEID=24f200004fe87b85b02dbbd9d1b46642
భారత సామ్రాజ్యాధీశుడిగా కింగ్‌ జార్జ్‌ను పట్టాభిషిక్తుడిని చేసే సమయంలో రాజధాని మార్పు ప్రకటన వెలువడింది. అప్పట్లో ఢిల్లీ జనాభా 2,33,000గా ఉండింది. చక్రవర్తి పర్యటనను పురస్కరించుకొని, ఇటీవల కామ న్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా చేసినట్లుగానే, 300 మంది అసాంఘిక శక్తులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు అయిన వారిలో నిరుపేదలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఆనవాయితీకి పట్టాభిషేక మహోత్సవం నుంచే బీజం పడింది. అది నేటికీ కొనసాగుతోంది.

ఎంతో గోప్యం
olddhelli 

కోల్‌కతా నుంచి కంటే కూడా ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభం అని బ్రిటిష్‌ వారు భావించిన నేపథ్యంలో న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడింది. తమ నగరానికి రాజధాని హోదా కావాలని ఢిల్లీవాసులు కోరుకోలేదు. అందుకు ఉద్యమించలేదు. అయినా ఢిల్లీ నగరానికి ఆ హోదా దక్కింది. చివరి క్షణం వరకూ ఈ ప్రక టనను ఎంతో గోప్యంగా ఉంచడం విశేషం. ఆ ప్రకటన చేయగానే సభలో కొద్దిసేపటి వరకు నిశ్శబ్దం తాండవించింది. సభికులకు విషయం అర్థమయ్యేందుకు కొంత సమయం పట్టింది. ఆ తరువాత కలకలం మొదలైంది. అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యాల్లో ఒక టిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

ఢిల్లీని నూతన రాజధానిగా తీర్చిదిద్దడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదిగా ఉండింది. ఢిల్లీ పట్టణానికి అవసరమైన మౌలిక వసతు లను సమకూర్చడం కన్నా పట్టణానికి నగర రూపురేఖలు జోడించడమే అప్పట్లో బ్రిటిష్‌ వారికి ప్రధానంగా ఉండింది. నేటికీ అదే తరహాలో ఢిల్లీ అభివృద్ధి కొనసాగుతోంది. కొత్తఢిల్లీ నిర్మాణయత్నం ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక ఏర్పా ట్లు మొదలయ్యాయి. పాత ఢిల్లీకి చేరువలోనే కొత్త ఢిల్లీని నిర్మించే ప్రయత్నాలూ ఆరంభమయ్యాయి. అందుకోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సబ్జి మండి, సివిల్‌ లైన్స్‌ తదితరాలను పరిశీలించి వివిధ కారణాల రీత్యా తోసిపుచ్చారు. చివరకు రైజినా గ్రామ ప్రాంతం బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు నచ్చింది.
http://lh5.ggpht.com/-2XM46lxzMJU/SGTdcyCaKcE/AAAAAAAADkM/mreWX_bGH4o/INDIADelhiMyFavouriteCityInIndia.jpg
అక్కడ ఉన్న గుట్టను తొలచివేసి ప్రభుత్వ భవ నాల నిర్మాణాలను ఆరంభించారు. ఎడ్విన్‌ లాండ్‌సీర్‌ లుటెన్స్‌, తన స్నేహితుడు హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్ట్‌లు ఈ పనులు చేపట్టా రు. లుటెన్స్‌ అప్పటి వరకూ గొప్ప ట్రాక్‌ రికా ర్డు ఏమీ లేనప్పటికీ, కొంతమంది బ్రిటిష్‌ సంపన్నుల భవనాలను అందంగా నిర్మించిన కారణంగా ఆయనకు ఈ పని అప్పచెప్పారు. నాటి వైస్రాయి లార్డ్‌ లైటన్‌ ఏకైక కుమార్తెను లుటెన్స్‌ వివాహం చేసుకోవడం కూడా ఇందు కు కారణం కావచ్చు. స్థూలంగా న్యూఢిల్లీ, గవర్నమెంట్‌ హౌస్‌ (రాష్టప్రతి భవన్‌) డిజైన్‌ ను లుటెన్స్‌ పర్యవేక్షించగా, సెక్రటరి యేట్స్‌ (నార్త్‌ , సౌత్‌ బ్లాక్స్‌), కౌన్సిల్‌ (పార్ల మెంట్‌) డిజైన్‌ బాధ్యతలను బాకెర్‌ చేపట్టారు. బ్రిటిష్‌ సామ్రాజ్య దర్పాన్ని ప్రతిబింబించే విధంగా ఆనాటి భవనాలు, కట్టడాలు రూపుదిద్దు కున్నాయి. ఢిల్లీలో యూనివర్సిటీ కోసం నాటి నాయ కులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఫలితంగా 1922లో అక్కడ యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. దాని నిర్మాణానికి అరకొర నిధులనే వెచ్చించారు.

ఎన్నెన్నో సమస్యలు

 http://images.beijing2008.cn/20080314/Img214268841.jpg
పాత ఢిల్లీ నగరంలో వసతులు మెరుగుపర్చేందుకు నాటి ప్రభత్వం ఏమాత్రం శ్రద్ధ వహిం చలేదు. 1927లో కౌన్సిల్‌ హౌస్‌ (నేటి పార్ల మెంట్‌)ను ప్రారంభించారు. దాన్ని ప్రారంభిం చిన రెండేళ్ళకే భగత్‌ సింగ్‌, బి.కె.దత్‌ అందు లో చిన్న పాటి బాంబు పేల్చారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఢిల్లీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవిభజన సందర్భంగా పాకిస్తాన్‌ నుంచి పెద్ద ఎత్తున హిందువులు ఢిల్లీకి వలస వచ్చారు. వారందరికీ కొన్నేళ్ళ పాటు ఢిల్లీలోనే ఆవాసం కల్పించారు. అదే సమయంలో ఢిల్లీలో పలువురు ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్ళగా వారి ఇళ్ళను ఇతరులు ఆక్రమించారు.
మాస్టర్‌ ప్లాన్‌
http://delhi-masterplan.com/wp-content/uploads/2009/07/delhi_1483_sq_km.jpg
ఢిల్లీ ప్రణాళికారహితంగా విస్తరించడం మొదలైంది. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ సై తం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబ ద్దంగా ఢిల్లీని విస్తరించే ప్రయత్నాలకు అప్పు డే బీజం పడింది. విస్తరణను నియంత్రించేం దుకు ఒక సెంట్రల్‌ అథారిటీ ఉండాలని నెహ్రూ భావించారు. 1957లో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటయ్యాయి. మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే యత్నాలు మొదలయ్యాయి.

1981 వరకు ఢిల్లీ విస్తరణ అంతా ఆనాడు నెహ్రూ ఆమోదించిన మార్గదర్శకాలకు అను గుణంగానే జరిగింది. చారిత్రక కట్టడాల చుట్టూరా ఉన్న విశాల స్థలాలను ఉద్యానవనా లుగా తీర్చిదిద్దారు. పచ్చదనం పెంపొందిం చారు. నేడు ఢిల్లీ ఎన్నో పర్యాటక, చారిత్రక స్థలాలతో అలరారుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ వీసీగా ఉండిన గ్యాయర్‌ ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చే శారు. ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేశారు. మరోవంకన ఢిల్లీ విలాసజీవితానికి మారు పేరుగా కూడా మారిపోయింది. ఆరోగ్య సదుపాయాలు, ఆసుపత్రులు విస్తరించాయి. ఢిల్లీ అభివృద్ధికి మరాఠాలు, బెంగాలీలు, తమిళు లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఎంతో కృషి చేశారు. నేడు ఢిల్లీ నగరం భిన్న ప్రాంతీయుల ఆచార వ్యవహారాలతో కళకళలాడుతుంటుంది. ఎవ రికి ఏ పండుగ వచ్చినా మిగిలిన వారూ ఆ వేడుకలో భాగస్వాములవుతుంటారు.

రవాణా

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYP2qdJSF_Qnp_84wBOs7yWGU1zBhJkY11csq8KG65jjddW4RT032ITbjVU-fLuJbrKTTg6Z7O3apO4zr8dAx40AuwmYHnQqWgJ0VcVgpZzI6umMIyAXNiP5TWGkW-KKn8qaiG5GqXrXc/s1600/Delhi+(Metro+Rail).jpgరాజ్‌పథ్‌, జన్‌పథ్‌, అక్బర్‌ రోడ్‌ లాంటి మార్గాలు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీ అంతటా భూగర్భ సబ్‌వేలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఢిల్లీ మొత్తం మీద 2,700 బస్‌ స్టాప్‌లు ఉన్నాయి. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ ప్రపంచంలోని అతి పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బాగా పేరొందింది. 2006-07లో 23 లక్షల కు పైగా ప్రయాణికులు దీన్ని ఉపయోగించు కున్నారు. 2020 నాటికి దీన్ని ఉపయోగించు కునే వారి సంఖ్య ఏటా 100 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీలో రవాణా సాధనాలుగా బస్సులు, ఆటోలు, రైళ్ళు బాగా వాడుకలో ఉన్నాయి. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొ రేషన్‌ యావత్‌ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పర్యావరణ స్నేహపూర్వక సీఎన్‌జీ బస్సులను కలిగి ఉంది. బస్‌ ర్యాపిడ్‌ సిస్టమ్‌ అంబేద్కర్‌ నగర్‌ నుంచి ఢిల్లీ గేట్‌ వరకు అమల్లో ఉంది. రైల్వే వ్యవస్థ 153 కి.మీ మేర రైలు మార్గాన్ని కలిగి ఉంది. 2020 నాటికి ఇది 413 కి.మీ.కు చేరుకోగలదని అంచనా. 130 స్టేషన్లు ఉన్నాయి.

కన్నాట్‌ ప్లేస్‌

ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ అనేది వృత్తాకారంలో ఉన్న వాణిజ్య ప్రాంతం. దీని అవుటర్‌ రింగ్‌ నుంచి 12 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి జన్‌పథ్‌.

జనాభా

 http://www.science-express.com/wp-content/uploads/2007/11/delhi.jpg
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీలో ఓ చిన్న భాగమైన న్యూఢిల్లీ జనాభా సుమా రుగా 2.50 క్షలు. హిందువులు 86.8 శాతం, ముస్లింలు 6.3 శాతం, సిక్కులు 2.4 శాతం, జైనులు 1.1 శాతం, క్రైస్తవులు 0.9 శాతం. పలు రకాల భాషలు మాట్లాడే వారు ఇక్కడ నివసిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూ సినా కాస్మోపాలిటన్‌ సంస్కృతి కనిపిస్తుంది. స్వాతంత్య్రదిన, గణతంత్రదిన వేడుకలు భారీస్థాయిలో జరుగుతాయి. వాటిని చూసేం దుకు విదేశీయులు కూడా వస్తుంటారు.

ప్రగతి మైదాన్‌

 http://www.delhitourism.com/images/trade_fair_delhi.jpg
ప్రగతి మైదాన్‌లో జరిగే ఆటో ఎక్స్‌పో ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. రెండేళ్ళ కోసారి ఈ ప్రదర్శన జరుగుతుంది.

సిస్టర్‌ సిటీస్‌

http://ashevillesistercities.org/joomla/images/stories/scilogo.jpg
న్యూఢిల్లీ, షికాగో (అమెరికా), లండన్‌ (బ్రిటన్‌), ఉలాన్‌ బటార్‌ (మంగోలియా), మాస్కో (రష్యా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (రష్యా), జోహాన్స్‌ బర్గ్‌ (దక్షిణాఫ్రికా)లతో సిస్టర్‌ సిటీ ఒప్పందాలను కలిగి ఉంది.

గతమెంతో ఘనం

 http://www.newdelhiairport.in/images/top-banner-img.jpg
ఢిల్లీ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 12వ శతాబ్ది నుంచి 19 వ శతాబ్ది మధ్య కాలం దాకా ఎన్నో ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. నిజానికి ఢిల్లీ అనేది ఒక్క నగరం కాదు. ఏడు పట్టణాలు కలసి రూపొందిన నగరం. సిరి, తుగ్లకాబాద్‌, జహా నాపనా, ఫిరోజాబాద్‌, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానాబాద్‌లు కలసి ఢిల్లీ నగరంగా రూ పాంతరం చెందాయి. వీటికి తోడుగా న్యూఢి ల్లీ కూడా ఈ జాబితాలో చేరింది. షాజహాన్‌ క్రీ.శ. 1639-1648 మధ్య కాలంలో నిర్మించినషాహజనానాబాద్‌ 1857 వరకు కూడా మొగల్‌ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది. ఢిల్లీ భౌగోళిక నేపథ్యం కారణంగా ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధా నిగా చేసుకున్నారు. యమునా నది ఒడ్డున ఉండడం, ఆయా సామ్రాజ్యాలకు పాలనకు అనువైన ప్రాంతంలో, వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండడం, ఆరావళి పర్వత పంక్తి లాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఒకప్పుడు 70,000 మంది అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఢిల్లీ నగరంలో నేడు 1.6 కోట్ల మంది నివసిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు మాత్రం వృద్ధి చెందలేదు. పర్వతపంక్తిని దెబ్బ తీయడం, యమునా నదిని కలుషితం చేయడం లాంటి వి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఢిల్లీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే వర సగా ఉన్న కొండలు, గుట్టలు నేడు ఎక్కడిక్క డ ముక్కచెక్కలుగా మారాయి. పట్టణీకరణ అటు కొండలను, ఇటు యమునా నదిని దెబ్బ తీస్తోంది.

వేగంగా విస్తరిస్తున్న నగరం

 http://k53.pbase.com/v3/30/52730/2/46484484.uppadjul20.jpg
దేశరాజధానిగా వ్యవహరించే న్యూఢిల్లీ ప్రాంతం ఢిల్లీ మెట్రో పోలీస్‌ పరిధిలో ఉంటుంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని తొమ్మిది జిల్లాల్లో అది ఒకటి. దీని విస్తీర్ణం 42.7 చ.కి. మీ. 134 దేశాలకు చెందిన విదేశీ రాయబార కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 1911 డిసెంబర్‌ 15న న్యూఢిల్లీకి శంకుస్థాపన జరిగింది. 1931 ఫిబ్రవరి 13న బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని హుమాయున్‌ సమాధి, కుతుబ్‌ కాంప్లెక్స్‌ రెండూ కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌గా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోనే అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. జీవిత కాలంలో కనీసం ఒకసారి సందర్శించిన నగరాల్లో ఒకటిగా ఈ నగరం ప్రఖ్యాతి చెందింది. కొత్త ఢిల్లీ అనేది ఏడు పాత పట్టణాలను కలుపుకుంటూ ఏర్పడింది. అందుకే జంతర్‌ మంతర్‌, లోధీ గార్డెన్స్‌ వంటి చారిత్రక కట్టడాలు కూడా దీని పరిధిలోకి వచ్చాయి.

చరిత్రలో సుస్థిర స్థానం

 http://www.virtualtripping.com/wp-content/uploads/2009/07/Traffic-in-delhi-450x339.jpg
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరు వాత ఢిల్లీకి పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించారు. కేంద్రప్రభుత్వం ఓ చీఫ్‌ కమిషనర్‌ను నియమించింది. 1956లో ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చారు. ఫలితంగా చీఫ్‌ కమిష నర్‌ స్థానంలోనే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నియమితులయ్యారు. ఒకప్పుడు సఫ్దరజంగ్‌ విమానాశ్రయం నగరానికి ఒక మూలన ఉండింది. అది ఇప్పుడు నగరం నడిబొడ్డుకు చేరింది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌ విమానాలకు ఉపయోగించడం లేదు. 1962 నుంచి పాలం విమానాశ్రయం వాడుక లోకి వచ్చింది. 1982లో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌, 2010లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడారంగ చరిత్రలో ఢిల్లీ నగరానికి సుస్థిర స్థానాన్ని కల్పించాయి.

ఫ్యాషన్లకు నిలయం
1930 ప్రాంతం నుంచే ఢిల్లీలో మహిళల జీవనశైలిలో పెనుమార్పులు వ్యక్తమవుతూ వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ బాక్సా ఫీస్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఈ మార్పులకు కారణమనవచ్చు. విదేశీయుల తాకిడి అధి కంగా ఉండడం, మెట్రోపాలిటన్‌ సంస్కృతి ఇవన్నీ ఢిల్లీని ఫ్యాషన్‌ కేంద్రంగా మార్చా యి. వివిధ రకాల ఫ్యాషన్‌ మ్యాగజైన్లు లాంటివి కూడా ఇందుకు కారణమయ్యా యి. స్వాతంత్య్రం రాకముందు వరకు కూడా బ్రిటన్‌ లైఫ్‌స్టయిల్‌ ఢిల్లీ నగరంపై తన ప్రభావాన్ని విపరీతంగా కనబర్చింది.

ఇదీ నేటి పరిస్థితి
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిల్చిన ఢిల్లీ నగరం నేడు అశాంతికి నిల యంగా మారిపోయింది. ఉగ్రవాదం పడగ నీడన ఢిల్లీవాసులు కాలం గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామాజిక అశాంతి పెచ్చుమీరిపోయింది. భూఆక్ర మణలు పెరిగిపోయాయి. అడ్డూ అదుపు లేకుండా నగరం విస్తరిస్తుండడంతో చుట్టు పక్కల పల్లెల్లోని వారు ఏ క్షణంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని ముఖ్య స్థలాలు.....

http://www.bobzworldcity.com/wp-content/uploads/2011/05/Parliament-House-in-New-Delhi.jpg 
http://www.liveindia.com/delhi/rashtrapatibhawan-main.jpg
http://delhitourism.blog.com/files/2011/03/akshardham00f.jpg 
http://www.delhimalayalee.com/images/39_new_delhi.jpg 
రాష్టప్రతి భవన్‌, పార్లమెంట్‌ భవనం, ఇండియా గేట్‌, జామా మసీదు, ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, హుమాయున్‌ సమాధి, జంతర్‌ మంతర్‌, పురానా ఖిల్లా, లక్ష్మీనారాయణ టెంపుల్‌, అక్షరధామం, బహాయి లోటస్‌ టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, రాజ్‌ఘాట్‌, సెక్ర టరియేట్‌, రాజ్‌పథ్‌, విజయ్‌ చౌక్‌, సఫ్దర్‌ జంగ్‌ సమాధి, మొగల్‌ గార్డెన్స్‌ లాంటి చారి త్రక, పర్యటక స్థలాలను ఢిల్లీలో చూడవచ్చు.

- వి.

Sunday, November 27, 2011

బడుగులకు భగవంతుడు జ్యోతిరావ్‌ ఫూలె

 http://farm3.static.flickr.com/2505/4228610546_b1766199f5.jpg
గ్రామీణులు, వ్యవసాయ కూలీలు, రైతాంగం, మహిళలు, సమాజంలో అట్టడుగు వర్గాలవారూ పడుతున్న కష్టనష్టాలకు మూలాలు వెతికి వారిని క్రాంతి పథంలోకి నడిపిన మహనీయుడు జ్యోతీరావ్‌ ఫూలే. ఆయన ఆలోచనలు, కార్యపథం ఎవ్వరికైనా సర్వదా ఆచరణీయం. చెప్పింది ఆచరించి చూపి మార్గదర్శి అయ్యారాయన. సమాజంలో కులం, మతం, ఆర్ధిక స్థోమత ఆధారిత అజ్ఞానం, అణచివేత, ఆధిపత్య దోరణే సమాజంలో విలువలు దెబ్బతినడానికి కారణాలుగా ఫూలె గ్రహించారు. pule2
వాటిని వ్యతిరేకించి మనిషికి సహజంగా ఉన్న మానవ హక్కులను అణగారిన వర్గాలు తెలుసుకుని అనుభవించే వాతావరణం ఏర్పాటుకు ఫూలే అహోరాత్రులూ శ్రమించారు. సమాజంలో మతం, మూర్ఖత్వం, అజ్ఞానాంధకారంలో సమాజశ్రేయస్సునే నిర్లక్ష్యం చేసిన వారిపట్ల ధ్వజమెత్తారు. సమాజంలో అట్టడుగువర్గాలవారూ సంపూర్ణ స్వేచ్ఛాఫలాలు అందుకోవాలని, కొత్త సమాజం కోసం ఆయన కలలు కన్నారు. సమాజంలో అణగారిన వర్గాల ఐక్యత, అభివృద్ధి కోసం ఫూలె ఎంతో పాటుపడ్డారు.

బాలికలకు పాఠశాల...
pule3పూణేలో 1848లో బాలికలకు తొలి పాఠశాలను ఆయనే ప్రారంభించారు. అణగారిని వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ప్రభోదించారు. అంతేగాక ‘పూణె స్థానిక మహిళల పాఠశాలలు’, ‘మహార్‌, మాంగ్‌ల విద్యాభివృద్ధి సమాఖ్య’ పేర రెండు సంస్థలు నెలకొల్పారు. ఆ ఉద్యమంలో తన భార్యకు భాగస్వామ్యం కల్పించారు. బాలికల పాఠశాలలో ఫూలె తన భార్య సావిత్రిని టీచర్‌గా చేరాలని ఉత్సాహపరిచారు. కానీ సమాజంలో మతఛాందసులు, సంప్రదాయాలకు కట్టుబడినవారంతా సావిత్రిబాయి విద్యాబోధనను వ్యతిరేకించారు. ముఖ్యంగా ఆమె అణగారిన కులానికి చెందినదని, విద్యాబోధనకు అనర్హురాలని భారీ ఎత్తున వ్యతిరేకించారు. కానీ అందుకు ఏమాత్రం వెరవక ఫూలె, సావిత్రీబాయి తమ లక్ష్యసాధనలో మనస్పూర్తిగా కొనసాగారు. ఆ విధంగా దేశంలో మహిళలకు, బాలికలకు తొలి పాఠశాలను నెలకొల్పిన గొప్పవ్యక్తిగా ఫూలె కీర్తింపబడ్డారు. విద్యారంగంలో ఆయన సేవలను బ్రిటీష్‌ ప్రభుత్వం గుర్తించింది. 1852 నవంబర్‌ 16న ఆయన్ను ఘనంగా సత్కరించింది.

సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్‌ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు.

వితంతు వివాహాలు...
సమాజం అన్ని విధాలా ఎదగడానికి మహిళలు చదువుకోవాలన్న స్పూర్తిని కల్పించడంతోనే ఆగక వితంతు వివాహాలను కూడా ఆయన ప్రోత్సహించడం గమనార్హం. అంతేగాక బాలహత్య ప్రతిబంధక్‌ గృహ పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి వితంతువుల పిల్లలను హత్యచేసే కుసంస్కారాన్ని, మూర్ఖ ఆచారానికి స్వస్తి పలికారు. ఈ యావత్‌ కార్యక్రమాల్లోనూ ఆయనకు చేదోడువాదోడుగా ఆయన భార్య సావిత్రీబాయి, ఇతర మిత్రుల సహకారం ఎంతో గొప్పది.

పూణేలో 1848లో బాలికలకు తొలి పాఠశాలను ఫూలె ప్రారంభించారు. అణగారిన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ప్రభోదించారు. ‘పూణె స్థానిక మహిళల పాఠశాలలు’, ‘మహార్‌, మాంగ్‌ల విద్యాభివృద్ధి సమాఖ్య’ పేర రెండు సంస్థలను ఆయన నెలకొల్పారు.

సత్యశోధక్‌ సమాజ్‌...
విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఫూలె సంస్థలు అన్ని విధాలా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. ఆ లక్ష్యసాధనకు మరింత పట్టుగా 1873 సెప్టెంబర్‌ 24న ‘సత్యశోధక్‌ సమాజ్‌’ అనే మరో సంస్థను ఏర్పాటుచేశారు. సామాజిక, మత పరమైన అణచివేతను సంపూర్ణంగా అణచివేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కొన్ని సూత్రాలు రూపొందించింది. అవి.. దీక్షలు, సంప్రదాయాలపేర చేసే పనులు, పునర్జన్మ అనేవి సత్యదూరం. దేవునిసేవకు భట్‌లు(బ్రాహ్మలు) లేదా ఇతర మధ్యవర్తుల అవసరంలేదు. ఈ సమాజం అందించిన సందేశం యావత్‌ మహారాష్టన్రు కదిలించింది. అయితే సమాజంలో అనాదిగా వున్న అర్ధరహిత సంప్రదాయాలు, అగ్రవర్ణాల దాష్టికాలను అధిగమించి స్వేచ్ఛ పొందడానికి అణగారిని వర్గాలకు చెందిన ప్రతీ మహిళా విద్యావంతురాలు కావాలని ఆ సంస్థ ప్రచారం చేసింది.

జ్యోతీరావ్‌ 1827 ఏప్రిల్‌ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్‌ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్‌ కుమార్తె సావిత్రీబారుని ఫూలె పెళ్లి చేసుకున్నారు.

కుటుంబ నేపధ్యం....
 http://blog.insightyv.com/wp-content/uploads/2009/11/savitribai_phule.jpg
జ్యోతీరావ్‌ ఫూలే పూర్వీకులు సతారా జిల్లా ఖతావ్‌ తాలూకాలోని కాట్గున్‌ గ్రామస్తులు. ఇంటిపేరు గోర్ఖే. ఫూలే ముత్తాత కోండిబ గోర్ఖే గ్రామపెద్దగా ఉండేవారు. ఆయనకు మరో గ్రామపెద్ద కులకర్ణికీ మధ్య విభేదాలు తలెత్తడంతో కొట్లాటలు జరిగాయి. అందులో దురదృష్టవశాత్తూ కులకర్ణి హత్యకు గురయ్యాడు. హంతకుడనే అపవాదు నుంచీ తప్పించుకోవడానికి ఆయన పూణేలోని పురందర్‌ జిల్లా ఖానావాడి తాలూక కాల్గున్‌ గ్రామానికి వెళ్లి పోయారు. ఆ తర్వాత కొండిబా కుమారుడు షెతిబా అక్కడ కరువు కాటకాల కారణంగా పూణేకి మకాం మార్చాడు. దీంతో వారి ఇంటి పేరు ఫూలేగా మారింది. షతిబాకు ముగ్గురు కుమారులు.. రానోజి, కృష్ణాజీ, గోవింద్‌. గోవిందరావుకు చిమ్నాబాయ్‌ అనే ఆమెతో పెళ్లయింది. వారి కుమారుడే జ్యోతిరావ్‌. ఆయనే భారత దేశంలో మహోన్నతమైన సామాజిక విప్లవానికి నాంది వేసిన జ్యోతిరావ్‌ ఫూలె.

జీవిత చరిత్ర...

http://im.rediff.com/getahead/2011/sep/05teacher-savitribai-phule.jpg
జ్యోతీరావ్‌ 1827 ఏప్రిల్‌ 11వ తేదీన జన్మించారు. ఏడాది తిరక్కుండానే తల్లిని పోగొట్టుకున్నారు. 1834-38 మధ్య కాలంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1840లో సతారా జిల్లా నయాగోవ్‌ గ్రామానికి చెందిన ఖండోజీ నవషో పాటిల్‌ కుమార్తె సావిత్రీబాయిని ఫూలె పెళ్లి చేసుకున్నారు. పరిస్థితుల కారణంగా కొంతకాలం ఫూలె విద్యకు స్వస్తి పలకాల్సివచ్చింది. అయితే ఆయనలో విద్య పట్ల ఆసక్తిని గ్రహించిన మున్షీ గఫార్‌ బేగ్‌, లిజిత్‌ అనేవారు సలహా మేరకు ఆంగ్లంలో చదువును కొనసాగించారు. వారి సూచన మేరకే 1841లో ఆయన ఇంగ్లీష్‌ పాఠశాలలో చేరారు. అక్కడ చదువుతున్న రోజుల్లో పూలె ‘రైట్స్‌ ఆఫ్‌ మాన్‌’ అనే పుస్తకం చదివారు. దీన్ని థామస్‌ పెయిన్‌ రాశారు. సమాజంలో సంభవించే మార్పులు, చేర్పులపై ఎంతో అవగాహన ఏర్పడింది. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj-xF5osR5SqPC6oG2J6PrsjaG8yuwuJouu6PT9OZyQF70na-_gJr05PrI4IE3QvNhsEAp9F0uahG5IDes2lLul0BLQc886nPMdUGHI5xtXHch2lR0BO9tdSY_VVPb_w9Our6D73WXcooQE/s1600/phule.jpg
చదువు పూర్తిచేసుకున్న ఫూలె అందరిలా ఉద్యోగంలో చేరలేదు. తండ్రికి వ్యాపారంలో సహకరించారు. ఈ సమయంలోనే అంటే 1848లో ఆయన జీవితంలో ఓ గొప్ప సంఘటన చోటుచేసుకుంది. ఒకరోజు ఆయన తన స్నేహితుని ఇంట పెళ్లికి వెళ్లారు. అక్కడ అగ్రకులాలకు చెందినవారి హేళనతో మనస్తాపానికి గురయ్యారు. దీన్ని సామాజిక అసమానతగా ఖండించారు. దీన్ని అధిగమించడానికి ఈ తరహా దుష్టచర్యలకు సరైన మందూ విద్యమాత్రమే అని ఆయన గ్రహించారు. శూద్రలు, అతి శూద్రులనే అణగారిని వర్గాల స్వేచ్ఛా స్వాతంత్రాలకు, గౌరవమర్యాదలు కాపాడేందుకు విద్య ఒక్కటే సరైన ఆయుధమని, మార్గమని తెలుసుకున్నారు. సమాజంలో అజ్ఞానాన్ని, దారిద్య్రాన్ని తొలగించడానికి సమానత్వం నెలకొల్పడానికి కృషిచేయడం ప్రారంభించారు.

ఒక సామ్రాజ్య సంకేతం - టాటాగ్రూప్‌

టాటా కంపెనీ రూపశిల్పులు
జంషెడ్‌జీ టాటా
jamshedji 

భారతదేశంలో ఎంతో పేరున్న టాటా కంపెనీ ఇప్పటిది కాదు. 1868లో టాటా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ప్రారంభమైంది. అంటే 148 ఏళ్ల కిందట ప్రారంభమైంది. జంషెడ్‌జీ నస్సెర్‌వాన్‌జీ టాటా గ్రూప్‌ కంపెనీల వ్యవస్థాపకుడు. టాటా కంపెనీలకు ఆయన పితామహుడు. ఈరోజు టాటా ఇంతగా విస్తరించిందంటే అది ఆయన వేసిన పునాదివల్లే.

దోరాబ్జీ టాటా
dorabjitata1 

టాటా గ్రూప్‌లో ఈయన టాటా స్టీల్‌, టాటా పవర్‌ సంస్థలను ప్రారం భించారు. టాటా గ్రూప్‌లో ఇప్పటికీ ఈ రెండు కంపెనీలే కీలకంగా ఉన్నా యి. ఒకవంక కొత్త కంపెనీలను ప్రారంభించడమే కాక, మరోవైపు భారత విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -ఐఐఎస్‌సి) ప్రారంభానికి ఆయన నిధులిచ్చి సహకరించారు. బెంగళూరు వెలుపల నెలకొన్న మొదటి పరిశోధనా సంస్థ ఇది.

నౌరోజీ సక్లత్‌వాలా
past_chair_saklatvala 

టాటా కుటుంబంతో సం బంధంలేని బయటి వ్యక్తి నౌరోజీ. సైరస్‌కు టాటాలతో దూరపు చుట్టరికం ఉన్నా, నౌరోజీకి అది కూడా లేదు. టాటా కుటుంబంతో సం బంధం లేకుండా ఆ గ్రూప్‌ నకు ఛైర్మన్‌ అయిన ఘనత ఈయనది.

జహన్‌గీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ టాటా
jahangir-ratanji 

టాటా కంపెనీల విస్తరణకు ఈయన ఎంతో కృషి చేశారు. నేడు ఉన్న అనేక టాటా కంపెనీలకు ఆయన పునాదులు వేశారు. జెఆర్‌డి టాటాగా ఈయన ప్రసిద్ధిచెందారు. జెఆర్‌డి టాటా కంపెనీకి వచ్చేనాటికి ఆ గ్రూప్‌లో 14 సంస్థలే ఉండేవి. వాటిని 95 సంస్థలుగా విస్తరించిన ఘనత ఈయనకే దక్కుతుంది. జెఆర్‌డికి విమానయానమంటే మక్కువ. ఆ అభిరుచితో ఈయన టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని జాతీయం చేసి, ఎయిర్‌ ఇండియాగా మార్చింది. సర్‌ దోరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ఆయన ట్రస్టీగా ఉన్నప్పుడు టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టిఐఎఫ్‌ఆర్‌), టాటా మెమోరియల్‌ సెంటర్‌ ఫర్‌ కేన్సర్‌ రీసెర్చ్‌, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిఐఎస్‌ఎస్‌), నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ (ఎన్‌సిపిఏ)లను జెఆర్‌డి నెలకొల్పారు.

రతన్‌ టాటా
Ratan-Tataa 

టాటాకు ఉన్న వివిధ కంపెనీల బిజినెస్‌ను ఈయన విస్తరించారు. మొదట ఇండియాకే పరిమితమైన అనేక టాటా కంపెనీలను అంతర్జాతీయ స్థాయికి తెచ్చారు. అంతర్జాతీయ రంగంలో టాటాకు సముచిత స్థానాన్ని కల్పించారు. అంతర్జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కంపెనీలను తీర్చిదిద్దారు.

బాంబే హౌస్‌

bombay_house_tata 

టాటా గ్రూప్‌ ప్రధాన కేంద్రం బాంబే హౌస్‌. 87 ఏళ్ల నాటి బాంబే హౌస్‌ టాటా కార్పొరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌. గత ఇరవై ఏళ్లలో అంటే...రతన్‌ టాటా టాటా సామ్రాజ్యానికి అధిపతి అయ్యాక బాంబే హౌస్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. ఆయన బాంబే హౌస్‌లో మార్పులు చేయాల నుకున్నారు. చేశారు. అంతకుముందు జెఆర్‌డి టాటా హ యాం స్వర్ణయుగంగా భాసిందని చెప్పేవారు రతన్‌ వచ్చి చేసిన మార్పుల్ని జీర్ణించుకోలేకపోయారు.

ఆయన పగ్గాలు చేపట్టగానే, ప్రక్షాళన ప్రారంభించారు. అక్కడి పాత కాపులకు, వృద్ధతరానికి ఆయన ఉద్వాసన పలికారు. ఆ చర్య చాలామందికి నచ్చలేదు. ఆగ్రహం తెప్పించింది. నిన్నమొన్న వచ్చిన రతన్‌ ఈ మార్పులు ఎలా చేయగలరు? అంతకు ముందు జెఆర్‌డి హయాంలో ఇలాంటిది కనీవినీ ఎరగం’ అన్నారు. తనపై వచ్చిన విమ ర్శలకు రతన్‌ సమాధానం చెప్పకుండా ఉండడంతో ఆయ నపై అనుమానాలూ వచ్చాయి. ఎప్పటినుంచో ఉన్నవారిని తొలగించి విమర్శలకు గురైన రతన్‌ ఇండికా కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టడంతో మొదట కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినా, తర్వాత ప్రశంసలు పొందారు. అలాగే, నానో కారు కూడా బాంబే హౌస్‌ నుంచి వచ్చిందే. ఇది టాటా సంస్థకు మరింత పేరు తెచ్చిపెట్టింది. నానో కారు పూర్తిగా రతన్‌ టాటా ఆలోచనే అంటారు. ఇది సా మాన్య ప్రజల్లో మొదట్లో ఆసక్తిని రేకెత్తించింది. లక్ష ల్లోనే ఆర్డర్లు వచ్చాయి. కానీ, ప్రస్తుతం డిమాండ్‌ తగ్గింది. కార్ల ఉత్పత్తిరంగంలో టాటా సుస్థిరస్థానాన్ని సంపాదిం చడానికి రతన్‌టాటాయే కారణమనడంలో సందేహం లేదు.

టాటాకు యువకోణం
cyrus-pallonji 

రతన్‌జీ టాటా వారసుడిగా సైరస్‌ కొత్తగా రంగంమీద కనిపిస్తున్నా ఆయనకు టాటా ఆధిపత్యం కట్టబెట్టాలన్న ఆలోచన కొన్నేళ్ల కిందటే వచ్చింది. సమర్థులైన యువతరం వారికి టాటా సారథ్యాన్ని అందివ్వాలని రతన్‌ టాటా అనుకున్నారు. ఆ ఆలోచనతోనే టాటా కంపెనీల్లో యువకులకు ప్రాధాన్యత ఇచ్చారు. 42 ఏళ్ల ఆర్‌ ముకుందన్‌ను 2008లో టాటా కెమికల్స్‌కు సిఈఓను చేశారు. 2009లో ఎన్‌ చంద్రశేఖరన్‌ను టిసిఎస్‌కు సీఈఓగా నియమించారు. అప్పుడాయన వయసు 46. అలాగే 2008లో టాటా టెలీసర్వీసెస్‌కు సారథిగా నియమితులైనప్పుడు ముకుంద్‌ రాజన్‌ వయసు కేవలం 40 ఏళ్లు.

టాటా కమ్యునికేషన్స్‌లో ఉన్నత పదవిలో నియమితులయ్యేనాటికి ఎన్‌ శ్రీనాథ్‌ వయసు 45 సంవత్సరాలు. మరో చిత్రమైన ఉదాహరణ కూడా ఉంది. బ్రోతిన్‌ బెనర్జీ 35 ఏళ్ల వయసులోనే టాటా హౌసింగ్‌కు సీఈఓగా మూడే ళ్ల క్రితమే ఎంపికయ్యారు. టాటా కంపెనీల్లో ఉన్నత పదవులు చేపట్టే నాటికి వీరందరి వయసుల సగటును తీస్తే సైరస్‌ 43 ఏళ్ల వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. టాటా సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టే వారి సగటు వయ సు తగ్గించాలన్నది రతన్‌జీ ఉద్దేశం. దానిపై ఏమైనా సందే హాలుంటే అవి సైరస్‌ నియామకంతో తీరిపోయాయనే చెప్పాలి. ప్రస్తుతం టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్లో ఉన్న కొందరి వయసు 64 నుంచి 73 వరకు ఉంది.

మరి మిస్ర్తీ ఏమంటారు?
రతన్‌జీ మాదిరిగానే సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ కూడా ఆలోచి స్తారా? అన్న సందేహం కలగడం సహజం. టాటా కంపెనీల్లో ఉన్నత పదవుల్ని యువతకు కట్టబెట్టడంలో సైరస్‌ పాత్ర కూడా ఉందని ఆయనను టాటా సామ్రాజ్యానికి సారథిగా ఎంపిక చేసిన అయిదుగురి కమిటీలో ఒక సభ్యుడు తెలిపారు. టాటా కంపెనీ ల్లో యువరక్తాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన సైరస్‌కూడా ఉందని ఆయన అన్నారు. ఇతర కంపెనీల్లో సమర్థులైన వారిని తమ కంపెనీల సీఈఓలుగా, టాటా సన్స్‌ డైరెక్టర్ల బోర్డులో నియమిం చడం సాధారణంగా జరుగుతూ వస్తున్నదే. ‘యువనాయకత్వం సంస్థకు యవ్వనాన్నిస్తుంది.

కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు సారథ్యం వహించినప్పుడు యువకులకు ప్రాధాన్య మిచ్చారు. మిస్ర్తీ సారథ్యాన్ని స్వీకరించిన తర్వాత టాటా గ్రూప్‌లో కూడా అదే జరుగుతుంది. యువతకు ప్రాధాన్యమిస్తారు’ అని ఏబీసీ కన్సల్టెంట్‌ సీఈఓ శివ్‌ అగర్వాల్‌ అన్నారు.మిస్ర్తీకి టాటా గ్రూప్‌లో అత్యున్నత పదవినిచ్చి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారనవచ్చు. మిస్ర్తీకి కలిసొచ్చే మరొక అంశం ఏమిటంటే, ఇప్పటికే టాటాకు చెందిన అనేక సంస్థల్లో యువకులే కీలక పదవుల్లో ఉన్నారు కనుక, వారితో పని తీసుకోవడం సులభతరమవుతుంది.

వయసు మీరిన వారూ ఉన్నారు
యువకులకు ప్రాధాన్యం ఇస్తున్న మాట నిజమే అయినా, దీనికి వ్యతిరేకమైన మరో వాదం కూడా వినిపిస్తోంది. టాటా సన్స్‌ డైరెక్టర్లలో ఆయన మాత్రమే 50 ఏళ్ల లోపు వారనీ, మిగతా వారు కనీసం పదేళ్లు పెద్దవారనీ అంటున్నారు. గ్రూప్‌లో టాప్‌లో ఉన్న అయిదు కంపెనీ బోర్డుల్లో దాదాపు 50 మంది డైరెక్టర్లున్నారు. వారిలో 70 శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారే.

ఎవరీ సైరస్‌ ?
pallonji 

టాటా గ్రూప్‌ సంస్థలకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ పల్లోంజీ కుటుంబానికి చెందినవారు. 2012 డిసెంబర్‌లో రతన్‌ టాటా నుంచి అధికార పగ్గాలు స్వీకరిస్తారు. మిస్ర్తీ అంటే ఎవరో ఇప్పటివరకు..అంటే టాటా గ్రూప్‌నకు రతన్‌ వారసుడిగా ఎంపికయ్యే వరకు చాలా మందికి తెలీదు. పారిశ్రా మిక మహాసామ్రాజ్యం షాపూర్జీ పల్లోంజీ సంస్థ (ఎస్‌పి) అధిపతి షాపూర్జీ పల్లోంజీ కుమారుడు. షాపూర్జీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు షాపూర్‌, సైరస్‌. కుమార్తెలు లైలా, అలూ. ఫోర్బ్స్‌ మాగజైన్‌ అంచనా ప్రకారం షాపూర్‌జీకి 2011 నాటికి ఉన్న సంపద విలువ 8.8 బిలియన్‌ డాలర్లు అంటే రూ 45,760 కోట్లు. రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన సైరస్‌ 1968 జూలై 4న పుట్టారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజీ నుంచి బిఇ సివిల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యారు.

లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందారు. ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌లో ఫెలో.సైరస్‌ ఇదివరకు టాటా సన్స్‌, టాటా ఎల్‌క్సిసి (ఇండియా)కు డైరెక్టర్‌గా పనిచేశారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ, ఫోర్బ్స్‌ గోకక్‌, అఫ్‌కాన్స్‌ ఇన్‌ఫ్రా, యునైటెడ్‌ మోటార్స్‌ (ఇండియా)తో సహా అనేక కంపెనీలకు డైరెక్టర్‌గా పనిచేశారు.సైరస్‌ పల్లోంజీ మిస్ర్తీ 1991లోనే షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు. బుధవారం టాటా గ్రూప్‌నకు రతన్‌జీ టాటా వారసుడిగా ఎన్నికైన తర్వాత సైరస్‌ ఒక ప్రకటన చేస్తూ- తను టాటా సంస్థ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, చట్టబద్ధంగా షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

టాటా గ్రూప్‌తో అనుబంధం
పల్లోంజీ కుటుంబానికి టాటా సంస్థతో అనుబంధం బంధుత్వంతో ఏర్పడింది. షాపూర్‌జీ కుమార్తె అలూ రతన్‌ టాటాకు సోదరుడి వరసయిన నోయల్‌ టాటాను వివాహమాడింది. ఆ రకంగా టాటా సామ్రాజ్యంతో పల్లోంజీ కుటుంబానికి అనుబంధం ఏర్పడింది.

thetata

శోభాయమాన రచయిత్రి

dheera2 
ఆమె ఒక వివాదాస్పద రచయిత్రి. స్ర్తీ స్వేచ్ఛను పరిపూర్ణంగా కోరుకునే అభ్యుదయభావాలు కలిగిన నేటి మహిళ...స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి సంవత్సరమే పుట్టడం యాధృచ్ఛికమే  అయి నా...స్వాతంత్య్ర కాలానికి ముందునాటి స్ర్తీ ఎలాంటి బానిసత్వపు సంెకళ్లలో బతికిందో...ఇప్పుడు దానికి వ్యతిరేకంగా దేశంలోని స్ర్తీలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో...ఆధునికతను పుణికిపుచ్చుకోవాలనేది ఆమె ఆశయం. అందుేక తన కెరీర్‌ తొలినాళ్లలో మోడలింగ్‌ చేసింది. అందమైన ఆమె మోము...మోడలింగ్‌కు సరిగ్గా సరిపోతుంది. అయినా ఆమెలోని నిరంతర తపన...జర్నలిస్ట్‌గా ఎదగాలనే అకుంఠిత దీక్ష ఆమెను కుదురుగా ఒకే  చోట నిలబడనీయలేదు. http://www.topnews.in/files/Shobhaa-De.jpg
అందుకే  మోడలింగ్‌ను పక్కకు పెట్టేసింది. జర్నలిస్ట్‌గా కొత్త అవతారమెత్తింది...తొలిసారిగా దేశంలోనే సెలెబ్రిటీలమీద, బాలీవుడ్గ నటులమీద గాసిప్స్‌తో వ్యంగ్యంగా విమర్శించే ఒక మేగజైన్‌ను స్థాపించింది. ఒక మహిళగా ఆ రోజుల్లో ఇలాంటి గాసిప్‌ మేగజైన్‌ను నడిపించడానికి ఎన్ని గట్స్‌ ఉండాలి...వేటినీ లెక్కచేయని ఆమె వ్యక్తిత్వం...మరికొన్ని పత్రికలు స్థాపించేందుకు పురిగొల్పింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సామాజికాంశాలపై ప్రశంసాత్మక వ్యాసాలు రాసి బెస్ట్‌ అనిపించుకున్నారు. మోడల్‌, కాపీరైటర్‌,జర్నలిస్ట్‌, స్క్రిప్ట్‌రైటర్‌, నావలిస్ట్‌గా సుపరిచితురాలైన ఆమె పేరు శోభాడే...ధైర్యసాహసాలకు మారుపేరు అదే...http://www.masala.com/images/venues/souk_al_bahar/full/shobhaaitpimages_full.jpg

శోభాడే ఒక సంచలన రచయిత్రి. ఆరుపదుల వయసులోనూ...ఇప్పటికీ అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంటోంది. ఇండియన్‌ జాకా కొలీన్స్‌గా పిలువబడే శోభ అసలు పేరు శోభా రాజాధ్యక్ష...  మహారాష్టల్రోని ముంబాయిలో జనవరి 7, 1948 సంవత్సరంలో పుట్టింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శోభ ఆచార వ్యవహారాలలో ఇంట్లో చాలా కఠినంగా ఉండేవారు. అయినా ఆ రోజుల్లోనే ఆమె పట్టుబట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది. ముంబాయిలోని సెయింట్‌ జేవియర్‌ కాలేజీలో ఫిలాసఫీ ప్రధానాంశంగా తీసుకుని ఎంతో పట్టుదలతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసింది.

dheera4 
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో...ఇంకా మన దేశంలో స్ర్తీవిద్యపై పూర్తిగా ఎవరికీ అవగాహన లేదు. పైగా దేశాలలోని చట్టాలన్నీ కూడా పురుషులకే అనుకూలంగా ఉండేవి. స్ర్తీవిద్యకు ప్రాధాన్యం అంతగాలేని ఆ రోజుల్లో ఒక మహిళ డిగ్రీ వరకూ చదవడమే గొప్ప అంశంగా భావించేవారు. అయితే కాలేజీ రోజుల్లోనే శోభ చిన్నచిన్న అభ్యుదయ కవితలు రాసుకునేది. అందరిలో ఒకదానిలా కాకుండా ఒక్కరే అందరిలో అనిపించుకోవడం గొప్పగా భావించేది శోభ. http://www.lovingyourchild.com/wp-content/uploads/2010/04/shobhaa_de.jpg
జర్నలిస్ట్‌గా తొలి అడుగు...
వనితాభ్యుదయానికి నిరంతర శ్రామికురాలిగా పనిచేయాలంటే అందుకు తప్పక ఒక ఆయుధం ఉండాలని...అందుకోసం తన కెరీర్‌నే మలుపుతిప్పిన జర్నలిజంను వృత్తిగా మలచుకుంది. మొదట్లో కొన్ని దినపత్రిక, మేగజైన్‌లలో పనిచేసిన శోభ తనే సొంతంగా ఒక పత్రిక నెలకొల్పాలని అనుకుంది. అది సాదాసీదాగా ఉండకూడదు...అంతర్జాతీయస్థాయిలో మన్ననలు అందుకునేలా ఉండాలని భావించింది. అందుకే ఒక వివాదాస్పద పత్రికను నెలకొల్పింది. అదే స్టార్‌డస్ట్‌...తొలిసారిగా అందులో సినీతారల ప్రైవేట్‌ జీవితాలను బహిరంగం చేసింది. అనేక వివాదాలతో కూడిన ఆ పత్రిక తొలినాళ్లలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.
http://librarykvpattom.files.wordpress.com/2008/07/ldh1.jpg
మార్కెట్లో స్టార్‌డస్ట్‌ రాగానే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యేవి. విదేశాలలో కూడా ఈ పత్రిక అంటే క్రేజ్‌ ఏర్పడింది. అలా తను ఆరంభించిన స్టార్‌డస్ట్‌ మేగజైన్‌ అంతలా ప్రాచుర్యం పొందడంతో ఆమె మరో అడుగు ముందుకేసి సొసైటీ, సెలెబ్రిటీ అనే మేగజైన్స్‌ కూడా నెలకొల్పింది. ఇలా ఒకేసారి మూడు పత్రికల నిర్వహణ కష్టమయ్యేసరికి...ఆ తర్వాత ఆమె ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా మారి మార్కెట్లో ఉన్న వివిధ పత్రికలకే కాకుండా...అంతర్జాతీయ మేగజైన్స్‌కు కూడా ఆమె తన ప్రత్యేక వ్యాసాలను అందించేవారు. అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు మారుమోగిపోయింది.

స్క్రిప్ట్‌రైటర్‌గా...
dheera3 
శోభాడే స్క్రిప్ట్‌రైటర్‌గా కొన్ని టీవీ సీరియల్స్‌కు కూడా పనిచేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్వాభిమాన్‌ అనే సీరియల్‌కు స్క్రిప్ట్‌ వర్క్‌ చేశారు ఆమె. ఇప్పటికీ మహిళల సమస్యలపై విభిన్న కోణాలలో ఆలోచనలు చేస్తుంటారు. దిలీప్‌డేను తన రెండవ భర్తగా పెళ్లాడారు. శోభాడేకు ఆరుగురు పిల్లలు. ఒక పక్క ఇన్ని రచనలు చేస్తూనే ఇంటిపనులు కూడా బాధ్యతా యుతంగా నిర్వర్తించేవారు. భర్త దిలీప్‌ డే కూడా శోభకు అనుకూలమైన భర్త. ఆమె స్వేచ్ఛకు ఏనాడూ అతడు అడ్డురాలేదు. http://www.yahindnews.com/wp-content/uploads/2010/10/Shobha-de.jpg
తన ఎదుగుదలలో భర్త ప్రోత్సాహం మరువలేనిదని ఆమె అంటుంది. 1980 సంవత్సరంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో సండే మ్యాగజైన్‌ సెక్షన్‌ విజయవంతంగా నిర్వహించేది. ఆ పత్రికలో ముంబాయిలో తారల వ్యక్తిగత జీవితాలను ఎండగట్టేది. వారు ఎలాంటి తప్పు పనులు చేసినా శోభ వెంటనే తన కలానికి పదునుపెట్టేది. ప్రస్తుతం ఆమె స్వేచ్ఛాయుత జీవితానికి అనుగుణంగా తను వివిధ పత్రికలకు ఇప్పటికీ కాలమిస్ట్‌గా వ్యవహరిస్తోంది. http://www.dancewithshadows.com/politics/wp-content/uploads/2008/11/shobhaa-de.jpg
వివాదాలు...
శోభాడే స్త్రీల గురించి మాట్లాడుతూ మన దేశంలో మహిళలు సెక్స్‌ భావాలను మగవారు స్వేచ్ఛగా వ్యక్తీకరించినట్లుగా చెప్పలేకపోతున్నారు అని ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచేవారు. శృంగారం అనేది తప్పుకాదని అది కూడా ఒక కళ అని...అయితే కళారాధన పేరుతో శృతిమించరాదని ఆమె వాదన. ఆమె తన రచనలలో తరచుగా శృంగార భావనలను బాహాటంగానే వ్యక్తీకరించేవారు. అందుకే ఆమె కొంతమంది దృష్టిలో శృంగార నవలారాణి. అయితే ఈ విషయాన్ని మాత్రం శోభ ఖండిస్తారు. నవరసాలలో ఉన్న అన్ని అంశాలతోపాటు శృంగారం కూడా స్మృజించాల్సిన అంశమే అని ఆమె వాదిస్తారు. మూఢాచారాల మాటున స్ర్తీకి శృంగార స్వేచ్ఛ కల్పించకపోవడం కూడా ఒకరకంగా కట్టుబానిసత్వమే అంటారామె. అయితే ఈ విషయంలో మన దేశం ఇంకా అటువంటి స్థాయిలో లేదు కాబట్టి కొందరు స్ర్తీలు కూడా శోభాడేను ఆ రోజుల్లో తప్పుబట్టారు.
http://www.itimes.com/files/rsz/fit_s_180x230/files/06-2010/558630/29efe676a02a78c169a10adff2a22023_1275464316.jpg
మోడల్‌గా తొలిరోజుల్లో
dheera1 
శోభా తన కెరీర్‌ తొలిరోజుల్లో మోడలింగ్‌ చేసింది. వ్యాపార ప్రకటనలకు, కొన్ని సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆమె తనకీ వృత్తిలో తృప్తిలేదని భావించింది. పైగా గ్లామర్‌ ఫీల్డ్‌... కొంతకాలానికి మరొకరు...ఆ తర్వాతకాలానికి ఇంకొకరు...ఇలా వస్తునేవుంటారు. కేవలం రెండు లేక మూడు సంవత్సరాల కెరీర్‌ ఉండే ఫీల్డ్‌ అని భావించింది. ఏ రంగంలో ఉన్నా కూడా స్త్రీల సమస్యలపట్ల తీవ్రంగా ఆలోచించేది. పురుషులతో సమానంగా స్ర్తీలు కూడా ఉండాలని ఆమె అభిలాష.http://timesofindia.indiatimes.com/thumb.cms?photoid=4229678&width=415&resizemode=4http://images.indiaplaza.in/books/9788/1899/9788189917418.jpg

ఆమె రాసిన పుస్తకాలు
  • శోభా ఎట్‌ సిక్ట్సీ (2010)
  • సంధ్యాస్‌ సీక్రెట్‌ (2009)
  • సూపర్‌ స్టార్‌ ఇండియా-ఫ్రమ్‌ ఇంక్రెడిబుల్‌ టు అన్‌ స్టాపబల్‌
  • స్ట్రేంజ్‌ అబ్సెషన్‌
  • స్నాప్‌ షాట్స్‌
  • స్పౌస్‌-ది ట్రుత్‌ అబౌట్‌ మ్యారేజ్‌
  • స్పీడ్‌ పోస్ట్‌(1999)
  • సరెవైవింగ్‌ మెన్‌(1998)
  • సెలెక్టివ్‌ మెమోరి (1998)
  • సెకండ్‌ థాట్‌(1996)
  • స్మాల్‌ బిట్రేయల్‌ (1995)
  • షూటింగ్‌ ఫ్రమ్‌ హిప్‌ (1994)
  • అన్‌ సర్టెన్‌ లైజన్స్‌ (1993)
  • స్టారీ సిస్టర్స్‌ (1989)
  • సోషలైట్‌ ఈవ్‌నింగ్‌ (1989) 
  • http://im.rediff.com/getahead/2009/dec/04shobhaa.jpg

Friday, November 25, 2011

తెరచిన పుస్తకం ఆర్ .‌కె. నారాయణ్

ఆర్‌.కె. నారాయణ్‌గా సుప్రసిద్ధుడైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్‌ నారాయణస్వామి ప్రఖ్యాత భారతీయ రచయిత. ఆయన రచనలలో కాల్పనికత ఎక్కువగా కనిపిస్తుంది. ఒక కాల్పనిక పట్టణంలో ఉన్న మనుషూలు, వాళ్ల వ్యవహారాల గురించి ధారావాహిక నవలలు వ్రాసారు. ఆంగ్ల భాషలో భారతీయ సాహిత్యాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి నారాయణ్‌.

The-Financial-Expert-by-R.K 
భారత దేశానికి చెందిన ఆంగ్ల భాష నవల రచయితలలో అత్యుత్తమ గొప్పవారిలో ఒకరిగా అరుదయిన అఖండ కీర్తిప్రతిష్టలను అందుకున్నారు.తన గురువు మరియు మిత్రుడైన గ్రహంగ్రీన్‌ సహాయంతో నారాయణ్‌ వెలుగులోకి వచ్చారు. అయిన రాసిన మొదటి నాలుగు పుస్తకాలను ప్రచురించడానికి ప్రచురణకర్తలను ఒప్పించడంలో గ్రహంగ్రీన్‌ ముఖ్య పాత్ర పోషించారు. వీటిలో, స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ , ది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స. ది ఇంగ్లీష్‌ టీచర్‌ అనే మూడు సగం-స్వీయచరిత్ర పుస్త్త్తకాలు ఉన్నాయి. http://www.iloveindia.com/indian-heroes/pics/rk-narayan.jpg
1951 సంవత్సరపు అత్యుత్తమ అసలైన నవలగా పేరొందిన ది ఫైనాన్షియల్‌ ఎక్సెపర్ట్‌ మరియు సాహిత్య అకాడమీ పురస్కారం గెలిచిన ‘ది గైడ్‌’ నారాయణ్‌ నవలలలో ధీటుగా నిలిచింది. ‘ది గైడ్‌’ నవల హిందీ, ఆంగ్ల భాషలలో ...బ్రాడ్వేలో సినిమాగా కూడా తీయడం జరిగింది. 
http://piyushaggarwal.com/wp-content/uploads/2010/06/malgudi-days.jpg
నారాయణ్‌ వ్రాసిన కథలలో ఎక్కువగా మాల్గుడి అనే ఒక కల్పిత పట్టణములో జరుగుతాయి. మొదటిసారి ఈ పట్టణం స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవలలో పరిచయం చేయబడింది. అయిన కథలు సామాజిక సంబంధాలని ఎత్తి చూపి, రోజూవారి జరిగే యదార్ధ సంఘటనల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తాయి. నిజమనిపించే ఒక కల్పిత పట్టాణాన్ని సృష్టించి, దాని ద్వారా రోజువారీ సామాన్య జీవితములోని హాస్యం, శక్తిని బయటకు చూపి, తన రచనలో దయ, మానవత్వం చూపిన విల్లియం ఫాక్నేర్‌తో ఆయినని పోలుస్తారు.

rk_narayans 
అరవై ఏళ్ళకు పైబడిన రచయిత వృత్తిలో, నారాయణ్‌కు అనేక పురస్కారాలు, గౌరవాలు అందాయి. రాయల్‌ సొసైటీ అఫ్‌ లిటరేచర్‌ నుండి బెన్సన్‌ మెడల్‌ మరియు భారత దేశపు రెండవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ని నారాయణ్‌ అందుకున్నారు. అయిన కొంతకాలం రాజ్యసభ సభ్యునిగా కూడా నామినేట్‌ అయ్యారు.తొలినాళ్లలో...అర్‌.కే. నారాయణ్‌ అప్పటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ ప్రాంతంలో జన్మించారు. అయిన తండ్రి ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. నారాయణ్‌ తన విద్యాజీవితములో కొంత కాలం తండ్రి పాఠశాలలో గడిపారు. ఉద్యోగ రీత్యా అయిన తండ్రి తరచూ బదిలీ అవుతూ ఉండడంతో, నారాయణ్‌ తన బాల్యములో కొంత బాగాన్ని అమ్మమ్మ పార్వతి రక్షణలో పెరిగారు.

అదే సమయంలో, ఒక నెమలి, అల్లరి కోతి ఆయినకు ఆప్తమిత్రులుగా ఉండేవట. ఆయిన అమ్మమ్మ ఆయినకి కుంజప్ప అని ముద్దుపేరు పెట్టారు. అయిన కుటుంబీకుల మధ్య ఈ పేరు నిలిచిపోయింది. ఆమె నారాయణ్‌కు గణితం, పురాణాలు, భారతీయ శాస్ర్తీయ సంగీతం, సంస్కృతం నేర్పించారు. అయిన తమ్ముడు అర్‌.కే. లక్ష్మణ్‌ సుప్రసిద్ధ కార్టూనిస్టు. వాళ్ల ఇంట్లో అంతా సహజంగా ఆంగ్లంలోనే సంభాషించేవారు. నారాయణ్‌ అయిన తోబుట్టువులు ఏదైనా వ్యాకరణ తప్పులు చేస్తే, కుటుంబీకులు సహించే వారు కాదు. అమ్మమ్మతో ఉన్నప్పుడు నారాయణ్‌ పురసవాకంలోని లూథరన్‌ మిషన్‌ స్కూల్‌, సి.ఆర్‌.సి. హైస్కూల్‌, క్రిస్టియన్‌ కాలేజీ హై స్కూల్‌లలో విద్యాభ్యాసం చేశారు. నారాయణ్‌ చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు. చిన్నతనంలోనే అయిన డికెన్స్‌, వోడ్‌ హౌస్‌, ఆర్థర్‌ కోనన్‌ డోయల్‌, థామస్‌ హర్డి వ్రాసిన పుస్త్తకాలను చదివారు.

500 
12 సంవత్సరాల వయసులో నారాయణ్‌ ఒక స్వాతంత్ర పోరాట సభలో పాల్గొన్నారు. దాని పర్యావసానం మామయ్యతో తిట్లు తినాల్సివచ్చింది. వారి కుటుంబం రాజకీయానికి అతీతంగా ఉండేది అప్పట్లో. నారాయణన్‌ తండ్రికి మహారాజ కళాశాల ప్రాంగణంలో ఉన్న ఉన్నత పాఠశాలకు బదలీ కావటంతో ఆయన కుటుంబసమేతంగా మైసూరుకు మారారు. తండ్రి పాఠశాల ప్రాంగణంలోని గ్రంథాలయంలో పనిచేస్తుండటంతో ఆర్కేకు చిన్నతనం నుంచి పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం హాబీగా మారింది. చిన్నతనం నుంచే తన ఆలోచనలన్నీ కూడా ఒక కార్యాచరణ రూపంలో పెట్టేందుకు యత్నించేవారు.

చిన్న చిన్న కవితలు, వ్యాసాలు ఇంగ్లీష్‌లో రాసేవారు ఆర్కే. ఉన్నత పాఠశాల విద్య ముగించినాక, ఆర్కే విశ్వవిద్యాలయమునకు ప్రవేశ పరీక్ష వ్రాసి సఫలీకృతుడు కాలేక, ఇంటిలోనే చదువుకుంటూ, వ్రాసుకుంటూ ఒక సంవత్సరం గడిపి, పిమ్మట 1926 సంవత్సరములో పరీక్షలో సఫలీకృతుడయ్యారు. ఆ తర్వాత మైసూరు మహారాజ కళాశాలలో చేరారు. బ్యాచిలర్‌ పట్టా పొందడానికి నారాయణ్‌ నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు. ఇది మామూలుకంటే ఒక సంవత్సరము ఎక్కువ. కొంతకాలం అయిన ఒక పాఠశాల ఉపాధ్యాయుడుగా ఉద్యోగం చేసారు. అయితే ప్రధాన ఉపాధ్యాయుడు ఆయినని వ్యాయమ ఉపాధ్యాయుడు స్థానములో పని చేయమనగానే ఇక ఆ రంగంలో ఉండటం ఎంతమాత్రం ఇష్టంలేక ఉద్యోగాన్ని మానేశారు. తనకు తగిన వృత్తి రచయిత అని భావించి ఇంట్లోనే ఉండి నవలలు వ్రాయడం ప్రారంభించారు.

డెవెలప్‌మెంట్‌ అఫ్‌ మారిటైం లాస్‌ అఫ్‌ సెవంటీన్త్‌-సెంచురీ ఇంగ్లాండ్‌ అనే పుస్తక గ్రంథ పరిచయం ద్వారా ఆయన తొలిసారిగా రచయితగా పరిచయం కాబడ్డారు. తర్వాత అయిన ఆంగ్ల భాష వార్తాపత్రికలు, సంచికలకు స్థానిక కథలు అప్పుడప్పుడు వ్రాయడం ప్రారంభించారు.మొదటి సంవత్సరం అయిన సంపాదన తొమ్మిది రూపాయిల పన్నెండు అణాలు. రాయడం ద్వారా సంపాదన ఎక్కువ రానప్పటికీ ఆయినకి ఒక స్థిరమైన జీవితం ఏర్పడింది. కాకపోతే ఆయనకు అవసరాలు బాగా తక్కువగా ఉండేవి. అసాధరణమైన వృత్తిని అయిన ఎన్నుకున్నందుకు అయిన కుటుంబం, మిత్రులు ఆయినకు సహకరించి గౌరవించారు.
http://www.exoticindia.com/books/rk_narayans_malgudi_days_volume_hindi_dvd_video_icl083.jpg
1930లో నారాయణ్‌ తన మొదటి నవల స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ని వ్రాసారు. అనేక ప్రచురణకర్తలు ఆ నవలని తిరస్కరించారు. ఈ పుస్త్తకంలోనే నారాయణ్‌, దేశ సామాజిక వాతావరణాన్ని చూపించే మాల్గుడి అనే ఒక పట్టణాన్ని సృష్టించారు.

టర్నింగ్‌పాయింట్‌

1933లో కోయంబత్తూర్‌లో తన ప్రక్కనే నివసిస్తున్న రాజం అనే 15 సంవత్సరాల అమ్మాయిని కలిసి ఆమెతో ప్రేమలో పడ్డారు ఆర్కే. ఎట్టకేలకు ఆ అమ్మాయి తండ్రి ఆమోదం పొంది ఆమెని వివాహం చేసుకున్నారు. వివాహం పిమ్మట, నారాయణ్‌ ‘ది జస్టిస్‌’ అనే ఒక మద్రాస్‌ పత్రికకు విలేకరి అయ్యారు. అది బ్రాహ్మిణ్‌-కాని వారి ప్రయోజనాలు మీద శ్రద్ధ చూపిస్తున్న పత్రిక. వారి పక్షాన ఒక బ్రాహ్మణ్‌ అయ్యర్‌ ఉండడం ప్రచురణకర్తలకు ఉత్సాహం కలిగించింది. ఈ ఉద్యోగం ద్వారా అయిన రకరకాల జనాలు, వారి సమస్యలతో పరిచయం ఏర్పడింది. అంతకు ముందు ఆర్కే స్వామి అండ్‌ ఫ్రెండ్స్‌ నవల యొక్క వ్రాతప్రతిని ఆక్స్‌ఫర్డ్‌లోని ఒక మిత్రునికి పంపారు.
ఆ మిత్రుడు ఆ ప్రతిని గ్రహంగ్రీన్‌కు చూపించారు. గ్రీన్‌ ఆ పుస్త్తకాన్ని తన ప్రచురణకర్తకు సిఫార్సు చేస్తే, ఆ పుస్త్త్తకం చివరిగా 1935లో ప్రచురించబడింది. ఆంగ్లం మాట్లాడే ప్రేక్షకులకు సులువుగా ఉండే విధంగా పేరుని క్లుప్తం చేసుకోమని ఆర్కేకు గ్రీన్‌ సలహా ఇచ్చారు. ఆ పుస్తకం అర్ధ-స్వయచరిత్ర లాగ ఉండి, అయిన బాల్యం నుండి అనేక సంఘటనల ఆధారంగా వ్రాయబడింది. పుస్త్తకం గురించి మంచి విమర్శలు వచ్చినప్పటికీ, అమ్మకాలు మాత్రం తక్కువగానే ఉండేవి. ఆర్కే తర్వాత రాసిన నవలది బ్యాచిలర్‌ అఫ్‌ ఆర్ట్‌‌స (1937) కొంత వరకు అయిన కళాశాల అనుభవ స్ఫూర్తితో వ్రాయబడింది. ఒక తిరగబడే బాలుడు సర్దుకోగలిగిన... ఎదిగిన వ్యక్తిగాగా మార్పుచెందే పరిస్థితిని గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.