Friday, January 27, 2012

బాపూతత్త్వం - గాంధీవర్ధంతి సందర్భంగా నివాళి... * జనవరి 30 గాంధీజీ వర్ధంతి

చెరగని చిరునవ్వు. ప్రశాంతమైన ముఖం. మృదువైన మాటలు. వ్యక్తిత్వాన్ని స్వయంగా పెంపొందించుకోవడం. ఇవి ఆయనలోని ప్రత్యేక లక్షణాలు. అహింసనే ఆయుధంగా స్వీకరించాడు. సత్యవ్రతాన్ని జీర్ణించుకున్నాడు. పరుషవాక్కుకు దూరంగా ఉన్నాడు. సాత్వికాహారం తీసుకున్నాడు. ప్రకృతితో మమైకమై జీవనాన్ని సాగించాడు. ప్రజలతో సహజీవనం చేసి ‘నాయకుడు అంటే ఇలా ఉండాలి’ అని ఆచరణపూర్వకంగా చూపాడు. కోట్లాది భారతీయుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. తుదిశ్వాస విడుస్తూ ‘హేరామ్’ అని భగవద్ధ్యానం చేశాడు. 
గాంధీవర్ధంతి సందర్భంగా నివాళి...

‘గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాల్లో కుటీరపరిశ్రమలను, ఇతర చిన్నతరహా పరిశ్రమలను స్థాపించేలా ప్రోత్సహించాలి’... ఇది మహాత్ముని ఆశయం. భారీ పరిశ్రమల పట్ల తన వైముఖ్యాన్ని ప్రకటిస్తూ, రాజకీయ, ఆర్థిక వికేంద్రీకరణే గ్రామీణాభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.
http://harlemworldblog.files.wordpress.com/2010/09/mahatma_gandhi.jpg
భారతీయ సంస్కృతి ఏ ఒక్కరిదీ కాదు...
‘భారతీయ సంస్కృతి అందరి భావాల మిశ్రమం. ఇంట్లో అన్ని భాగాలలోకి వెలుగునిచ్చే సంస్కృతి నాది’ అన్నారు గాంధీజీ. ఆయనకు భారతీయ సంస్కృతి అంటే వల్లమాలిన అభిమానం. ఆయన సిద్ధాంతవేత్త కాదు. కాని నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి. 

http://wagingnonviolence.org/wp-content/uploads/2011/11/gandhi-and-crowd.jpg
ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఇంక తిరుగులేదు. అదే ఆయనను బలమైన శక్తిగా రూపొందించింది. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించినవారు సైతం ఆయనను జాతిపితగా కీర్తిస్తున్నారు. సామాన్యుడిగా జన్మించినప్పటికీ భారతావనికి జాతిపితగా కీర్తి పొందారు. స్వాతంత్య్ర సాధనకు ఆయన చేసిన సేవ ఒక ఎత్తయితే, మహాత్ముడిగా మానవాళికి అందించిన సేవలు మరో ఎత్తు.
http://www.kamat.com/mmgandhi/dandimarch.jpg
స్వయంగా ఎదిగినవాడు...
మహాత్ముడు తనకు తానుగానే ఎదిగిన మహోన్నత ప్రజానాయకుడు. ఆయనలో ఉన్న నైతికవర్తనే ఆయనను నేతను చేసింది. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమ’ని విర్రవీగిన ఆంగ్లేయులను... చేతిలో ఆయుధం లేకుండా, సత్యాగ్రహమనే ఆయుధంతో పారదోలిన వీరుడు.
http://www.nobelprize.org/nobel_prizes/peace/articles/gandhi/images/gandhi2.jpg
భిన్నత్వంలో ఏకత్వం...
సామాన్యుల్లో ఎంతో ప్రభావం చూపిన ఆయన ఆలోచనలు, ఆచరించిన విధానాలు ఈనాటికీ ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. తాను అనుసరించనిదేదీ ఇతరులకు చెప్పలేదు. సత్యం, అహింసల ప్రేరణతో దేశస్వాతంత్య్రం కోసం ఆయన చేసిన సహాయ నిరాకరణోద్యమం ప్రజలందరినీ ఒకచోటకు చేర్చి, జాతీయభావాన్ని పెంపొందించింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించారు. హింస, రక్తపాతం, మతకల్లోలాలకు వ్యతిరేకంగా ఆయన నిర్వర్తించిన పాత్రను ‘ఒన్‌మాన్ ఆర్మీ’ గా భారత తొలి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ అభివర్ణించారు. వేలాది సైనికులు చేయలేని శాంతిస్థాపనను ఆయన ‘ఒక్కరే’ సాధించారని కొనియాడా రు. అంతవరకు వారు చూసిన నేతలకు, గాంధీజీకి మధ్య ఉన్న తారతమ్యాన్ని గమనించారు.
http://www.aparnaonline.com/images/GANDHI.jpg
నెహ్రూ ప్రశంస...
జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’లో... ‘‘తాను చెప్పిన మాటల్నే ఆయన కొలబద్దగా తీసుకుని అనుసరించేవారు. తానెన్నుకున్న మార్గాన్ని అనుసరించడంలో అవరోధాలు కలిగినప్పుడు వాటిని అధిగమించేందుకు ప్రయత్నించేవారు. తన మాటలకు, మార్గానికి తానే ప్రారంభకుడు అయ్యేవారు. సత్యం, అహింసల నేపథ్యంలో నైతికవర్తనకున్న ప్రాముఖ్యతను, దానివలన అలవడే క్రమశిక్షణను గమనించారు’’ అని వివరించారు.


అందరికీ అనుసరణీయం...
ఒకరి మార్గం మరొకరికి అపమార్గంగా కనబడవచ్చు. ఒకరి విధానం ఇంకొకరికి అనుసరణీయం కాకపోవచ్చు. కానీ గాంధీజీ అనుసరించిన మార్గమే తమకు సమ్మతమని భారతీయులంతా భావించారు. ఆయన నెలకొల్పిన ఈ నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ ప్రపంచదేశాలను ఆకర్షిస్తున్నాయి.
http://www.totalbhakti.com/wallpaper/image/Mahatma-Gandhi-Jayanti-2421.jpg
జాతిభేదాలు వద్దు... మనిషిని మనిషిగా చూడు
ఒకసారి మాటల సందర్భంలో ‘మీరు స్వదేశీయులను ప్రేమించినంతగా విదేశీయులను ప్రేమించరు కదా!’ అని ఒక ఆంగ్లేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన, ‘నేను మనిషిని మనిషిగానే చూస్తాను. స్వదేశీయుడా? విదేశీయుడా? అన్నది ముఖ్యం కాదు. పొరుగువాడికి తోడ్పడమే మానవసేవ’ అని చెప్పారు. 

http://www.ruraluniv.ac.in/Gandhi%20with%20Jinnah.JPG
http://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpg http://upload.wikimedia.org/wikipedia/commons/9/94/Jinnah_Gandhi.jpg
ఈ సందర్భంలోనూ ఆ వ్యక్తి, ‘ముస్లింలీగ్‌కు ఎందుకు తోడ్పడం లేదు’ అని మరో ప్రశ్న వేశాడు. ‘సహకరించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. అయితే, నా మార్గంలో లేనివారిపై నా సేవలను రుద్దలేను’ అని జవాబిచ్చారు.http://3ifactory.files.wordpress.com/2010/02/gandhi-walking_out_for_lunch_2.jpg
దేవాలయాలలోకి...
హరిజనుల దేవాలయ ప్రవేశానికి సంబంధించి ఆయన, ‘ఒకసారి వారిని దేవాలయంలో ప్రవేశించడానికి అనుమతించిన తరువాత వాళ్లు లోపలికి వస్తారా? రారా? అనేది సమస్య కాదు. దేవాలయ ప్రవేశానికి తమకు హక్కు ఉందని హరిజనులు వాదించే ప్రశ్నా కాదు. వారికి కూడా దేవాలయ ప్రవేశార్హత ఉందని భావించడం ప్రతి ఒక్కరి బాధ్యత’ అన్నారు.
http://geekiest.net/image.axd?picture=image_399.png
ఆయన చెప్పిన ప్రతి మాటలోనూ సత్యాహింసలు ఉంటాయి. ఆ రెండూ జీవితాంతం ఆయనతో అంటిపెట్టుకునే ఉన్నాయి. స్వాతంత్య్ర సముపార్జనలో ప్రజలశక్తి ఆయనే. ప్రజల విశ్వాసం ఆయన పట్లే. జనానికి దూరంగా ఆయన ఏనాడూ లేరు. ‘నేత అనేవాడు జనంతోనే మమైకమైపోవాలి. వారితో కలిసే పనిచేయాలి. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి. వారి ఇష్టాయిష్టాల్ని తెలుసుకోవాలి’ అని ఆచరించి చూపించారు. నిజమైన నేతగా విశ్వాసం పొందాలంటే ఇంతకంటే కావలసినదేముంటుంది? నిరుపేద కూడా ‘ఇది నా దేశం’ అని భావించే భారతదేశం కోసం పాటుపడతాను, పేదలకు ఆహారం రూపంలో పరమాత్ముడిని అందించాలి... అని ఆలోచించిన గాంధీజీని స్మరించుకోవడం భారతీయుల ధర్మం.
గాంధీజీ సూచించిన ఏడు విసర్జనీయ సూత్రాలు
 నేటికీ అనుసరించదగినవి.
 







 - విడిచిపెట్టవలసినవి...
* సోమరితనం, 
* ఇతరులకు నచ్చని విధంగా నడుచుకోవడం,
* వ్యక్తిత్వం లేని జ్ఞానం, 
* నైతికత లేని వ్యాపారం, 
* మానవత్వం లేని విజ్ఞానం, 
* త్యాగంలేని మతం, 
* సిద్ధాంతం లేని రాజకీయం.

వీటిని తప్పనిసరిగా విసర్జించాలని చెప్పారు. అంతేకాక వీటిని అనుసరిస్తే దేశానికి, సమాజానికి వాటిల్లే నష్టాలను కూడా తెలియజెప్పారు.

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjFphrw3P37aa515ZTD9x1M1VYpv_CWxhzHOzNHgcvIy4e4ppSmvFWi74ktmLnT12RFnBO-mafpZcbmw3YLImfVBC9wXOQVlLqdGEylZrRVJyM0aPzsKhv31XtIDTAlfGwjXu4MqXMpjho/s1600/3378454931_ded4cfdee5.jpg
మాటలో శక్తి...
సహాయ నిరాకరణ ప్రారంభించినప్పుడు... ఒకచోట ప్రజలు పోలీసు స్టేషన్ తగులబెట్టి హింసకు పాల్పడ్డారని తెలిసి, మొత్తం ఉద్యమాన్నే నిలిపివేశారు. అంత ఆగ్రహంలో ఉన్న ప్రజలు కూడా ఆయన మాటను శిరసావహించి ఉద్యమానికి విరామం ప్రకటించారంటే గాంధీజీ మాటల్లో దాగి ఉన్న శక్తి ఎంతటిదో అర్థమవుతుంది.

కలలుగన్న భారతం
‘నా ఆకాంక్ష ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాలు లేని దేశం. అంటరానితనం, మద్యపానం, మాదకద్రవ్యాలు లేని విధంగా నాదేశం రూపుదిద్దుకోవాలి. పురుషుల్లాగే మహిళలు కూడా సమానహక్కులు అనుభవించగలగాలి.’ ఇదీ మహాత్ముడు కలలుగన్న భారతదేశం.

 http://s1.hubimg.com/u/1351200_f520.jpg
- తాడేపల్లి శివరామకృష్ణారావు

Thursday, January 26, 2012

క్షమించడు.. సహించడు

  http://topnews.in/law/files/rahul_gandhi.jpg
రాహుల్ గురించి మీకేం తెలుసు? రాజీవ్, సోనియాల కుమారుడు. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసుడు. "ఎక్కడో విదేశాల్లో చదువుకొచ్చాడు, ఇప్పుడు కాంగ్రెస్ నేతగా యూపీలో ప్రచారం చేస్తున్నాడు.. అంతకన్నా ఏం తెలియదు..'' అంటున్నారా...













అయితే మీరు తాజాగా విడుదలయిన 'రాహుల్' పుస్తకాన్ని చదవాల్సిందే. రాహుల్ గురించి చాలా మందికి తెలియని అనేక విషయాలు, విశేషాలు దీనిలో ఉన్నాయి. వాటిలో నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాలు ......

 









అమెరికాలోని ట్రినిటీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత రాహుల్ వెంటనే భారత్‌కు రాలేదు. లండన్‌లోని మానిటర్ గ్రూప్‌లో ఉద్యోగంలో చేరాడు. తమ బ్రాండ్‌లకు సంబంధించిన వ్యవహారాలలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో కంపెనీలకు మానిటర్ గ్రూప్ సలహాలు ఇస్తుంది. ఈ గ్రూపులో రాహుల్ మూడేళ్లు పనిచేశాడు. ఆ సమయంలో రాహుల్ తన పేరు మార్చుకున్నాడు. ఎవరికీ తాను ఇందిరాగాంధీ మనవడినని గాని రాజీవ్ కొడుకునని గాని తెలియనివ్వలేదు. ఒక విధంగా ఇది సాహసమనే చెప్పాలి. "అమెరికాలో చదువు పూర్తి అయిపోయిన తర్వాత లండన్‌లో సాధారణమైన జీవితాన్ని గడిపాను. ఆ సమయంలో నాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఒక విధంగా ఇది పెద్ద రిస్క్ అనే చెప్పాలి'' అని రాహుల్ ఆ తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 
http://blogs.independent.co.uk/wp-content/uploads/2010/11/Rahul-Gandhi.jpg
ఒకప్పుడు రాజీవ్ కూడా రాహుల్ మాదిరిగానే సాధారణమైన జీవితాన్ని గడపాలని కోరుకొనేవాడు. ప్రధాని అయిన తర్వాత కుదరలేదు కాని రాజీవ్‌కు విమానాలు నడపటం అంటే ప్రాణం. ఇది కూడా ప్రధాని అయిన తర్వాత సాధ్యమయ్యేది కాదు. అందుకే- "కొన్ని సార్లు నేను ఒంటరిగా కాక్‌పిట్‌లోకి వెళ్లి కూర్చుంటాను. నేను ఎగరలేనని నాకు తెలుసు. కాని బయట ప్రపంచానికి దూరంగా ఉన్నాననే భావన నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది'' అని రాజీవ్ ఒక సందర్భంలో పేర్కొన్నారు.http://pakteahouse.files.wordpress.com/2009/05/rahul-gandhi.jpg
కంపెనీ డైరెక్టర్‌గా..
ఒక వైపు రాహుల్ ఇంగ్లాండ్‌లో సాధారణమైన జీవితాన్ని గడపటానికి ప్రయత్నిస్తున్నప్పుడే భారత్‌లో సోనియా రాజకీయాలలోకి ప్రవేశించింది. ఆమెకు ప్రియాంక తోడుగా ఉండేది. రాహుల్ అప్పటికే దేశాన్ని వదలివెళ్లి పదేళ్లు అయిపోయింది. 
http://www.mobileapples.com/Assets/Content/Wallpapers/Rahul_gandhi_and_soniya.jpg http://www.pkp.in/images2/Priyanka%20Gandhi%20kids.jpg
సోనియా రాజకీయాలలో నిలదొక్కుకోవటం మొదలుపెట్టింది. రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో 2002లో రాహుల్ భారత్‌కు తిరిగి వచ్చాడు.http://jharkhandmirror.files.wordpress.com/2009/08/rahul1.jpg?w=298
ఇదే సమయంలో మన దేశంలో టెక్నాలజీ బూమ్ వచ్చింది. లక్షల మంది ఐటీ రంగంలోకి ప్రవేశించటం మొదలుపెట్టారు. భారత్‌కు తిరిగి వచ్చిన రాహుల్ మరి కొందరు స్నేహితులతో కలిసి ముంబాయిలో బ్యాక్ఆప్స్ (ఆపరేషన్స్) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కంపెనీని స్థాపించాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు సలహాలు ఇవ్వటం ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం.

దీనిలో రాహుల్‌తో పాటుగా మనోజ్ మట్టు (రాహుల్‌కు చిన్ననాటి మిత్రుడు), అనిల్ ఠాకూర్ (మాజీ కేంద్ర మంత్రి రామేశ్వర్ ఠాకూర్ కుమారుడు), రన్వీర్ సిన్హా (రాహుల్ మిత్రుడు) డైరెక్టర్లుగా ఉండేవారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు రాహుల్ సమర్పించిన అఫిడవిట్‌లో తనకు బ్యాక్ఆప్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 83 శాతం వాటా ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల ముందు రాహుల్ ఈ కంపెనీలో డైరెక్టర్ పదవికి రాజీనామా చేశాడు.
http://satyameva-jayate.org/wp-content/uploads/2010/11/Rahul-Gandhi-Congress.jpg
అయితే రాజకీయాలలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించటం వల్ల ఈ బిజినెస్‌ను నడపటానికి రాహుల్‌కు సమయం లేదని ఆయన సన్నిహిత వర్గాలు ఆ సమయంలో పేర్కొన్నాయి.''
Rahul gandhi

పట్టువీడని తత్వం..
"రాహుల్ ఏ విషయానీ మర్చిపోడు.తప్పు జరిగితే ఎవరినీ క్షమించడు.'' 
http://mangalorean.com/images/newstemp17/20080329rahul6.jpg
 ఈ విషయాన్ని కొందరు జర్నలిస్టులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. 2009, జనవరి 22వ తేదీన ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో ఒక వర్క్‌షాప్ జరిగింది. దీనిలో రాహుల్ ఒక ప్రజంటేషన్ ఇచ్చాడు. మధ్యాహ్నం అందరితో కలిసి లంచ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆ ప్రజంటేషన్‌కు సంబంధించిన కాగితాలు కనిపించలేదు. ఈ వర్క్‌షాప్‌ను చిత్రీకరించటానికి వచ్చిన కొందరు ఛానెల్ రిపోర్టర్లు ఆ కాగితాలను రాహుల్‌కు చెప్పకుండా తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాల్సిందేనని రాహుల్ పట్టుపట్టాడు. http://www.publictrustofindia.com/wp-content/uploads/2011/07/r2.jpg
పోయినవి ప్రజంటేషన్ కాగితాలే కాబట్టి పట్టించుకోవద్దని అక్కడున్న నేతలు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. కాని రాహుల్ తన పట్టు వీడలేదు. దీనితో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు హిబీ ఇడెన్ పార్లమెంట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పుడు పోలీసులు మూడు ఛానెల్స్‌కు సంబంధించిన రిపోర్టర్లను పిలిచి విచారించారు. పోలీసు రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది నేతలు - ఆ ప్రజంటేషన్‌లో రహస్యాలు ఏమీ లేవు కాబట్టి రిపోర్టును వెనక్కి తీసుకుందామని రాహుల్‌కు నచ్చచెప్పటానికి ప్రయత్నించారు. 
http://indiacurrentaffairs.org/wp-content/uploads/2011/07/Rahul-Gandhi%E2%80%99s-Thesis-On-Terrorism.jpg
కాని రాహుల్ అంగీకరించలేదు. తనకు చెప్పకుండా కాగితాలు తీసుకోవటం కూడా దొంగతనం కిందకే వస్తుందని వాదించాడు.http://newsleaks.in/wp-content/uploads/2011/04/M_Id_63449_Rahul_Gandhi.jpg
 పుస్తకం పేరు: రాహుల్
రచయితలు: జితిన్ గాంధీ, వీను సంధు
http://4.bp.blogspot.com/-I9MwcXJthxI/TjJhJGA1rAI/AAAAAAAABck/c4oIWIhLLZ8/s1600/rahul+indira+gandhi.jpg
ప్రచురణకర్త: వైకింగ్, ధర: రూ. 499

Friday, January 20, 2012

లేడీ ఆఫ్‌ లెన్స్‌ - Homai Vyarawalla

 http://www.thehindu.com/multimedia/dynamic/00640/29SMHOMAI3_640893f.jpg

 

1947 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్‌లో తొలిసారి భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడు ఆమె అక్కడుంది. ఆమె స్వతంత్ర భారత చిత్రాన్ని ఒక దేశంగా చిత్రీకరించింది. . ఆమె తన ఫొటోగ్రఫీలో భారతదేశ అసలు రంగులను బ్లాక్‌ అండ్గ వైట్‌లో అందించారు. అప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని ఆమె తన ెకమెరా కళ్లతో చూశారు. వారసత్వంగా వాటిని భారతదేశానికి అందించారు. 
హోమి  వ్యరవల్ల  ( Homai Vyarawalla )  మనదేశానికి చెందిన తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా చరిత్ర సృష్టించారు. 

http://www.indianetzone.com/photos_gallery/10/Homai-Vyarawalla_2162.jpg
http://www.thehindu.com/multimedia/dynamic/00628/Bangalore_CITY_Page_628623e.jpg
 http://static.dnaindia.com/images/cache/1637909.jpg
ప్రొఫైల్‌
పూర్తి పేరు : Homai Vyarawalla
పుట్టిన తేది: 1913 డిసెంబర్‌ 13
జన్మస్థలం : నవ్‌సారి, గుజరాత్‌
భర్త : మాణిక్‌షా వైరావల్లా
సంతానం :ఫారుఖ్‌
వృత్తి :ఫోటో జర్నలిస్ట్‌

http://www.hindustantimes.com/Images/2011/4/6d14c51b-c505-4c7a-9853-623d11892850MediumRes.JPG
President Pratibha Patil presents the Padma Vibhushan award to first woman photojournalist Homai Vyarawalla during a function at the Rashtrapati Bhavan in New Delhi.

తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్‌http://26.media.tumblr.com/tumblr_lxuf4kUBtW1qgxsx4o1_500.jpghttp://farm2.static.flickr.com/1074/5098501900_3d738b4cf9.jpg
A photo by Homai at the wedding of M.K Natarajan, her only surviving colleague
 Homai is the second woman to the right of the groom
 http://api.ning.com/files/bWHzqflReDtNpNlEZdhXwVjR9nSpUfWqow-HhkRN8hlaluo3HVtZO9yLg5yp8a1phmVcQbeC9MSfP-rI91yHoPtc75Vpx8Io/JawaharlalNehruDelhi1955.jpg
http://s.wsj.net/public/resources/images/OB-QX004_iparti_E_20111207025648.jpg
హోమై ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను 1930లో ప్రారంభించారు. తరువాత జాతీయ వ్యాప్తంగా మంచి ఫోటో జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1942లో ఆమె తన కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు.తరువాత ఢిల్లీకి మారారు. ముప్పయ్ సంవత్సరాల పాటు ఢిల్లీలోనే ఉంటూ ఆమె అనేక మంది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకుల చిత్రాలను క్లిక్‌మని పించారు. 
 Jawaharlal Nehru during an informal botany class with his grandsons, Rajiv and Sanjay Ghandi. 1950
Silver gelatine print
 http://www.tribuneindia.com/2006/20060319/spectrum/lead7.jpg
 A rare photograph by Homai of Feroze Gandhi with Indira at a political rally
 
మహాత్మా గాంధీ, జవహార్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, నెహ్రూ - గాంధీ కుటుంబం చిత్రాలను తీశారు.
http://www.thehindu.com/multimedia/dynamic/00169/20DFR_HOMAI_169801e.jpg
Jawaharlal Nehru meeting his sister Vijaya Lakshmi Pandit. Photo: Homai Vyarawalla.




http://deshgujarat.com/wp-content/uploads/2012/01/Nehru.gif

ఆణిముత్యాలు..ఆమె చిత్రాలుhttp://www.fravahr.org/IMG/jpg/HomaiVyarawalla_s-2.jpg 
Homai Vyarawalla at a photo session with Indira Gandhi
 
హోమై క్లిక్‌ మనిపించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను 2010లో కొత్త ఢిల్లీలోని ‘నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌’లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అల్కాజీ ఫౌండేషన్‌ సహకరించింది. హోమై తన కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి ఎన్నో ఫోటోలను తీసింది. జవహార్‌లాల్‌ నెహ్రూ ఫోటోలను తీయడం అంటే ఆమె చాలా ఇష్టమని ఒక సందర్భంలో తెలిపారు. అందుకే ఇతర ఏ ఫోటోగ్రాఫర్‌ తీయలేని నెహ్రూ చిత్రాలను ఆమె తీసింది. నెహ్రూ సిగరెట్‌ తాగుతూ, ఆకాశంలో శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ, ఫోటోగ్రఫీ అను మతి లేదు అనే బోర్డు పక్కన నెహ్రూ ఉన్న సమయంలో ఇలా ఎన్నో చిత్రాలను తీసింది హోమై.

మహాత్ముడి చిత్రాలు
 http://www.asianartnewspaper.com/files/imagecache/large/files/W3DX%20Image%2016%20Gandhi.jpg
మహత్మా గాంధీ చిత్రాలను భావితరాలకు అందించడంలో హోమై కీలమైన పాత్ర పోషించారు. మహాత్ముడు రైలు దిగుతుండగా, జనంలో నడుస్తుండగా వంటి అనేక ఫోటోలను తీశారు హోమై. అంతేకాకుండా నాటి ఆమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడి భార్య జాకీ కెన్నడి భారతదేశా నికి విచ్చేసినప్పుడు నెహ్రూ స్వయంగా ఆమెకు తిలకం పెట్టి స్వాగతం పలికే చిత్రం, జాకీ కెన్నడి ఇందిరా గాంధీలో సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భం, దలైలామా వంటి ప్రముఖులు చిత్రాలను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీశారు. ఇంకా అనేక చారిత్రాత్మక ఘట్టాలను చిత్రరూపంలో సజీవంగా ఉంచారు.
కళలపై ఆసక్తి
 http://zoroastriansnet.files.wordpress.com/2011/02/mrs-kennedy-nehru0001.jpg
హోహై 1913 డిసెంబర్‌ 9న గుజరాత్‌లోని నవసారిలో జన్మించారు. ఆమె ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. సర్‌.జె.జె. ఆర్ట్స్ స్కూల్‌ నుంచి ఆర్ట్స్ లో ప్రావీణ్యం గడించారు. హోమైకు చిన్న నాటి నుంచే కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రతి విష యాన్ని ఆమె కళాత్మకమైన దృష్టితో చూసేవారు. ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేకత ఉంటుందని దాన్ని చూసే కళ్ళపై దాని విలువ ఆదారపడి ఉంటుందని ఆమె నమ్మే వారు.ఆమె గాంధీయిజమ్‌ పై అపారమైన నమ్మకాన్ని ఉంచే వారు. అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పే ప్రతి మాట ఆమెను ప్రభావితం చేసింది. ఆమె తన జీవితాన్ని సాధారణంగా, ఆడంబరాలకు దూరంగా గడిపారంటే ఆమెపై ఆ మహాత్ముడి ప్రభావం ఎలా ఉందో గమనించవచ్చు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6txRLgbKP69dKwajnhpP8If-vF3D1wP9QpxiInGoqgaOf8LhezpnaQ78RR4C3cyYMgiXvzpSA9ilL4ApTTp5llwuKS3BVJ9HdBn1IAPZhz5QfiaRb9qmpPnUZ1qXSYXtfm7rWqKtDGOI/s400/pandit_nehru_photography_strictly_prohibitedy_Homai+Vyarawalla.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEidOkaE_nM9qefQeL4FTl2FKeUtSs2_9JHYjjRVP3WBPZ5iNQAt5u2I3m_NGx1fZSkhEUb9d1aSGFZ0E4Osg1CZ8m2FQZNdYObDWPyfaxjGvVN3hVrNYsptMoEFTJ5rhKV56NLrAEZ0mxk/s400/Jacqueline+Kennedy_pandit_nehru.jpg
Jawaharlal Nehru greets American first lady Jacqueline Kennedy

బ్లాక్‌ &  వైట్‌ 
గత కాలాన్ని చాలా మంది బ్లాక్‌ అండ్‌ వైట్‌గానే ఊహించుకుంటారు. ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కోటి రంగుల జ్ఞాపకాలను ఆవిష్ర్కతం చేశారు హోమై. ఆమె తన చిత్రాలను ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే తీసేవారు. ‘ రెండురంగులతో ఎన్నో భావాలను పలికించడం నాకిష్టం. నాకు ఫోటోగ్రఫీ అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ మాత్రమే’ అని ఒక సందర్భంలో ఆమె తెలిపారు. ఆమె సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్‌’తో సత్కరించింది. ఆమె ఇటీవలే ఊపితిత్తుల సంబంధిత వ్యాధితో ఇటీవలే కన్నుమూశారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’అనే మ్యాగజైన్‌కు పని చేయడం ప్రారంభించారు.1970 వరకూ ఆమె అందులోనే పని చేశారు. ఆ మధ్య కాలంలో ఆమె అనేక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను తీసి ముద్రణకు ఇచ్చారు. అవి మంచి గుర్తింపును సాధించాయి.1973లో ఆమె తన భర్తను కోల్పోయింది. దాంతో ఆమె వడోదరకు మకాం మార్చింది.