Thursday, May 19, 2011

మెరుపు తగ్గినందుకే '' ఎరుపు '' ఓటమి

 http://www.currentnewsindia.com/wp-content/uploads/2011/04/cpm-logo_1.jpg
బెంగాల్ అంటే భారతదేశపు తూర్పువాకిలి మాత్రమే కాదు మార్పువాకిలి కూడా. ఇంగ్లీషువాడు అడుగుపెట్టి తొలిరాజ్యం స్థాపించుకున్నది ఇక్కడే. సాంస్కృతిక పునరుజ్జీవనమని పిలిచే పడమటిగాడ్పు సుడులు తిరిగింది ఇక్కడే. రాజారామమోహన్‌రాయ్, ఈశ్వర్‌చంద్రవిద్యాసాగర్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, సరోజినీదేవి,హరీంద్రనాథ్ చటోపాధ్యాయ, జగదీశ్‌చంద్రబోసు, సత్యజిత్‌రే, అమర్త్యసేన్.. చెప్పుకుంటూ పోతే జాతి గర్వించదగ్గ మేధావులు ప్రతిభావంతులు ధీరులు వీరులు వందల వేల సంఖ్యలో కనిపిస్తారు. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తుందో దేశం రేపు అదే ఆలోచిస్తుందట. బెంగాల్ ఆకాశం ఎరుపెక్కినప్పుడు, ప్రపంచం దానివైపు ఆసక్తిగా చూసింది. జనం రైటర్స్ బిల్డింగ్ గర్భగుడిలో ఎర్రదేవుడిని ప్రతిష్ఠించినప్పుడు దేశమంతటా ఆ జైత్రయాత్ర కొనసాగుతుందనిపించింది. http://westbengalelections2011.com/wp-content/uploads/2011/02/Election-in-West-Bengal-Assembly-Election-in-West-Bengal.jpg
చిట్టగాంగ్ వీరుల దగ్గరనుంచి చారుమజుందార్ దాకా బెంగాల్ ప్రజావిప్లవాలకు వేదికగానే ఉండింది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన తెభాగా రైతాంగ ఉద్యమం కానీ, స్వాతంత్య్రానంతరం రెండుసార్లు చెలరేగిన ఆహారభద్రతా ఉద్యమాలు కానీ బెంగాలీ ప్రజానీకాన్ని సమరశీలంగా మలిచాయి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి, చీలిక తరువాత అతివాద పక్షంగా ఉండిన మార్క్సిస్టు పార్టీకి, మరో చీలిక అనంతరం నక్సలైట్ పార్టీలకు బెంగాల్ వేదిక అయింది.

1967 నుంచే అధికారంలో భాగస్వామ్యం సాధించుకోగలిగిన మార్క్సిస్టు పార్టీ, ఎమర్జెన్సీ చీకటిరోజుల అనంతరం, 1977లో సహవామపక్షాలతో కలసి రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచే స్థాయికి ఎదిగింది. అధికారంలోకి రాగానే భూసంస్కరణల అమలును చేపట్టింది. మిగులు భూములను పంచడం, కౌలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించడం లక్ష్యాలుగా తొలిదఫా జ్యోతిబసు ప్రభుత్వం పనిచేసింది. ఫలితంగా, రాష్ట్రంలో పార్టీకి గట్టిపునాదులు వేయగలిగింది. అన్ని స్థాయిలలో ప్రభుత్వ యంత్రాంగంపై పార్టీ పట్టును స్థాపించగలిగింది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhh1M-BnJftw-88Zqk9oWhosluz0E6IZ18on2kzimfupSpXTALMrefVExaN0Hf9llcio1sEqNHA3nhWAKBmwGe1LPJmTyXB6ncHDC4_10CZa3WSAshxaK4XnthPZvHbV3RGdvwfhTVHI1R0/s1600/Buddha+WB.JPG
రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో బలంగా ఉండిన ట్రేడ్‌యూనియన్ ఉద్యమం, కిసాన్ ఉద్యమం వామపక్ష ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగేందుకు బాటలు వేశాయి.వామపక్ష ప్రభుత్వం హయాంలో సంక్షేమపథకాలు, పేదలకు అనుకూలమైన విధాన నిర్ణయాలు కొన్ని సాధ్యపడ్డాయి కానీ, పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంగుళం ముందుకు సాగలేదు. ప్రతిపక్ష ప్రభుత్వమని చెప్పి కేంద్రం ప్రభుత్వరంగ పరిశ్రమలకు అవకాశం ఇవ్వలేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమని, అల్లరిపెట్టే ట్రేడ్‌యూనియన్ల రాష్ట్రమని ప్రైవేటు రంగమూ ప్రవేశించలేదు. http://images.jagran.com/cpm-b-11-4-2011.jpg
కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎత్తుగడగా మాత్రమే ఎన్నికలను, ప్రభుత్వ నిర్వహణను ఆశ్రయిస్తున్నామని చెప్పిన మార్క్సిస్టు పార్టీకి రాష్ట్రాభివృద్ధికి అనువైన మార్గమేదో బోధపడలేదు. బెంగాల్ అంటే భారతదేశంలో ఒక మారుమూల రాష్ట్రం, పరిశ్రమలు బతకలేని రాష్ట్రం- అన్న ముద్ర ఖాయపడింది. రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగులకు, భృతి ఇవ్వడం సంక్షేమచర్యే అయింది తప్ప, పరిష్కారం కాలేకపోయింది. http://static.ibnlive.com/pix/sitepix/10_2010/prakash-karat2710630_271x181.jpg
వరుస విజయాలతో అధికారానికి అలవాటుపడిపోయిన పార్టీ యంత్రాంగంలో అనేక అవలక్షణాలు ప్రవేశించాయి, ఉద్యమశీలత కొరవడింది. జ్యోతిబసుతో సహా పార్టీ, ప్రభుత్వ అధినేతలందరూ వ్యక్తిగత నిజాయితీకి, నిరాడంబరతకు ప్రతీకలుగా ఉండినప్పటికీ, దిగువస్థాయిల్లో పార్టీనాయకుల తీరు భిన్నంగా ఉండింది.

బెంగాల్‌తో సంబంధం లేకుండా మార్క్సిస్టు పార్టీ సరళిలో కూడా మార్పులు రాసాగాయి. కొత్తరకం రాజీకమ్యూనిస్టులే తప్ప కడదాకా నిలిచే విప్లవ కమ్యూనిస్టులు కాదని నక్సలైట్లు 1960లలోనే విమర్శించినప్పటికీ, ఎమర్జెన్సీ ముగిసేదాకా మార్క్సిస్టు పార్టీకి మిలిటెంట్ పార్టీ ప్రతిష్ఠే ఉండేది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర అణచివేతచర్యలకు లక్ష్యంగా ఉన్నవారిలో, అజ్ఞాతజీవితం గడపవలసివచ్చినవారిలో మార్క్సిస్టులు కూడా ఉన్నారు.

ఆ తరువాత కొంతకాలం దాకా సిపిఎం మాటల్లో విప్లవం, తగిన సమయంలో సాయుధపోరాటం వంటి మాటలు వినిపిస్తూనే ఉండేవి. మరోవైపు ఇందిరాగాంధీతో అంటకాగి అప్రతిష్ఠపాలైన సిపిఐతో పోల్చినప్పుడు, మార్క్సిస్టుపార్టీ నికార్సయిన పార్టీగానే కనిపించేది. బెంగాల్ విజయంతో స్ఫూర్తిపొందిన ఆపార్టీ 1980ల తరువాత ప్రధానస్రవంతి రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్ష ప్రత్యామ్నాయాలను నిర్మించడంలోను, రాష్ట్రాల స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలతో పొత్తుపెట్టుకోవడంలోను ఆసక్తిపెరిగిపోయింది.

అదే సమయంలో తనకు అనుబంధంగా ఉన్న రైతాంగ, కార్మిక, ఉద్యోగ సంఘాల ద్వారా పోరాటాలను కూడా పార్టీ నిర్వహించేది. అయితే, పాలకపార్టీలతో పొత్తుల క్రీడ కారణంగా అప్పుడప్పుడు నాలుగుసీట్లు అదనంగా గెలుచుకోగలిగినా, మరోసారి అవే ప్రధానపార్టీలు చతికిలపడినప్పుడు వామపక్షాల సభాబలం కూడా తగ్గిపోయేది. పోరాటాల ద్వారా ఏర్పడే ప్రజాబలం మాత్రమే వారికి స్థిరంగా ఉంటూ వచ్చింది.

ఆ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా సిపిఎం, ఎన్నికల రాజకీయాలపైనే మొగ్గు చూపుతూ వచ్చింది. ప్రధాన పాలక పార్టీల ఘర్షణలో ముందుకు వచ్చిన దేశసమగ్రత, సమైక్యత, సుస్థిరత, లౌకికవాదం, తీవ్రవాదంపై పోరాటం- వంటి నినాదాల చుట్టూ పరిభ్రమించింది. శ్రామికవర్గపార్టీగా ఉండిన సంస్థ భావరంగంలో ఎగువ మధ్యతరగతికి, ఆర్థికవిధానాల్లో పారిశ్రామికులకు ఆమోదకరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.

1990దశకం ప్రారంభంలో అమలులోకి వచ్చిన ఆర్థికసంస్కరణలు వామపక్షాలకు కొత్త పోరాట అవకాశాలను తెరిచాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కొత్త పారిశ్రామికవిధానం వల్ల కార్మికులకు ఏర్పడిన అభద్రత కమ్యూనిస్టులకు నూతన పోరాట ఎజెండాను కల్పించాయి.

అయితే, ఆ అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో వామపక్షాలు విఫలమయ్యాయి. సంస్కరణల తొలి దశాబ్దంలో వామపక్షాలు చేసిన ఉద్యమాలన్నీ సారాంశంలో- ప్రభుత్వం తాను తలపెట్టిన సంస్కరణలను కొద్దిపాటి సవరణలతో అమలుచేయించడానికి పనికివచ్చాయి. చివరకు ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగసంఘాలు బలహీనపడ్డాయి. మార్క్సిస్టు పార్టీ నేతలే సంస్కరణల్లోని మంచిని కూడా చూడాలనే వాదన ప్రారంభించారు.
http://img2.allvoices.com/thumbs/event/609/480/53688836-buddhadeb-bhattacharjee.jpg
బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్‌లో సంస్కరణలకు ప్రతినిధిగా చూస్తున్నాము కానీ, 1990లలో జ్యోతిబసు రాష్ట్రానికి ప్రయోజనం కలిగినట్టయితే విదేశీపెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఇక బుద్ధదేవ్ హయాంలో అయితే, మార్పు స్పష్టంగా కనిపించింది. 2006లో ఆయన ఘనవిజయం సాధించినప్పుడు మొదటగా అభినందించింది రతన్‌టాటాయే.

ఉద్యోగాలు దొరుకుతున్నప్పుడు విదేశీపెట్టుబడి మీద ఏమిటి మీ అభ్యంతరం?- అని బుద్ధదేవ్ కేరళలోని తన సహచరుడు అచ్యుతానందన్‌ను ఒక సందర్భంలో ప్రశ్నించారు. బెంగాల్‌లో మార్క్సిస్టు పార్టీ మాట్లాడుతున్న మాటలకు, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ అనుసరించిన వైఖరికి పొంతన లేక పార్టీ అభిమానులు గందరగోళపడ్డారు. తన విధానంలోని ద్వంద్వ స్వభావానికి పార్టీ తగిన వివరణ ఇవ్వలేకపోయింది.

భూములను పంచి, కౌలురైతాంగానికి హక్కులు ఇచ్చి, రైతు అనుకూల చర్యలు చేపట్టిన ప్రభుత్వం పరిశ్రమల కోసం నందిగ్రామ్‌లో, సింగూర్‌లో రైతుల భూములను ఇవ్వడం బెంగాల్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీర్ఘకాలంగా బెంగాల్‌లో పార్టీరాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగడుతున్న తృణమూల్ కాంగ్రెస్‌కు, నలభైయేండ్ల కిందట విఫలమైన ప్రయత్నాన్ని మరోసారి చేపట్టిన మావోయిస్టులకు క్రమంగా రాష్ట్రంలో ఆదరణ పెరిగింది.
http://get.cfn.netdna-cdn.com/wp-content/uploads/2010/06/Mamta-Trinamool-Congress.jpg
ఒకనాడు బెంగాల్‌లో తలదాచుకున్న సిక్కు తీవ్రవాదులను పంజాబ్ పోలీసులు అపహరించి ఎన్‌కౌంటర్ చేస్తే అభ్యంతరం చెప్పిన వామపక్ష ప్రభుత్వం ఇప్పుడు స్వయంగా కేంద్రబలగాలతో కలసి ప్రజలపై అణచివేతచర్యలను నిర్వహించడం, బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడం రాష్ట్రంలో దిగజారిన విలువలకు సాక్ష్యంగా నిలిచాయి.

మూడున్నర దశాబ్దాల కిందట ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం చాలా కాలం పాటు కట్టుబడిన విలువలను కూడా చివరి సంవత్సరాలలో వదులుకున్నది. అందుకే, నందిగ్రామ్, సింగూర్ తరువాత జరిగిన అన్ని స్థాయిల ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్ పరాజయాన్ని చవిచూస్తూ వచ్చింది. సిపిఎంనేతలు అంటున్నట్టు బెంగాలీలు కోరుకున్నది కేవలం పార్టీల మార్పు, నేతల మార్పు కాదు. విధానాల మార్పు.

బెంగాల్, కేరళల్లో పరాజయం మార్క్సిస్టు పార్టీకి ఒకరకంగా మేలుచేస్తుంది. తన విధానాలను సమీక్షించుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ శషభిషలు లేకుండా దేశంలో అమలవుతున్న అభివృద్ధి విధానాన్ని సమర్థించడమా, నానాటికి పెరుగుతున్న ప్రజాచైతన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడమా వారు నింపాదిగా, ఏ పరిమితులూ లేకుండా చర్చించుకోవచ్చు. 2000 సంవత్సరం తరువాత నాలుగేళ్ల పాటు మన రాష్ట్రంలో మార్క్సిస్టు పార్టీ నిర్వహించిన ఉద్యమాలను గుర్తు తెచ్చుకుంటే, దాని శక్తిసామర్థ్యాలను తక్కువ చేయలేము.

ఆ ప్రయాస అంతా రాజశేఖరరెడ్డి విజయానికి తోడ్పడిందనుకోండి, అది వేరే విషయం. విప్లవకరమైన, మిలిటెంట్ పార్టీగా మార్క్సిస్టు పార్టీ ఉండాలని ఇప్పుడు ఎవరూ ఆశించడంలేదు. నికార్సయిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఎంతో చేయగలదు. భారత రాజకీయచిత్రపటంలో ఒక కట్టుబాటున్న ప్రజాస్వామిక రాజకీయ పక్షం అవసరం స్పష్టంగానే కనిపిస్తున్నది. మార్క్సిస్టు పార్టీ ఆత్మవిమర్శ ఆ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా సాగాలని కోరుకోవాలి.

మార్క్సిస్టుపార్టీ స్వయంకృతాపరాధాల కారణంగా ఓడిపోయిందని గ్రహించడం అవసరమే కానీ, అందుకు ఆనందించడం కానీ, సంబరపడడం కానీ అనవసరం.మార్క్సిస్టులు బలహీనపడితే, ప్రధానస్రవంతి రాజకీయాల్లో ప్రజానుకూలమైన గొంతు కనీసంగాకూడా, అప్పుడప్పుడైనా వినిపించే అవకాశం ఉండదు. అలాగే, మమతాబెనర్జీ పరిపాలన ఎట్లా ఉండబోతున్నదో చెప్పడానికి పెద్దగా కష్టపడనక్కరలేదు. రెండు ఊర్లలో భూమిని అన్యాక్రాంతం చేసినందుకే ప్రభుత్వంపై ఆగ్రహించిన బెంగాలీలు, మొత్తం రాష్ట్రాన్ని అంగట్లో పెట్టగలిగే విధానాలున్న మమతను ఎంతో కాలం సహించరు.
http://economictimes.indiatimes.com/photo/8289643.cms
-కె. శ్రీనివాస్

Monday, May 16, 2011

జయమైనా.. అపజయమైనా... ఆమెది ఒకటే తీరు..!

 
తమిళనాడు పదహారవ ముఖ్యమంత్రిగా జయలలిత చెనై్నలోని మద్రాసు యూనివర్శిటీ ఆడిటోరియంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాల రోజు ఎటువంటి ఆత్రుత లేకుండా ఎలా కనిపించారో ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆమె ఎటువంటి బావోధ్వేగాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డా రు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఓ మహిళగా ఆమె సాధించిన ఈ విజయం.. మహిళాలోకానికే గర్వకారణం..

jaya 
ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన క్షణం నుండి... ప్రచారం... ఫలితా లు ప్రమాణ స్వీకారం వంటి అన్ని సందర్భాల్లోనూ ప్రతిపక్ష నేతగా, అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించారు.
అనుచరులకు అమ్మగా...
ఎంజీఆర్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అనతికాలంలో ఎంత పేరుప్రఖ్యాతులు సాధించిన ఆమెను పార్టీలోని వారంతా ‘అమ్మా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి అడుగిడక ముందు సినీ ప్రపంచంలో ఓ అందాల తార.. ఎదురులేని నాయకి... రాజకీయాల్లోనూ అంతే అడుగిడింది మొదలు ఎన్ని సమస్యలు.. అడ్డంకులు వచ్చినా ఎదురు నిలవడమే కానీ వెనక్కి వెళ్లడం అంటే ఏమిటో ఆమెకు తెలియదు.. ఆమె స్వభావాన్ని కొందరు మొండి తనం అంటే మరికొందరు ఆత్మవిశ్వాసం అంటారు. ఏది ఏమైనా ఆమె లక్ష్యం మాత్రం ముందుకు సాగడమే...

చిన్నతనం...
తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన జయలలిత ప్రాధమిక విద్యా భ్యాసం బెంగళూరులో చేశారు.అనంతరం మద్రాసుకు వలసవెళ్లారు. 15 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో జయలలిత నటనా రంగంలో ప్రవేశిం చారు. ఆమె అన్న విజయకుమార్‌ 1990లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

సినీ జీవితం...

తమిళసినీ రంగంలో ఎదురులేని తారగా జయలలిత వెలిగారు. 1961లో మాజీ రాష్టప్రతి వి.వి.గిరి కొడుకు శంకర్‌ గిరి నిర్మించిన ఇంగ్లీష్‌ సినిమా లో నటించారు. మొదటి సినిమాను మాత్రం కన్నడలో చేశారు. అది చాలా పెద్ద హిట్టు కావడంతో ఆమెకు ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకపో యింది. అన్నిటా విజయమే.తెలుగునాట ఆమెకు అభిమానులు బ్రహ్మర థం పట్టారు. హిందీలోనూ ఆమె కొన్ని సినిమాలను చేశారు. కేవలం నటన మాత్రమే కాదు ఆమె స్వయంగా పదికి పైగా పాటలను కూడా పాడారు.

రాజకీయ జీవితం...
1981లో ఎంజీఆర్‌ ప్రోత్సాహంతో అన్నాడీఎంకేలో చేరి 1988లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం పార్టీ నాయకత్వ బాధ్య తలను జయలలిత తీసుకున్నారు. మొదటిసారి 1991 తమిళనాడు అసెం బ్లీ ఎన్నికలలో గెలిచి మొదటి మహిళా ప్రతిపక్షనాయకురాలిగా మారారు.

ప్రతిపక్షం నుండి ముఖ్యమంత్రిగా...
jaya1అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంజీఆర్‌ వారసత్వంతో 1982లో రాజ కీయాల్లోకి వచ్చి ఆయన మార్గంలోనే నడిచారు. మొదటి సారి బోదినా యక్కలనూర్‌ నియో జకవర్గం నుండి పోటీ చేసి గెలు పొందారు. ఈ ప్రాం తం కేరళకు సమీపంలో వుంది. తరువాత ఈ ప్రాంతం రెండుగా విభజిత మైంది.అందులో ఒక భాగం, తమిళనాడులో, మరో ప్రాంతం కేరళలో వుంది.

1984లో ఎంజీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం ఎంజీఆర్‌ మరణానంతరం ఆమె ఆయన నియోజక వర్గం ఆండిపట్టినుండి నుండి పోటీ చేసి గెలుపొందారు. అనతరం ఈ ప్రాం తం అన్నాడీఎంకే స్థావరంగా మారింది. వరుసగా అన్నాడీఎంకే పార్టీలే గెలు పొందుతూ వచ్చింది.మధ్యలో రెండు సార్లు డీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుం ది. తిరిగి 2002, 2006లలో జయలలిత ఈ ప్రాంతం నుండి పోటీ చేసి గెలు పొందారు. ప్రస్తుత విజయం మాత్రం ఆమెకు అందించింది శ్రీరంగం నియోజ కవర్గం.
రాజకీయ విజయాలు...
  • ప్రయివేటు సంస్థల్లో ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించారు.
  • చెనై్నకి న్యూ వీరనం నీటి సరఫరా పథకాన్ని పూర్తి చేశారు.
  • లాటరీ టికెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించారు.
  • జైళ్లలో, కోర్టుల్లో వీడియో కాన్ఫిరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • వర్షపు నీటి నిల్వ పథకాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు.
  • గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

    మర్చిపోలేని సందర్భాలు...
  • 1991 జూన్‌ 24-1996 మే 12 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు.
  • 1996లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగారు.
  • ఎన్నో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.
  • 2001 ఎన్నికలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు.
  • అసెంబ్లీకి ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
  • 2001 సెప్టెంబర్‌ 21న సుప్రీం కోర్టు క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకుని వున్న వ్యక్తి 163(1)కింద ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదనే తీర్పు నిచ్చింది. ఆమెపై వారెంటును జారీ చేసింది.
  • దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకుల్లో ఒకరైన పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సి వచ్చింది.
  • 2003లో జయలలిత తిరిగి తనపై వచ్చిన ఆరోపణలు సవాలు చేస్తూ న్యాయస్థానంలో పోరాడారు. ఎన్నికల ద్వారా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
  • 2006లో పన్నీర్‌సెల్వం పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. ఆమెను అవసరం అయితే తప్ప సమావేశాల్లోనూ పాల్గొనరాదన్న నిబంధనను కూడా జారీ చేశారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు.
  • 2006లో అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆమె తిరిగి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

    పొందిన అవార్డులు...
  • 1972లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని
  • 1991లో మద్రాసు యూనివర్శిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌
  • 1992లో ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌
  • 1993లో మధురై కామరాజు యూనివర్శిటీ నుండి గౌరవ డిగ్రీ పట్టా
  • 2005లో తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ న్యాయ విద్యాలయం నుండి గౌరవ న్యాయవాద డిగ్రీ.
    ప్రొఫైల్‌...
    పుట్టిన తేది    : ఫిబ్రవరి 24, 1948 (63 ఏళ్లు)
    రాజకీయ పార్టీ    : అన్నాడీఎంకే
    నియోజకవర్గం     : శ్రీరంగం
    నివాసం     : చెనై్న, తమిళనాడు
    వృత్తి     : అన్నాడీఎంకే అధినేత్రి
     

మారుతున్న గ్రామీణ భారతానికి ప్రతీక.. ఛవీ రజావత్‌

లక్షల సంపాదన వదిలి... సమాజసేవవై కదిలి
http://www.thehindubusinessline.com/multimedia/dynamic/00330/2010041650130402_330710e.jpg
సరిగ్గా 50 రోజుల క్రితం.. మార్చి 25, 2011.. ఐక్య రాజ్య సమితి వేదికగా.. 11వ ‘ఇన్ఫో-పావర్టీ’ సదస్సు జరుగుతోంది. భారత్‌ నుండి ఓ మహిళా గ్రామ సర్పంచ్‌ ఇప్పుడు ప్రసంగిస్తారు అని సదస్సు చైర్‌పర్సన్‌ ప్రక టించగానే.. అక్కడ ఉన్న వివిధ దేశాల రాయబారులు, మంత్రులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎందరో మహామహులు ప్రసంగించాల్సిన ఈ సదస్సులో ఒక సర్పంచ్‌ ఏం మాట్లాడుతుంది అని చెవులు కొరుక్కు న్నారు.


మహిళా సర్పంచ్‌ అనగానే.. ఓ 40-50 ఏళ్ళ వయస్సులో.. గ్రామీణ వస్తధ్రారణలో.. ఉంటుందని భావించిన వారికి ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి. ఆమె అందం, ఆధునిక వస్తధ్రారణ చూసి.. ఈమె సర్పంచ్‌ కానేకాదు ఐటీ ప్రొఫెషనల్‌, మోడల్‌ అయి వుంటుందని అనుకున్నారంతా.. ఆమె రాజస్థాన్‌లోని సోడా గ్రామ సర్పంచ్‌ 30 ఏళ్ళ ఛవీ రజావత్‌. మేనేజ్‌ మెంట్‌ డిగ్రీని సైతం పక్కనబెట్టి.. ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు సహకారం లేకుండా.. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ‘ధీర’ వనిత. ఆమె సేవలకు గుర్తింపుగా.. ఇటీవల ‘టెక్నాలజీ డే’ సందర్భంగా.. మాజీ రాష్టప్రతి డా అబ్దుల్‌ కలామ్‌ చేతుల మీదుగా.. ప్రశంసాపత్రాన్ని అందుకుంది.


chhavirajawat 
ఛవీ రజావత్‌.. రాజస్థాన్‌లోని మారుమూల సోడా గ్రామ సర్పంచి.. మారుతున్న గ్రామీణ భారతానికి అసలు సిసలు ప్రతీక.. 30 ఏళ్ల రజావత్‌ ఎంబీఏ చేసిన ఏకైక గ్రామ సర్పంచి.. అంతేకాదు.. ఈ పదవిలో ఉన్న అత్యంత పిన్న వయస్కురాలు కూడా..! మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రఖ్యాతి గాంచిన రిషీ వ్యాలీ స్కూల్‌లో ప్రాథమిక విద్య... ప్రతిష్టాత్మక లేడీ శ్రీరాం కాలేజీలో కాలేజీ విద్య... పుణెలోని బాలాజీ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుండి ఎంబీఏ పూర్తిచేసన రజావత్‌ తన స్వగ్రామానికి సేవ చేసేందుకు..


భారతీ-టెలీ వెంచర్స్‌లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానాన్ని సైతం వదులుకున్నారు. సిటీ లైఫ్‌ను విడిచిపెట్టి.. సోడాలోని మట్టి రోడ్లపై తిరుగుతూ.. ప్రజల తో మమేకమవుతూ తన గ్రామ ఉజ్వల భవితకు పునాది రాళ్లు వేస్తున్నారు. మార్చి 24-25 తేదీల్లో ఐరాసలో జరిగిన ఈ సద స్సు ప్యానెల్‌ చర్చలో పాల్గొన్న రజావత్‌.. దారిద్య్రానికి వ్యతిరేకం గా పోరాడటంతో.. అభివృద్ధిని ప్రోత్సహించడంలో పౌర సమా జం పాత్రపై ప్రసంగించారు. వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తు త తరుణంలో మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ- సర్వీసెస్‌ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవా లని చెప్పారు.


సోడాకు కొత్త సొబగులు...
‘‘గత సంవత్సర కాలంలో నేను, గ్రామస్తులు కలిసి మా సొంత కృషితో గ్రామంలో మంచి మార్పు తెచ్చాం. మాకు బయటి మద్ద తు లేదు. ఎన్జీవోలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సహకారం లేదు. అయితే, మిలియనియం అభివృద్ధి లక్ష్యాల సాధనకు మాకు కార్పొరేటు ప్రపంచం, బయటి ఏజెన్సీల మద్దతు కావాలి’’ అని రజావత్‌ కోరారు. తమ గ్రామంలో తొలి బ్యాంకు ఏర్పాటుకు సహకరించిన ఐరాస ఆఫీ్‌ ఫర్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ కృతజ్ఞతలు తెలి పారు. ‘‘మూడేళ్లలో నా గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తా. నాకు డబ్బు అక్కర్లేదు. మా గ్రామంలో ప్రాజెక్టులను దత్తత తీసుకునే వ్యక్తులు, సంస్థలు కావాలి. నా గ్రామంలో సత్వర అభివృద్ధి కోసం ఈ సదస్సు సహకారమందించాలి. అప్పుడే మీరు, నేను అనుభవిస్తున్న మంచి జీవితాన్ని ప్రస్తుత తరం అనుభవించడాని కి వీలుంటుంది’’ అని ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. రజావత్‌ ప్రసంగానికి ప్రతినిధుల నుంచి అపూర్వ స్పందన లభించింది.
http://img.technospot.in/Chhavi-Rajawat.png
జీన్స్‌ ప్యాంట్‌... గుర్రపుస్వారీ...
సంప్రదాయంలో భాగంగా తమ ముఖం ఇతరులకు కనిపించ కుండా ముసుగు ధరించే మహిళలు ఎక్కువగా ఉండే రాజస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆమె జీన్స్‌ ప్యాంట్‌, టీ షర్ట్‌ ధరించి.. గ్రామ సభలకు హాజరవుతారు.గుర్రపు స్వారీ చేస్తారు. సాధారణంగా.. ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివిన ఎవరైనా కార్పొరేట్‌ రంగంలో లక్షల సంపాదనతో స్థిరపడతారు. కానీ, రజావత్‌ అలా కాదు, కార్పొరేట్‌ ఉద్యోగాన్ని సైతం కాదని. జన్మభూమి సేవలో తరిస్తున్నారు. గత మూడేళ్ళలో గ్రామ సర్పంచ్‌గా సోడా గ్రామాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చింది. దీనికి గుర్తింపుగానే ఐరాస సదస్సు ప్యానల్‌ చర్చల్లో పాల్గొనే అరుదైన ఘనతను సొం తం చేసుకున్నారు రజావత్‌. ఎలాంటి సహాయ సహకారాలను ఆశించకుండా.. తీసుకోకుండా తనదైన ఆలోచనలతో తన గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సాధారణ మను షులకు సాధ్యం కాని పనిని చేసి చూపించింది. అందుకే 30 ఏళ్ళ వయస్సులోనే ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించింది. భారత్‌ లోనే పిన్నవయస్కురాలైన, ఎంబిఎ చదివిన ఏకైక మహిళా సర్పం చ్‌ రజావత్‌ (30). గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించేందుకు ఎయిర్‌టెల్‌కు చెందిన భారీ టెలీవెంచర్స్‌లో ఉన్నతస్థాయి ఉద్యో గాన్ని సైతం వదులుకుంది. గ్రామ సర్పంచ్‌గా తాను అనుకున్నది సాధించిన వైనాన్ని ఐక్యరా జ్యసమితి సదస్సులో వివరించింది. దారిద్య్రంపై పోరు, అభివృద్దిలో పౌరసమాజం పాత్ర, అభివృద్ధి చర్యలను పౌరసమాజం ఎలా అమలు చేయాలి అనే అంశంపై చర్చలో పాల్గొంది.
http://images.jagran.com/PTI3_30_2011_000016B_49592.jpg
ఈ-సేవలు అమలు చేయాలి...
వనరులు పరిమితంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మిలీనియం లక్ష్యాలను సాధించాలంటే ఈ-సేవలు వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సహా వివిధ వ్యూహాత్మక చర్యలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సదస్సులో ప్రతినిధులకు సూచించింది. ‘‘స్వాతంత్య్రం సంపాదించినప్పటినుంచీ గత 65 ఏళ్ళు ఒకే రీతిలో పురోగతిని సాధించేందు కు భారత్‌ కృషి చేస్తోంది. కానీ ఇది సరైనరీతిలో లేదు.ప్రజలకు నీరు, విద్యుత్తు, మరుగుదొ డ్లు, పాఠశాలలు, ఉద్యోగాలు అందించడంలో మనం విఫలమయ్యాం.


Chhavi_Rajawat
వీటిని వేరొకదారిలో సాధించడవచ్చు. వేగంగా చర్యలు చేపట్టవచ్చునని నేను భావిస్తున్నారు. గడిచిన ఒక్క ఏడాది లోనే నేను, సోడా గ్రామస్తులు కలిసి సొంత సామర్థ్యంతో గ్రామంలో సమూల మార్పులు తీసుకొచ్చాం.మేము ఎవరి మద్దతును తీసుకోలేదు. ఎన్జీవోలు గానీ, ప్రభుత్వం లేదా ప్రైవేటు వ్యక్తులు ఎవరి సాయం తీసుకోలేదు’’ అని చెప్పారు. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధిం చేందుకు బయట ఏజన్సీలు, కార్పొరేట్‌ ప్రపంచం మద్దతును కోరుతున్నానని ఆమె చెప్పారు.


మేనేజ్‌మెంట్‌ డిగ్రీ గ్రామ పాలనకు ఉపయోగపడుతోంది...
‘‘గ్రామస్తులకు సేవ చేయడం ద్వారా నేను నా మూల్లాలోకి వెళుతున్నాను. ఇందుకు ముంద స్తుగా అనుకున్నది కాదు. ఎక్కడైతే నేను ఎదిగానో అదే గ్రామానికి నేను సేవలు అందిస్తున్నా ను’’ అని ఐక్యరాజ్యసమితి సదస్సు అనంతరం రజావత్‌ చెప్పారు. నా ఎంబీఏ డిగ్రీ గ్రామ పాలనకు, కొత్త రక్తాన్ని తీసుకొచ్చేందుకు ఉపయోగపడుతోంది. దీనిని నేను కెరీర్‌గా భావిం చడం లేదు. సామాజిక సేవగా భావిస్తున్నాను అని చెప్పారు. ఎన్జీవోల సాయంతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, సురక్షితమైన తాగునీరు తెచ్చేందుకు దృష్టిపెడుతున్నాను రజావత్‌ తెలిపారు.
http://images.idiva.com/media/content/2011/Mar/woman_sarpanch_chhavi_600x450.jpg
రిషీ వ్యాలీ టు సోడా...
ఛవీ రజావత్‌ నేతృత్వంలో సోడా గ్రామం ప్రగతిపథాన ముందుకు పోతుంటే, పత్రికా విలేఖ రులు, ప్రచార ప్రసార మాధ్యమాలు, ిసినీ నిర్మాతలు సోడా గ్రామానికి బారులు తీరారు. ఓ మహిళ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి పథకాలు ఎలా అమలు జరుగుచున్నాయనేదే అందరి ధ్యాస. సోడాలో మంచి నీరు ప్రధాన సమస్య. రజావత్‌ గతంలో జైపూర్‌లో గుర్రాల స్వారీ స్కూలును నడుపుతూ, తల్లికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో సహకరించేది. రజావత్‌కు పూర్వ సర్పంచ్‌ విధులు సరిగా నిర్వహించని కారణాన గ్రామస్థులు విసిగి వేసారిపోయారు.


ఆమెను ఈసారి సర్పంచ్‌గా పోటీకి నిలువకపోతే ధర్నాకు సిద్ధమయ్యారు. ఓ వైపు తలంతా కప్పుకున్న గృహిణులు, మరోవైపు జీన్స్‌ ప్యాంట్‌తో ఈమె ఎలా గ్రామానికి పొంతన కుదరుతుందని కొం దరు ప్రశ్నించారు. ఆమె ఏ దుస్తులు ధరించినా సోడా గ్రామవాసి. అదే ఆ గ్రామానికి కోడలై తే రాజస్థానీ దుస్తులు ధరించాలని పట్టుబట్టే వారే. గుర్రమెక్కి గ్రామంలో ఇంటింటి బాగోగు లు వాకబు చేస్తుంది. ఛవీ రజావత్‌ రాజ్‌పుట్‌ కుటుంబీకురాలు. వారికి సోడా, పరిసర గ్రామాలలో వందల ఎకరాలున్నాయి.


ఇరవై సంవత్సరాల క్రితం ఆమె తాతగారు ఆ ఊరి సర్పంచ్‌ వారి పాలనలో గ్రామస్థుల కష్టాలు తీరాయి.మళ్లీ సర్పంచ్‌ మారడంతో అభివృద్ధి నోచుకోలేదు. మహిళా రిజర్వేషన్‌ అమలు జరుగుతుందని సర్పించ్‌ భార్యను సర్పంచ్‌గా నుంచోమన్నాడు. కానీ గ్రామస్థులంతా ఛవీ రజావత్‌నే సర్పంచ్‌గా ఆదరించి గెలిపించారు.రాజస్థాన్‌లోని సర్పంచ్‌ల ఎన్నికల్లో చావీ రజావత్‌కే అత్యధికంగా మెజారిటీ లభించింది.

ఉపాధి హామీ...

టాంక్‌ జిల్లావెనుకబడిన ప్రాంతం. గ్రామస్థులంతా ఆవాలు, గోధుమ, ధనియాలను పండించే వారు.వర్షాభావ ప్రాంతం గత రెండు సంవత్సరాలుగా చెరువులు, వాగులు ఎండిపోయాయి. భూమిలో నీరు ఇంకిపోతుంది.బిసాల్పూర్‌ డామ్‌ నీళ్లు జైపూర్‌కు మళ్లిస్తున్న కారణాన టాంక్‌ జిల్లాలోని గ్రామాలకు నీరు అందటం లేదు. చావిరజావత్‌ సోడా గ్రామానికి నీరు రప్పించేందుకు కంకణం కట్టుకుంది. మరోవెపు జాతీయస్థాయిలో నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలో అవినీతిపై రజావత్‌ యుద్ధం ప్రకటించింది. పంటలకాలం ముగిస్తే, గ్రామంలో పెక్కుమందికి ఉపాధి లభించుట లేదు. జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకై రజావత్‌ శ్రమించింది. పంటకాలం ముగిస్తే, చేతులు ముడుచుకొని ఎవరినీ కూర్చోవద్దన్నది.


మహిళా కార్మికులు...
పొలం గట్లు వేయటం, మట్టి పనులలో అధికంగా మహిళా కార్మికులే పని చేస్తారు. చదువుకున్న విద్యార్థినులు కూడా మట్టి పనులు చేస్తున్నారు. ఏదైనా పొలాలకు నీరందితేనే కానీ, వారి భవిష్యత్‌ మారదనేది వారి వాదన. రోజూ నీటికై మహిళలు ఎన్నోమైళ్లు నడిచివెళ్లాలి. రోజూ రెండు సార్లు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. కొందరు నగరానికి వలసలు వెళ్లారు. మరి కొందరు సోమరులుగా సోడా గ్రాంలోనే కాలం గడుపుతున్నారు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj4DQP_uTb9y7rwtPTNJac8JjjRK9P__GlnGQF0jYq-mwpvwQ3Ep_vk7mStdvbrfmuwbWt0T-qG6Klv5cKb9JHhCjrQYnLNYiqewLIzOh1pkoJabl0Z0ao-UAPBKMz7wM6w-oTQiEuL7Cs/s400/Chhavi-Rajawat.jpg

మారిన ఆలోచనాధోరణి...
తండ్రి, ఛవీ రజావత్‌కు బాసటగా నిలిచారు. చెరువులను తవ్వించటం, చెట్లు పెంచటం, డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకాలకు రూపకల్పన చేయటం వారి నిత్యవిధులు. వర్షపు నీటిని సక్రమంగా విని యోగించమని గ్రామస్థులకు తెలియజేశారు. ఛవీ రజావత్‌ చేపట్టిన విప్లవాత్మక మార్పులలో, ఎవరినీ సోమరిగా కూర్చోవద్దన్నది. కష్టించి పనిచేసే మనస్తత్వాన్ని అలవాటు చేసింది. గ్రామాలలో పలుచోట్ల ప్రభుత్వం పైనే, ప్రతి పనికీ గతంలో ఆధారపడేవారు. ఛవీ రజావత్‌ అలా కాకుండా గ్రామస్థులను వారి కాళ్లపై నిలబడే స్వభావాన్ని పెంచింది. వారి ఆలోచనలను మార్చడం కష్టమే. కానీ కాలగమనంలో ఛవీ రజావత్‌ దీక్ష, పట్టుదల ముందు వారు తలొగ్గారు. ప్రతీ చిన్న పనికీ ప్రభుత్వంపై ఆధారపడక, గ్రామాభివృద్ధికై వారిని శ్రమయేవ జయతే బాటలో నడిపిస్తుంది.