Monday, May 16, 2011

జయమైనా.. అపజయమైనా... ఆమెది ఒకటే తీరు..!

 
తమిళనాడు పదహారవ ముఖ్యమంత్రిగా జయలలిత చెనై్నలోని మద్రాసు యూనివర్శిటీ ఆడిటోరియంలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ఫలితాల రోజు ఎటువంటి ఆత్రుత లేకుండా ఎలా కనిపించారో ప్రమాణ స్వీకార సమయంలోనూ ఆమె ఎటువంటి బావోధ్వేగాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డా రు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఓ మహిళగా ఆమె సాధించిన ఈ విజయం.. మహిళాలోకానికే గర్వకారణం..

jaya 
ఎన్నికల తేదీల ప్రకటన వెలువడిన క్షణం నుండి... ప్రచారం... ఫలితా లు ప్రమాణ స్వీకారం వంటి అన్ని సందర్భాల్లోనూ ప్రతిపక్ష నేతగా, అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఒకే రకమైన హావభావాలను ప్రదర్శించారు.
అనుచరులకు అమ్మగా...
ఎంజీఆర్‌ వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అనతికాలంలో ఎంత పేరుప్రఖ్యాతులు సాధించిన ఆమెను పార్టీలోని వారంతా ‘అమ్మా’ అని ప్రేమగా పిలుచుకుంటారు. రాజకీయాల్లోకి అడుగిడక ముందు సినీ ప్రపంచంలో ఓ అందాల తార.. ఎదురులేని నాయకి... రాజకీయాల్లోనూ అంతే అడుగిడింది మొదలు ఎన్ని సమస్యలు.. అడ్డంకులు వచ్చినా ఎదురు నిలవడమే కానీ వెనక్కి వెళ్లడం అంటే ఏమిటో ఆమెకు తెలియదు.. ఆమె స్వభావాన్ని కొందరు మొండి తనం అంటే మరికొందరు ఆత్మవిశ్వాసం అంటారు. ఏది ఏమైనా ఆమె లక్ష్యం మాత్రం ముందుకు సాగడమే...

చిన్నతనం...
తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన జయలలిత ప్రాధమిక విద్యా భ్యాసం బెంగళూరులో చేశారు.అనంతరం మద్రాసుకు వలసవెళ్లారు. 15 ఏళ్ల వయసులో తల్లి ప్రోత్సాహంతో జయలలిత నటనా రంగంలో ప్రవేశిం చారు. ఆమె అన్న విజయకుమార్‌ 1990లో చనిపోయారు. ఆయనకు ఇద్దరు పిల్లలు.

సినీ జీవితం...

తమిళసినీ రంగంలో ఎదురులేని తారగా జయలలిత వెలిగారు. 1961లో మాజీ రాష్టప్రతి వి.వి.గిరి కొడుకు శంకర్‌ గిరి నిర్మించిన ఇంగ్లీష్‌ సినిమా లో నటించారు. మొదటి సినిమాను మాత్రం కన్నడలో చేశారు. అది చాలా పెద్ద హిట్టు కావడంతో ఆమెకు ఇక వెనుదిరిగి చూసే అవకాశం లేకపో యింది. అన్నిటా విజయమే.తెలుగునాట ఆమెకు అభిమానులు బ్రహ్మర థం పట్టారు. హిందీలోనూ ఆమె కొన్ని సినిమాలను చేశారు. కేవలం నటన మాత్రమే కాదు ఆమె స్వయంగా పదికి పైగా పాటలను కూడా పాడారు.

రాజకీయ జీవితం...
1981లో ఎంజీఆర్‌ ప్రోత్సాహంతో అన్నాడీఎంకేలో చేరి 1988లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ మరణానంతరం పార్టీ నాయకత్వ బాధ్య తలను జయలలిత తీసుకున్నారు. మొదటిసారి 1991 తమిళనాడు అసెం బ్లీ ఎన్నికలలో గెలిచి మొదటి మహిళా ప్రతిపక్షనాయకురాలిగా మారారు.

ప్రతిపక్షం నుండి ముఖ్యమంత్రిగా...
jaya1అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎంజీఆర్‌ వారసత్వంతో 1982లో రాజ కీయాల్లోకి వచ్చి ఆయన మార్గంలోనే నడిచారు. మొదటి సారి బోదినా యక్కలనూర్‌ నియో జకవర్గం నుండి పోటీ చేసి గెలు పొందారు. ఈ ప్రాం తం కేరళకు సమీపంలో వుంది. తరువాత ఈ ప్రాంతం రెండుగా విభజిత మైంది.అందులో ఒక భాగం, తమిళనాడులో, మరో ప్రాంతం కేరళలో వుంది.

1984లో ఎంజీఆర్‌ ఆరోగ్యం క్షీణించడంతో ఆమె పార్టీ పగ్గాలు చేపట్టారు. అనంతరం ఎంజీఆర్‌ మరణానంతరం ఆమె ఆయన నియోజక వర్గం ఆండిపట్టినుండి నుండి పోటీ చేసి గెలుపొందారు. అనతరం ఈ ప్రాం తం అన్నాడీఎంకే స్థావరంగా మారింది. వరుసగా అన్నాడీఎంకే పార్టీలే గెలు పొందుతూ వచ్చింది.మధ్యలో రెండు సార్లు డీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుం ది. తిరిగి 2002, 2006లలో జయలలిత ఈ ప్రాంతం నుండి పోటీ చేసి గెలు పొందారు. ప్రస్తుత విజయం మాత్రం ఆమెకు అందించింది శ్రీరంగం నియోజ కవర్గం.
రాజకీయ విజయాలు...
  • ప్రయివేటు సంస్థల్లో ఎక్కువ వడ్డీని వసూలు చేయడాన్ని నిషేధించారు.
  • చెనై్నకి న్యూ వీరనం నీటి సరఫరా పథకాన్ని పూర్తి చేశారు.
  • లాటరీ టికెట్ల అమ్మకాలపై నియంత్రణ విధించారు.
  • జైళ్లలో, కోర్టుల్లో వీడియో కాన్ఫిరెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు.
  • వర్షపు నీటి నిల్వ పథకాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు.
  • గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

    మర్చిపోలేని సందర్భాలు...
  • 1991 జూన్‌ 24-1996 మే 12 వరకు ముఖ్యమంత్రిగా వున్నారు.
  • 1996లో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగారు.
  • ఎన్నో క్రిమినల్‌ కేసుల్లో ఇరుక్కుని వివాదాస్పద వ్యక్తిగా ముద్రపడ్డారు.
  • 2001 ఎన్నికలలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చారు.
  • అసెంబ్లీకి ఎన్నిక కాకుండానే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టి మరిన్ని వివాదాలలో చిక్కుకున్నారు.
  • 2001 సెప్టెంబర్‌ 21న సుప్రీం కోర్టు క్రిమినల్‌ కేసుల్లో చిక్కుకుని వున్న వ్యక్తి 163(1)కింద ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలులేదనే తీర్పు నిచ్చింది. ఆమెపై వారెంటును జారీ చేసింది.
  • దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పార్టీ నాయకుల్లో ఒకరైన పన్నీర్‌ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించాల్సి వచ్చింది.
  • 2003లో జయలలిత తిరిగి తనపై వచ్చిన ఆరోపణలు సవాలు చేస్తూ న్యాయస్థానంలో పోరాడారు. ఎన్నికల ద్వారా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
  • 2006లో పన్నీర్‌సెల్వం పార్టీ నాయకునిగా ఎన్నికయ్యారు. ఆమెను అవసరం అయితే తప్ప సమావేశాల్లోనూ పాల్గొనరాదన్న నిబంధనను కూడా జారీ చేశారు. కానీ అది ఎక్కువ కాలం నిలవలేదు.
  • 2006లో అసెంబ్లీకి ఎన్నికైన అనంతరం ఆమె తిరిగి అన్నాడీఎంకే పార్టీ నాయకురాలిగా, అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

    పొందిన అవార్డులు...
  • 1972లో తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామని
  • 1991లో మద్రాసు యూనివర్శిటీ నుండి డాక్టర్‌ ఆఫ్‌ లిటరేచర్‌
  • 1992లో ఎంజీఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరేట్‌
  • 1993లో మధురై కామరాజు యూనివర్శిటీ నుండి గౌరవ డిగ్రీ పట్టా
  • 2005లో తమిళనాడు డాక్టర్‌ అంబేద్కర్‌ న్యాయ విద్యాలయం నుండి గౌరవ న్యాయవాద డిగ్రీ.
    ప్రొఫైల్‌...
    పుట్టిన తేది    : ఫిబ్రవరి 24, 1948 (63 ఏళ్లు)
    రాజకీయ పార్టీ    : అన్నాడీఎంకే
    నియోజకవర్గం     : శ్రీరంగం
    నివాసం     : చెనై్న, తమిళనాడు
    వృత్తి     : అన్నాడీఎంకే అధినేత్రి
     

No comments:

Post a Comment