Wednesday, February 23, 2011

మనసు చూపిన మార్గం

చంద్రికా కృష్ణమూర్తి... సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ వుమన్‌... న్యూయార్క్‌ యూనివర్శిటీ ట్రస్టు బోర్డు మెంబర్‌.. పెప్సికో సిఇఓ ఇంద్రానూయికి సోదరి... అది కొద్ది కాలం క్రితం వరకు ఇప్పుడు.. ఓ మంచి సంగీత విద్వాంసురాలు. 56 ఏళ్ల వయసులో తనలో దాగున్న అంతర్గత ప్రతిభకు ప్రాణం పోసుకుంది. గిటారు నేర్చుకుంది. సంగీత సాధన చేసింది.  భక్తి సంగీతంతో                  ఓం నమశ్శివాయ  పేరుతో మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసింది.  ఇక రెండవ ఆల్బం ఓం నయో నారాయణతో గ్రామీ అవార్డుకు ఎంపికయ్యింది.

yellowscarfచంద్రికా కృష్ణమూర్తి ఫేస్‌ బుక్‌ ఓపెన్‌ చేస్తే చాలు.. 25 వేల రకాల పూలు నవ్వుతూ పలకరిస్తాయి. ఆ పూలలోని సుగంధం చల్లగా కదిలిస్తుంది. నెమ్మదిగా పరికించి చూస్తే అందులో ఆమె పరిచయం చేసే కొత్త విషయాలెన్నో.

పాటలంటే ప్రాణం...
చిన్నతనం నుండి రేడియోలో పాటలు వింటూ పెరిగారు. అన్ని రకాల సంగీతా న్ని విని ఆనందించేవారు.శనివారం రాత్రి పాఠకులు కోరిన పాటలను ప్రసా రం చేసేవారు. అవంటే చంద్రికకు ఎంతో ఇష్టం. తప్పకుండా వినేది. ఇక టామ్‌ జోనెస్‌ పాటలు అంటే చాలా చాలా ఇష్టం. డీన్‌ మార్టిన్స్‌ సాంగ్‌ మొదటి సారి వినగానే ఆమెకు నచ్చింది. వుడ్‌ స్టాక్‌ సాంగ్స్‌ని ఒకే వారంలో పన్నెండు సార్లు విన్నది.అలాగే చిన్నతనం నుండి ఎక్కువ హమ్మింగ్‌ చేసేది. ఇక భక్తి పాటలం టే చంద్రిక ప్రాణం పెట్టేది.జాతీయ గీతాల పట్ల మక్కువ ఎక్కువ. ఫ్రెంచ్‌ సంగీతం కూడా నేర్చుకుంది.

నాకు నేనే ప్రశ్నగా..
పెరిగి పెద్దవుతున్న కొద్దీ చంద్రిక పూర్తిగా చదువు వైపుకి మళ్లింది. ఉన్నత స్థానానికి చేరుకుంది. కానీ ఏదో వెలితి. ఎంత సాధించి నా సంతృప్తి లేక బాధపడింది. ఓసారి తనను తాను పూర్తిగా అర్థం చేసుకునేం దుకు ప్రయత్నించింది. ‘నాకు సంబంధించి ప్రతి విషయంలోనూ సంగీతం వుంది. ఇది లేకుండా నేను బతకడం అనేది సాధ్యం కాదు. నాకు నేనే ఓ పెద్ద నీడలాంటి దాన్ని దాని గురించి నాకు నేనే ఎప్పుడూ చెప్పుకుంటూ వుంటాను. తొమ్మిది సంవత్సరాల క్రితం నా కూతురిని స్కూలుకు పంపిచడం మొదలు పెట్టాకే మేలుకున్నాను. బిజినెస్‌లో ఎంతో విజయం సాధించాను.

Chandrika1కానీ నా లోపల దాగున్న తృష్ణని మాత్రం ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయాను. నేను ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనిపించింది. నాకు సంతోషం కలిగించే అంశం ఏంటి అని? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అనిపించింది నాకు సంతో షాన్ని కలిగించే అంశం సంగీతం ప్రస్తుతం నా జీవితంలో అది లేదు. అప్పుడే మొదలైంది సంగీత విద్యార్థిగా. ఎంతో గొప్ప గొప్పవారి దగ్గరికి వెళ్ళి క్లాసికల్‌, హిందుస్థానీ సంగీతాన్ని తెలుసుకున్నాను. పండిట్‌ గిరిష్‌ వాజాల్వర్‌ వంటి వారి తో కలిసి పనిచేశాను. ఆయన నాకు అసలు గురువు. వీణ సహస్ర బుద్ధే దగ్గర, శుభ్ర గుహ, పండిట్‌ విజయ్‌ కిచ్‌లు దగ్గర కూడా దీన్ని నేర్చుకున్నాను’ అని చంద్రిక చెబుతోంది.

ఇవంటే చాలా ఇష్టం..
అమెరికాలో టాప్‌ 40 హిట్‌ పాటలన్నీ చంద్రికకు చాలా ఇష్టం. నును డెమీస్‌ రౌసెస్‌, ఊమ్‌ కథోమ్‌, నానా మస్కౌరి వారి పాటల నుండి ఎంతో నేర్చు కుంది. వాటి నుండి స్ఫూర్తి పొందింది. ఇక వారి మెలోడీ పాటలు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాయి. ఎబిబిఎ, బ్రెజిలి యన్‌ సంగీతం, ది ఈగల్స్‌, బిగీస్‌, జోన్‌ బేజ్‌ వంటి ఎన్నో కలెక్షన్స్‌ ఆమె దగ్గర వున్నాయి. పాశ్చాత్య సంగీత క్లాసిక్స్‌ అన్నీ సేకరించారు.

ఆషామాషీ కాదు..
మొదటి ఆల్బమ్‌ను 2005లో చంద్రిక విడుదల చేసింది. అనుకున్నదే తడవు గా చేసింది కాదిది.అందుకు ఆమె ఎంతో శ్రమించింది. ‘ఆల్బమ్‌ మొదలు పెట్టే ముందే అన్నిటికీ సిద్ధం అయ్యాను. భారతదేశంలో ఎంతో మంది ప్రముఖుల ను కలుసుకున్నాను. సంగీతాన్ని తెలుసుకున్నాను’ అని చంద్రిక అంటోంది.

గ్రామీ అవార్డుకు ఎంపిక...

పాశ్చాత్య పాప్‌ సంగీతాన్ని అక్కడి సంగీత హోరును అన్నిటినీ మరిపించి చం ద్రిక రెండవ ఆల్బం ఓం నమో నారాయణ గ్రామీ అవార్డుకు ఎంపికయ్యిం ది. బేలాఫ్లెక్‌, బేబిల్‌ గిల్‌బర్టో, అంజెలి క్యూ కిడ్జో, సెర్జియో మెండెస్‌ వం టి ప్రముఖుల ఆల్బమ్స్‌ను దాటుకుని ఆమె నామినీగా నిలిచినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

Chandrikaమీ ఆల్బమ్‌కు గ్రామీ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నా రా? అని చంద్రికను అడిగితే ‘ఇదో గౌరవం. అసలు ఎంపిక అవ్వడమే ఎంతో గర్వంగా అనిపించింది.కలలో కూడా అనుకోలేదు. నేను ఏదో అవార్డు వస్తుంది.. తెచ్చుకోవాలని అనే ఆశతో అయితే పని చేయలేదు.భవిష్యత్తులో దాని కోసం ప్రయత్నించే దా న్ని. కానీ ఇప్పుడే వ స్తుందని మాత్రం అ నుకోలేదు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

ఎంత ఎదిగినా ఒదిగే...
‘నా జీవితం ఏమీ మార దు. నేను నా శక్తి వంచన లే కుండా నాలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకుని ఆల్బమ్‌ చేశాను. ఇక గ్రామీ నామినేషన్‌ అనేది నా సంగీతాన్ని ఎంతో మందికి తెలిసేలా చేసింది. ఎన్నోకష్టాలను దాటుకు ని అది ఆ స్థానానికి చేరుకుంది. సంగీతం అనేది మనసు మూలాలను తాకేదిగా వుండాలి. అప్పుడే విజయం సాధిస్తుంది. నా పాటల్లో ఆ ప్రత్యేకత వుంది కాబట్టే ఈ స్థాయికి వచ్చింది’ అని ఎంతో వినమ్రత ప్రదర్శిస్తారు.

ఎవరి ప్రత్యేకత వారిదే..
ఇంద్రానూయి చెల్లెలుగా పుట్టడం ఎంతో గర్వంగా అనిపిస్తుందని చంద్రిక అం టోంది. ‘ఆమె ఎంతో శక్తివంతమైన మహిళ. లక్షలాది మంది అభిమానులు ఆమెకున్నారు. వారందరిలో నేను ముందు వరుసలో వుంటాను. కలలను నెరవే ర్చుకోవడం అంటే ఏంటో ఆమె నుండే నేర్చుకోవాలి. ఇద్దరం ఎంతో సన్నిహి తంగా వుంటాం. 35 సంవత్సరాలుగా ఎవరికి వారు బతుకుతున్నాం. ఆమె వ్యా పారంలో అంచెలంచెలుగా ఎదిగింది. నేను నా స్థాయిలో వున్నాను. ఓ ఫౌండేష న్‌ని ఏర్పాటు చేశాను. బిజినెస్‌ స్కూలుకు బోర్డు మెంబర్‌గా వున్నాను. దీనితో పాటు అమెరికన్‌ ఇండియా ఫౌండేషన్‌లో కూడా భాగస్వామిగా వున్నాను’ అని చంద్రిక వారి మధ్య గల ప్రత్యేకతలను చెబుతున్నారు. అంతే కాదు..ఇంద్రా నూయి చంద్రికకు ఎంతో సపోర్టుగా కూడా వుంటారు. సంగీతం వైపుకు వెళ్లేందుకు మార్గదర్శకురాలు కూడా. ఈ విజయం అనేది ఆమెకు ఓ స్వీట్‌ న్యూస్‌. భవిష్యత్తులో తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుని ముందుకెళ్ళేందుకు ఇప్పుడు చంద్రిక సిద్ధమవుతోంది. ఆమెకు ఆల్‌దిబెస్ట్‌.

Wednesday, February 16, 2011

పేదింటి పెద్ద '' జ్యోతి ''

కొందరు గాలిలో దీపం పెట్టి దేవుడా అంటారు.
జ్యోతి తన జీవితానికే తానే చేతులు అడ్డం పెట్టుకుని దాని వెలుతురు ఆరిపోకుండా చూసుకోగలిగింది.
కొందరు ఎవరైనా తమకు ఉద్యోగం ఇస్తే బాగుండు అనుకుంటారు.
జ్యోతి నాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వరు అని పోరాడుతుంది.
కొందరు అమెరికాను చూసొస్తే చాలు అనుకుంటారు.
జ్యోతి నేనెందుకు అమెరికాలో స్థిరపడకూడదు అని భుజాలకు రెక్కలు కట్టుకుంటుంది.
జ్యోతి కథ ఒక సినిమా కథకు తక్కువకాని కథ. సినిమా తీయదగ్గ కథ.
ఫిక్షన్ కంటే అరుదుగా ఉండే జీవితంలాంటి కథ.
ఆమె కథ చాలామందికి దీపంలాంటిది. దారిలాంటిది. జీవనజ్యోతిలాంటిది.


‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే సూత్రాన్ని గట్టిగా విశ్వసించారు అనిల్‌జ్యోతి. వరంగల్ జిల్లా నర్సింహులుగూడెంలోని ఒక సాధారణ కుటుంబంలోని ఐదుగురు తోబుట్టువుల్లో ఒకరైన జ్యోతి ప్రస్తుతం అమెరికాలో ఏటా నాలుగు మిలియన్ డాలర్ల టర్నోవరున్న ‘కీ’ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు అధినేత. అంతేకాదు, ‘నేర్చుకోవడానికే జీవించు’(లెర్న్ టు లివ్) అనే నినాదంతో వృద్ధ, అనాథల ఆశ్రమాలకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. అనిల్‌జ్యోతి తన జీవన పోరాటంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ స్ఫూర్తిని కలిగించేవే.

తల్లి ‘లేని’ పిల్లగా హాస్టల్‌లో...
జ్యోతి తండ్రి వెంకటరెడ్డి టీచర్. ఎమర్జెన్సీలో ఉద్యోగం పోవడంతో పిల్లల చదువులు, వారి పోషణ ఆయనకు భారమయ్యాయి. దాంతో జ్యోతిని ఏదైనా హాస్టల్‌లో వేయాలనుకున్నారు. హన్మకొండలోని ‘బాలసదనం’లో అవకాశముందని తెలిసి అక్కడికి వెళ్లారు. అయితే సదన్ నిర్వాహకులు తల్లిదండ్రులు లేని పిల్లలనే చేర్చుకుంటామనడంతో అప్పటికే ఆర్థికబాధలతో విసుగెత్తిపోయిన తండ్రి ‘అమ్మలేని పిల్ల’ అని చెప్పి జ్యోతిని హాస్టల్‌లో చేర్పించారు. అమ్మ బతికే ఉన్నా అమ్మ లేని అనాథలా హాస్టల్‌లో చేరిన ఘట్టం జ్యోతిని చాలారోజులు బాధించింది. ఆ మాటకొస్తే ఆ బాధ ఇప్పటికీ పోలేదు.

హాస్టల్‌లో ఉన్న జ్యోతిని చూడటానికి అమ్మ వచ్చే అవకాశం లేదు. అప్పుడప్పుడూ వచ్చే నాన్నలోనే అమ్మ సరస్వతమ్మను చూసుకునేది. హాస్టల్‌లో ఉన్న పిల్లలను చూసేందుకు వాళ్ల తల్లులు వచ్చినప్పుడు జ్యోతి హృదయం విలవిల్లాడేది. ఆ బాధను మర్చిపోవడానికి స్నేహితులతో ఎక్కువకాలం గడిపేది. నాన్న ఇచ్చిన గాంధీ, నెహ్రూ, షేక్‌స్పియర్ బయోగ్రఫీలను చదవడం అలవరచుకుంది.

టీచరు ఉద్యోగం కోసం...
వేసవి సెలవుల్లో సదన్ సూపరింటెండెంట్ వాళ్లతోనే ఉంటూ టైపింగ్‌ను నేర్చుకుంది జ్యోతి. అక్కడ టెన్త్ పూర్తయిన తర్వాత టీచరు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఒకేషనల్‌కోర్సులో చేరితే అది పూర్తయిన తర్వాత కాని తెలియలేదు జ్యోతికి... ఆ కోర్సుతో టీచర్ ఉద్యోగం రాదని! జ్యోతి హతాశురాలయ్యింది. చదువుకుంటానని మొత్తుకుంది. కాని ఇంట్లో వినకుండా పెళ్లి చేసేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్తగారి కుటుంబం జ్యోతి కుటుంబానికి దగ్గరి బంధువులే అయినా అప్పటిదాకా పెరిగిన హాస్టల్ జీవితానికి పూర్తిగా భిన్నంగా అనిపించిందామెకు. వ్యవసాయ కుటుంబం కావడంతో పనులు చేయడానికి పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని చేస్తున్నా సరే ఏదో వెలితి ఆమెను వెన్నాడటం మానలేదు. అప్పుడే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ రావడంతో అతికష్టం మీద జ్యోతి అందులో చేరింది. ఉద్యోగరీత్యా జిల్లా అంతా తిరగాల్సి వచ్చేది. దాంతో వరంగల్‌కు మకాం మార్చి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. ఎలాగో టైలరింగ్ నేర్చుకుని లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. అప్పుడే టైపింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. అప్పుడు వచ్చిన ఓ ఆలోచన ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
చదువే కీలకం...
ఏ జీవితమైనా బాగుపడాలంటే చదువు ముఖ్యం. తనకు చదువు పెద్దగా లేదు. అందుకే ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది జ్యోతి. కష్టపడి ఫీజు డబ్బులు సమకూర్చుకుని ఓపెన్‌యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. అదే సమయంలో పరిచయస్తులు కొందరు లైబ్రరీ పెట్టుకోమని సలహా ఇచ్చారు. లైబ్రరీలోనే టైపింగ్, టైలరింగ్ కూడా. వొకేషనల్ కోర్సుతో పాటు డిగ్రీ ఉండేసరికి టీచరు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే స్పెషల్ టీచరుగా అవకాశం వచ్చింది. భర్తకు సిటిజన్ క్లబ్‌లో ఉద్యోగం రావడంతో జీవితం ఓ గాడిన పడింది. ఉద్యోగం రెగ్యులర్ కావడంతో జీతం పెరిగింది. జీతం వస్తోంది కదా అని ఊరుకోకుండా జ్యోతి అక్కడ కూడా తన వైవిధ్యాన్ని, పోరాట పటిమను నిరూపించుకున్నారు. తాను పనిచేసే స్కూల్లో నాలుగో తరగతి వరకు ఉంటే ఏడోతరగతి వరకు ఏర్పాటు చేయించి స్వంత భవనాలను కూడా సాధించారు. ఆ సమయంలోనే ఎం.ఏ సోషియాలజీ వన్‌సిట్టింగ్‌లో పాసయ్యారు. టీచర్ ఉద్యోగం నుంచి పదోన్నతి పొంది మండల్ చైల్డ్ ఆఫీసరయ్యారు. అయితే అక్కడితో ఆగిపోలేదు!
అమెరికా వైపు...
బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్లాలనుకున్నారు జ్యోతి. దానికి ఉన్న మార్గాలను తెలుసుకున్నారు. ఒక బంధువుకు సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ సంస్థ ఉండడంతో కంప్యూటర్‌కోర్సు నేర్చుకుని వీసా కోసం ప్రయత్నిస్తే తెలుగు మీడియమనే కారణంతో వీసా రాలేదు. హెచ్-1తోనే కాకుండా విజిటర్స్ వీసాపై కూడా అమెరికాకు వెళ్లొచ్చని తెలియడంతో ఆ దిశగా ప్రయత్నించి ఎంతో ఆశతో అమెరికా వెళితే విజిటర్స్ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమతించవని తెలిసి చావుదెబ్బ తినాల్సి వచ్చింది. అయితే భారతీయుల దుకాణాల్లో పనిచేసే అవకాశం మాత్రం ఉండటంతో మూవీ క్యాసెట్‌షాపులో సేల్స్‌గర్ల్ ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత తమ ఊరివాళ్ల సహకారంతో ఓ సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీలో ఉద్యోగం సాధించింది. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న టైపింగ్ ఇందుకు ఉపయోగపడింది. ఆ తర్వాత కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆఫ్ అమెరికా కంపెనీలో రిక్రూటర్‌గా ఉద్యోగం దొరికింది.

ఆ కంపెనీ వారి సహకారంతోటే ముందుగా వీసా ఎక్స్‌టెన్షన్, ఆ తర్వాత హెచ్‌వన్ వీసా సాధించింది. వర్జీనియాలో ఏడాదికి అరవై వేల డాలర్ల ప్యాకేజితో ఉద్యోగం వచ్చింది. దాంతో అమెరికాలో ఆమె సెటిల్ కాగలిగింది. ఎలాగైనా సరే అమెరికాలో బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్న జ్యోతి ఓ పార్ట్‌నర్‌ని చేర్చుకుని చిన్న వ్యాపారం ప్రారంభించింది. కొన్నాళ్లకు ఆమె శ్రమ ఫలించి వ్యాపారంలో లాభాలు కళ్లజూసింది. జీవితంలో ఒక్కసారైనా అమెరికాను చూసిరావాలని కలలుకనే సగటు భారతీయులుగానే ఆలోచిస్తే ఆమె జ్యోతి ఎందుకవుతుంది? అమెరికాలో సంపాదించిన ఆస్తులు, వాటి సముపార్జనలో ఎదురైనఅనుభవంతో గ్రామీణ భారతంలోని ‘మహిళా సాధికారత, స్వావలంబన’ కోసం ‘లెర్న్ టు లివ్’ ఫౌండేషన్ ద్వారా పనిచేయాలని నిర్ణయించుకుంది.

‘‘మహిళ సంపాదనపరురాలైతే భర్త, పిల్లలు, బంధువులు, సమాజం అంతా గౌరవిస్తుంది. ఆ కుటుంబ కొనుగోలుశక్తి, ఆర్థిక, సామాజిక స్థితి అంతా పెరుగుతుంది. అన్ని కుటుంబాలు ఇలాగే ఉంటే బంధువర్గం, సమాజం, దేశం అంతా అభివృద్ధి చెందుతారు’’ అని చెబుతున్న జ్యోతి జీవితంలోని చివరిమజిలీ దాకా నేర్చుకుంటూనే ఉంటానని ఉత్సాహంగా చెబుతున్నారు. ఈ ఉత్సాహం ప్రతి మహిళకూ ఆదర్శం కావాలి.

ఆడపిల్ల పరాన్నజీవి కాదు
ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన జీవితాంతం తండ్రి, భర్త, పిల్లలు ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉండాలా? లింగ భేదానికి అతీతంగా ప్రతివారు పనిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదు. అలాగని కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాల్లేకుండా ఉండాలనేది నా అభిమతం కాదు. పని సంస్కృతికి ప్రతి గ్రామీణ మహిళా అలవాటు పడాలి. ఇందుకోసం గ్రామీణప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, శిక్షణ, ఉపాధి వంటి వాటికోసం నా శక్తిని, అనుభవాన్ని ఉపయోగించాలని ఉంది.
 
- అనిల్‌జ్యోతి
http://www.facebook.com/video/video.php?v=10150221623072386&comments

Friday, February 4, 2011

బిలియనీర్ల విలాసాలు * అత్యంత ధనికులు నలుగురి సరదాలు.

జుట్టున్నమ్మ ఏ ముడైనా వేయగలదని డబ్బున్న వారు ఏమైనా చేయగలరు.ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా పేరుపొందిన వారు ఎల్లవేళలా సంపాదన యావలో ఉంటారని, డబ్బులు లెక్కచూసుకుంటూ కాలం గడుపుతారని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. వారికీ సరదాలు ఉంటాయి.కాకపోతే అవి కొంచెం ఖరీదైనవి అయి ఉంటాయి అంతే! మన దేశంలో అత్యంత ధనికులుగా పేరుగాంచిన నలుగురి సరదాలు ఏమిటో తెలుసుకుందాం..

mukeshambani_bbj2ఐశ్వర్యవంతులు తమ సరదాల కోసం లలు, కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తమకేదేమైనా ఇష్టమైతే ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.అది ఒక పడవ కావచ్చు, విమానం కావచ్చు లేదా ద్వీపమే కావచ్చు. అది ఏదైనా సరే వారి మనసు దాని పైకి మళ్లిందో అది వారి స్వంతం కావలసిందే. ఇటువంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుంటే అమ్మో...అనకుండా ఉండలేము.

హై ఫ్లయింగ్‌ బిలియనీర్‌...
మన దేశంలోని ధనవంతులలో మొదటి స్థానాన్ని ఆక్రమించే ముఖేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఎంత కష్టపడతారో తన సరదాల కోసం అదే విధంగా ఖర్చుచేస్తారు. ఆయన తన భార్యా పిల్లలతో సరదాగా గడిపేందుకు ఎంత డబె్బైనా ఖర్చుచేస్తారు. ఇందుకోసం ముఖేష్‌ ఇటీవల బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌2 విమానాన్ని కొను గోలు చేశారు. ఇందులో ప్రత్యేకంగా హోటల్‌ తో పాటు బోర్డు రూమ్‌ కూడా ఉంది. వీటిలో చక్కగా ఎంజాయ్‌ చేసేందుకు అవసర మైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. 1,004 చదరపు అడుగుల ఈ ప్లేన్‌లో తన కోసం ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీస్‌, ప్రైవేట్‌ సూట్‌ను ఏర్పాటు చేసుకున్నారు ముఖేష్‌ అంబానీ. ఆయనకు తన భార్య నీతా అంటే ప్రాణం. ఆమె బర్త్‌డే గిఫ్ట్‌గా ఏకంగా 60 మిలియన్‌ డాలర్ల ఎయిర్‌ బస్‌ను కొనుగోలుచేసి ఇవ్వడం మరో విశేషం. ఇ తన పిల్లల కోసం ఏమి కొంటారో వేచి చూడాల్సిందే.

కార్లంటే ప్రాణం...
lamborghini_ambani_anilబిలియనీర్‌ సోదరులలో పెద్దవాడైనా ముఖేష్‌ అంబానీ లాగే అనిల్‌ అంబానీకి సైతం కొన్ని రకాల ఇష్టాలున్నాయి. అనిల్‌ అంబానీకి స్పీడ్‌గా వెళ్లే కార్లంటే ప్రాణం. వేగంగా వెళ్లే ఆరు లగ్జరీ కార్లను ఆయన కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారు. లాంబ్రోగిని గల్లార్డో, మెర్సీడీజ్‌ ఎస్‌ క్లాస్‌, మేబ్యాచ్‌, బిఎండబ్ల్యూ 7 సీరీస్‌, అడీ క్యూ7, రాల్స్‌ రా యిస్‌, పోర్స్చ్‌, లెక్సస్‌ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మన దేశంలో ఇంతటి ఖరీదైన కార్లు మరెవరి దగ్గరి కూడా లేవంటే అతి శయోక్తి కాదు.ఈ విలాసవంతమైన కార్ల కోసం ఆయన తన నివాసం వద్ద ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా ఏర్పాటుచేసుకున్నారు.

ద్వీపాన్ని సొంతం చేసుకొని...

విదేశాల్లో నివసిస్తున్న ఎన్‌ఐఆర్‌ బిలియనీర్లలో ఒకరు బాబ్‌ ధిల్లాన్‌. కెనడాలో నివసించే ఈ ఇండియన్‌ బిలియనీర్‌ అమెరికా బెలీజ్‌ ప్రాంతం సమీపంలో ఏకంగా 2300 ఎకరాల ద్వీపాన్ని కొనుగోలుచేశారు.సెంట్రల్‌ అమెరికన్‌ ఐలాండ్‌ అయిన దీన్ని ఆయన ఎంతో అందంగా తీర్చిదిద్దారు. పచ్చటి ప్రకృతితో కళకళలాడే ఈ ద్వీపంలో ధిల్లాన్‌ తన నివాసాన్ని భారీగా నిర్మించుకున్నారు. ఇక ఈ సిఖ్‌ బిలియనీర్‌ ఐలాండ్‌ పొరుగున హాలీవుడ్‌ స్టార్‌ లియోనార్డో డి కాప్రియో ద్వీపం ఉండడం విశేషం.

ద కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌...
bob_dhillon-islandఈ మాట అనగానే అందరికీ గుర్తొచ్చేది లిక్కర్‌ కింగ్‌ విజయా మాల్యా అని. ఈ ఐశ్వ ర్యవంతుడు విలాస వంతమైన మనిషిగా పేరు గాంచారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత కూడా అయిన ఈ బిలియ నీర్‌కు విలాసవంతమైన బోట్లు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇటీవల 450 కోట్ల రూపాయలను వెచ్చించి ఖతారి రాయల్స్‌ 95 మీటర్ల బోటును కొన్నారు. ఇండియన్‌ ఎంప్రెస్‌ని దీనికి పేరుపెట్టారు. నీటిపైన తేలియాడే ఖరీదైన ఈ ప్యాలెస్‌ బోటును ఎంతో అం దంగా నిర్మించారు.ఇందులో ప్రఖ్యాత ఆర్టిస్ట్‌లు రెనాయిర్‌, చగల్‌ పెయింటిం గ్స్‌ను ఏర్పాటుచేయడం విశేషం.

ఇందులో విలాసవంతమైన సౌకర్యాలె న్నింటినో సమకూర్చారు. ఈ బోటులో మసా జ్‌, సోనా రూమ్‌లను ఏర్పాటుచేశారు. ఇం దులో హాయిగా సేద తీరవచ్చు. ఎల్టన్‌ జాన్‌ పియానో కూడా ఇందులో ఉంది. కొద్ది రోజుల క్రితం సూపర్‌ మోడల్‌ హైదీ క్లమ్‌, ఆమె భర్త సీల్‌ తమ ఆరుగురు పిల్లలతో కలిసి ఈ బోటుపై సరదాగా గడి పారు. ఇందులో ఉన్న విలాసవంతమైన సౌకర్యాలను చూసి వారు ఆశ్చర్యపోయారు.కొద్దిరోజుల పాటు ఈ బోటులో నివసించి వారు చక్కగా ఎంజాయ్‌ చేశారు.

ఖరీదైన బోటులో షికారు...
feratti_sunny_dewanరియల్‌ ఎస్టేట్‌ మొగల్‌గా పేరుగాంచిన సన్నీ దీవాన్‌ దేశంలోని టాప్‌ బిలియనీర్లలో ఒకరిగా నిలుస్తారు.ఈ బిలియనీర్‌ 527 కోట్ల రూపాయలతో ఫెర్రెట్టీ 881 బోటును కొన్నారు. 90 అడుగుల ఈ బోటులో విలాసవంతమైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకెళ్తుంది. సముద్రంపై షికారుకెళ్లే సన్నీ దీవాన్‌ తర చుగా తన బోటును గేట్‌ఆఫ్‌ ఇండియా వద్ద పార్క్‌ చేస్తుం టారు. ఈ బోటును తిలకించేందుకు పర్యాటకులు అక్క డికి వస్తుంటారు.బాగున్నాయి కదూ మన వారి టేస్టులు? ఏమైనా పైసా మె హై పరమాత్మ.