Monday, January 31, 2011

గణతంత్రమా ? కు(టుంబ)తంత్రరాజ్యమా?


india-poltics
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీర్తి అందుకుంటున్న భారత దేశంలో రాచరికపు, వారసత్వ లక్షణాలు బలపడడం ఒక వైచిత్రి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది. పార్లమెంటే కాదు అనేక రాష్ట్ర అసెంబ్లీలలో పరిస్థితి ఇదే. అంతెందుకు? మన రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న ప్రజాస్వామిక నిర్వచనం ఇక్కడ పని చేయడం లేదు. కుటుంబం కొరకు, కుటుంబం వలన, కుటుంబం చేత నాయకులు తయారవుతున్నారు.

ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మరణిస్తే ఆ స్థానాన్ని మరో దీటైన నాయకుడితో నింపకుండా భార్యకో, కుమారిడికో ఇవ్వడం దానిని వారి కుటుంబ జమీన్‌లా కట్టబెట్టడం వెనుక రాజకీయ పార్టీల నిస్సహాయత, స్వార్థమూ రెండూ కనిపిస్తాయి. ఒక నాయకుడు కష్టపడి పైకి ఎదిగి ఒక స్థానాన్ని సాధించుకోవడం వెనుక అతడి శ్రమ, నిబద్ధత రెండూ ఉంటాయి. అయినంత మాత్రాన అతడు మరణించగానే ఆ స్థానాన్ని కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని చూడడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.

list1 ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్‌ గాంధి కొడుకు రాహుల్‌, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్‌ , మాధవ్‌రావ్‌ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్‌ పైలెట్‌ కొడుకు, ఒమర్‌ అబ్దుల్లా బామ్మర్ది సచిన్‌, ఫరూక్‌ అబ్దుల్లా కొడుకు, షేఖ్‌ అబ్దుల్లా మనవడు ఒమర్‌ అబ్దుల్లా, ములాయమ్‌ సింగ్‌ యాదవ్‌ కొడుకు అఖిలేశ్‌, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్‌సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది.

ఇప్పటి యువ నాయకులు ప్రపంచం చుట్టివచ్చారు. ప్రతిభపై ఆధారపడ్డ కొత్త కార్పొరేట్‌ సంస్కృతిని అలవరుచుకున్నారు. ఆధునిక భారతదేశాన్ని అవతరింపచేయడం కోసం కృషిచేసినవారి వారసులుగా వీరిని వీరు పరిగణించుకుంటున్నారు. ఏ దిక్కుకేసి చూచినా కుటుంబరాజకీయాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దాని ఫలితాలు చాలా స్వల్పమైనవి.

list లక్షద్వీప్‌ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్‌ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్‌పవార్‌ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది.

రాజకీయాల్లో బంధుప్రీతి ఎంతగా పాతుకుపోయిందంటే ప్రజాస్వామ్యంపై దాని ప్రభావాన్ని అంచనా వేయలేము. వంశానుగత వారసత్వ రాజకీయాలు ఎంత లోతుగా పాతుకుపోయిందో ఊహకందదు.
ఈ కుటుంబ వ్యవస్థ వల్ల మంచి సత్తా ప్రతిభ వున్న వారు మొగ్గ దశలోనే రాజకీయరంగానికి దూరమవుతున్నారు. ఇక్కడ సమస్య వారసత్వం మాత్రమే కాదు. ప్రముఖ నాయకుడి పిల్లల్ని, వితంతువుల్ని, బామ్మర్దుల్ని రంగంలోకి దింపి కుటుంబం అధికారాన్ని బలోపేతం చేసుకుం టున్నాయి రాజకీయ పార్టీలు. అర్హులు కాకపోయినా ప్రముఖ నాయకుల పిల్లలు రాజకీయల్లోకి ప్రవేశించాలని ఆశిస్తారు.

వారసత్వం అధికంగా ఉన్న పార్టీలు...
farukhపార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్‌పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్‌సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్‌ఎల్‌డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్‌సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్‌సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు.

ఇది ప్రాంతీయ అంశమా..
ఇక్కడే విభిన్న రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. పంజాబ్‌,ఢిల్లీ, హర్యానాల్లో కుటుంబ రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయి. ఆ తర్వా త గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌ కాక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 75 శాతం పైచిలుకు ఎంపీ లు వారసత్వేతర నేపథ్యానికి చెందినవారని తెలుస్తోంది. సాధారణంగా ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ వంటి 2000 సంవత్సరంలో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రాల్లో బంధుప్రీతి అంత గా లేదని చెప్పుకోవాలి. కుటుంబ రాజకీయాలు బలపడ్డానికి సమయం బహుశా సరిపోలేదు.


రాష్ట్రంలో సంచలన వారసత్వం
ap-pమన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్‌ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్‌కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.

mchannareddy లోక్‌సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్‌లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు.

ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉత్తర భారతమంతటా శాసన సభ్యులు తమ పిల్లల్ని, పెళ్ళాల్ని వారసులుగా నియమిస్తున్నారు. 38 అతి కుర్ర ఎంపీల్లో 33 మంది మమ్మీ-డాడీ సహాయంతో వచ్చినవారే. మిగతా 5గురిలో ఒకరు రాహుల్‌ ఎంపిక చేసిన మీనాక్షి నటరాజన్‌. మరో ముగ్గురు స్వయం కృషితో పైకి వచ్చిన బిజెపి,బిఎస్‌పి ,సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు. మరొక సభ్యుడు మాయావతి ఎంపిక చేసిన వారు.

దక్షిణాదిలో బలమైన వంశ వృక్షం
south-polticsదక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.

సుదీర్ఘకాల వారసులు ఎక్కువ సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ లో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. వలస పాలకులు మన రాజ్యాధికారాన్ని దేశంలోని రాజరిక కుటుంబాలకు హస్తగతం చేయకూడదన్న నిజం పునాదిగా భారత గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. కానీ తీరా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌ సభ కాక ఒక వంశ సభ ఆవిర్భవించినట్టు కనిపిస్తోంది. వారసత్వ పాలన రాకుండా ఉండేందుకు నెహ్రూ,పటేల్‌,వి.పి.మీనన్‌ తదితరులు బృహత్తరమైన కృషిచేశారు. 554 రాజరిక రాజ్యాలు ఆధునిక ప్రజాస్వామిక దేశంలో విలీనం చేయడానికి పాటుపడ్డారు. దేశంలో సర్వసత్తాక అధికారం ప్రజాపరంగానే వుండాలన్న సూత్రంగా స్వతంత్ర భారత రాజ్యాంగం ఆవిర్భవించింది.

కానీ ఈ రోజు దేశం కొత్తగా కొన్ని ప్రాంతాలుగా విడిపోయింది. కొన్ని స్థానిక కుటుంబాల చేతుల్లో రాజ్యాధికారం బందీ అయిపోయింది.

No comments:

Post a Comment