Wednesday, November 2, 2011

సృజనాత్మకతయే వీరి సంపద

నేటి గ్లోబలైజేషన్‌ కాలంలో డబ్బు కళ్లముందు కనబడుతూనే మాయమౌతుంది. సంపాదించిన డబ్బుని నిలుపుకోవడమే కాకుండా దాన్ని రెట్టింపు చేయడం కొంత కష్టమైన విషయం.వేల కోట్లల్లో టర్నోవర్‌ఉండే కంపెనీలపై కొన్ని లక్షలమంది ఆధారపడతారు. అలాంటి సంస్థను అనునిత్యం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు నేటి మహిళలు.అంతే కాకుండా అత్యంత సంపన్నవంతమైన వ్యక్తులుగా అవతరిస్తున్నారు. ఇటీవలే ఫోర్స్బ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన సంపన్న జాబితాలో పలువురు భారతీయ మహిళలు కూడా ఉన్నారు. వారి గురించి............

సావిత్రి జిందాల్‌

jindal 

సావిత్రి జిందాల్‌ తన భర్త ఓం ప్రకాశ్‌జిందాల్‌ 2005లో మృతి చెందిన తరువాత ఆయన స్థానంలో కంపెనీ బాధ్యతలను చేపట్టి ప్రస్తుతం ‘జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు చైర్‌పర్సన్‌’గా కొనసాగుతున్నారు.గత నాలుగు సంవత్సరాల నుంచి భారతదేశంలోనే అత్యంత సంపదగల మహిళగా కొనసాగుతూనే ఉన్నారు.ఒ మ్యాగజైన్‌ ప్రకారం ఆమె సంపద విలువ దాదాపు 14.4 బిలియన్‌ డాలర్లుంటుందని అంచనా.గత ఏడాది ఆడాగ్‌ చైర్మన్‌ అంబాని మూడవస్థానం నుంచి ఆరవస్థానానికి చేరడంతో 13.3 బిలియన్‌ల డాలర్లతో ఏడవస్థానంలో నిలిచారు.ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకారం 2011లో ప్రపంచంలోని అత్యంత సంపదకల వ్యక్తులలో 56వ స్థానాన్ని సంపాదించారు.జిందాల్‌ సంస్థ దేశంలోనే అత్యధిక స్టీల్‌ను ఉత్పత్తి చేసే సంస్థల్లో ఒకటి. వీటితో పాటు పవర్‌, మైనింగ్‌,ఆయిల్‌,గ్యాస్‌, మౌలికసదుపాయాల ల్పన వంటి కార్యకలాపాలను కొనసాగిస్తుంది.

ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : సావిత్రి జిందాల్‌
పుట్టినతేది  : మార్చి20,1950
భర్త   : ఓ.పి.జిందాల్‌
ప్రస్తుత హోదా : జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ 
    చైర్‌పర్సన్‌, హార్యాన విధాన సభ
    నుంచి ఎమ్‌ఎల్‌ఏ.
ర్యాంకు  : 56
బాధ్యతలు చేపట్టిన సం : 2005
సంపద  : 14.4 బిలియన్‌ డాలర్లు 


కిరణ్‌ మజుందార్‌ షా

kiran-original 

భారతదేశంలో అత్యంత సంపన్నమైన మహిళలలో కిరణ్‌ మజుందార్‌ షా ఒకరు.ఆమె మొత్తం సంపద విలువు 9 వందల మిలియన్‌ డాలర్లు.భారతదేశంలో మొదటి బయోటెక్నాలజీ సంస్థ ‘బయోకాన్‌ లిమిటెడ్‌’ను కిరణ్‌ మజుందార్‌షా 1978లో ప్రారంభించారు.అయితే ఈ సంస్థకు నిధులను సమకూర్చడానికి ఏ బ్యాంకు ముందుకు రాలేదట. ప్రయత్నంలో భాగంగా ఐ.సి.ఐ.సి.ఐ వెంచర్‌ మాజీ చైర్మన్‌ నారాయణ్‌ వాగుల్‌ను సంప్రదించారు. ఈ ప్రాజెక్టు గురించి విని, అందులోని అంశాలను పరిశీలించాక ‘ ఇలాంటి ప్రాజెక్టులకు నిధుల సమకూర్చాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాపారంలో ఉన్నాము’ అని తెలిపారట. కిరణ్‌ మజుందార్‌ తన పరిజ్ఞానాన్ని అమెరికన్‌ పండ్ల రసాల కంపెనీకి చెందిన ఓషియన్‌ స్ప్రేలో తను అభివృద్ధి చేసిన ఎంజైమ్స్‌ను వాడారు.నేటికీ అదే సాంకేతికతను వాడుతుండటం తనకు గర్వకారణం అని చెబుతుంటారు.తను అద్దెకు ఉంటున్న ఇంట్లోని గ్యారెజ్‌లో రూ.10వేలతో ప్రారంభమైన బయోకాన్‌ నేడు ప్రపంచంలోని టాప్‌-20 బయోటెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా, బిలియన్‌ డాలర్‌ కంపెనీగా, ఆసియాలోనే అతిపెద్ద బయోఫార్మా కంపెనీగా అవతరించింది. ఐ.సి.ఐ.సి.ఐ వెంచర్‌ మాజీ చైర్మన్‌ నారాయణ్‌ వాగుల్‌ ఆమె గురించి తెలుపుతూ ‘ తన ఆత్మవిశ్నాసంపై ఎలాంటి సందేహం కలగలేదు. నా ఆఫీస్‌కు వచ్చి నాతో అరగంట తన ప్రాజెక్టు గురించి, తన ఆశయాల గురించి చర్చించినప్పుడే అనుకున్నాను తను మంచి స్థాయికి చేరుతుందని.
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : కిరణ్‌ మజుందార్‌ షా
పుట్టినతేది  : మార్చి 23,1953
ప్రస్తుత హోదా : మ్యానేజింగ్‌ డైరక్టర్‌- చైర్మన్‌, బయోకాన్‌ 
సంపద  : 900 మిలియన్‌ డాలర్లు


ఇందు జైన్‌
indu 

భారతదేశంలో ఉన్న బిలియనీర్‌లలో ఇందు జైన్‌ ఒకరు.ఇందు జైన్‌ ్రపస్తుతం దేశంలోని అతిపెద్ద మీడియా గ్రూప్‌ ‘ బెన్నెట్‌ ,కాలమన్‌ అండ్‌ కో.లిమిటెడ్‌’ సంస్థకు చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.అమె బాధ్యతలను స్వీకరించిన తరువాత ‘ది టైమ్స్‌ గ్రూప్‌’ భారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించింది.సంపద విలువ 3 బిలియన్‌డాలర్లు. సాహు జైన్‌కుటుంబానికి చెందిన ఆమెకు ఇద్దరు కుమారులు. ఆమె మంచి ఆర్థిక వేత్తతో పాటు మంచి ఆధ్యాత్మిక సేవా చింతన గల వ్యక్తి కూడా.మానవతా వాదానికి ప్రాధాన్యతనిస్తారు.అందుకే ‘ది టైమ్స్‌ ఫౌండేషన్‌’ను ప్రారంభించి సామాజక సేవకు పూనుకున్నారు. ఈ ఫౌండేషన్‌ సామాజిక సేవను,వరదలు, తుఫాను వంటి విపత్కర సమయాల్లో అన్ని విధాలుగా ఆదుకోవడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది.అంతే కాకుండా మహిళల అభ్యున్నతికి పాటుపడుతుంటారు
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : ఇందు జైన్‌
సంతానం  : ఇద్దరు
ప్రస్తుత హోదా : బెన్నెట్‌ ,కాలమన్‌ అండ్‌ 
    కో.లిమిటెడ్‌ సంస్థకు చైర్మన్‌
సంపద  : 3 బిలియన్‌ డాలర్లు 
ఇతర కార్యలాపాలు : ది టైమ్స్‌ ఫౌండేషన్‌ ద్వారా సేవా 
    కార్యక్రమాలను చేపట్టడం

అను ఆగా
anu 

థెర్మాక్స్‌ గ్రూప్‌కు చెందిన అను ఆగా ఫోర్స్బ్‌ మ్యాగజైన్‌ అత్యంత సంపన్నుల జాబీతాలో 51వ స్థానాన్ని సంపాదించింది. ఆమె సంపద విలువ 1.24 బిలియన్‌ డాలర్లు.ఆమె థెర్మాక్స్‌ లిమిటెడ్‌ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించారు. ఎనెర్జీ , ఎన్విరాన్‌మెంట్‌ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించే ఈ కంపెనీ విలువ 1996-2004 మధ్యకాలంలో రూ.3246 కోట్లకు చేరింది.ఈ కాలంలో ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా అను వ్యవహరించారు.2007లో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ సిద్ధం చేసిన అత్యంత సంపద కల భారతీయ మహిళల్లో ఎనిమిదవ స్థానంలో నిలిచారు.కంపెనీ బాధ్యతలను నుంచి విరమణ తీసుకున్నాక సామాజిక సేవపై దృష్టి కేంద్రీకరించారు. అమె సామాజిక సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారత ప్రజలకు అందించే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ‘పద్మ శ్రీ’తో సత్కరించింది.
ప్రోఫైల్‌..

పూర్తిపేరు  : అను ఆగా
పుట్టినతేది  : ఆగస్టు 3,1942
జన్మస్థలం  : ముంబై
చేపట్టిన పదవి :మాజీ చైర్మన్‌, థెర్మాక్స్‌ లిమిటెడ్‌

No comments:

Post a Comment