Friday, January 20, 2012

లేడీ ఆఫ్‌ లెన్స్‌ - Homai Vyarawalla

 http://www.thehindu.com/multimedia/dynamic/00640/29SMHOMAI3_640893f.jpg

 

1947 ఆగస్టు 15న రెడ్ ఫోర్ట్‌లో తొలిసారి భారతీయ త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడు ఆమె అక్కడుంది. ఆమె స్వతంత్ర భారత చిత్రాన్ని ఒక దేశంగా చిత్రీకరించింది. . ఆమె తన ఫొటోగ్రఫీలో భారతదేశ అసలు రంగులను బ్లాక్‌ అండ్గ వైట్‌లో అందించారు. అప్పుడే అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని ఆమె తన ెకమెరా కళ్లతో చూశారు. వారసత్వంగా వాటిని భారతదేశానికి అందించారు. 
హోమి  వ్యరవల్ల  ( Homai Vyarawalla )  మనదేశానికి చెందిన తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్‌గా చరిత్ర సృష్టించారు. 

http://www.indianetzone.com/photos_gallery/10/Homai-Vyarawalla_2162.jpg
http://www.thehindu.com/multimedia/dynamic/00628/Bangalore_CITY_Page_628623e.jpg
 http://static.dnaindia.com/images/cache/1637909.jpg
ప్రొఫైల్‌
పూర్తి పేరు : Homai Vyarawalla
పుట్టిన తేది: 1913 డిసెంబర్‌ 13
జన్మస్థలం : నవ్‌సారి, గుజరాత్‌
భర్త : మాణిక్‌షా వైరావల్లా
సంతానం :ఫారుఖ్‌
వృత్తి :ఫోటో జర్నలిస్ట్‌

http://www.hindustantimes.com/Images/2011/4/6d14c51b-c505-4c7a-9853-623d11892850MediumRes.JPG
President Pratibha Patil presents the Padma Vibhushan award to first woman photojournalist Homai Vyarawalla during a function at the Rashtrapati Bhavan in New Delhi.

తొలి మహిళా ఫోటో జర్నలిస్ట్‌http://26.media.tumblr.com/tumblr_lxuf4kUBtW1qgxsx4o1_500.jpghttp://farm2.static.flickr.com/1074/5098501900_3d738b4cf9.jpg
A photo by Homai at the wedding of M.K Natarajan, her only surviving colleague
 Homai is the second woman to the right of the groom
 http://api.ning.com/files/bWHzqflReDtNpNlEZdhXwVjR9nSpUfWqow-HhkRN8hlaluo3HVtZO9yLg5yp8a1phmVcQbeC9MSfP-rI91yHoPtc75Vpx8Io/JawaharlalNehruDelhi1955.jpg
http://s.wsj.net/public/resources/images/OB-QX004_iparti_E_20111207025648.jpg
హోమై ఫోటో జర్నలిస్ట్‌గా తన కెరీర్‌ను 1930లో ప్రారంభించారు. తరువాత జాతీయ వ్యాప్తంగా మంచి ఫోటో జర్నలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 1942లో ఆమె తన కుటుంబంతో సహా ముంబైకు మకాం మార్చారు.తరువాత ఢిల్లీకి మారారు. ముప్పయ్ సంవత్సరాల పాటు ఢిల్లీలోనే ఉంటూ ఆమె అనేక మంది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకుల చిత్రాలను క్లిక్‌మని పించారు. 
 Jawaharlal Nehru during an informal botany class with his grandsons, Rajiv and Sanjay Ghandi. 1950
Silver gelatine print
 http://www.tribuneindia.com/2006/20060319/spectrum/lead7.jpg
 A rare photograph by Homai of Feroze Gandhi with Indira at a political rally
 
మహాత్మా గాంధీ, జవహార్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ, నెహ్రూ - గాంధీ కుటుంబం చిత్రాలను తీశారు.
http://www.thehindu.com/multimedia/dynamic/00169/20DFR_HOMAI_169801e.jpg
Jawaharlal Nehru meeting his sister Vijaya Lakshmi Pandit. Photo: Homai Vyarawalla.




http://deshgujarat.com/wp-content/uploads/2012/01/Nehru.gif

ఆణిముత్యాలు..ఆమె చిత్రాలుhttp://www.fravahr.org/IMG/jpg/HomaiVyarawalla_s-2.jpg 
Homai Vyarawalla at a photo session with Indira Gandhi
 
హోమై క్లిక్‌ మనిపించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను 2010లో కొత్త ఢిల్లీలోని ‘నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌’లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు అల్కాజీ ఫౌండేషన్‌ సహకరించింది. హోమై తన కెరీర్‌లో ఆణిముత్యాల్లాంటి ఎన్నో ఫోటోలను తీసింది. జవహార్‌లాల్‌ నెహ్రూ ఫోటోలను తీయడం అంటే ఆమె చాలా ఇష్టమని ఒక సందర్భంలో తెలిపారు. అందుకే ఇతర ఏ ఫోటోగ్రాఫర్‌ తీయలేని నెహ్రూ చిత్రాలను ఆమె తీసింది. నెహ్రూ సిగరెట్‌ తాగుతూ, ఆకాశంలో శాంతి కపోతాన్ని ఎగురవేస్తూ, ఫోటోగ్రఫీ అను మతి లేదు అనే బోర్డు పక్కన నెహ్రూ ఉన్న సమయంలో ఇలా ఎన్నో చిత్రాలను తీసింది హోమై.

మహాత్ముడి చిత్రాలు
 http://www.asianartnewspaper.com/files/imagecache/large/files/W3DX%20Image%2016%20Gandhi.jpg
మహత్మా గాంధీ చిత్రాలను భావితరాలకు అందించడంలో హోమై కీలమైన పాత్ర పోషించారు. మహాత్ముడు రైలు దిగుతుండగా, జనంలో నడుస్తుండగా వంటి అనేక ఫోటోలను తీశారు హోమై. అంతేకాకుండా నాటి ఆమెరికా అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెన్నడి భార్య జాకీ కెన్నడి భారతదేశా నికి విచ్చేసినప్పుడు నెహ్రూ స్వయంగా ఆమెకు తిలకం పెట్టి స్వాగతం పలికే చిత్రం, జాకీ కెన్నడి ఇందిరా గాంధీలో సరదాగా మాట్లాడుకుంటున్న సందర్భం, దలైలామా వంటి ప్రముఖులు చిత్రాలను బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తీశారు. ఇంకా అనేక చారిత్రాత్మక ఘట్టాలను చిత్రరూపంలో సజీవంగా ఉంచారు.
కళలపై ఆసక్తి
 http://zoroastriansnet.files.wordpress.com/2011/02/mrs-kennedy-nehru0001.jpg
హోహై 1913 డిసెంబర్‌ 9న గుజరాత్‌లోని నవసారిలో జన్మించారు. ఆమె ముంబాయి విశ్వవిద్యాలయం నుంచి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. సర్‌.జె.జె. ఆర్ట్స్ స్కూల్‌ నుంచి ఆర్ట్స్ లో ప్రావీణ్యం గడించారు. హోమైకు చిన్న నాటి నుంచే కళలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ప్రతి విష యాన్ని ఆమె కళాత్మకమైన దృష్టితో చూసేవారు. ప్రతి దృశ్యానికి ఒక ప్రత్యేకత ఉంటుందని దాన్ని చూసే కళ్ళపై దాని విలువ ఆదారపడి ఉంటుందని ఆమె నమ్మే వారు.ఆమె గాంధీయిజమ్‌ పై అపారమైన నమ్మకాన్ని ఉంచే వారు. అప్పట్లో మహాత్మా గాంధీ చెప్పే ప్రతి మాట ఆమెను ప్రభావితం చేసింది. ఆమె తన జీవితాన్ని సాధారణంగా, ఆడంబరాలకు దూరంగా గడిపారంటే ఆమెపై ఆ మహాత్ముడి ప్రభావం ఎలా ఉందో గమనించవచ్చు.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6txRLgbKP69dKwajnhpP8If-vF3D1wP9QpxiInGoqgaOf8LhezpnaQ78RR4C3cyYMgiXvzpSA9ilL4ApTTp5llwuKS3BVJ9HdBn1IAPZhz5QfiaRb9qmpPnUZ1qXSYXtfm7rWqKtDGOI/s400/pandit_nehru_photography_strictly_prohibitedy_Homai+Vyarawalla.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEidOkaE_nM9qefQeL4FTl2FKeUtSs2_9JHYjjRVP3WBPZ5iNQAt5u2I3m_NGx1fZSkhEUb9d1aSGFZ0E4Osg1CZ8m2FQZNdYObDWPyfaxjGvVN3hVrNYsptMoEFTJ5rhKV56NLrAEZ0mxk/s400/Jacqueline+Kennedy_pandit_nehru.jpg
Jawaharlal Nehru greets American first lady Jacqueline Kennedy

బ్లాక్‌ &  వైట్‌ 
గత కాలాన్ని చాలా మంది బ్లాక్‌ అండ్‌ వైట్‌గానే ఊహించుకుంటారు. ఆ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే కోటి రంగుల జ్ఞాపకాలను ఆవిష్ర్కతం చేశారు హోమై. ఆమె తన చిత్రాలను ఎప్పుడూ బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే తీసేవారు. ‘ రెండురంగులతో ఎన్నో భావాలను పలికించడం నాకిష్టం. నాకు ఫోటోగ్రఫీ అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ మాత్రమే’ అని ఒక సందర్భంలో ఆమె తెలిపారు. ఆమె సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారత పౌరులకు అందించే రెండవ అత్యున్నత పురస్కారం ‘పద్మవిభూషణ్‌’తో సత్కరించింది. ఆమె ఇటీవలే ఊపితిత్తుల సంబంధిత వ్యాధితో ఇటీవలే కన్నుమూశారు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె ‘ది ఇల్లస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’అనే మ్యాగజైన్‌కు పని చేయడం ప్రారంభించారు.1970 వరకూ ఆమె అందులోనే పని చేశారు. ఆ మధ్య కాలంలో ఆమె అనేక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలను తీసి ముద్రణకు ఇచ్చారు. అవి మంచి గుర్తింపును సాధించాయి.1973లో ఆమె తన భర్తను కోల్పోయింది. దాంతో ఆమె వడోదరకు మకాం మార్చింది.

Tuesday, January 17, 2012

ఫీనిక్స్ జ్యోతి * ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన ఓ పాఠమే!

jyothi telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaగ్రీకు పురాణాల్లో ఫీనిక్స్ అనే పక్షి ఉంటుంది సూర్యుడిని అందుకోవాలని అది ఆశపడుతుంది ఎగిరి.. ఎగిరి.. సూర్యునికి దగ్గరవుతుంది వేడికి రెక్కలు మాడి కింద పడిపోతుంది కానీ దాని కోరిక చావదు
గాయాలు మానాక మళ్లీ ఎగరడం మొదలెడుతుంది ఇది ఫీనిక్స్ పట్టుదలను పాఠంగా నేర్పే కథ! 

ఈమె జీవితం కూడా తెలుసుకోవాల్సిన ఓ పాఠమే!


మైలారం గ్రామం, వరంగల్, 1988లో ఒకరోజు..
ఓ యువతి పొలంలో కలుపుతీస్తోంది.. ‘ఝయ్..’మని ఆకాశంలో ఏదో చప్పుడు... ఆమె ఆసక్తిగా పైకి చూసింది. విమానం! ‘నా జీవితంలో ఎప్పటికైనా ఆ విమానం ఎక్కాలి’ ఆశ పడిందామె. అందులో తప్పులేదు. కానీ ఆమె పరిస్థితులు వేరు. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. బంధాలు.. బంధుత్వాలు.. కట్టుబాట్లు.. వీటి మధ్య ఆమెకది అత్యాశే. కానీ ఆమె అలా అనుకుంటే ఇప్పటికీ ఇంకా అదే పొలంలో పనిచేస్తుండేదేమో!


మే 2, 2000.. బేగంపేట ఎయిర్‌పోర్ట్, హైదరాబాద్
ఫీనిక్స్ ఎంత ఎగిరినా సూర్యుడిని అందుకోలేకపోయింది. కానీ ఆ యువతి కల నెరవేరింది. ఆకాశంలో ఎగరాలన్న ఆశ తీరింది. అమెరికా వెళ్లింది. అంతటితో ఆగిపోలేదు. ఆమె లక్ష్యం మరింత విస్తృతమైంది. ఆమె సంకల్పం ఫీనిక్స్ ఆశ కన్నా గొప్పది. అందుకే ఇప్పుడామె యుఎస్8 బేస్డ్ కంపెనీకి సిఈవో అయ్యింది. ఆమె పేరు జ్యోతి.. అలియాస్8 అనిల్‌జ్యోతి. అమెరికా ఆరిజోనాలో ఫీనిక్స్ అనే నగరం ఉంది. జ్యోతి స్థాపించిన కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కార్యాలయం కూడా అక్కడే ఉంది. అందుకే ఆమె ఫీనిక్స్ జ్యోతి. 
Every successful story has a painful beginning..
- Dr. APJ Abdul కలం

ప్రతి విజయగాథ ఒక బాధాకరమైన పరిస్థితి నుంచే ప్రారంభమవుతుంది.


jyothi_1 telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema పాఠం 1 :No pain no gain ( నో పెయిన్ నో గెయిన్ )
పెయిన్ : వరంగల్ జిల్లా నర్సింహులు గూడెంలో ఒక సాధారణ కుటుంబం. ఐదుగురు తోబుట్టువుల్లో జ్యోతి ఒకరు. ఎమ్జన్సీ టైమ్‌లో తండ్రి వెంకట్‌డ్డి ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు. ‘తల్లిలేని పిల్ల’ అనే అబద్ధంతో జ్యోతిని హన్మకొండ బాలసదనంలో చేర్పించాడు తండ్రి. అమ్మ బతికే ఉన్నా అనాథలా హాస్టల్‌లో ఉండడం జ్యోతిని బాధించింది.


గెయిన్ : హాస్టల్లో ఉండడం వల్ల మమతాను రాగాలకు దూరమైనప్పటికీ ఆ బాధను మర్చిపోవడానికి ఆమె స్నేహితులతో ఎక్కువగా గడిపేది. మిగిలిన సమయం చదువుకు వెచ్చించేది. టెన్త్ ఫస్ట్ క్లాస్8లో పాసయ్యింది. ఇంకా బాగా చదువుకోవాలనుకుంది. వేసవి సెలవుల్లో టైపింగ్ నేర్చుకుంది. టీచరు ఉద్యోగం సంపాదించాలని ఒకేషనల్ కోర్సు చేసింది.


పాఠం 2 : Accept and adart to the reality (వాస్తవాల్ని అంగీకరించాలి... అనుగుణంగా మలుచుకోవాలి)
వాస్తవం : అప్పుడు జ్యోతికి 18 ఏళ్లు. ఒకేషనల్ కోర్సు టీచర్ ఉద్యోగానికి అర్హత కాదని తెలుసుకుంది. ఇంకా చదువుకోవాలనుకుంది. కానీ ఇంట్లోవాళ్లు అప్పటికే పెళ్లి చేశారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లికూడా అయింది. వ్యవసాయ కుటుంబం. పేదరికం. పొలం పనులు చేయడానికి పిల్లలను ఇంటి దగ్గరే వదిలి వచ్చేది. రోజుకు ఐదు రూపాయలు సంపాదన. ఏదో వెలితి. ఇది కాదు జీవితం. ఇంకా ఏదో కావాలి.
చిరుదీపం : జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన పాఠం వాస్తవాల్ని అంగీకరించడం. అవి ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదు. చిరుదీపం వెలిగించాలి. ఆ దీపమే నేషనల్ సర్వీస్8 వాలంటీర్ నోటిఫికేషన్. అతికష్టం మీద జ్యోతి అందులో వెలిగింది. నిన్న మొన్నటి వరకు తనతో కలిసి పనిచేసిన కూలీలకే వయోజన విద్య నేర్పింది.


పాఠం 3 : No condition is permanent ( ఏ పరిస్థితి శాశ్వతం కాదు )
కండీషన్స్ : ఏడాది గడిచింది. నెహ్రూ యువకేంవూదంలో అవకాశం వచ్చింది. కానీ ఇతర ప్రాంతాలు తిరగాలి. అంటే.. మకాం హన్మకొండకు మార్చాలి. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. పిల్లలు తనలాగే బతకకూడదు. వారికి మంచి భవిష్యత్తునివ్వాలి. అంటే.. హన్మకొండకు వెళ్లక తప్పదు. చిన్న ఇనప్పెట్టెలో సామన్లు సర్దుకుని, ఇద్దరు పిల్లల్ని తీసుకుని హన్మకొండకు బయలుదేరింది.
మార్పు : ఏదీ శాశ్వతం కాదు. మార్పు మాత్రమే శాశ్వతం. జ్యోతి కోరుకుంది కూడా అదే. ఉద్యోగం చేస్తోంది. కానీ అదొక్కటే సరిపోదు. టైలరింగ్ నేర్చుకుంది. లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. టైపింగ్ పాసయింది. ఎలాగైనా డిగ్రీ చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు తనని ఆపేవారు లేరు. ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందింది. కష్టపడి స్పెషల్ టీచరుగా ఉద్యోగం సంపాదించింది. 18 నెలల తర్వాత రెగ్యులర్ అయింది.

పాఠం 4 : Work for growth  ( ప్రగతి కోసం కృషి )

కృషి : చేసే పనిలో క్వాలిటీ ఉండాలి. అందులో ఎదిగేందుకు ప్రయత్నించాలి. జ్యోతి అదే చేసింది. పరకాల మండలం రామకృష్ణాపూర్‌లో ఉద్యోగం. 4వ తరగతి వరకు ఉంటుంది ఆ స్కూల్లో. పిల్లలు మాత్రం 16 మందే. అదే ఊర్లో ప్రయివేటు స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. జ్యోతి రోజూ బస్8కు వెళ్లి వచ్చేది. ఆలస్యం అయితే ఆబ్‌సెంట్ వేసేవాడు హెడ్‌మాస్టర్. తిరిగి వెనక్కి రాలేదు. ఆ రోజున ఊళ్లోకి వెళ్లి పిల్లల తల్లిదంవూడులతో మాట్లాడేది. ప్రయివేటు స్కూల్‌కి, గవర్నమెంట్ స్కూల్‌కి తేడా తెలియజెప్పేది. వారిలో మార్పు వచ్చింది. ఏడాదిలోనే గవర్నమెంట్ స్కూల్‌కి సొంత భవనం... 270మంది స్ట్రెంత్. మూతపడిన ప్రయివేటు స్కూల్ టీచర్లకు కూడా ఉపాధి కల్పించింది.
ప్రగతి : నలుగురు చేసే పనిని నలుగురిలా కాకుండా వైవిధ్యంగా తనదైన శైలిలో చేసి విజయం సాధించింది జ్యోతి. ఆ సమయంలోనే ఎంఏ సోషియాలజీ వన్‌సిట్టింగ్‌లో పాసయ్యింది. టీచర్ ఉద్యోగం నుంచి పదోన్నతి పొంది మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయింది.
పాఠం 5 :Never wait for Miracle (అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు)
ప్రగతి కోసం : జీతం పెరిగింది. జీవితం బాగుంది. ఇక చాలు. ఇంతకన్నా సాధించడం వీలుకాదు.. అని సర్దుకుని సంతృప్తి చెందితే ఎదుగుదల ఆగిపోయినట్లే. చాలామంది ఈ కంఫర్ట్ జోన్ కోసమే బతుకుతుంటారు. ఇంకా ఎదగాలంటే జీవితంలో ఏదో అద్భుతాలు జరగాలని ఎదురుచూస్తుంటారు. అలాంటివాప్పటికీ సగటు మనిషిగానే మిగిలిపోతారు. లో ఎయిమ్ ఈజ్ క్రైమ్ అంటారు అబ్దుల్ కలామ్. మన లక్ష్యాలు పెద్దగా ఉండాలి. ప్రయత్నించాలి. కానీ అద్భుతాలు జరగాలని ఎదురుచూడొద్దు. ఈసారి జ్యోతి లక్ష్యం పెద్దది. ప్రయత్నం మొదపూట్టింది.
కృషి : బంధువుల్లో చాలామంది అమెరికాలో ఉండడంతో తను కూడా అక్కడికి వెళ్లాలనుకుంది. కంప్యూటర్ కోర్సు నేర్చుకుంది. వీసా కోసం ప్రయత్నించింది. మరి పిల్లలు? వారికి నచ్చజెప్పి హాస్టల్‌లో చేర్పించింది. హెచ్1 వీసా దొరకలేదు. విజిటర్స్ వీసా మీద అమెరికా వెళ్లింది. కానీ ఆ వీసాతో ఉద్యోగం చేయడానికి అక్కడి చట్టాలు అనుమంతిచవు. అయినా తను అక్కడ బతకాలంటే ఏదో అద్భుతం జరగాలి. కానీ అలా జరగదని ఆమెకు తెలుసు.
పాఠం 6 : Never loose courage (ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు)
ధైర్యం : నెలకు 20 వేల రూపాయల ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని కొత్త జీవితం మొదపూట్టాలని అమెరికాలో అడుగుపెట్టిందంటే ఆమెది కచ్చితంగా సాహసోపేతమైన నిర్ణయమే. మొండి ధైర్యమే. కానీ ఆ ధైర్యం ఇప్పుడు కోల్పోవాల్సి వచ్చింది. ఎంత కాలం ఇలా పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ చిన్న చిన్న షాపుల్లో పనిచేయాలి? మళ్లీ ప్రశ్న. జీవితంలో ఎప్పుడో ఎదురైన సమస్య. కాదు ఎప్పుడూ ఎదురయ్యే సమస్యే. వెంట తెచ్చుకున్న డబ్బులు అయిపోవస్తున్నాయి. ఏం చేయాలి? ఒక్క ఛాన్స్ ఉంది. అలాంటి వారు భారతీయుల దుకాణాల్లో పనిచేసే అవకాశం ఉంది. ఒక మూవీ క్యాసెట్ షాపులో సేల్స్ గర్ల్‌గా చేరింది.
ముందడుగు : ఇంగ్లీష్ రాదు. డబ్బులు లేవు. షాప్‌లో పనిచేస్తే వచ్చే డబ్బు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సి వస్తుంది. కానీ ఆమె అడుగు ముందుకే పడింది. తమ ఊరివాళ్ల సహాయంతో ఓ సాఫ్ట్‌వేర్ కన్సప్టూన్సీలో ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత సిఏ అమెరికా కంపెనీలో రిక్రూటర్‌గా చేరింది.


పాఠం 7 : Associate with good people (మంచివాళ్లతో సన్నిహితంగా ఉండాలి)
గుడ్ పీపుల్ :  ఎలా బతకాలో ఎవరూ పాఠంగా నేర్పరు. పరిస్థితులు నేర్పిస్తాయంతే. చాలాసార్లు చూసి నేర్చుకోవాల్సిందే. అంటే.. మనం ఎవరితోనైతే ఎక్కువ కాలం కలిసి ఉంటామో వారు మనకన్నా అనేక విషయాలు తెలిసినవారై ఉండాలి.
విత్ అసోసియేషన్ : జ్యోతి అలాంటి వారితో కలిసి పనిచేసి కొంచెం కొంచెంగా ఇంగ్లీషు నేర్చుకుంది. వీసా గడువు మాత్రం దగ్గరపడుతోంది. ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. హెచ్1 వీసా కోసం ఎన్నో కష్టాలు పడింది. మొత్తానికి సాధించింది. వర్జీనియాలో మంచి ఉద్యోగం సంపాదిచింది. కాలంతో పాటు కష్టపడితేనే ఇవన్నీ దొరికాయి.


పాఠం 8 : Inspire and give hope (స్ఫూర్తిని రగిలించు, ఆశని కలిగించు)
స్ఫూర్తి : మే 2000లో అమెరికా వెళ్లిన జ్యోతి అక్టోబర్ 2001 నాటికి సొంత కంపెనీ ప్రారంభించగలిగింది. తన పరిస్థితులను అర్థం చేసుకుని ఎవరినీ నిందించకుండా తనకు తానుగా ఎదిగి ఇప్పుడు అమెరికాలో కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ పేరుతో కంపెనీని ప్రారంభించింది. సాధారణ రైతుకూలీ నుంచి సక్సెస్8ఫుల్ ఉమెన్‌గా ఎందరికో స్ఫూర్తిగా నిస్తోంది.
హోప్ : జీవితంలో ఒక్కసారైనా అమెరికా చూసి రావాలని కలలుకనే సగటు భారతీయురాలిగానే ఆలోచిస్తే ఆమె జ్యోతి ఎందుకవుతుంది? అమెరికాలో ఎదురైన అనుభవంతో గ్రామీణ భారతంలోని మహిళా సాధికారత, స్వావలంబన కోసం పనిచేస్తోంది. తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేసింది. మంచి భవిష్యత్తునిచ్చింది. వృద్ధాక్షిశమాలకు, అనాథలకు తనవంతు సహాయం చేస్తోంది. కాలేజీ విద్యార్థులకు తన జీవితాన్నే మోటివేషన్ పాఠంగా చెబుతోంది.

చివరగా ఒక మాట. స్టీవ్ జాబ్స్ చెప్పిన మాట. ‘మీ లక్ష్య సాధన కోసం అవసరమైతే పస్తులుండండి. అవసరమైతే అవహేళనలు ఎదుర్కోండి ( 2005, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ). పేదవాడిగా పుట్టడం మీ తప్పుకాదు.. కానీ పేదవాడిగానే చచ్చిపోతే కచ్చితంగా అది మీ తప్పే. అందుకే మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలి.
 ఆల్ ది బెస్ట్. 
* బీరెడ్డి నగేష్ రెడ్డి
ఫోటోలు : కె. సాయిలు

Sunday, January 15, 2012

జయకళ శశిలలిత! * Inner View

ప్రాణానికి ప్రాణం అనుకున్న శశికళను బయటికి గెంటేస్తూ
జయ ఎందుకంత నిష్కర్షమైన నిర్ణయం తీసుకున్నారు?
పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జయ హృదయంలో తనకున్న ప్రత్యేక స్థానాన్ని కూడా శశికళ ఎందుకు పోగొట్టుకోవలసి వచ్చింది? అసలు జయకు, శశికి మధ్య ఏమిటంత స్నేహం? ఎందుకంత స్నేహం? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఇన్నర్‌వ్యూ.


అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ గుర్తులో కనిపించే ఆకుపచ్చని జంట ఆకుల్లా ఇంతకాలం వర్థిల్లిన జయ, శశిల స్నేహం ఇప్పుడు ‘ఏకాకు’లా మిగిలింది!

రాజకీయాలలో స్నేహం కానీ, శత్రుత్వం కానీ శాశ్వతం కాదని అంటారు. అయితే గత డిసెంబర్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత తన అనుంగు నె చ్చెలి శశికళా నటరాజన్‌ను పార్టీ నుంచే కాకుండా, తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి కూడా బయటికి పంపించడాన్ని బట్టి చూస్తే - పాతికేళ్లుగా వీరి మధ్య ఉన్న స్నేహ సాన్నిహిత్యం శాశ్వతంగా ముగిసినట్ల్లే కనిపిస్తోంది.


శశికళను బహిష్కరించిన ఐదురోజుల తర్వాత జరిగిన పార్టీ సమావేశంలో తొలిసారిగా మౌనం వీడిన జయ... ‘నమ్మక ద్రోహులకు పార్టీలో చోటు లేదు’ అని ఒకప్పటి తన ‘సిస్టర్ ఇన్ స్పిరిట్’ (స్నేహోదరి) ను ఉద్దేశించి కరాకండిగా వ్యాఖ్యానించడం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది! నిజానికి జయ, శశిల మధ్య ఇన్నేళ్లూ కొనసాగింది రాజకీయాలకు అతీతమైన స్నేహానుబంధం. దాన్ని కూడా కాదనుకుని శశికళపై చర్య తీసుకున్నారు జయ. ‘‘ఇవాళ్టి నుంచి నువ్వు అన్నాడిఎంకెలో భాగం కాదు.. ఫో’’ అని అధికారికంగా అనడమైతే అన్నారు కానీ, అంతరార్థం మాత్రం ‘ఇవాళ్టి నుండి నువ్వు నాలో భాగం కానే కాదు’ అని స్నేహానికి నీళ్లొదులుకోవడమే.

ఐదేళ్ల నిరధికార విరామం తర్వాత గత ఏడాది మే 16న తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి పట్టాభిషిక్తురాలైన ‘పురుచ్చి తలైవి’ (విప్లవ నాయిక) జయలలిత... తనెంతో కష్టపడి సాధించుకున్న పదవిని కాపాడుకోవడం కోసం చివరికిలా తన ఇష్టసఖినే ఫణంగా పెట్టవలసి వస్తుందని ముందెన్నడూ ఊహించి ఉండరు! స్నేహితురాలికి సర్వం దోచిపెట్టిన జయలలితకు... ఇప్పుడా స్నేహితురాలి నుంచే తన రాజకీయ అధికారాన్ని సంరక్షించుకోవలసిన అగత్యం ఏర్పడింది.


ప్రాణసమానం అనుకున్న శశికళ తనను నట్టేట ముంచేందుకు పార్టీ కార్యాలయంలో పావులు కదుపుతున్న విషయం తెలిసి జయ ఆమెకు చెక్ పెట్టారని రాజకీయ పరిశీలకుల అంచనా. ఇందుకు వారు చూపుతున్న నిదర్శనాలు జయ కటౌట్‌లా నిలువెత్తుగా కనిపిస్తున్న ప్పటికీ అంతకన్నా ఎత్తైది వారి స్నేహానుబంధం.

అనుకోని అనుబంధం
జయ, శశిల మధ్య ఉన్న సాన్నిహిత్యం 1991లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు నుంచే వీరిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఉన్నా, అది పోయస్ గార్డెన్‌కే పరిమితం అయ్యింది. అధికారంలోకి వచ్చాక ఇద్దరూ కలిసి కనిపించడంతో స్నేహం బహిర్గతమయ్యింది. అప్పట్లో వీడియో క్యాసెట్ల దుకాణం నడుపుతున్న శశికళకు ప్రభుత్వోద్యోగి అయిన ఆమె భర్త నటరాజన్ ద్వారా జయలలితతో పరిచయభాగ్యం కలిగింది.
అన్నాడిఎంకె వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జయలలిత ఆ పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉండేవారు. శశికళ ఆ ప్రచారానికి సంబంధించిన వీడియో క్యాసెట్లు తీసుకుని వచ్చి జయలలితకు అందజేసేవారు. తరువాత వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో శశికళ, జయలలిత దగ్గరే ఉండిపోయారు. 1991లో పార్టీ అధికారంలోకి రావడంతో శశికళకు పార్టీలో కూడా పట్టు దొరికింది. 


జయలలిత, శశికళ, చంద్రలేఖ


 









ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ఆంతరంగికురాలిగా మారిన శశికళల మధ్య స్నేహం ఏర్పడడానికి ప్రధాన కారణం చంద్రలేఖ అనే మరో మహిళ. చంద్రలేఖ దక్షిణ ఆర్కాట్ జిల్లాకు అప్పట్లో కలెక్టర్‌గా ఉండేవారు. అదే జిల్లాకు పౌర సంబంధాల అధికారి (పి.ఆర్.ఓ)గా శశికళ భర్త నటరాజన్ ఉండేవారు. ఎమర్జెన్సీ టైమ్‌లో ప్రభుత్వం కొంతమంది పి.ఆర్.ఓ.లను చెట్టుకొకర్ని, పుట్టకొకర్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యడంతో నటరాజన్... పన్నీర్‌శెల్వం అనే మరో అధికారితో కలిసి కోర్టుకెక్కారు.

ఆ సమయంలోనే జీవనోపాధి కోసం నటరాజన్ తన భార్య శశికళ చేత వీడియో పార్లర్ పెట్టించాడు. చివరికి కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడంతో నటరాజన్‌కు 1980లో తిరిగి పి.ఆర్.ఓ.గా ఉద్యోగం లభించింది. సరిగ్గా అప్పుడే భర్త ద్వారా శశికళకు కలెక్టరు చంద్రలేఖ పరిచయం అయ్యారు. ఈ క్రమంలో శశికళ తరచు చంద్రలేఖ ఇంటికి వెళ్లి కష్టాలను వెళ్లబోసుకునేవారు. సంపాదన చాలకపోవడంతో శశికళ కొంత డబ్బు అప్పు చేసి సింగపూరు వెళ్లి, వీడియో కెమెరాలు తెచ్చుకుని పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వీడియోలు తీయడం మొదలుపెట్టారు.

అన్నాడిఎంకె పార్టీకి ప్రచార కార్యదర్శిగా ఉన్న జయలలితను తనకు పరిచయం చేయాలని చంద్ర లేఖను శశికళ కోరారు. అలా చంద్రలేఖ పరిచయం చేయడంతో పార్టీకి చెందిన కార్యక్రమాలను వీడియో, ఫోటోలు తీసే పనులను జయ శశికళకు అప్పగించారు. పనితీరు బాగుండటంతో శశికళను మళ్లీ మళ్లీ పిలిపించి కార్యక్రమాలు అప్పగించేవారు. అయితే జయలలితకు ఆమె మరీ అంతగా ఎలా దగ్గరయ్యారో ఈనాటికీ అంతుబట్టని విషయం. జయలలిత స్వతహాగా తెలివైనవారు. ఒక పట్టాన ఎవరినీ నమ్మరు.


అలాంటిది ఒక సాధారణ గృహిణి, చదువులేని మహిళ అయిన శశికళను ఆమె ఎందుకు చేరదీశారన్నది ఇంకో ప్రశ్న. అయితే శశికళలో ఉండే ప్లస్ పాయింట్లు శశికళలో ఉన్నాయి. ప్రచార కార్యక్రమాలు చేపట్టడంలో ఆమె ఘటికురాలు. సాటి మనిషికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వం కూడా. ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే, అందులో జోక్యంచేసుకోరు, వారు చెప్పేదంతా శ్రద్ధగా వింటారు. ఈ స్వభావం ఉన్న వారిని సాధారణంగా ఎవరైనా ఇష్టపడతారు. జయలలిత కూడా బహుశా అందుకే ఆమెను చేరదీసి ఉండొచ్చు.


‘కళ’ తప్పిన స్నేహం

1996 ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓడిపోయి డిఎంకె అధికారంలోకి వచ్చింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై జయ, శశి జైలుపాలయ్యారు. అప్పటి వరకు శశికళ పార్టీ సభ్యురాలు కూడా కాదు. జయ వెంట ఎక్కడా కనిపించేవారు కాదు. 2001 శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో తొలిసారి బహిరంగంగా జయలలిత వెంట శశికళ ప్రత్యక్షమయ్యారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉండగనే 2002లో జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయ్యారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని శశికళకు ఇవ్వాలని అనుకున్నారు. అయితే శశికళకు పార్టీ సభ్యత్వం లేకపోవడం, ఆమె పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో ఆమె ముఖ్యమంత్రి పదవిని ఆశించలేక పోయారు. దాంతో ఆమె సూచించిన పన్నీరుశెల్వంకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు.

ఈ నేపథ్యంలో జయలలిత నిర్దోషిగా బయట పడుతూనే శశికళకు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. తరువాత పార్టీలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కోర్‌కమిటీ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు. ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీలోను, ప్రభుత్వంలోను శశికళ వర్గీయులదే పైచేయిగా నిలిచింది. 2011 ఎన్నికల్లో శశికళ ప్రాబల్యం బాగా పెరిగింది.


‘రాజకీయమే’ అసలు కారణం!

నిరుడు తమిళనాడు శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచి జయలలిత, శశికళల మధ్య విభేదాలు తలెత్తాయి. శాసనసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందు తన సొంత వర్గానికి చెందిన కొంతమందికి జయలలితకు తెలియకుండానే శశికళ సీట్లు కేటాయించుకున్నారు. దాంతో జయ ఆ జాబితాను రద్దు చేసి, కొత్త జాబితాను విడుదల చేశారు.

అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిగింది. పార్టీలో ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, శశికళ తమ బంధువర్గానికి సీట్లు కేటాయించారని ఆరోపిస్తూ పోయస్ గార్డెన్‌లోని శశికళ ఇంటి ముందు కూడా కార్యకర్తలు ఆందోళనలు చేశారు.


పరిపాలనలోనూ జోక్యం!

రాష్ట్ర పరిపాలనలో కూడా శశికళ జోక్యం ఎక్కువయింది. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేయడం, టెండర్లు ఫలానా వారికే ఇవ్వాలని ఒత్తిడి తేవడం వంటివి కూడా జరిగాయి. ఈ కారణంగా కొందరు ఐఎఎస్ అధికారులు శెలవులు పెట్టి వెళ్లిపోయిన విషయాన్ని ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో జయలలితకు ఫిర్యాదులు అందాయి. అప్పుడే కొంతమంది మంత్రులపై జయ వేటు వేశారు.

భర్త కోసం శశి వ్యూహం!

జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తులున్న కేసు ప్రస్తుతం బెంగుళూరు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు వ్యవహారంలో కూడా స్నేహితురాళ్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. జయలలిత కోర్టుకు హాజరయినపుడు, న్యాయమూర్తి పలు ప్రశ్నలను సంధించారు. వాటిలో చాలా వరకు తనకు తెలియదని, అవన్నీ తన పేరు చెప్పుకుని తన చుట్టూ ఉన్నవారు చేశారని జయలలిత చెప్పారు.

తనపేరు మీద ఉన్న ఆస్తులన్నీ శశికళకు చెందినవేనని అన్నట్లు కూడా బయటికి పొక్కింది. అదే విధంగా శశికళ కూడా తనకేమీ సంబంధం లేదని, అంతా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జయలలితకు చెందిన ఆస్తులేనని తెగేసి చెప్పారు.


రేపో మాపో బెంగుళూరు కోర్టులో గనుక జయలలితకు ప్రతికూలమైన తీర్పు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆమె వైదొలగవలసి ఉంటుంది. అప్పుడు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలి. ఆ బాధ్యతలను తన భర్త నటరాజన్‌కు కట్టబెట్టాలని శశికళ జయలలితను కోరినట్లు వినికిడి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న శంకర్ కోవిల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో నటరాజన్‌కు టిక్కెట్టు ఇచ్చి, గెలిపించాలని జయను శశి కోరారు.


2002లో ఇదే కేసులో జయను దోషిగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చి జైలు శిక్షను విధించింది. అప్పుడు శశికళ సామాజిక వర్గానికి చెందిన పన్నీరుశెల్వంను ముఖ్యమంత్రిని చేశారు. దాదాపు ఆరు నెలల పాటు పన్నీరుశెల్వం ముఖ్యమంత్రిగా పని చేశారు. తరువాత జయను కోర్టు నిర్దోషిగా పేర్కొనడంతో తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అదే పరిస్థితి మరోసారి ఉత్పన్నమవుతుందని శశికళ భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ తన బంధువర్గంతో పలుసార్లు సమావేశమయ్యారు.


జయలలిత కోసం అందరం కష్టపడుతున్నాం కాబట్టి తమలో ఎవరో ఒకరికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని సమావేశంలో తీర్మానించుకున్నారు. ఆ పదవిని నటరాజన్‌కు ఇచ్చే విషయంపై ఏకాభిప్రాయానికి కూడా వచ్చారు. సమావేశంలో నటరాజన్‌తో పాటు శశికళ బంధువర్గం రావణన్, వెంకటేశన్, దివాకరన్, భాస్కరన్, మరి కొంతమంది ఉన్నారు. అన్నాడీఎంకేలో ప్రస్తుతం ఇరవై మంది శశికళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విషయం జయ చెవిలో పడింది. పర్యవసానమే శశి, ఆమె అనుచరుల బహిష్కరణ.


ఇంత అకస్మాత్తుగా శశికళను జయ దూరం చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. జయ చాటున శశికళ మిన్నాగు పన్నాగాలు పన్నగలరని కూడా ఎవరూ అనుకోలేదు. రెండు దశాబ్దాలకు పైబడిన వీరిద్దరి ఆత్మీయ అనుబంధంలో ఇంతవరకు ఉల్లాసాలు తప్ప విరుపులు లేవు. నిజానికి జయ ఔదార్యమే వీరి స్నేహాన్ని నిలిపింది.


 
ఆమె చెప్తే ‘అమ్మ’ చెప్పినట్లే














అన్నాడిఎంకె పార్టీలో ఇద్దరు అధినేత్రులు! ఒకరు ప్రధాన కార్యదర్శి జయలలిత, మరొకరు ఆమె సన్నిహితురాలు శశికళ. వారిద్దరిది ఇరవై ఏళ్లకు పైబడిన అనుబంధం. పార్టీలోను, ప్రభుత్వంలోను, జయ నివాసం పోయస్ గార్డెన్‌లోను శశికళకు అగ్రతాంబూలమే. అధికారులు జయలలితకు ఎంత విలువ ఇస్తారో, అంతే విలువను శశికళకూ ఇవ్వాల్సిందే.

జయలలిత వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లినా, అధికారిక పర్యటనలో ఉన్నా శశికళ ఆమె పక్కన ఉండాల్సిందే. చివరికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ప్రచార వాహనంలో వెనక సీటులో శశికళ ఉంటారు. పార్టీలో జయలలితకు తెలియని విషయాలయినా ఉంటే ఉండవచ్చు కాని, శశికళకు తెలియని విషయాలు ఉండవని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే జయలలిత నీడ శశికళ. 1991-96 మధ్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకే రకమైన చీరలు కట్టుకునేవారు, ఒకే రకమైన ఆభరణాలు ధరించేవారు. చెప్పులు కూడా ఒకే రకంగా ఉండేవి.


కవలు పిల్లలు ఏ విధంగా ఒకే డ్రస్ వేసుకుంటారో, అదే విధమైన దుస్తులు ధరించేవారు. 1996లో జైలుకు కూడా కలిసే వెళ్లారు. అటువంటి స్నేహం వారిద్దరిదీ. ఒక దశలో శశికళ జయకు సమయం కేటాయించడం కోసం తన భర్తను కూడా నిరాదరించారు. 1996 శాసనసభ ఎన్నికల్లో అన్నాడిఎంకె పరాజయానికి శశికళ, ఆమె బంధువర్గమే కారణమని ఆరోపణలు వచ్చినప్పుడు శశికళను కొన్నాళ్ల పాటు దూరంగా ఉంచిన జయలలిత మళ్లీ దగ్గరకు తీసుకున్నారు. 2003లో శశికళకు పార్టీలో తొలిసారిగా ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి ఎగ్జిక్యూటివ్ కోర్ సభ్యురాలిగా పదవిని కట్టబెట్టారు.


అమలిన స్నేహం

 







ఇరవై ఏళ్ల స్నేహ బాంధవ్యంలో, రాజకీయ సాంగత్యంలో జయలలితగానీ ఆమె ప్రియబాంధవి శశికళగానీ ఒకరి గురించి ఒకరు నోరు మెదిపిన సందర్భం ఒక్కటైనా లేదు! ఇంటర్వ్యూలలో శశికళ ప్రస్తావన వచ్చినప్పుడు జయ ‘నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్’ అన్నట్లు చూసేవారు. జయ గురించి శశకళను అడిగే ధైర్యమైతే అసలు పార్టీలో ఎవరికీ ఉండేది కాదు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై ఊహలు, వదంతులు చుట్టుముట్టినప్పుడు కూడా వీళ్ల స్నేహం తొణకలేదు. తత్తరపడలేదు. శశికళ ఒంటి మీద ప్రతి తులం బంగారానికీ ప్రత్యుర్థులు జయనే లెక్క అడిగేవారు.

శశి వెనకేసుకున్న ప్రతిరూపాయి పైనా వారికి జయ బొమ్మే కనిపించేది. ఎన్నికల ప్రచారంలో జయ వెంట శశికళ ఉండడం, ఒక చిన్న వేడుకలో వారిద్దరూ ఆత్మీయంగా దండలు మార్చుకోవడం, శశికళ మేనల్లుడి వివాహాన్ని జయ కనీ వినీ ఎరుగని రీతిలో జరిపించడం వంటి వాటిని కూడా బద్ధ విరోధ డి.ఎం.కె.పార్టీ రాష్ర్ట సమస్యలుగా చిత్రీకరించినప్పుడూ ఈ అపూర్వ స్నేహితులు ఖాతరు చేయలేదు.


అయితే ఇవే అంశాలపై వారు 1996 ఎన్నికల్లో ప్రజాతీర్పును మన్నించవలసి వచ్చింది! ఎన్నికల ప్రచారానికి శశికళను వెంటేసుకుని వెళ్లినప్పుడు జయకు బ్రహ్మరథం పట్టిన తమిళనాడు ప్రజలు ఆ అభిమానాన్ని తమ ఓటు ద్వారా చాటలేకపోయారు! మేనల్లుడి పెళ్లిలో ఒంటి నిండా నగలతో టీవీలలో ఆడంబరంగా కనిపించిన శశికళను నేరుగా చూసేందుకే జనం ఎగబడ్డారనీ, నిజానికి వారికి శశికళ తీరు నచ్చక ఆ కోపాన్ని జయపైన చూపించి ఆమెను ఓడించారని మీడియాలో వార్తకథనాలు వచ్చాయి.


అయినప్పటికీ శశి చేతిని జయ వదల్లేదు. అంతగా తను నమ్మి, ప్రేమించి అభిమానించిన మిత్రురాలు తనకు ద్రోహం చేస్తోందన్న వాస్తవాన్ని తట్టుకోలేకే చివరికి ఒక్క బహిష్కరణ సంతకంతో తన మనసులోంచి ఆమె ముద్రను చెరిపేసుకున్నారు జయలలిత!

- సి.బి.మోహన్‌రావు, బ్యూరో ఇన్‌చార్జి, చెన్నై

ఫొటోలు: వన్నె శ్రీనివాసులు

Sunday, December 11, 2011

వందేళ్ల రాజధాని ఢిల్లీ

 http://www.wheninindia.com/_/rsrc/1316456855159/history-of-Delhi/43.jpg
భారతదేశానికి ఢిల్లీ రాజధానిగా మారి డిసెంబర్‌ 12 నాటికి వందేళ్ళు పూర్తి కానున్నాయి. ఈ వందేళ్ళలో ఎంతో మార్పు. నాటి బ్రిటిష్‌ ఇండియాకు రాజధానిగా కోల్‌కతా ఉండింది. సరిగ్గా వందేళ్ళ క్రితం బ్రిటిష్‌ వారు ఢిల్లీని రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకూ రాజధాని నగరంలో ఎన్నెన్నో మార్పులు. పాత అందాలు అదృశ్యమై కొత్త అందాలు చేరాయి . పట్నం వాతావరణం మాయమైపోయాయి. మెట్రోపాలిటన్‌ కల్చర్‌ చేరింది. ఎంతో అభివృద్ధి ... మరెంతో విధ్వంసం ... 

http://karol-bagh.com/images1/rashtrapati-bhavan-india-picture-photo.jpg
ఒక నగరం జీవితకాలంలో వందేళ్ళు ఏమంత పెద్దది కాదు. అందులో విశేష మూ ఉండదు. ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు భిన్నం. ఈ నగరం దేశరాజధాని హోదాను సంతరించుకొని వందేళ్ళు గడిచాయి. ఈ వం దేళ్ళలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకు న్నాయి. పాత ఆనవాళ్ళు చెదిరిపోయాయి. కొత్త ఆనవాళ్ళు వచ్చిపడ్డాయి. ఒక శతాబ్ది కా లంలో...ఒక్కో దశాబ్దిలో ఒక్కో రకం పోకడ. వెరసి నేటికి రాజధాని ఢిల్లీ ‘న్యూఢిల్లీ’గా మారిపోయింది. ‘‘కౌన్సిల్‌లో గవర్నర్‌ జనరల్‌తో సంప్రదిం పుల అనంతరం మంత్రులు ఇచ్చిన సలహా మేరకు భారత ప్రభుత్వం దేశ రాజధానిని కలకత్తా నుంచి ప్రాచీన రాజధాని అయిన ఢిల్లీకి మార్చాలని నిర్ణయించినట్లు తెలియజే సేందుకు ఎంతగానో సంతోషిస్తున్నాం’’ - అని 1911 డిసెంబర్‌ 12న నాటి రాజు ఐదో జార్జ్‌ ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన దేశం లో సంచలనం కలిగించారు. 18వ శతాబ్ది నుంచి కూడా బ్రిటిష్‌ సామ్రాజ్యానికి భారతదేశంలో ఆయువుపట్టుగా ఉన్న కలకత్తా నుంచి రాజధాని హోదా ఢిల్లీకి మారింది. ఆ ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే ఢిల్లీకి రాజధాని హంగులు సమకూరసాగాయి. http://delhi.gov.in/wps/wcm/connect/24f200004fe87b85b02dbbd9d1b46642/red+fort.jpg?MOD=AJPERES&lmod=827272050&CACHEID=24f200004fe87b85b02dbbd9d1b46642
భారత సామ్రాజ్యాధీశుడిగా కింగ్‌ జార్జ్‌ను పట్టాభిషిక్తుడిని చేసే సమయంలో రాజధాని మార్పు ప్రకటన వెలువడింది. అప్పట్లో ఢిల్లీ జనాభా 2,33,000గా ఉండింది. చక్రవర్తి పర్యటనను పురస్కరించుకొని, ఇటీవల కామ న్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా చేసినట్లుగానే, 300 మంది అసాంఘిక శక్తులను అరెస్టు చేశారు. ఇలా అరెస్టు అయిన వారిలో నిరుపేదలే అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఆనవాయితీకి పట్టాభిషేక మహోత్సవం నుంచే బీజం పడింది. అది నేటికీ కొనసాగుతోంది.

ఎంతో గోప్యం
olddhelli 

కోల్‌కతా నుంచి కంటే కూడా ఢిల్లీ నుంచి దేశాన్ని పాలించడం సులభం అని బ్రిటిష్‌ వారు భావించిన నేపథ్యంలో న్యూఢిల్లీ రాజధానిగా ఏర్పడింది. తమ నగరానికి రాజధాని హోదా కావాలని ఢిల్లీవాసులు కోరుకోలేదు. అందుకు ఉద్యమించలేదు. అయినా ఢిల్లీ నగరానికి ఆ హోదా దక్కింది. చివరి క్షణం వరకూ ఈ ప్రక టనను ఎంతో గోప్యంగా ఉంచడం విశేషం. ఆ ప్రకటన చేయగానే సభలో కొద్దిసేపటి వరకు నిశ్శబ్దం తాండవించింది. సభికులకు విషయం అర్థమయ్యేందుకు కొంత సమయం పట్టింది. ఆ తరువాత కలకలం మొదలైంది. అత్యంత గోప్యంగా ఉంచిన రహస్యాల్లో ఒక టిగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.

ఢిల్లీని నూతన రాజధానిగా తీర్చిదిద్దడం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదిగా ఉండింది. ఢిల్లీ పట్టణానికి అవసరమైన మౌలిక వసతు లను సమకూర్చడం కన్నా పట్టణానికి నగర రూపురేఖలు జోడించడమే అప్పట్లో బ్రిటిష్‌ వారికి ప్రధానంగా ఉండింది. నేటికీ అదే తరహాలో ఢిల్లీ అభివృద్ధి కొనసాగుతోంది. కొత్తఢిల్లీ నిర్మాణయత్నం ఢిల్లీని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలిక ఏర్పా ట్లు మొదలయ్యాయి. పాత ఢిల్లీకి చేరువలోనే కొత్త ఢిల్లీని నిర్మించే ప్రయత్నాలూ ఆరంభమయ్యాయి. అందుకోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. సబ్జి మండి, సివిల్‌ లైన్స్‌ తదితరాలను పరిశీలించి వివిధ కారణాల రీత్యా తోసిపుచ్చారు. చివరకు రైజినా గ్రామ ప్రాంతం బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు నచ్చింది.
http://lh5.ggpht.com/-2XM46lxzMJU/SGTdcyCaKcE/AAAAAAAADkM/mreWX_bGH4o/INDIADelhiMyFavouriteCityInIndia.jpg
అక్కడ ఉన్న గుట్టను తొలచివేసి ప్రభుత్వ భవ నాల నిర్మాణాలను ఆరంభించారు. ఎడ్విన్‌ లాండ్‌సీర్‌ లుటెన్స్‌, తన స్నేహితుడు హెర్‌బెర్ట్‌ బాకెర్‌ అనే ఆర్కిటెక్ట్‌లు ఈ పనులు చేపట్టా రు. లుటెన్స్‌ అప్పటి వరకూ గొప్ప ట్రాక్‌ రికా ర్డు ఏమీ లేనప్పటికీ, కొంతమంది బ్రిటిష్‌ సంపన్నుల భవనాలను అందంగా నిర్మించిన కారణంగా ఆయనకు ఈ పని అప్పచెప్పారు. నాటి వైస్రాయి లార్డ్‌ లైటన్‌ ఏకైక కుమార్తెను లుటెన్స్‌ వివాహం చేసుకోవడం కూడా ఇందు కు కారణం కావచ్చు. స్థూలంగా న్యూఢిల్లీ, గవర్నమెంట్‌ హౌస్‌ (రాష్టప్రతి భవన్‌) డిజైన్‌ ను లుటెన్స్‌ పర్యవేక్షించగా, సెక్రటరి యేట్స్‌ (నార్త్‌ , సౌత్‌ బ్లాక్స్‌), కౌన్సిల్‌ (పార్ల మెంట్‌) డిజైన్‌ బాధ్యతలను బాకెర్‌ చేపట్టారు. బ్రిటిష్‌ సామ్రాజ్య దర్పాన్ని ప్రతిబింబించే విధంగా ఆనాటి భవనాలు, కట్టడాలు రూపుదిద్దు కున్నాయి. ఢిల్లీలో యూనివర్సిటీ కోసం నాటి నాయ కులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ఫలితంగా 1922లో అక్కడ యూనివర్సిటీ రూపుదిద్దుకుంది. దాని నిర్మాణానికి అరకొర నిధులనే వెచ్చించారు.

ఎన్నెన్నో సమస్యలు

 http://images.beijing2008.cn/20080314/Img214268841.jpg
పాత ఢిల్లీ నగరంలో వసతులు మెరుగుపర్చేందుకు నాటి ప్రభత్వం ఏమాత్రం శ్రద్ధ వహిం చలేదు. 1927లో కౌన్సిల్‌ హౌస్‌ (నేటి పార్ల మెంట్‌)ను ప్రారంభించారు. దాన్ని ప్రారంభిం చిన రెండేళ్ళకే భగత్‌ సింగ్‌, బి.కె.దత్‌ అందు లో చిన్న పాటి బాంబు పేల్చారు. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఢిల్లీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవిభజన సందర్భంగా పాకిస్తాన్‌ నుంచి పెద్ద ఎత్తున హిందువులు ఢిల్లీకి వలస వచ్చారు. వారందరికీ కొన్నేళ్ళ పాటు ఢిల్లీలోనే ఆవాసం కల్పించారు. అదే సమయంలో ఢిల్లీలో పలువురు ముస్లింలు పాకిస్తాన్‌కు వెళ్ళగా వారి ఇళ్ళను ఇతరులు ఆక్రమించారు.
మాస్టర్‌ ప్లాన్‌
http://delhi-masterplan.com/wp-content/uploads/2009/07/delhi_1483_sq_km.jpg
ఢిల్లీ ప్రణాళికారహితంగా విస్తరించడం మొదలైంది. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ సై తం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రణాళికాబ ద్దంగా ఢిల్లీని విస్తరించే ప్రయత్నాలకు అప్పు డే బీజం పడింది. విస్తరణను నియంత్రించేం దుకు ఒక సెంట్రల్‌ అథారిటీ ఉండాలని నెహ్రూ భావించారు. 1957లో మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ, ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటయ్యాయి. మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించే యత్నాలు మొదలయ్యాయి.

1981 వరకు ఢిల్లీ విస్తరణ అంతా ఆనాడు నెహ్రూ ఆమోదించిన మార్గదర్శకాలకు అను గుణంగానే జరిగింది. చారిత్రక కట్టడాల చుట్టూరా ఉన్న విశాల స్థలాలను ఉద్యానవనా లుగా తీర్చిదిద్దారు. పచ్చదనం పెంపొందిం చారు. నేడు ఢిల్లీ ఎన్నో పర్యాటక, చారిత్రక స్థలాలతో అలరారుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ వీసీగా ఉండిన గ్యాయర్‌ ఆ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో కృషి చే శారు. ఎన్నో కళాశాలలను ఏర్పాటు చేశారు. మరోవంకన ఢిల్లీ విలాసజీవితానికి మారు పేరుగా కూడా మారిపోయింది. ఆరోగ్య సదుపాయాలు, ఆసుపత్రులు విస్తరించాయి. ఢిల్లీ అభివృద్ధికి మరాఠాలు, బెంగాలీలు, తమిళు లతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా ఎంతో కృషి చేశారు. నేడు ఢిల్లీ నగరం భిన్న ప్రాంతీయుల ఆచార వ్యవహారాలతో కళకళలాడుతుంటుంది. ఎవ రికి ఏ పండుగ వచ్చినా మిగిలిన వారూ ఆ వేడుకలో భాగస్వాములవుతుంటారు.

రవాణా

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYP2qdJSF_Qnp_84wBOs7yWGU1zBhJkY11csq8KG65jjddW4RT032ITbjVU-fLuJbrKTTg6Z7O3apO4zr8dAx40AuwmYHnQqWgJ0VcVgpZzI6umMIyAXNiP5TWGkW-KKn8qaiG5GqXrXc/s1600/Delhi+(Metro+Rail).jpgరాజ్‌పథ్‌, జన్‌పథ్‌, అక్బర్‌ రోడ్‌ లాంటి మార్గాలు దేశమంతటా ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీ అంతటా భూగర్భ సబ్‌వేలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఢిల్లీ మొత్తం మీద 2,700 బస్‌ స్టాప్‌లు ఉన్నాయి. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ ప్రపంచంలోని అతి పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం బాగా పేరొందింది. 2006-07లో 23 లక్షల కు పైగా ప్రయాణికులు దీన్ని ఉపయోగించు కున్నారు. 2020 నాటికి దీన్ని ఉపయోగించు కునే వారి సంఖ్య ఏటా 100 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీలో రవాణా సాధనాలుగా బస్సులు, ఆటోలు, రైళ్ళు బాగా వాడుకలో ఉన్నాయి. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొ రేషన్‌ యావత్‌ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పర్యావరణ స్నేహపూర్వక సీఎన్‌జీ బస్సులను కలిగి ఉంది. బస్‌ ర్యాపిడ్‌ సిస్టమ్‌ అంబేద్కర్‌ నగర్‌ నుంచి ఢిల్లీ గేట్‌ వరకు అమల్లో ఉంది. రైల్వే వ్యవస్థ 153 కి.మీ మేర రైలు మార్గాన్ని కలిగి ఉంది. 2020 నాటికి ఇది 413 కి.మీ.కు చేరుకోగలదని అంచనా. 130 స్టేషన్లు ఉన్నాయి.

కన్నాట్‌ ప్లేస్‌

ఢిల్లీలో కన్నాట్‌ ప్లేస్‌ అనేది వృత్తాకారంలో ఉన్న వాణిజ్య ప్రాంతం. దీని అవుటర్‌ రింగ్‌ నుంచి 12 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఒకటి జన్‌పథ్‌.

జనాభా

 http://www.science-express.com/wp-content/uploads/2007/11/delhi.jpg
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీలో ఓ చిన్న భాగమైన న్యూఢిల్లీ జనాభా సుమా రుగా 2.50 క్షలు. హిందువులు 86.8 శాతం, ముస్లింలు 6.3 శాతం, సిక్కులు 2.4 శాతం, జైనులు 1.1 శాతం, క్రైస్తవులు 0.9 శాతం. పలు రకాల భాషలు మాట్లాడే వారు ఇక్కడ నివసిస్తున్నారు. నగరంలో ఎక్కడ చూ సినా కాస్మోపాలిటన్‌ సంస్కృతి కనిపిస్తుంది. స్వాతంత్య్రదిన, గణతంత్రదిన వేడుకలు భారీస్థాయిలో జరుగుతాయి. వాటిని చూసేం దుకు విదేశీయులు కూడా వస్తుంటారు.

ప్రగతి మైదాన్‌

 http://www.delhitourism.com/images/trade_fair_delhi.jpg
ప్రగతి మైదాన్‌లో జరిగే ఆటో ఎక్స్‌పో ఆసియాలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. రెండేళ్ళ కోసారి ఈ ప్రదర్శన జరుగుతుంది.

సిస్టర్‌ సిటీస్‌

http://ashevillesistercities.org/joomla/images/stories/scilogo.jpg
న్యూఢిల్లీ, షికాగో (అమెరికా), లండన్‌ (బ్రిటన్‌), ఉలాన్‌ బటార్‌ (మంగోలియా), మాస్కో (రష్యా), సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ (రష్యా), జోహాన్స్‌ బర్గ్‌ (దక్షిణాఫ్రికా)లతో సిస్టర్‌ సిటీ ఒప్పందాలను కలిగి ఉంది.

గతమెంతో ఘనం

 http://www.newdelhiairport.in/images/top-banner-img.jpg
ఢిల్లీ నగరానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 12వ శతాబ్ది నుంచి 19 వ శతాబ్ది మధ్య కాలం దాకా ఎన్నో ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. నిజానికి ఢిల్లీ అనేది ఒక్క నగరం కాదు. ఏడు పట్టణాలు కలసి రూపొందిన నగరం. సిరి, తుగ్లకాబాద్‌, జహా నాపనా, ఫిరోజాబాద్‌, దినపానా, షేర్‌గఢ్‌, షా హజనానాబాద్‌లు కలసి ఢిల్లీ నగరంగా రూ పాంతరం చెందాయి. వీటికి తోడుగా న్యూఢి ల్లీ కూడా ఈ జాబితాలో చేరింది. షాజహాన్‌ క్రీ.శ. 1639-1648 మధ్య కాలంలో నిర్మించినషాహజనానాబాద్‌ 1857 వరకు కూడా మొగల్‌ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది. ఢిల్లీ భౌగోళిక నేపథ్యం కారణంగా ఎంతో మంది రాజులు దాన్ని తమ రాజధా నిగా చేసుకున్నారు. యమునా నది ఒడ్డున ఉండడం, ఆయా సామ్రాజ్యాలకు పాలనకు అనువైన ప్రాంతంలో, వ్యూహాత్మకంగా కీలక స్థానంలో ఉండడం, ఆరావళి పర్వత పంక్తి లాంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

ఒకప్పుడు 70,000 మంది అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఢిల్లీ నగరంలో నేడు 1.6 కోట్ల మంది నివసిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా మౌలిక వసతులు మాత్రం వృద్ధి చెందలేదు. పర్వతపంక్తిని దెబ్బ తీయడం, యమునా నదిని కలుషితం చేయడం లాంటి వి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఢిల్లీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే వర సగా ఉన్న కొండలు, గుట్టలు నేడు ఎక్కడిక్క డ ముక్కచెక్కలుగా మారాయి. పట్టణీకరణ అటు కొండలను, ఇటు యమునా నదిని దెబ్బ తీస్తోంది.

వేగంగా విస్తరిస్తున్న నగరం

 http://k53.pbase.com/v3/30/52730/2/46484484.uppadjul20.jpg
దేశరాజధానిగా వ్యవహరించే న్యూఢిల్లీ ప్రాంతం ఢిల్లీ మెట్రో పోలీస్‌ పరిధిలో ఉంటుంది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని తొమ్మిది జిల్లాల్లో అది ఒకటి. దీని విస్తీర్ణం 42.7 చ.కి. మీ. 134 దేశాలకు చెందిన విదేశీ రాయబార కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. 1911 డిసెంబర్‌ 15న న్యూఢిల్లీకి శంకుస్థాపన జరిగింది. 1931 ఫిబ్రవరి 13న బ్రిటిష్‌ ఇండియా గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ ఇర్విన్‌ దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని హుమాయున్‌ సమాధి, కుతుబ్‌ కాంప్లెక్స్‌ రెండూ కూడా యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్స్‌గా గుర్తింపు పొందాయి. ప్రపంచంలోనే అతివేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఢిల్లీ గుర్తింపు పొందింది. జీవిత కాలంలో కనీసం ఒకసారి సందర్శించిన నగరాల్లో ఒకటిగా ఈ నగరం ప్రఖ్యాతి చెందింది. కొత్త ఢిల్లీ అనేది ఏడు పాత పట్టణాలను కలుపుకుంటూ ఏర్పడింది. అందుకే జంతర్‌ మంతర్‌, లోధీ గార్డెన్స్‌ వంటి చారిత్రక కట్టడాలు కూడా దీని పరిధిలోకి వచ్చాయి.

చరిత్రలో సుస్థిర స్థానం

 http://www.virtualtripping.com/wp-content/uploads/2009/07/Traffic-in-delhi-450x339.jpg
1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరు వాత ఢిల్లీకి పరిమిత స్వయం ప్రతిపత్తి కల్పించారు. కేంద్రప్రభుత్వం ఓ చీఫ్‌ కమిషనర్‌ను నియమించింది. 1956లో ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం గా మార్చారు. ఫలితంగా చీఫ్‌ కమిష నర్‌ స్థానంలోనే లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నియమితులయ్యారు. ఒకప్పుడు సఫ్దరజంగ్‌ విమానాశ్రయం నగరానికి ఒక మూలన ఉండింది. అది ఇప్పుడు నగరం నడిబొడ్డుకు చేరింది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్‌ విమానాలకు ఉపయోగించడం లేదు. 1962 నుంచి పాలం విమానాశ్రయం వాడుక లోకి వచ్చింది. 1982లో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌, 2010లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడారంగ చరిత్రలో ఢిల్లీ నగరానికి సుస్థిర స్థానాన్ని కల్పించాయి.

ఫ్యాషన్లకు నిలయం
1930 ప్రాంతం నుంచే ఢిల్లీలో మహిళల జీవనశైలిలో పెనుమార్పులు వ్యక్తమవుతూ వచ్చాయి. జాతీయ, అంతర్జాతీయ బాక్సా ఫీస్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఈ మార్పులకు కారణమనవచ్చు. విదేశీయుల తాకిడి అధి కంగా ఉండడం, మెట్రోపాలిటన్‌ సంస్కృతి ఇవన్నీ ఢిల్లీని ఫ్యాషన్‌ కేంద్రంగా మార్చా యి. వివిధ రకాల ఫ్యాషన్‌ మ్యాగజైన్లు లాంటివి కూడా ఇందుకు కారణమయ్యా యి. స్వాతంత్య్రం రాకముందు వరకు కూడా బ్రిటన్‌ లైఫ్‌స్టయిల్‌ ఢిల్లీ నగరంపై తన ప్రభావాన్ని విపరీతంగా కనబర్చింది.

ఇదీ నేటి పరిస్థితి
ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా నిల్చిన ఢిల్లీ నగరం నేడు అశాంతికి నిల యంగా మారిపోయింది. ఉగ్రవాదం పడగ నీడన ఢిల్లీవాసులు కాలం గడుపుతున్నారు. ఏ క్షణంలో ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సామాజిక అశాంతి పెచ్చుమీరిపోయింది. భూఆక్ర మణలు పెరిగిపోయాయి. అడ్డూ అదుపు లేకుండా నగరం విస్తరిస్తుండడంతో చుట్టు పక్కల పల్లెల్లోని వారు ఏ క్షణంలో తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఢిల్లీలోని ముఖ్య స్థలాలు.....

http://www.bobzworldcity.com/wp-content/uploads/2011/05/Parliament-House-in-New-Delhi.jpg 
http://www.liveindia.com/delhi/rashtrapatibhawan-main.jpg
http://delhitourism.blog.com/files/2011/03/akshardham00f.jpg 
http://www.delhimalayalee.com/images/39_new_delhi.jpg 
రాష్టప్రతి భవన్‌, పార్లమెంట్‌ భవనం, ఇండియా గేట్‌, జామా మసీదు, ఎర్రకోట, కుతుబ్‌ మినార్‌, హుమాయున్‌ సమాధి, జంతర్‌ మంతర్‌, పురానా ఖిల్లా, లక్ష్మీనారాయణ టెంపుల్‌, అక్షరధామం, బహాయి లోటస్‌ టెంపుల్‌, ఇస్కాన్‌ టెంపుల్‌, రాజ్‌ఘాట్‌, సెక్ర టరియేట్‌, రాజ్‌పథ్‌, విజయ్‌ చౌక్‌, సఫ్దర్‌ జంగ్‌ సమాధి, మొగల్‌ గార్డెన్స్‌ లాంటి చారి త్రక, పర్యటక స్థలాలను ఢిల్లీలో చూడవచ్చు.

- వి.