
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీర్తి అందుకుంటున్న భారత దేశంలో రాచరికపు, వారసత్వ లక్షణాలు బలపడడం ఒక వైచిత్రి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఈ సత్యం బోధపడుతుంది. పార్లమెంటే కాదు అనేక రాష్ట్ర అసెంబ్లీలలో పరిస్థితి ఇదే. అంతెందుకు? మన రాష్ట్రాన్ని పరిశీలిస్తే ఇది మరింత ప్రస్ఫుటమవుతుంది. ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు అన్న ప్రజాస్వామిక నిర్వచనం ఇక్కడ పని చేయడం లేదు. కుటుంబం కొరకు, కుటుంబం వలన, కుటుంబం చేత నాయకులు తయారవుతున్నారు.
ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మరణిస్తే ఆ స్థానాన్ని మరో దీటైన నాయకుడితో నింపకుండా భార్యకో, కుమారిడికో ఇవ్వడం దానిని వారి కుటుంబ జమీన్లా కట్టబెట్టడం వెనుక రాజకీయ పార్టీల నిస్సహాయత, స్వార్థమూ రెండూ కనిపిస్తాయి. ఒక నాయకుడు కష్టపడి పైకి ఎదిగి ఒక స్థానాన్ని సాధించుకోవడం వెనుక అతడి శ్రమ, నిబద్ధత రెండూ ఉంటాయి. అయినంత మాత్రాన అతడు మరణించగానే ఆ స్థానాన్ని కుటుంబ సభ్యులతోనే భర్తీ చేయాలని చూడడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
ఎన్నికల ప్రక్రియ మరింత బలోపేతంగా పారదర్శకంగా పరిణతి చెందుతున్న తరుణంలో రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోకి తరలిపోతున్నది. వీళ్ళ ఇంటి పేర్లు తెలిస్తే చాలు. వీరి గురించి తెలుసుకున్నట్లే. కొత్త పార్లమెంటు సభ్యులు చాలావరకు కొడుకులే కావడం విశేషం. రాజీవ్ గాంధి కొడుకు రాహుల్, జితేంద్ర ప్రసాద కొడుకు జితిన్ , మాధవ్రావ్ సింధియా కొడుకు జ్యోతిరాదిత్య,రాజేశ్ పైలెట్ కొడుకు, ఒమర్ అబ్దుల్లా బామ్మర్ది సచిన్, ఫరూక్ అబ్దుల్లా కొడుకు, షేఖ్ అబ్దుల్లా మనవడు ఒమర్ అబ్దుల్లా, ములాయమ్ సింగ్ యాదవ్ కొడుకు అఖిలేశ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, మాధవరావ్సింధియా కుమారుడు దుష్యంతు ఇలా ఈ పేర్ల ప్రవాహం అనంతంగా కొనసాగుతూనే వుంటుంది. మరి వీరి సిద్ధాంతాలేమిటి? వీరి భావజాలం ఏమిటి? వీటికి స్పష్టమైన సమాధానం దొరకదు. అవి వీరి హృదయాల్లో నిర్దిష్టమైన రూపురేఖలు దాల్చలేదు. ఈ పిల్లలు ప్రపంచం చుట్టివచ్చారు. వీరికో సిద్ధాంతం లేదు. బహుశా సిద్ధాంతాల రాజకీయాలతో ఇండియా నష్టపోయింది. ఇప్పటి యువ నాయకులు ప్రపంచం చుట్టివచ్చారు. ప్రతిభపై ఆధారపడ్డ కొత్త కార్పొరేట్ సంస్కృతిని అలవరుచుకున్నారు. ఆధునిక భారతదేశాన్ని అవతరింపచేయడం కోసం కృషిచేసినవారి వారసులుగా వీరిని వీరు పరిగణించుకుంటున్నారు. ఏ దిక్కుకేసి చూచినా కుటుంబరాజకీయాలు విలయతాండవం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ దాని ఫలితాలు చాలా స్వల్పమైనవి.
లక్షద్వీప్ దీవులకు ఇండియాలో అతి కుర్ర ఎంపి హమ్దుల్లా సరుూద్ ఒకప్పుడు ఇండియాలో అతి చిన్న వయసు ఎంపి కుమారుడు. ఈ వారసుడు లక్షద్వీపులో పుట్టలేదు కనుక అక్కడ్నించి ఎన్నిక పోటీచేసేట్లు మన కేంద్ర ప్రభుత్వం 2008లో రాజ్యాంగ సవరణ తీసుకువచ్చింది. 29ఏళ్ళ చిరుత ప్రాయంలోనే మంత్రి అయిన మేఘాలయకు చెందిన అగథా సంగ్మా మాజీ స్పీకరు కుమార్తె. కుటుంబ వ్యవస్థలోనే అధికార క్రమాన్ని ఖచ్చితంగా ఏర్పడివుంది. శరద్పవార్ కూతురు సుప్రి యా సూలే తన తండ్రి విరోధు లతో కలిసి సంతోషంగా పనిచేసింది. రాజకీయాల్లో బంధుప్రీతి ఎంతగా పాతుకుపోయిందంటే ప్రజాస్వామ్యంపై దాని ప్రభావాన్ని అంచనా వేయలేము. వంశానుగత వారసత్వ రాజకీయాలు ఎంత లోతుగా పాతుకుపోయిందో ఊహకందదు.
ఈ కుటుంబ వ్యవస్థ వల్ల మంచి సత్తా ప్రతిభ వున్న వారు మొగ్గ దశలోనే రాజకీయరంగానికి దూరమవుతున్నారు. ఇక్కడ సమస్య వారసత్వం మాత్రమే కాదు. ప్రముఖ నాయకుడి పిల్లల్ని, వితంతువుల్ని, బామ్మర్దుల్ని రంగంలోకి దింపి కుటుంబం అధికారాన్ని బలోపేతం చేసుకుం టున్నాయి రాజకీయ పార్టీలు. అర్హులు కాకపోయినా ప్రముఖ నాయకుల పిల్లలు రాజకీయల్లోకి ప్రవేశించాలని ఆశిస్తారు.
వారసత్వం అధికంగా ఉన్న పార్టీలు...
పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్ఎల్డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయి ఇక శివసేన పార్టీయే థాక్రే కుటుంబం అధీనంలో ఉంది. ఇక మాయావతి బిఎస్పిలో మూడవ వంతు ఎంపీలు వారసులు. ఇక 324 సీట్లు కలిగివున్న రెండు పెద్ద పార్టీలు బిజెపి, కాంగ్రెస్. బిజెపిలో 19శాతం సభ్యులే వారసులు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే 37.5శాతం ఎంపీలు కుటుంబ సంబంధం ద్వారా లోక్సభలోకి ప్రవేశించారు. పార్టీ ఎంపీలందరూ వారసత్వమార్గంలో ఎంపికైనవారు కావడంతో ఆర్ఎల్డి ప్రథమ శ్రేణిలో నిలిచింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయి,7 వారసత్వ ఎంపీలున్న ఎన్సిపి రెండవస్థానంలో ఉంది. 42.9శాతం ఉన్న బిజెడి మూడవస్థానంలో ఉంది. లోక్సభలో స్వల్పసంఖ్యలో సీట్లున్నాయికనుక ఈ పార్టీలకు ఫలితాలు గణాంకాల రీత్యా అంత గణనీయమైనవి కావు. ఇది ప్రాంతీయ అంశమా..
ఇక్కడే విభిన్న రకాల ధోరణులు కనిపిస్తున్నాయి. పంజాబ్,ఢిల్లీ, హర్యానాల్లో కుటుంబ రాజకీయాలు ప్రబలంగా ఉన్నాయి. ఆ తర్వా త గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ కాక ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో 75 శాతం పైచిలుకు ఎంపీ లు వారసత్వేతర నేపథ్యానికి చెందినవారని తెలుస్తోంది. సాధారణంగా ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి 2000 సంవత్సరంలో ఆవిర్భవించిన కొత్త రాష్ట్రాల్లో బంధుప్రీతి అంత గా లేదని చెప్పుకోవాలి. కుటుంబ రాజకీయాలు బలపడ్డానికి సమయం బహుశా సరిపోలేదు.
రాష్ట్రంలో సంచలన వారసత్వం
మన రాష్ట్రం విషయానికి వస్తే వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ అంతిమ అధికారాన్ని సాధించడంలో వీరంతా విఫలమయ్యారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి పీఠం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం తెలిసిందే. కేంద్రంలో ప్రధాని పదవిని నెహ్రూ కుటుంబానికి వారసత్వంగా ఇచ్చిన పార్టీయే ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని జగన్కు కట్టబెట్టే సమయంలో ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడడం ఒక వైచిత్రి. అయితే రాజకీయాలలో ఒక వెలుగు వెలిగి మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో పీఠాలు దక్కకపోయినా రాజకీయ వారసత్వం నిస్సందేహంగా దక్కిందనేది వాస్తవం. అర్హులైన వారసులు లేనప్పుడు భార్యకు, ఉంటే కుమారుడికి లేదా కుమార్తెకు ఆ స్థానం కట్టబెట్టడం దేశంలో ఒక సంప్రదాయం అయిపోయింది. చిత్రమేమి టంటే దాదాపు 69.5శాతం మహిళా ఎంపీలు కుటుంబ రాజకీయాల వర్గానికి చెందినవారు.
లోక్సభలో 30 ఏళ్ళలోపు సభ్యులందరూ ఆ సీటు వారసత్వంగా పొందినవారే. 66 యువ ఎంపీల్లో మూడింట రెండొం తులు వారసత్వ ఎంపీలే. కొత్త తరం శాసన సభ్యులు రాజకీయాల్లో ఇతర సభ్యులకంటే ఒక దశాబ్దపు సౌలభ్యం ఉన్నవారు. కాంగ్రెస్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. 35ఏళ్ళ లోపు ప్రతి ఎంపీ వారసత్వ సభ్యుడే. ఈ ధోరణి కొనసాగితే భారతీయ పార్లమెంటులో వారసత్వ సభ్యులు మాత్రమే ఉండే రోజు దూరంలో లేదు. దేశం 60 ఏళ్ళకు పూర్వం స్వాతంత్య్రానికి పూర్వం ఎక్కడ ఉండేదో అక్కడికి చేరుకుంటుంది. వారసత్వంగా వచ్చిన మహరాజు ఆయన దర్బారులో సామంత రాజులు ఉంటారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉత్తర భారతమంతటా శాసన సభ్యులు తమ పిల్లల్ని, పెళ్ళాల్ని వారసులుగా నియమిస్తున్నారు. 38 అతి కుర్ర ఎంపీల్లో 33 మంది మమ్మీ-డాడీ సహాయంతో వచ్చినవారే. మిగతా 5గురిలో ఒకరు రాహుల్ ఎంపిక చేసిన మీనాక్షి నటరాజన్. మరో ముగ్గురు స్వయం కృషితో పైకి వచ్చిన బిజెపి,బిఎస్పి ,సిపిఐ(ఎం) పార్టీ సభ్యులు. మరొక సభ్యుడు మాయావతి ఎంపిక చేసిన వారు.
దక్షిణాదిలో బలమైన వంశ వృక్షం
దక్షిణ భారతదేశంలో వారసత్వ రాజకీయాలు బలంగా ఉన్న పార్టీ డిఎంకె అనే చెప్పాలి. ఆ పార్టీ అధినేత కరుణానిధి కుటుంబమంతా రాజకీయాలలోనే ఉన్న వైనం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆయన పెద్ద కుమారుడు కేంద్రంలో మంత్రి, చిన్న కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రి కాగా కుమార్తె ఎంపి. అంతే కాదు ఆయన మేనల్లుడి కుమారుడు కూడా కేంద్రం లో మంత్రిగా ఉన్నాడు.సుదీర్ఘకాల వారసులు ఎక్కువ సంఖ్యలో ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో ఉన్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. వలస పాలకులు మన రాజ్యాధికారాన్ని దేశంలోని రాజరిక కుటుంబాలకు హస్తగతం చేయకూడదన్న నిజం పునాదిగా భారత గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. కానీ తీరా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ కాక ఒక వంశ సభ ఆవిర్భవించినట్టు కనిపిస్తోంది. వారసత్వ పాలన రాకుండా ఉండేందుకు నెహ్రూ,పటేల్,వి.పి.మీనన్ తదితరులు బృహత్తరమైన కృషిచేశారు. 554 రాజరిక రాజ్యాలు ఆధునిక ప్రజాస్వామిక దేశంలో విలీనం చేయడానికి పాటుపడ్డారు. దేశంలో సర్వసత్తాక అధికారం ప్రజాపరంగానే వుండాలన్న సూత్రంగా స్వతంత్ర భారత రాజ్యాంగం ఆవిర్భవించింది.
కానీ ఈ రోజు దేశం కొత్తగా కొన్ని ప్రాంతాలుగా విడిపోయింది. కొన్ని స్థానిక కుటుంబాల చేతుల్లో రాజ్యాధికారం బందీ అయిపోయింది.
ఆస్ట్రేలియా వెళ్లాక కృష్ణా ఒబేరాయ్లో ఉన్న అనుభవంతో అక్కడా ఓ మంచి హోటల్లోనే ఉద్యోగం దొరికింది. అలా చేస్తున్నప్పుడే అక్కడి ఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ (స్వచ్ఛంద సంస్థ)లో పనిచేసే మంచి అవకాశం దొరికింది.
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు చేసిన సందడి అభిమానులను ఉక్కిరిబిక్కిరిచేసింది. దీంతో సినీతారలు, మోడల్స్, క్రీడాకారులు, వ్యాపార ప్రముఖులు తదితర సెలబ్రిటీలు వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. బిగ్బాస్-4 రియాల్టీ షోలో పమేలా ఆండర్సన్ మొదలుకొని టెస్టుల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 50 సెంచరీలు, బాలీవుడ్లో సల్మాన్ఖాన్ టాప్ హీరోగా నిలిచి తమ అభిమానులకు మధురానుభూతులను పంచారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ఏడాది వార్తల్లో ప్రముఖులుగా నిలిచి ఆకట్టుకున్నారు. అభిమానులను మైమరపించిన ఈ సెలబ్రిటీల గురించి తెలుసుకుందామా...
ఈ ఏడాది బాలీవుడ్ టాప్ హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచారు. సల్మాన్ ఇటీవలే 45వ బర్త్డే వేడుకలను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. సల్మాన్కు అమీర్ఖాన్కు ఉన్న యాక్టింగ్ స్కిల్స్, షారూఖ్ ఖాన్ వంటి చరిష్మా లేకున్నా ఈ ఏడాది ఆయన పలు హిట్ సినిమాలతో బాలీవుడ్ టాప్ హీరోగా నిలిచారు. ఈ ఏడాది సల్మాన్ నటించిన దబంగ్ సినిమా సూపర్హిట్గా నిలిచింది. దీంతోపాటు బిగ్ బాస్ సీజన్ 4లో యాంకర్గా చేసిన సల్మాన్కు ఎంతో పాపులారిటీ దక్కింది. బాలీవుడ్లో అమీర్ఖాన్, షారూఖ్ ఖాన్లు, సల్మాన్ ఖాన్లు ఖాన్ల త్రయంగా పేరుగాం చారు. ఈ ఏడాది ఖాన్ల త్రయంలో సల్మానే బెస్ట్గా నిలిచారు. ఇతర ఖాన్లకంటే తక్కువ వయస్సుగల ఈ బాలీవుడ్ కండలవీరుడు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని మానవతా వాదిగా సైతం పేరుతెచ్చుకున్నారు. బాలీవుడ్ ట్రేడ్ కన్సల్టెంట్ అమోద్ మెహ్రా మాట్లాడుతూ ‘ఈ ఏడాది బాలీవుడ్లో డబ్బింగ్ సినిమాలతో కలిసి 237 హిందీ సినిమాలు విడుదల య్యాయి. వీటన్నింట్లో నిజమైన సూపర్ హిట్ సినిమాలుగా నిలిచినవి మాత్రం దబంగ్, గోల్మాల్ 3 మాత్రమే. ఈ ఏడాది ఖానో మే ఖాన్ కౌన్ హై...అంటే నేను సల్మాన్ ఖాన్ అని చెబుతాను. సల్మాన్ నటించిన వీర్ సినిమా ఫెయిలైనప్పటికీ దబంగ్ సినిమాతో ఆయన టాప్స్టార్గా నిలిచారు’ అని ఆయన సల్మాన్ను పొగిడారు.
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ను వివాహమాడి కొత్త జీవితంలోకి ప్రవేశించారు. దీంతో పాటు టెన్నిస్లో పలు విజయాలు ఆమెకు సంతోషాన్ని మిగిల్చాయి. ‘2010 సంవత్సరం నా జీవితంలోనే అదృష్టమైన సంవత్సరంగా భావిస్తాను. ముందుగా నా పెళ్లి షోయబ్తో జరగడంతో నా జీవితంలో ఆనం దం వెల్లివిరిసింది. ఇక ఆసియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో మెడల్స్ గెల్చుకోవడం సంతోషాన్నిచ్చింది. దీంతో పాటు దుబాయ్లో జరిగిన ఇంటర్నే షనల్ టెన్నిస్ ఫెడరేషన్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాను. వీటన్నింటితో ఈ ఏడాది నాకు అదృష్ట సంవత్సరంగా మారింది. గాయంనుంచి కోలుకొని గత కొన్ని నెలలుగా టెన్నిస్లో మళ్లీ పుంజుకొని విజయాలు సాధించడం నాకు ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్లో కూడా నా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాను’ అని సానియా పేర్కొన్నారు. ‘షోయబ్ సహకారం, ప్రోత్సాహం నాకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇటీ వల ఢిల్లీలోని ఓ టెన్నిస్ అకాడమీని సందర్శించాను. అక్కడ పలువురు యువ తులు టెన్నిస్ ఆడుతూ కనిపించడం గొప్పగా అనిపించింది. యువకులకు ధీటుగా యువతులు సైతం నేడు మనదేశంలో టెన్నిస్లో రాణిస్తుండడం శుభ పరిణామం. చిన్నతనంలో టెన్నిస్ నేర్చుకుంటున్న ప్రారంభంలో నా తల్లిదండ్రులు సైతం టెన్నిస్ నేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. చివరికి పెళ్లి చేసుకొని భర్తతో కాపురం చేసుకోవాల్సిన అమ్మాయిలకు స్పోర్ట్స ఎందుకనే వారు నేడు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం భర్త, పిల్లలు, ఇల్లే కాదు క్రీడల్లోకూడా మహిళలు రాణించాల్సిన అవసరం ఉంది’ అని సానియా పేర్కొ న్నారు. ‘నన్ను పూర్తిగా అర్థం చేసుకునే భర్త షోయబ్ నాకు దక్కడం నా అదృ ష్టంగానే భావిస్తాను.
దేశంలోని కోటీశ్వరులలో ఒకరైన విజయ్మాల్యా గురించి తెలియని వారుండరు. ఆయన లిక్కర్ కింగ్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యజమానిగా ప్రపంచ ప్రసిద్దిగాంచారు. ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ క్రికెట్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ టీం యజమాని కూడా విజయ్మాల్యానే. ఇక విజయ్మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా తండ్రి వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నాడు. సిద్దార్థ ఐపిఎల్లో తమ టీం బెంగళూర్ క్రికెట్ మ్యాచుల్లో కనిపించి సందడిచేశారు. బెంగళూర్ జట్టుకు సెలబ్రిటీ సపోర్టర్గా ఉన్న బాలీవుడ్ అందాలతార దీపికా పదుకునే సైతం ఐపిఎల్ మ్యాచుల్లో సిద్దార్థతో కలిసి మెరిసారు. అప్పటి నుంచి ప్రారంభమైంది వీరిద్దరి మధ్య ప్రేమాయణం. వారిద్దరు కలిసి న్యూ ఇయర్ వేడు కలను లండన్లో జరుపుకు నేందు కు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి లండన్ షాపింగ్ చేయ డం, పార్టీల్లో పాల్గొనడం, ఫ్రెండ్స్ తో కలిసి న్యూ ఇయర్ వేడులను జరుపుకొని మధురానుభూతులను పొందేందుకు సిద్దమయ్యారు. ఈ మధ్యన దీపికా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆమె కొంత నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో సిద్దార్థతో కలిసి లండన్లో కొద్ది రోజులు గడిపితే కొత్త ఉత్సాహంతో మళ్లీ సినిమా షూటింగుల్లో పాల్గొనవచ్చని దీపికా భావిస్తున్నారు. ఇక దీపికా తన వెంట చాలు అంతకంటే మించిన ఆనందం మరోటి లేదని సిద్దార్థ అంటున్నారు.
మన దేశంలోని పలు టివి ఛానెల్స్లో ఈ మధ్యన రియాల్టీ షోలు హంగామా చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలను దృష్టిలో పెట్టుకొని పలు ఛానెల్స్ వెరైటీగా రియాల్టీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ రియాల్టీ షోలలో అన్నిటికంటే గొప్ప సక్సెస్ను సాధించింది మాత్రం బిగ్ బాస్. దీని హోస్ట్గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక బిగ్ బాస్-4లో సెలబ్రిటీ గెస్ట్గా హాలీవుడ్ ‘అందాల’ తార, బేవాచ్ గర్ల్ పమేలా ఆండర్సన్ సెలబ్రిటీ గెస్ట్గా పాల్గొని అభిమానులకు కనువిందుచేశారు. ఇందుకోసం ఈ హాలీవుడ్ నటి పమేలా ముంబయ్కు విచ్చేశారు. ఆమె సెలబ్రిటీ గెస్ట్గా బిగ్ బాస్ 4 హౌస్లో మూడు రోజుల పాటు గడిపారు. పమేలా బిగ్ బాస్ షో కోసం ప్రత్యేకంగా తళుకులీనే తెల్లటి చీరను ధరించారు. జుంకాలు, గాజులతో పాటు ముఖానికి బింధీ ధరించి అభిమానులను మైమరపించారు. ఈ డ్రెస్సింగ్లో ఆమె యానా గుప్తా ఐటమ్ సాంగ్ ‘బాబూజీ జరా ధీరే చలో’ పాట మధ్య బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించారు. అనంతరం ఆమె రెండు చేతులు జోడించి నమస్తే అంటూ హౌస్ మేట్స్ అందరినీ పలకరించి ఆకట్టుకున్నారు. మూడవ గెస్ట్గా ప్రవేశించిన పమేలాను చూసి ఈ షోలో పాల్గొన్నవారు ఆనందపడ్డారు. పమేలా ఆండర్సన్ను అకస్మాత్తుగాచూసి ఈ షోలో పాల్గొన్న అస్మిత్ పటేల్, హృషాంత్ గోస్వామిలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కలర్స్ టివి ఛానెల్లో ప్రసారమైన బిగ్ బాస్-4 షో పమేలా ఎంట్రీతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
ఈ ఏడాది పలువురు సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వామితో విడిపోయి సైతం వార్తల్లోకెక్కారు. ఇటువంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ ఉడ్స్ గురించి. ఆయన వివాహేతర సంబంధాలతో వార్తల్లోకెక్కారు. పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్న అతని విషయం చివరికి భార్యకు తెలిసింది. దీంతో అతని భార్య టైగర్ ఉడ్స్ నుంచి విడాకులు తీసుకుంది. భార్య నుంచి దూరమైన అనంతరం టైగర్ ఉడ్స్ పశ్చాత్తాపపడినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇక బ్రిటన్ సెలబ్రిటీ లిజ్ హర్లీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్వార్న్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భారతీయ సంతతికి చెందిన బిజినెస్ టైకూన్ అరుణ్ నాయర్ను పెళ్లి చేసుకున్న లిజ్ కొంతకాలం క్రితం నుంచి అతనితో సఖ్యతగా ఉండడం లేదు. చివరికి షేన్వార్న్తో జతకట్టింది లిజ్. ఈ జంట లండన్లోని ఓ హోటల్లో కొన్ని రోజులు కూడా గడిపారు. ఈ విషయం మీడియా ద్వారా బయటపడడంతో లిజ్ భర్త అరుణ్ నాయర్తో కొద్ది రోజుల నుంచే దూరంగా ఉంటున్నట్టు ప్రకటించింది. షేన్వార్న్తో తన సంబంధం గురించి మాత్రం ఏమీ చెప్పలేదు.