చంద్రికా కృష్ణమూర్తి... సక్సెస్ఫుల్ బిజినెస్ వుమన్... న్యూయార్క్ యూనివర్శిటీ ట్రస్టు బోర్డు మెంబర్.. పెప్సికో సిఇఓ ఇంద్రానూయికి సోదరి... అది కొద్ది కాలం క్రితం వరకు ఇప్పుడు.. ఓ మంచి సంగీత విద్వాంసురాలు. 56 ఏళ్ల వయసులో తనలో దాగున్న అంతర్గత ప్రతిభకు ప్రాణం పోసుకుంది. గిటారు నేర్చుకుంది. సంగీత సాధన చేసింది. భక్తి సంగీతంతో ఓం నమశ్శివాయ పేరుతో మొదటి ఆల్బమ్ను విడుదల చేసింది. ఇక రెండవ ఆల్బం ఓం నయో నారాయణతో గ్రామీ అవార్డుకు ఎంపికయ్యింది.
చంద్రికా కృష్ణమూర్తి ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే చాలు.. 25 వేల రకాల పూలు నవ్వుతూ పలకరిస్తాయి. ఆ పూలలోని సుగంధం చల్లగా కదిలిస్తుంది. నెమ్మదిగా పరికించి చూస్తే అందులో ఆమె పరిచయం చేసే కొత్త విషయాలెన్నో.పాటలంటే ప్రాణం...
చిన్నతనం నుండి రేడియోలో పాటలు వింటూ పెరిగారు. అన్ని రకాల సంగీతా న్ని విని ఆనందించేవారు.శనివారం రాత్రి పాఠకులు కోరిన పాటలను ప్రసా రం చేసేవారు. అవంటే చంద్రికకు ఎంతో ఇష్టం. తప్పకుండా వినేది. ఇక టామ్ జోనెస్ పాటలు అంటే చాలా చాలా ఇష్టం. డీన్ మార్టిన్స్ సాంగ్ మొదటి సారి వినగానే ఆమెకు నచ్చింది. వుడ్ స్టాక్ సాంగ్స్ని ఒకే వారంలో పన్నెండు సార్లు విన్నది.అలాగే చిన్నతనం నుండి ఎక్కువ హమ్మింగ్ చేసేది. ఇక భక్తి పాటలం టే చంద్రిక ప్రాణం పెట్టేది.జాతీయ గీతాల పట్ల మక్కువ ఎక్కువ. ఫ్రెంచ్ సంగీతం కూడా నేర్చుకుంది.
నాకు నేనే ప్రశ్నగా..
పెరిగి పెద్దవుతున్న కొద్దీ చంద్రిక పూర్తిగా చదువు వైపుకి మళ్లింది. ఉన్నత స్థానానికి చేరుకుంది. కానీ ఏదో వెలితి. ఎంత సాధించి నా సంతృప్తి లేక బాధపడింది. ఓసారి తనను తాను పూర్తిగా అర్థం చేసుకునేం దుకు ప్రయత్నించింది. ‘నాకు సంబంధించి ప్రతి విషయంలోనూ సంగీతం వుంది. ఇది లేకుండా నేను బతకడం అనేది సాధ్యం కాదు. నాకు నేనే ఓ పెద్ద నీడలాంటి దాన్ని దాని గురించి నాకు నేనే ఎప్పుడూ చెప్పుకుంటూ వుంటాను. తొమ్మిది సంవత్సరాల క్రితం నా కూతురిని స్కూలుకు పంపిచడం మొదలు పెట్టాకే మేలుకున్నాను. బిజినెస్లో ఎంతో విజయం సాధించాను.
కానీ నా లోపల దాగున్న తృష్ణని మాత్రం ఏ మాత్రం నెరవేర్చుకోలేకపోయాను. నేను ఏంటో తెలుసుకోవాల్సిన సమయం అనిపించింది. నాకు సంతోషం కలిగించే అంశం ఏంటి అని? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అప్పుడే అనిపించింది నాకు సంతో షాన్ని కలిగించే అంశం సంగీతం ప్రస్తుతం నా జీవితంలో అది లేదు. అప్పుడే మొదలైంది సంగీత విద్యార్థిగా. ఎంతో గొప్ప గొప్పవారి దగ్గరికి వెళ్ళి క్లాసికల్, హిందుస్థానీ సంగీతాన్ని తెలుసుకున్నాను. పండిట్ గిరిష్ వాజాల్వర్ వంటి వారి తో కలిసి పనిచేశాను. ఆయన నాకు అసలు గురువు. వీణ సహస్ర బుద్ధే దగ్గర, శుభ్ర గుహ, పండిట్ విజయ్ కిచ్లు దగ్గర కూడా దీన్ని నేర్చుకున్నాను’ అని చంద్రిక చెబుతోంది. ఇవంటే చాలా ఇష్టం..
అమెరికాలో టాప్ 40 హిట్ పాటలన్నీ చంద్రికకు చాలా ఇష్టం. నును డెమీస్ రౌసెస్, ఊమ్ కథోమ్, నానా మస్కౌరి వారి పాటల నుండి ఎంతో నేర్చు కుంది. వాటి నుండి స్ఫూర్తి పొందింది. ఇక వారి మెలోడీ పాటలు ఆమెను ఎంతగానో ప్రోత్సహించాయి. ఎబిబిఎ, బ్రెజిలి యన్ సంగీతం, ది ఈగల్స్, బిగీస్, జోన్ బేజ్ వంటి ఎన్నో కలెక్షన్స్ ఆమె దగ్గర వున్నాయి. పాశ్చాత్య సంగీత క్లాసిక్స్ అన్నీ సేకరించారు.
ఆషామాషీ కాదు..
మొదటి ఆల్బమ్ను 2005లో చంద్రిక విడుదల చేసింది. అనుకున్నదే తడవు గా చేసింది కాదిది.అందుకు ఆమె ఎంతో శ్రమించింది. ‘ఆల్బమ్ మొదలు పెట్టే ముందే అన్నిటికీ సిద్ధం అయ్యాను. భారతదేశంలో ఎంతో మంది ప్రముఖుల ను కలుసుకున్నాను. సంగీతాన్ని తెలుసుకున్నాను’ అని చంద్రిక అంటోంది.
గ్రామీ అవార్డుకు ఎంపిక...
పాశ్చాత్య పాప్ సంగీతాన్ని అక్కడి సంగీత హోరును అన్నిటినీ మరిపించి చం ద్రిక రెండవ ఆల్బం ఓం నమో నారాయణ గ్రామీ అవార్డుకు ఎంపికయ్యిం ది. బేలాఫ్లెక్, బేబిల్ గిల్బర్టో, అంజెలి క్యూ కిడ్జో, సెర్జియో మెండెస్ వం టి ప్రముఖుల ఆల్బమ్స్ను దాటుకుని ఆమె నామినీగా నిలిచినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మీ ఆల్బమ్కు గ్రామీ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నా రా? అని చంద్రికను అడిగితే ‘ఇదో గౌరవం. అసలు ఎంపిక అవ్వడమే ఎంతో గర్వంగా అనిపించింది.కలలో కూడా అనుకోలేదు. నేను ఏదో అవార్డు వస్తుంది.. తెచ్చుకోవాలని అనే ఆశతో అయితే పని చేయలేదు.భవిష్యత్తులో దాని కోసం ప్రయత్నించే దా న్ని. కానీ ఇప్పుడే వ స్తుందని మాత్రం అ నుకోలేదు’ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఎంత ఎదిగినా ఒదిగే...
‘నా జీవితం ఏమీ మార దు. నేను నా శక్తి వంచన లే కుండా నాలోని ప్రతిభను పూర్తిగా వినియోగించుకుని ఆల్బమ్ చేశాను. ఇక గ్రామీ నామినేషన్ అనేది నా సంగీతాన్ని ఎంతో మందికి తెలిసేలా చేసింది. ఎన్నోకష్టాలను దాటుకు ని అది ఆ స్థానానికి చేరుకుంది. సంగీతం అనేది మనసు మూలాలను తాకేదిగా వుండాలి. అప్పుడే విజయం సాధిస్తుంది. నా పాటల్లో ఆ ప్రత్యేకత వుంది కాబట్టే ఈ స్థాయికి వచ్చింది’ అని ఎంతో వినమ్రత ప్రదర్శిస్తారు.
ఎవరి ప్రత్యేకత వారిదే..
ఇంద్రానూయి చెల్లెలుగా పుట్టడం ఎంతో గర్వంగా అనిపిస్తుందని చంద్రిక అం టోంది. ‘ఆమె ఎంతో శక్తివంతమైన మహిళ. లక్షలాది మంది అభిమానులు ఆమెకున్నారు. వారందరిలో నేను ముందు వరుసలో వుంటాను. కలలను నెరవే ర్చుకోవడం అంటే ఏంటో ఆమె నుండే నేర్చుకోవాలి. ఇద్దరం ఎంతో సన్నిహి తంగా వుంటాం. 35 సంవత్సరాలుగా ఎవరికి వారు బతుకుతున్నాం. ఆమె వ్యా పారంలో అంచెలంచెలుగా ఎదిగింది. నేను నా స్థాయిలో వున్నాను. ఓ ఫౌండేష న్ని ఏర్పాటు చేశాను. బిజినెస్ స్కూలుకు బోర్డు మెంబర్గా వున్నాను. దీనితో పాటు అమెరికన్ ఇండియా ఫౌండేషన్లో కూడా భాగస్వామిగా వున్నాను’ అని చంద్రిక వారి మధ్య గల ప్రత్యేకతలను చెబుతున్నారు. అంతే కాదు..ఇంద్రా నూయి చంద్రికకు ఎంతో సపోర్టుగా కూడా వుంటారు. సంగీతం వైపుకు వెళ్లేందుకు మార్గదర్శకురాలు కూడా. ఈ విజయం అనేది ఆమెకు ఓ స్వీట్ న్యూస్. భవిష్యత్తులో తన ప్రతిభకు మరింత పదును పెట్టుకుని ముందుకెళ్ళేందుకు ఇప్పుడు చంద్రిక సిద్ధమవుతోంది. ఆమెకు ఆల్దిబెస్ట్.

వేసవి సెలవుల్లో సదన్ సూపరింటెండెంట్ వాళ్లతోనే ఉంటూ టైపింగ్ను నేర్చుకుంది జ్యోతి. అక్కడ టెన్త్ పూర్తయిన తర్వాత టీచరు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఒకేషనల్కోర్సులో చేరితే అది పూర్తయిన తర్వాత కాని తెలియలేదు జ్యోతికి... ఆ కోర్సుతో టీచర్ ఉద్యోగం రాదని! జ్యోతి హతాశురాలయ్యింది. చదువుకుంటానని మొత్తుకుంది. కాని ఇంట్లో వినకుండా పెళ్లి చేసేశారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అత్తగారి కుటుంబం జ్యోతి కుటుంబానికి దగ్గరి బంధువులే అయినా అప్పటిదాకా పెరిగిన హాస్టల్ జీవితానికి పూర్తిగా భిన్నంగా అనిపించిందామెకు. వ్యవసాయ కుటుంబం కావడంతో పనులు చేయడానికి పిల్లలను ఇంటిదగ్గరే వదిలిపెట్టి పొలం దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఏ పని చేస్తున్నా సరే ఏదో వెలితి ఆమెను వెన్నాడటం మానలేదు. అప్పుడే నేషనల్ సర్వీస్ వాలంటీర్ నోటిఫికేషన్ రావడంతో అతికష్టం మీద జ్యోతి అందులో చేరింది. ఉద్యోగరీత్యా జిల్లా అంతా తిరగాల్సి వచ్చేది. దాంతో వరంగల్కు మకాం మార్చి ప్రత్యామ్నాయాల అన్వేషణలో పడింది. ఎలాగో టైలరింగ్ నేర్చుకుని లంగాలు కుట్టి దుకాణాలకిచ్చేది. అప్పుడే టైపింగ్ పరీక్ష కూడా పాసయ్యారు. అప్పుడు వచ్చిన ఓ ఆలోచన ఆమె జీవితాన్నే మలుపుతిప్పింది.
ఆడపిల్లగా పుట్టినంత మాత్రాన జీవితాంతం తండ్రి, భర్త, పిల్లలు ఇలా ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉండాలా? లింగ భేదానికి అతీతంగా ప్రతివారు పనిచేయాలి. ఎవరిమీదా ఆధారపడకూడదు. అలాగని కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాల్లేకుండా ఉండాలనేది నా అభిమతం కాదు. పని సంస్కృతికి ప్రతి గ్రామీణ మహిళా అలవాటు పడాలి. ఇందుకోసం గ్రామీణప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను గుర్తించి, శిక్షణ, ఉపాధి వంటి వాటికోసం నా శక్తిని, అనుభవాన్ని ఉపయోగించాలని ఉంది.
ఐశ్వర్యవంతులు తమ సరదాల కోసం లలు, కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. తమకేదేమైనా ఇష్టమైతే ఎంత ఖరీదైనా కొనుగోలు చేసేందుకు వెనుకాడరు.అది ఒక పడవ కావచ్చు, విమానం కావచ్చు లేదా ద్వీపమే కావచ్చు. అది ఏదైనా సరే వారి మనసు దాని పైకి మళ్లిందో అది వారి స్వంతం కావలసిందే. ఇటువంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుంటే అమ్మో...అనకుండా ఉండలేము.
బిలియనీర్ సోదరులలో పెద్దవాడైనా ముఖేష్ అంబానీ లాగే అనిల్ అంబానీకి సైతం కొన్ని రకాల ఇష్టాలున్నాయి. అనిల్ అంబానీకి స్పీడ్గా వెళ్లే కార్లంటే ప్రాణం. వేగంగా వెళ్లే ఆరు లగ్జరీ కార్లను ఆయన కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేశారు. లాంబ్రోగిని గల్లార్డో, మెర్సీడీజ్ ఎస్ క్లాస్, మేబ్యాచ్, బిఎండబ్ల్యూ 7 సీరీస్, అడీ క్యూ7, రాల్స్ రా యిస్, పోర్స్చ్, లెక్సస్ వంటి ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. మన దేశంలో ఇంతటి ఖరీదైన కార్లు మరెవరి దగ్గరి కూడా లేవంటే అతి శయోక్తి కాదు.ఈ విలాసవంతమైన కార్ల కోసం ఆయన తన నివాసం వద్ద ఓ ప్రత్యేక గ్యారేజీని కూడా ఏర్పాటుచేసుకున్నారు.
ఈ మాట అనగానే అందరికీ గుర్తొచ్చేది లిక్కర్ కింగ్ విజయా మాల్యా అని. ఈ ఐశ్వ ర్యవంతుడు విలాస వంతమైన మనిషిగా పేరు గాంచారు. కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత కూడా అయిన ఈ బిలియ నీర్కు విలాసవంతమైన బోట్లు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఇటీవల 450 కోట్ల రూపాయలను వెచ్చించి ఖతారి రాయల్స్ 95 మీటర్ల బోటును కొన్నారు. ఇండియన్ ఎంప్రెస్ని దీనికి పేరుపెట్టారు. నీటిపైన తేలియాడే ఖరీదైన ఈ ప్యాలెస్ బోటును ఎంతో అం దంగా నిర్మించారు.ఇందులో ప్రఖ్యాత ఆర్టిస్ట్లు రెనాయిర్, చగల్ పెయింటిం గ్స్ను ఏర్పాటుచేయడం విశేషం.
రియల్ ఎస్టేట్ మొగల్గా పేరుగాంచిన సన్నీ దీవాన్ దేశంలోని టాప్ బిలియనీర్లలో ఒకరిగా నిలుస్తారు.ఈ బిలియనీర్ 527 కోట్ల రూపాయలతో ఫెర్రెట్టీ 881 బోటును కొన్నారు. 90 అడుగుల ఈ బోటులో విలాసవంతమైన సౌకర్యాలెన్నో ఉన్నాయి. అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ బోటు సముద్రంలో వేగంగా దూసుకెళ్తుంది. సముద్రంపై షికారుకెళ్లే సన్నీ దీవాన్ తర చుగా తన బోటును గేట్ఆఫ్ ఇండియా వద్ద పార్క్ చేస్తుం టారు. ఈ బోటును తిలకించేందుకు పర్యాటకులు అక్క డికి వస్తుంటారు.బాగున్నాయి కదూ మన వారి టేస్టులు? ఏమైనా పైసా మె హై పరమాత్మ.